శ్రీకాకుళం: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం శ్రీకాకుళంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో జాతీయ జెండాకు టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్ వల్ల అవమానం జరిగింది. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్ గార మండలంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం అక్కడి నుంచి వమ్మరవెల్లికి బైక్లపై ర్యాలీగా బయలుదేరారు. రామ్మోహన్నాయుడు నడుపుతున్న బైక్పై వెనుక కూర్చున్న ఎమ్మెల్యే గొండు శంకర్ జాతీయ జెండాను తలకిందులుగా పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు.ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అయింది.


