
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన జూలై నెల కోటాను ఏప్రిల్ 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు ఏప్రిల్ 21–23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల జూలై నెల కోటాను 22న ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల జూలై కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. జూలై నెల అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జూన్ నెల ఆన్లైన్ కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి దర్శనం టోకెన్ల జూలై కోటాను ఆన్లైన్లో విడుదల చేయనుంది.
24న ఎస్ఈడీ కోటా విడుదల
జూలై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన (ఎస్ఈడీ) టికెట్ల కోటాను ఈనెల 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో జూలై నెల గదుల కోటాను 24న మ«ద్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆయా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.