Olympics 2024: మనూ భాకర్‌- సరబ్‌జోత్‌ సింగ్‌లకు వైఎస్‌ జగన్‌ అభినందనలు | YS Jagan Congratulates To Manubhaker Sarabjot Singh Pair Won Medal In Olympics | Sakshi
Sakshi News home page

Olympics 2024: మనూ భాకర్‌- సరబ్‌జోత్‌ సింగ్‌లకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

Jul 30 2024 4:22 PM | Updated on Jul 30 2024 5:50 PM

YS Jagan Congratulates To Manubhaker Sarabjot Singh Pair Won Medal In Olympics

పారిస్‌  ఒలింపిక్స్‌ షూటింగ్‌ విభాగంలో పతకం సాధించిన భారత ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ జోడీ మనూ భాకర్‌- సరబ్‌జోత్‌ సింగ్‌లను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు.

‘ఒలింపిక్స్‌ ఎయిర్‌   పిస్టల్‌ 10   మీటర్ల మిక్స్‌డ్‌ ఈవెంట్‌ లో మనూ భాకర్‌- సరబ్‌జోత్‌ సింగ్‌లు  కాంస్యం గెలిచి  భారతదేశ కీర్తిని మరింత పెంచారు’ అంటూ  వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

 

కాగా, ఒలింపిక్స్‌-2024లో భారత్‌ రెండో పతకం సాధించిన సంగతి తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ షూటింగ్‌లో కాంస్యం దక్కించుకుంది. భారత షూటింగ్‌ జోడీ మనూ భాకర్‌- సరబ్‌జోత్‌ సింగ్‌ అద్భుత ప్రదర్శనతో దేశానికి ఒలింపిక్‌ మెడల్‌ అందించారు.

దక్షిణ కొరియా జోడీ(జిన్‌ ఓయె–లీ వన్‌హో)ని 16-10తో ఓడించి పతకం సాధించారు. ఈ క్రమంలో మనూ భాకర్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్‌ తరఫున ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన అథ్లెట్‌గా నిలిచింది. కాగా 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మహిళల విభాగంలో ఆమె కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement