
వైఎస్ఆర్ జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లిలో విషాదం నెలకొంది. మల్లేపల్లి చెరువులో 5 మంది పిల్లలు గల్లంతయ్యారు. పిల్లల మృతదేహాలు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. గాలింపుల్లో ఒక పిల్లవాడి మృతదేహం మాత్రం లభ్యమైంది. మిగిలిన నలుగురి మృతదేహాల కోసం గాలింపులు చేపడుతున్నారు. ఈతకు వెళ్లి పిల్లలు గల్లంతయ్యారని స్థానికులు చెబుతున్నారు.