
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పతకం సాధించిన భారత ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ జోడీ మనూ భాకర్- సరబ్జోత్ సింగ్లను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు.
‘ఒలింపిక్స్ ఎయిర్ పిస్టల్ 10 మీటర్ల మిక్స్డ్ ఈవెంట్ లో మనూ భాకర్- సరబ్జోత్ సింగ్లు కాంస్యం గెలిచి భారతదేశ కీర్తిని మరింత పెంచారు’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
Team India makes the nation proud yet again at the 2024 Olympics! @realmanubhaker and Sarabjot Singh bring home the bronze in the 10m air pistol mixed team event. #IndiaAtOlympics pic.twitter.com/MQQI792J1q
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 30, 2024
కాగా, ఒలింపిక్స్-2024లో భారత్ రెండో పతకం సాధించిన సంగతి తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ షూటింగ్లో కాంస్యం దక్కించుకుంది. భారత షూటింగ్ జోడీ మనూ భాకర్- సరబ్జోత్ సింగ్ అద్భుత ప్రదర్శనతో దేశానికి ఒలింపిక్ మెడల్ అందించారు.
దక్షిణ కొరియా జోడీ(జిన్ ఓయె–లీ వన్హో)ని 16-10తో ఓడించి పతకం సాధించారు. ఈ క్రమంలో మనూ భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున ఒకే ఎడిషన్లో రెండు పతకాలు గెలిచిన అథ్లెట్గా నిలిచింది. కాగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో ఆమె కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే.