
సాక్షి, విశాఖపట్నం: కూటమి సర్కార్పై స్టీల్ ప్లాంట్ కార్మికులు మండిపడుతున్నారు. అమరావతిలో నిర్మాణాల కోసం స్టీల్ ప్లాంట్ ఉక్కును విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఉక్కును వదిలి వేర్వేరు ప్రాంతాల్లో సీఆర్డీఏ అధికారులు పర్యటించారు. సచివాలయం, ఐకానిక్ భవనాల నిర్మాణానికి 60 వేల టన్నుల స్టీల్ ఉపయోగించాలని నిర్ణయించారు.
స్టీల్ కోసం రాయగడ బళ్లారి తమిళనాడు ప్రాంతాల్లో సీఆర్డీఏ అధికారులు పర్యటించారు. స్టీల్ ప్లాంట్ను కాపాడటం అంటే పక్క రాష్ట్రాల్లో ఉక్కును కొనడమా?. స్టీల్ ప్లాంట్ ఉక్కు అమరావతి నిర్మాణాలకు పనికిరాదా? అంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేసే ఉక్కును కొనుగోలు చేస్తే స్టీల్ ప్లాట్కు మేలు జరుగుతుందని కార్మికులు అన్నారు.