breaking news
Bandaru Sravani Sree
-
కారు - బైక్ రేసింగ్.. టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణికి ముడుపులు
-
కారు - బైక్ రేసింగ్.. టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణికి ముడుపులు
సాక్షి,అనంతపురం: శింగనమల నియోజకవర్గంలో కారు - బైక్ రేసింగ్ వివాదంగా మారింది. అటవీ ప్రాంతంలో రేసింగ్ చేసుకునేందుకు నిర్వాహకులకు టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుమతి ఇచ్చారు. పర్యాటక అభివృద్ధి కోసమే రేసింగ్కు అనుమతి ఇచ్చామని అన్నారు. అయితే, కారు-బైక్ రేసింగ్కు ఎలాంటి అనుమతులు లేవని అటవీ శాఖ అధికారులు తెలిపారు. శింగనమల, నార్పల, పుట్లూరు మండలాల్లో జరుగుతున్న రేసింగ్ నిర్వహణను బెంగళూరుకు చెందిన ఓ సంస్థ నిర్వహిస్తుంది. సదరు సంస్థ నుంచి భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని రేసింగ్కు అనుమతి ఇచ్చారంటూ ఎమ్మెల్యే బండారు శ్రావణిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామ శివారులో బైకు, కార్ రేస్ పోటీలు జరుగుతున్నాయి. ‘దక్షణి డేర్ క్రాస్ కంట్రీ ర్యాలీ అండ్ బైక్ రేస్’ పేరిట ఈ పోటీలను 3 రోజులపాటు నిర్వహిస్తున్నారు. పుట్లూరు మండలం నుంచి నార్పల మండలం వరకూ ఉన్న కొండ ప్రాంతాల్లో జరుగుతున్న బైక్, కార్ రేస్లో ఏపీ, తెలంగాణ, గోవా, తమిళనాడు, కేరళల రేసర్లు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే శ్రావణి మాకొద్దు.. టీడీపీలో తిరుగుబాటు
-
శింగనమలలో ఉద్రిక్తత.. బండారు శ్రావణికి బిగ్ షాక్
సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వంలో టీడీపీలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి వైఖరికి వ్యతిరేకంగా పచ్చ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలకు దిగారు. సేవ్ టీడీపీ పేరుతో పచ్చ పార్టీ నేతలు ఆందోళనలు చేపట్టారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. బుక్కరాయసముద్రం ఎంపీడీవో కార్యాలయాన్ని టీడీపీ నేతలు ముట్టడించారు. ఈ సందర్భంగా శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి తమకు వద్దంటూ పచ్చ పార్టీ నేతలు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ వర్గానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, సేవ్ టీడీపీ పేరుతో శింగనమల టూమెన్ కమిటీ వర్గీయులు నిరసన తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
బండారు శ్రావణి వర్గం Vs ఫీల్డ్ అసిస్టెంట్లు.. తన్నుకున్న తమ్ముళ్లు!
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో భారీగా అవినీతి జరుగుతోంది. తాజాగా అవినీతి డబ్బులు కోసం టీడీపీకి చెందిన రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. శింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల అవినీతి బాగోతం బయటపడింది. టీడీపీ నేతలు అవినీతి డబ్బు కోసం తన్నుకున్నారు. టీడీపీలోని రెండు వర్గాలు ఇలా తన్నుకోవడంపై స్థానికులు ఆశ్చర్యపోయారు. బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లిలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు రెండు వర్గాలు విడిపోయారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్గం ఒకటి కాగా, టీడీపీ టూమెన్ కమిటీ వర్గాల మరొకటిగా విడిపోయింది. తాజాగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అవినీతి డబ్బుల కోసం తన్నుకున్నారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
శింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల బాహాబాహీ
-
బండారు శ్రావణికి మళ్లీ భంగపాటు!
శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి మరోసారి భంగపాటు ఎదురైంది. తన వర్గీయులకు మండల కన్వీనర్ల పదవులు ఇప్పించేందుకు ఆమె ప్రయత్నించగా.. సీనియర్లు పలువురు అడ్డుపడ్డారు. దీంతో అక్కడి టీడీపీ వర్గపోరు మళ్లీ తెర మీదకు వచ్చింది.సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గంలో టూమెన్ కమిటీ అక్కడి ఎమ్మెల్యే బండారు శ్రావణికి కొరకరాని కొయ్యగా మారింది. తన వర్గీయుల కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలకు వరుసగా చెక్ పెడుతూ వస్తోంది. తాజాగా.. మండల కన్వీనర్ల ఎంపికలో ఈ వర్గపోరు మరోసారి బయటపడింది. తన వర్గం వాళ్లకు పదవులు ఇప్పించాలని శ్రావణి ప్రయత్నించగా.. సీనియర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో తమ వర్గీయులకే పదవులు ఇవ్వాలంటూ ఇటు శ్రావణి వర్గం, అటు మరో వర్గం గొడవకు దిగింది. టీడీపీ నేతల బాహా బాహీతో పంచాయితీ రోడ్డుకెక్కింది. ఎన్నికలకు ముందు నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సమయం నుంచే టూమెన్ కమిటీకి, బండారు శ్రావణికి వైరం మొదలైంది. అటుపై ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన శ్రావణి.. నియోజకవర్గ వ్యవహారాల్లో తన వర్గీయులకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. అయితే.. మంత్రి నారా లోకేష్ అండ చూసుకుని ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, ఎలాగైనా ఆమె ఆధిత్యానికి పుల్స్టాప్ పెట్టాలని సీనియర్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. -
టీడీపీ ఎమ్మెల్యే శ్రావణిశ్రీ వేధిస్తున్నారు..
అనంతపురం జిల్లా: శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ వేధింపుల నుంచి తన కుటుంబాన్ని రక్షించాలని నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలం కనంపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త ప్రసాద్ శనివారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద భార్య, పిల్లలతో కలిసి నిరసన వ్యక్తం చేశాడు. ‘సేవ్ లోకేశ్ అన్న’ అంటూ ప్లకార్డు పట్టుకుని నిరసన తెలుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. స్థానిక అంశాలపై ప్రసాద్ ఇప్పటికే ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీతో విభేదించారు. ఆమె తీరుపై పలుమార్లు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేను ధిక్కరించినందుకుగానూ అతడిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రసాద్ మరోమారు మంగళగిరి టీడీపీ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులతో నిరసన తెలిపాడు. -
శింగనమల TDP MLA బండారు శ్రావణిపై కార్యకర్తల తిరుగుబాటు
-
టీడీపీలో పొలిటికల్ వార్.. ఎమ్మెల్యే కారణంగా కీలక నేతల రాజీనామా!
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనలో పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు, వారి ప్రవర్తన కారణంగా.. టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీటీసీ సైతం రాజీనామా చేశారు.వివరాల ప్రకారం.. శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిపై టీడీపీ కార్యకర్తల తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యే శ్రావణి కార్యకర్తల కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారని పచ్చ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం వచ్చిన మంత్రి టీజీ భరత్కు స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం, ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు.దీంతో, అక్కడే ఉన్న పోలీసులు.. టీడీపీ కార్యకర్తలను ఈడ్చి పడేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఎమ్మెల్యే శ్రావణి వైఖరికి నిరసనగా వెస్ట్ నరసాపురం టీడీపీ ఎంపీటీసీ అంజినమ్మ రాజీనామా చేశారు. ఇదే సమయంలో 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమకు కనీస గుర్తింపు ఇవ్వలేదని టీడీపీ నేతలు వాసాపురం బాబు, కనంపల్లి ప్రసాద్ ధర్నాకు దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టిడిపి ఎమ్మెల్యే బండారు శ్రావణి కు సొంత కార్యకర్త నుంచి నిరసన సెగ. పార్టీ కోసం చాలా కష్టపడ్డాను కానీ గుర్తింపు ఇవ్వడం లేదు.- టిడిపి కార్యకర్త pic.twitter.com/ZibwkRqIZv— రాజా రెడ్డి YSRCP (@rajareddzysrcp) April 18, 2025