ఇతర విమానయాన సంస్థల బాటలోనే ఆకాశ ఎయిర్ కూడా తమ ఫ్లయిట్ టికెట్లపై ఇంధన సర్చార్జీ విధించనున్నట్లు ప్రకటించింది. దేశ, విదేశ రూట్లను బట్టి చార్జీలు రూ. 199 నుంచి రూ. 1,300 వరకు ఉంటాయి. ఇది మార్చి 15 (నేడు) నుంచి అమల్లోకి వస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ఇంధనాల రేట్లు భగ్గుమన్న నేపథ్యంలో దేశీ ఎయిర్లైన్స్ ఈ చార్జీలు విధిస్తున్నాయి. సాధారణంగా విమానయాన సంస్థల వ్యయాల్లో ఇంధనం భారం 40 శాతం స్థాయిలో ఉంటుంది.


