కొమ్మినేనిని మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు | Senior Journalist Kommineni Arrest Day 2 Updates | Sakshi
Sakshi News home page

కొమ్మినేనిని మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు

Jun 10 2025 9:13 AM | Updated on Jun 10 2025 1:25 PM

Senior Journalist Kommineni Arrest Day 2 Updates

June 10th, 11: 42AM

కొమ్మినేనిని మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు

గుంటూర జీజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం కొమ్మినేనిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

June 10th, 10: 45AM

  • జీజీహెచ్‌లో కొమ్మినేనికి వైద్య పరీక్షలు పూర్తి

  • జీజీహెచ్‌లో కొమ్మినేని శ్రీనివాసరావుకు బిపి,షుగర్,ఈసిజి తదితర టెస్టులు

  • గుంటూరు జిజిహెచ్ నుంచి మంగళగిరి కోర్టుకు తరలింపు

June 10th, 9:00AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును నిన్న(సోమవారం, జూన్‌ 9) అక్రమంగా అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి సోమవారం ఉదయమే చేరుకుని కొమ్మినేనిని అదుపులోకి తీసుకున్నారు. 70 ఏళ్ల వయస్సున్న కొమ్మినేనిపై అక్రమ కేసులు బనాయించి మరీ అరెస్ట్‌ చేయించింది కూటమి ప్రభుత్వం. 

ఇదిలా ఉంచితే,  ఈ రోజు(మంగళవారం, జూన్‌10) ఉదయం కొమ్మినేనిని  జీజీహెచ్‌కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షల తర్వాత మంగళగిరి కోర్టుక కొమ్మినేనిని తరలించనున్నారు. కొమ్మినేనిని రాత్రంతా నల్లపాడు పీఎస్‌లోనే ఉంచారు పోలీసులు. కొమ్మినేనిని అడ్వకేట్లు కలవకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై న్యాయవాదుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొమ్మినేని అరెస్టుపై జర్నలిస్టుల నిరసనలు

  • సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని అరెస్ట్‌ను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల నిరసనలు
  • నల్లగొండ నకిరేకల్‌లో నల్లజెండాలతో జర్నలిస్టుల నిరసన
  • ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తుందని ఆందోళన
  • భేషరతుగా కొమ్మినేనిని విడుదల చేయాలని జర్నలిస్టుల డిమాండ్

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది
అల్లూరి సీతారామరాజు జిల్లా: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్టును ఎమ్మెల్సీ అనంత బాబు ,మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిలు ఖండించారు. కక్షపూరితంగా కొమ్మినేని  అరెస్ట్ చేశారన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని విమర్శించారు.

కొమ్మినేని అరెస్టు దుర్మార్గం 
సాక్షి, అమరావతి: సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మి­నేని శ్రీనివాసరావు అరెస్టు దుర్మార్గం, కక్షపూరి­తమని, సాక్షి మీడియాను టార్గెట్‌ చేసిన సీఎం చంద్రబాబు, నిజాయితీగా పని చేసే జర్నలిస్టును వేధించడం దారుణమని వైఎ­స్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. తాడే­పల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యా­లయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జర్నలిస్ట్‌ కృష్ణంరాజు వ్యాఖ్యల­తో ‘సాక్షి’కి సంబంధం లేకపోయినా వైఎస్‌ జగన్‌ను, ఆయన సతీమణి భారతిని తిట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కూటమి పాలన వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే కొమ్మినేనిని అరెస్టు చేశారని విమర్శించారు.

కొమ్మినేని అరెస్టు అక్రమం  
అనంతపురం కార్పొరేషన్‌: సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్‌ అరెస్టు అక్రమమని వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు.ఆయన  సోమవారం విలేకరులతో మాట్లాడుతూ..రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కొమ్మినేనిని అరెస్టు చేయించారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం ఈ అంశాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. సాక్షి మీడియాపై చంద్రబాబు సర్కార్‌ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు, కొమ్మినేని విషయంలో మాత్రం ఆగమేఘాలపై స్పందించడం రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు.

విశ్లేషకుల వ్యాఖ్యలను ‘సాక్షి’కి ఆపాదించకూడదు 
సాక్షి, అమరావతి: రాజ­ధాని అమరావతిఫై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విశ్లే­ష­కుల అభిప్రాయా­లను సాక్షి మీడియాకు ఆపాదించడం సరైనది కాదని  సెంటర్‌ ఫర్‌ పొలిటికల్‌ స్ట్రాటజీ అండ్‌ రీసెర్చ్‌ (సీపీఆర్‌ఎస్‌) చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ డాక్టర్‌ మామిడి సుదర్శన్‌ అన్నారు. గతంలో ఈనాడులో వచి్చన పలు వ్యాసాలపై ఆ పత్రిక అధినేత రామోజీరావు మీద కోర్టులో పరువు నష్టం దావా వేసినప్పుడు రామోజీరావు ఇదే విషయాన్ని కోర్టుకు నివేదించారని తెలిపారు. పేపర్‌లో రాసే వ్యాసాలు, విశ్లేషణలు రాసిన వారి వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప, ఈనాడుకు ఏ సంబంధంలేదని హైకోర్టుకు రామోజీరావు నివేదించారని సోమవా­రం ఒక ప్రకటనలో ఆయన గుర్తుచేశారు. సాక్షి టీవీ చర్చలో అమరావతిపై విశ్లేషకుడి అభిప్రాయం ఆయన వ్యక్తిగతమని, దీనితో సాక్షికి సంబంధంలేదని స్పష్టం చేశారు.

కొమ్మినేనిని రాత్రంతా నల్లపాడు పీఎస్ లోనే ఉంచిన పోలీసులు

జర్నలిస్టులను అణిచివేతకే అక్రమ అరెస్ట్‌లు 
తిరుపతి మంగళం: కూటమి ప్రభు­త్వం అధికారంలోకి రాగానే కక్ష సాధింపులు, రెడ్‌బుక్‌ పాలన, అక్రమ కేసులు బనాయించి గిట్టనివాళ్లను జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకుందని వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరు­పతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తున్న సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం దాడులకు తెగ­బడుతూ అక్రమ అరెస్ట్‌లు చేయడం బాధా­క­రమన్నారు. జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడం,  పత్రికా కార్యాలయాలపై దాడులు చేయడం చరిత్రలో ఎన్నడూ లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘కొమ్మినేని’ అరెస్టు కక్ష సాధింపే.. 
హైదరాబాద్‌: సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్‌ చేయడాన్ని ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (ఐఎఫ్‌డబ్ల్యూజే), తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజేఎఫ్‌) తీవ్రంగా ఖండించాయి. ఇది పోలీసుల కక్ష సాధింపు చర్యలో భాగమని ఐఎఫ్‌డబ్ల్యూజే కార్యదర్శి పులిపలుపుల ఆనందం, టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర సీనియర్‌ ఉపాధ్యక్షుడు పిల్లి రాంచందర్‌ తదితరులు సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు హైదరాబాద్‌లో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు సందర్భంగా వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement