కొత్త టెలికం కస్టమర్లను ఆకర్షించడంలో ఎప్పటి మాదిరే ఎయిర్టెల్ ముందుంది. మే నెలలో 29.8 లక్షల మంది కొత్త సబ్స్క్రయిబర్లను (చందాదారులు/కస్టమర్లు) సొంతం చేసుకుంది.
ఇందులో 29.26 లక్షల మంది మొబైల్ విభాగం నుంచి రాగా, 53,809 మంది కస్టమర్లు ఫిక్స్డ్లైన్ వినియోగదారులుగా ఉన్నారు. రిలయన్స్ జియో నెట్వర్క్ కిందకు 22.55 లక్షల మంది కొత్తగా వచ్చి చేరారు. ఇందులో 21.54 లక్షల మంది మొబైల్ విభాగం నుంచి రాగా, మిగిలిన వారు ఫిక్స్డ్ లైన్ విభాగం నుంచి ఉన్నారు.


