సాక్షి, తాడేపల్లి: మొహర్రం సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశం విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం.. త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి మొహర్రం ప్రతీక అని ఆయన తెలిపారు. ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల కూడా మొహర్రం అని గుర్తు చేశారు. ఈ పవిత్ర సంతాప దినాలు రాష్ట్రంలో మత సామరస్యానికి, సమైక్యతకు అద్దం పడతాయని వైఎస్ జగన్ తన సందేశంలో పేర్కొన్నారు.


