దాడి చేసింది టీడీపీ రౌడీలే | mla ramireddy pratap says attack on rtc driver in kavali has nothing to do with us | Sakshi
Sakshi News home page

దాడి చేసింది టీడీపీ రౌడీలే

Oct 30 2023 4:57 AM | Updated on Oct 30 2023 4:57 AM

mla ramireddy pratap says attack on rtc driver in kavali has nothing to do with us - Sakshi

చంద్రబాబు పోస్టర్‌తో నిందితుడు అరుణ్‌కుమార్‌

సాక్షి, అమరావతి: ఆర్టీసీ డ్రైవర్‌పై కావలిలో దాడి చేసిన రౌడీలు విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీకి చెందినవారేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. దాడి చేసిన రౌడీలు ‘ఐ సపోర్ట్‌ బాబు..’ బ్యానర్లు పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరు జనసేన జెండా కప్పుకోగా మరొకరు బీజేపీ నేత అనుచరుడిగా ఉన్నట్లు చెప్పారు.

ఆధారాలతో సహా రౌడీ మూకల ఫో­టోలను మీడియాకు ఆయన విడుదల చేశారు. ప్రశాంత ప్రాంతం కావలిలో ఎవరు ఎటువంటి వారో ప్రజలకు బాగా తెలుసన్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆదివారం తాడే­పల్లి­­లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాల­యంలో విలేకరులతో మాట్లాడుతూ వాస్తవాలు తెలుసు­కో­కుండా లోకేశ్, పవన్‌ కల్యాణ్‌ బుర్రలేని మా­ట­లు మాట్లాడారని విమర్శించారు.

దొంగలే.. దొంగ దొంగ అంటూ దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. సాయంత్రం 6.30 గంటల సమ­యంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలసి తాను ఆర్టీవో కార్యాలయాన్ని ప్రారంభించి వెళ్తుం­డగా సంఘటన స్థలం వద్ద ఏం జరిగిందో వివరాలు సేకరించాలని పోలీసులకు సూ­చించినట్లు చెప్పారు. టీడీపీ, దాని తోక పార్టీలు ప్రతి విషయాన్ని వైఎస్సార్‌ సీపీకి ఆపాదించే యత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. డ్రైవర్‌పై దాడి చేసిందెవరో కావలి ప్రజలందరికీ తెలుసని చెప్పారు.

నిందితుడు సుధీర్‌పై నాలుగు రాష్ట్రాల్లో వందల కేసులున్నాయని, అవన్నీ బయటకు తీస్తామని తెలిపారు. ఈ ఘటనలో తమ పార్టీకి చెందిన వారు ఒక్క­రున్నా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మరి లోకేశ్‌ అందుకు సిద్ధమేనా? అని సవాల్‌ చేశారు. ప్రధాన ముద్దాయి సుధీర్‌ గతంలో తన కారుపై కూడా దాడి చేసిన­ట్లు పేర్కొన్నారు. టీడీపీ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్న పసుపులేటి సుధాకర్‌ అనే వ్యక్తి పక్కన నిందితుడు గుర్రంకొండ అరుణ్‌ కుమార్‌ ఉన్నట్లు వెల్లడించారు.

గతంలో జనసేన తరఫున తనపై పోటీ చేసిన సుధాకర్‌ వద్ద ఇలాంటి గ్యాంగులు చాలా ఉ­న్నాయని, వాటిని హైదరాబాద్‌లో మోహరించి ఏం చేస్తున్నాడో తమకు సమాచారం ఉందన్నారు. అరుణ్‌ కుమార్‌ అనే వ్యక్తి ‘ఐ సపోర్ట్‌ బాబు’ అనే బ్యానర్‌ పట్టుకున్నాడని చెప్పారు. శివారెడ్డి జనసేన కార్యకర్తే అనే విషయాన్ని పవన్‌ తెలుసుకుంటే మంచిదన్నారు. ఎవరు రౌడీ షీటర్లను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారో గుర్తు పెట్టుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement