
వాలీబాల్ టోర్నీలో విజేతగా జిల్లా జట్టు
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠం్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–15 బాల, బాలికల వాలీబాల్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. బాలుర విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం ప్రథమస్థానంలో నిలవగా రంగారెడ్డి, మంచిర్యాల ఆ తర్వాత స్థానాలు దక్కించుకున్నాయి. ఈ మేరకు విజేతలకు షీల్డ్లు, సర్టిఫికెట్లు అందజేశారు. ఎంఈఓ హీర్యానాయక్, గురుకుల విద్యాపీఠం ప్రిన్సిపాల్ డి.శ్రీనివాస్రావు, పీఈటీల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవరెడ్డి, పీఈటీలు, పీడీలు నాగరాజు, సుధాకర్, షబ్బీర్, చెన్నకృష్టారెడ్డి, భాస్కర్రెడ్డి, సుధాకర్, రవికుమార్, బస్వరాజ్, మల్లేశ్, బాబయ్య, వెంకటేశ్, శ్రీలత, జోనల్ సెక్రటరీ పీడీ సుశీల తదితరులు పాల్గొన్నారు.