సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ కీలక మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ ప్రెస్మీట్లో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, శాంతిభద్రతల పరిస్థితి, అలాగే చంద్రబాబు నాయుడి ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఏపీలో సమకాలీన అంశాలపై వైఎస్ జగన్ స్పందించే అవకాశం ఉంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్, అలాగే రాజధాని రైతుల పరామర్శకు వెళ్తున్న క్రమంలో ఉండవల్లి వద్ద వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాలు జరిపిన దాడి.. తదితర అంశాలపై వైఎస్ జగన్ స్పందించే అవకాశం ఉంది. అలాగే..
వైఎస్సార్సీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలు.. దాడులు.. అక్రమ కేసులు, ప్రజా సమస్యలు, రైతులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులను వైఎస్ జగన్ ప్రస్తావించే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికల హామీలను కూటమి సర్కార్ ఎగ్గొటడంతో పాటు వైఎస్సార్సీపీ తరఫున పోరాటాలు.. ఇలా ఒక్కో అంశం వారీగా స్పందిస్తారని తెలుస్తోంది.


