ప్రభుత్వ కర్కశత్వంపై అక్షర గర్జన | Senior journalists condemns attacks on Sakshi offices | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కర్కశత్వంపై అక్షర గర్జన

Jun 13 2025 5:17 AM | Updated on Jun 13 2025 5:17 AM

Senior journalists condemns attacks on Sakshi offices

‘సాక్షి’ పై దాడిని ఖండించిన సీనియర్‌ పాత్రికేయులు, కార్మిక, ప్రజా సంఘాలు, వామపక్ష నాయకులు

విజయవాడ స్పోర్ట్స్‌/జి.కొండూరు: ‘సాక్షి’ కార్యా­ల­యాలపై టీడీపీ నాయకులు, కార్య­కర్తలు దురుద్దేశంతో చేస్తున్న దాడులను ప్రజా సంఘాలు, జర్నలిస్టు సంఘాలు, కార్మిక సంఘాలు, న్యాయవాదులు, వామపక్ష నాయకులు, సీనియర్‌ జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు. నాణేనికి మరోవైపు ఉన్న ప్రపంచాన్ని చూపిస్తూ ప్రజల సమస్యల్ని వెలుగులోకి తీసుకొస్తున్న సాక్షిపై దాడులు చేయడం సిగ్గుచేటు అన్నారు. పత్రిక కార్యాలయాలపై దాడి ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని నినదించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను రెడ్‌బుక్‌ ప్రమాదంలో పడేసిందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

సాక్షి కార్యాలయాలపై టీడీపీ నాయకులు చేస్తున్న దాడులకు నిరసనగా విజయవాడ గాం«దీనగర్‌లోని ధర్నా చౌక్‌ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఇచి్చన పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలల నుంచి జర్నలిస్టు, జర్న­లిస్టు సంఘాల నాయకులు తరలివచ్చి ధరా­లో పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా కొనసాగింది.

టీడీపీ గూండాల చర్యలకు నిరసనగా ఫ్లకార్డులను ప్రదర్శించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడండి, రెడ్‌బుక్‌ పాలనను అంతం చేయండి, పత్రికా కార్యాలయాలపై దాడులు సిగ్గు.. సిగ్గు.. అనే నినాదాలతో ఆ ప్రాంగణాన్ని హోరెత్తించారు. కార్యక్రమంలో సీనియర్‌ న్యాయ­వాది ఒగ్గు గవాస్కర్, సాక్షి ప్రతినిధులు బీవీ రాఘవరెడ్డి, విశ్వనా«థ్‌రెడ్డి, ఎన్‌.సతీ‹Ù, ఓబుల్‌రెడ్డి వెంకట్రామిరెడ్డి, చందు శివాంజనేయులు, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రవిచంద్ర పాల్గొన్నారు.

సాక్షిపై కక్షసాధింపు చర్యలను ఖండిస్తున్నాం 
మీడియా సంస్థలు తప్పులు, పొరపాట్లు చేశాయని భావిస్తే ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలి. అంతేకానీ కార్యాలయాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో ఎంతమాత్రం సమంజసం కాదు. ఇది కేవలం కక్షసాధింపు చర్యే. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను ఈ ప్రభుత్వం దురి్వనియోగం చేస్తోంది. సాక్షిపై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ఖండిస్తున్నాం. – కె.పోలారి, ఇఫ్టూ నేత

నా సర్విసులో ఇలాంటివి చూడలేదు 
నా సర్విసులో మీడియా సంస్థలు, జర్నలిస్టులపై ఇటువంటి దాడులు చూడలేదు. మీడియా సంస్థలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూడటం ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఇటు­వంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలి. – వెంకటేశ్వరరెడ్డి, రిటైర్డ్‌ పోలీసు అధికారి 

నిరంకుశ చర్య మంచిది కాదు 
ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులను, దమన కాండలను జర్నలిస్టు సంఘాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆడుకోవడం దుర్మార్గం. జర్నలిస్టులు, మీడియా సంస్థలపై ప్రభుత్వం నిరంకుశ వైఖరి ప్రదర్శించడంమంచి చర్య కాదు. – సీహెచ్‌.రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి, చిన్న, మధ్య తరగతి పత్రికల సంఘం (సామ్నా) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement