టీడీపీ ఎమ్మెల్యే శ్రావణిశ్రీ వేధిస్తున్నారు.. | TDP Activists Protest In front Of Mangalagiri Party Office | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే శ్రావణిశ్రీ వేధిస్తున్నారు.. మా కుటుంబాన్ని రక్షించండి

Jun 29 2025 8:26 AM | Updated on Jun 29 2025 12:09 PM

TDP Activists Protest In front Of Mangalagiri Party Office

మంగళగిరి కేంద్ర కార్యాలయం ముందు శింగనమల కార్యకర్త నిరసన

అనంతపురం జిల్లా: శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ వేధింపుల నుంచి తన కుటుంబాన్ని రక్షించాలని నియోజ­కవర్గంలోని గార్లదిన్నె మండలం కనంపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త ప్రసాద్‌ శనివారం గుంటూ­రు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యా­ల­యం వద్ద భార్య, పిల్లలతో కలిసి నిరసన వ్యక్తం చేశాడు.

 ‘సేవ్‌ లోకేశ్‌ అన్న’ అంటూ ప్లకార్డు పట్టు­కుని నిరసన తెలుపుతున్న దృశ్యాలు సోషల్‌ మీడి­యాలో హల్‌చల్‌ చేశాయి. స్థానిక అంశాల­పై ప్రసాద్‌ ఇప్పటికే ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ­తో విభేదించారు. ఆమె తీరుపై పలు­మార్లు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేను ధిక్కరించినందుకుగానూ అతడిపై పోలీస్‌ కేసు కూడా నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రసాద్‌ మరోమారు మంగళగిరి టీడీపీ కార్యా­లయం వద్ద కుటుంబ సభ్యులతో నిరసన తెలిపాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement