కక్ష కట్టి.. అక్రమ కేసు పెట్టి.. | TDP Leaders Over Action On YSRCP Activists, Illegal Cases Filed On Them After YS Jagan Palnadu Visit | Sakshi
Sakshi News home page

కక్ష కట్టి.. అక్రమ కేసు పెట్టి..

Jun 20 2025 6:20 AM | Updated on Jun 20 2025 9:11 AM

TDP Leaders over Action on YSRCP Activists

వైఎస్‌ జగన్‌ రెంటపాళ్ల పర్యటన విజయవంతంతో కూటమి నేతల అక్కసు

సాక్షి, నరసరావుపేట: ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఆంక్షలు విధించినా... వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన అనుకున్నదాని కంటే ఎక్కువ విజయవంతం కావడంతో కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారు. అక్కసుతో వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. 

కూటమి నేతల దాడులు, పోలీసుల వేధింపులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్సార్‌సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ బుధవారం పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆయన పర్యటన సందర్భంగా వివిధ కారణాలు చూపి వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారు. వీటి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతుండడం గమనార్హం. 

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి రూరల్‌ ఎస్‌ఐ షేక్‌ అమీనుద్దీన్‌ అక్రమ కేసు కట్టారు. గుంటూరు–హైదరాబాద్‌ హైవేలో కంటెపూడి సమీపంలో విధులు నిర్వర్తిస్తుండగా అంబటి ర్యాలీగా వచ్చారని, అనుమతులు లేవని చెప్పినా వినిపించుకోకుండా ఇనుప స్టాప్‌ బోర్డును నెట్టేశారని, అది నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు గన్‌మెన్‌ చిలకా గోపి కాలుపై పడి రక్తస్రావమైందని ప్రస్తావించారు. గోపి ఫిర్యాదుతో అంబటి, మరికొందరి పై 189(2), 223(ఏ), 121(1), 132, 324(4), రెడ్‌విత్‌ 190 బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

⇒ వైఎస్‌ జగన్‌ రెంటపాళ్ల పర్యటనకు అనుమతి లేకపోయినా.. పెద్దఎత్తున  ప్రజలను రోడ్లపైకి తీసుకువచ్చి బైక్‌ ర్యాలీలు చేశారని వైఎస్సార్‌ సీపీ నేత గజ్జల సు«దీర్‌భార్గవ్‌రెడ్డి,  మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై సత్తెనపల్లి టౌన్‌ ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు అక్రమ కేసు నమోదు చేశారు. ప్రజా రవాణాకు ఆటంకం, బా­రికేడ్ల ధ్వంసం, ప్రభుత్వ ఆస్తి నష్టానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ కేసులో మరికొందరు వైఎస్సార్‌సీపీ నేతల పేర్లు చేర్చేందుకు పోలీసులపై కూటమి నేతలు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.

నాగమల్లేశ్వరరావు తండ్రిపైనా.. 
రెంటపాళ్ల వీఆర్వో బూసిరాజు లక్ష్మి ఫిర్యాదు మేరకు నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లు, గజ్జల సు«దీర్‌ భార్గవ్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మరికొందరు వైఎస్సార్‌సీపీ నేతలపై సత్తెనపల్లి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో మరో అక్రమ కేసు నమోదు చేశారు. ఇరుకు సందులో ఎక్కువమందితో విగ్రహావిష్కరణ వద్దని పోలీసులు నోటీసులిచ్చినా పెద్దసంఖ్యలో జనం వచ్చేలా చేసి వారి జీవితాలను ప్రమాదంలో పడేశారని పేర్కొన్నారు. భారీ సౌండ్‌తో డీజే, ప్రజా రవాణాకు ఆటంకం కలిగించారని తెలిపారు. 
 


ఫ్లెక్సీలు ప్రదర్శించారని... 
టీడీపీ నాయకుల అంతు చూస్తాం అంటూ ఫ్లెక్సీ ప్రదర్శించాడని బొల్లెద్దు రవితేజపై సత్తెనపల్లి టౌన్‌ టీడీపీ మైనార్టీ సెల్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌ వలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 352, 351(2) రెడ్‌ విత్‌ 3(5) బీఎన్‌ఎస్‌ సెక్షన్లను ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చారు.  

⇒ వైఎస్‌ జగన్‌ పర్యటనలో అభిమానులు గజ్జ­ల ఆసుపత్రి వద్ద రోడ్డుపై డీజే పెట్టడంతో ఇ­బ్బందిపడ్డామని సత్తెనపల్లికి చెందిన నూ­ర్‌­బాషా జానీబాబు ఇచ్చిన ఫిర్యాదుతో మ­రో కేసు నమోదు చేశారు. డీజే సౌండ్‌ ఆప­మన్నందుకు గుర్తుతెలియని నలుగురు త­నౖ­పె దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement