సాయికృష్ణ కేసు.. పోలీసుల అదుపులో బాషా! | Sai Krishna Case: Police Question Baasha News | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ కేసు.. పోలీసుల అదుపులో బాషా!

Jun 20 2026 1:10 PM | Updated on Jun 21 2026 9:52 AM

Sai Krishna Case: Police Question Baasha News

సాక్షి, విజయవాడ: సాయికృష్ణ మిస్సింగ్‌ కేసు వ్యవహారంలో పూటకో మలుపు తిరుగుతోంది. దర్యాప్తులో భాగంగా కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికకు వెళ్లిన అధికారులు.. అక్కడ పని చేసే బాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సాయికృష్ణను లాకప్‌డెత్‌ చేసిన అనంతరం ఇక్కడే ఖననం/అంత్యక్రియలు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గాదె సాయికృష్ణ కేసు దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీలు శనివారం విజయవాడ కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలోని అనుమానాస్పద వ్యవహారాలను బయటకు తెచ్చాయి. అనాధ మృతదేహాల నిర్వహణలో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలతో ఎలక్ట్రికల్ ఫర్నెస్ ఆపరేటర్ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

కృష్ణలంక స్వర్గపురిలో సాయంత్రం 6 గంటల తర్వాత దహనాలు నిర్వహించకూడదన్న నిబంధన అమల్లో ఉంది. అయితే మే నెల 23వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో రెండు అనాధ మృతదేహాలను అక్కడికి తీసుకువచ్చినట్లు తేలింది. అప్పటికే సమయం ముగిసిందని దహనానికి అవకాశం లేదని ఇంచార్జి బాషా చెప్పినప్పటికీ, పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల సూచనలతో మృతదేహాలను తాత్కాలికంగా అక్కడే నిల్వచేసినట్లు సమాచారం. అనంతరం 24వ తేదీ ఉదయం దహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ వ్యవహారం దర్యాప్తు చేస్తున్న గాదె సాయికృష్ణ కేసుతో అనుసంధానంగా బయటపడినట్లు తెలుస్తోంది. అనాధ మృతదేహాల దహనానికి సంబంధించిన ప్రొసీజర్‌ను పూర్తిగా పాటించారా లేదా? రికార్డులు సక్రమంగా నిర్వహించారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. దహనాలు, ఖననాల ముందు తప్పనిసరిగా నిర్వహించాల్సిన రికార్డులు, కృష్ణలంక పోలీసులు ఇచ్చిన అనుమతులు సరైన విధంగా ఉన్నాయా? అసలు ఆ అనుమతులు ఎవరు ఇచ్చారు? అనే విషయాల్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

జరిగింది ఇదే.. స్వర్గపురి ఎలక్ట్రిక్ ఫర్నిష్ ఆపరేటర్ షాకింగ్ నిజాలు..

విచారణలో భాగంగా ఎలక్ట్రికల్ ఫర్నెస్ ఆపరేటర్ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అతడి మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకుని సీఐ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో సాంకేతికంగా పరిశీలిస్తున్నారు. శ్మశాన వాటికలో విధి నిర్వహణలో ఏమైనా లోపాలు జరిగాయా? నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement