సెక్రటరీనే అడగండి.. నేనెళ్లిపోతా! | minister gummadi sandhya rani fire on public | Sakshi
Sakshi News home page

సెక్రటరీనే అడగండి.. నేనెళ్లిపోతా!

Apr 3 2025 11:36 AM | Updated on Apr 3 2025 1:42 PM

minister gummadi sandhya rani fire on public

సాక్షి, పార్వతీపురం మన్యం/సాలూరు: ‘మీకు నీళ్లు కావాలంటే నీళ్లిస్తాను. బిందెలు పట్టుకుని ఎండలో నిల్చోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మీరు ఎవరికి చెప్పారు. ఇప్పుడే కదా నాకు చెప్పింది.. ఎవరికో చెబితే ఎలా..’ అంటూ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలనుద్దేశించి వ్యాఖ్యానించారు. 

తాము ఐదు నెలలుగా ఇబ్బంది పడుతున్నామని, ఈ విషయం పంచాయతీ సెక్రటరీకి కూడా చెప్పామని మహిళలు చెబితే.. ‘సెక్రటరీకి చెప్పారా.. అయితే సెక్రటరీనే వెళ్లి అడగండి. నేను వెళ్లిపోతాను. ఆ సెక్రటరీలు పడుకుండి­పోతు­న్నారు’ అని అన్నారు. 

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గురువి­నాయు­డు­పేట పంచాయతీ గొలుగువలస గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు­చేసుకుంది. తాగునీటి సమస్య చెప్పుకొందామని వస్తే మంత్రి క్లాస్‌ పీకడం పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనకు కారణం సీపీఎం వాళ్లేనని అక్క­డున్న వామపక్ష నాయకుడు కోరాడ ఈశ్వర­రావుపై అసహనం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి పనులు చేయొద్దంటూ హెచ్చరించారు.   

Advertisement
 
Advertisement
Advertisement