
హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) ఆధ్వర్యంలోని లాండ్రీ డిటర్జెంట్ బ్రాండ్ సర్ఫ్ ఎక్సెల్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 కోట్ల టర్నోవర్ మార్కును అధిగమించినట్లు తెలిపింది. వినియోగదారుల్లో ఈ బ్రాండ్కు ఉన్న ఆదరణే ఈ మార్కు చేరేందుకు తోడ్పడిందని కంపెనీ సీఈఓ, ఎండీ రోహిత్ జవా తెలిపారు.
ఇదీ చదవండి: నీరుగారుతున్న ఉపాధి హామీ చట్టం లక్ష్యం
2022 ఆర్థిక సంవత్సరంలో రూ.8,200 కోట్ల అమ్మకాలను నమోదు చేసిన సర్ఫ్ ఎక్సెల్ హెచ్యూఎల్ అతిపెద్ద బ్రాండ్ల్లో ఒకటిగా తన స్థానాన్ని నిలబెట్టుకుందని జవా చెప్పారు. 2025 నాటికి ఇది రూ.10,000 కోట్లు మార్కును చేరినట్లు తెలిపారు. హెచ్యూఎల్ వార్షిక నివేదికలో భాగంగా ఈ మేరకు వివరాలు వెల్లడించారు. హెచ్యూఎల్ హోమ్ కేర్ విభాగం రూ.22,972 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిందని చెప్పారు. కంపెనీ మొత్తం టర్నోవర్ రూ.60,000 కోట్లు దాటిందని పేర్కొన్నారు. అండర్లైయింగ్ వాల్యూమ్ వృద్ధి(ధరల్లో ఒడిదొడుకులున్నా అమ్మకాలు పెరగడం)లో 2% పెరుగుదలను, ప్రతి షేరుకు 5% ఆదాయం (ఈపీఎస్) వృద్ధి నమోదు చేసినట్లు చెప్పారు.