
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెపె్టంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్ డిప్ కోసం జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు జూన్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే, వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి.
కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జి సేవా టికెట్లను జూన్ 21న, అంగప్రదక్షిణం టోకెన్లు 23న, వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. ఇక 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటా విడుదల చేస్తారు. శ్రీవారి సేవ (తిరుమల, తిరుపతి), పరకామణి సేవ, నవనీత సేవల ఆగస్టు నెల కోటాను జూన్ 25న విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సై ట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.