Budget 2024-25: సార్వత్రిక ఎన్నికలు.. ఈసీకి కేటాయింపులు ఇలా.. | Allocations To Election Commission In Budget 2024 | Sakshi
Sakshi News home page

Budget 2024-25: బడ్జెట్‌లో ఎన్నికల సంఘానికి కేటాయింపులు ఇలా..

Feb 2 2024 11:30 AM | Updated on Feb 2 2024 11:54 AM

Allocations To Election Commission In The Budget - Sakshi

కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి వివిధ ప్రభుత్వ శాఖలకు నిధులు కేటాయించారు. 

ఈ ఏడాది లోక్‌సభతో పాటు కొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘానికి 2024-25 బడ్జెట్‌లో కేంద్రం రూ.306.06 కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో కేంద్రం రూ.385.67 కోట్లు ఇచ్చింది. అయితే ఈసారి బడ్జెట్‌లో ఈ నిధులు తగ్గించినట్లు తెలుస్తుంది. 

న్యాయమంత్రిత్వ శాఖకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,502.30 కోట్లు ఇవ్వగా.. 2024-25లో రూ.34.84 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్ని ఈవీఎంల సేకరణ కోసం ఎన్నికల సంఘానికి ఇవ్వనున్నారు. న్యాయమంత్రిత్వ శాఖ పరిధిలోని శాసన విభాగం ఈసీకి సంబంధించిన ఎన్నికలు, ఎన్నికల చట్టాల అంశాలకు నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తుంది.

ఇదీ చదవండి: బడ్జెట్‌ 2024-25 కథనాల కోసం క్లిక్‌ చేయండి

మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు భారత్‌ సిద్ధమవుతోంది. అధికార యంత్రాంగం ఇప్పటికే ఈ ప్రక్రియలో నిమగ్నం అయింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు దేశవ్యాప్తంగా 96 కోట్ల మందికిపైగా అర్హులు ఉన్నట్లు కొన్ని గణాంకాల ప్రకారం తెలిసింది. వారిలో 47 కోట్ల మంది మహిళలేనని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement