కుప్పంలో టీడీపీ గూండాయిజం | TDP Leaders Attack On YSRCP Leaders In Kuppam | Sakshi
Sakshi News home page

కుప్పంలో టీడీపీ గూండాయిజం.. వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి

May 11 2024 10:45 AM | Updated on May 11 2024 11:40 AM

TDP Leaders Attack On YSRCP Leaders In Kuppam

కుప్పంలో టీడీపీ బరితెగించింది. టీడీపీ నేతలు గూండాయిజంతో చెలరేగిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు.

సాక్షి, చిత్తూరు: కుప్పంలో టీడీపీ బరితెగించింది. టీడీపీ నేతలు గూండాయిజంతో చెలరేగిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వైస్సార్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వైఎ‍స్సార్‌సీపీ కార్యకర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

టీడీపీ నేతల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. టీడీపీ నేతల దౌర్జన్యకాండపై వైఎ‍స్సార్‌సీపీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన తెలిపారు. గాయపడ్డ వైఎ‍స్సార్‌సీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement