అభాగ్యులకు ఆపన్నహస్తం  | Financial assistance by YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

అభాగ్యులకు ఆపన్నహస్తం 

Oct 21 2023 3:38 AM | Updated on Oct 21 2023 3:38 AM

Financial assistance by YS Jagan Mohan Reddy - Sakshi

కర్నూలు(సెంట్రల్‌): సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభాగ్యులకు ఆపన్నహస్తం అందించారు. గురువా­రం ఎమ్మిగనూరుకు వచ్చిన ఆయనను పలువురు కలిసి తమ బాధలు చెప్పుకోవడంతో సీఎం చలించిపోయారు. తక్షణ సాయం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజనకు ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో శుక్రవా­రం ఆమె తన కార్యాలయంలో ఆరుగురు బాధితుల­కు రూ.లక్ష చొప్పున సాయం అందించారు. అలా­గే సీఎంను ఉద్యోగాలు అడిగిన వారికి ఉపాధి కల్పన అవకాశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

సీఎంను కలిసిన బాధితుల వివరాలు 
♦ కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన యు.అశోక్‌ ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. 
♦ గోనెగండ్ల మండలం హెచ్‌.కైరవాడి గ్రామానికి చెందిన కురువ రాజు కుమార్తె అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. 
♦ ఎమ్మిగనూరుకు చెందిన షేక్‌ రేష్మకు బ్రెయిన్‌ క్యాన్సర్‌ కారణంగా రెండు కళ్లు కోల్పోయింది. 
♦  ఎమ్మిగనూరు మండలం దైవందిన్నె గ్రామానికి చెందిన బి.భాస్కర్‌ కుడి కాలు ఆపరేషన్‌ చేయించుకుని ఆరి్థకంగా చితికిపోయారు. 
♦  గోనెగండ్ల మండలం పెద్దమరివీడు గ్రామానికి చెందిన డి.ఖాజావలి ఆరేళ్లుగా కిడ్నీ, యూరిన్‌ బ్లాడర్‌ సమస్యతో బాధపడుతున్నారు. 
 ఎమ్మిగనూరుకు చెందిన గొల్ల లక్ష్మన్న కుమార్తె శ్రావణి మానసిక జబ్బుతో బాధపడుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement