సాక్షి,కృష్ణా : ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా మరో ఏడు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 26కు చేరింది.
కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు జిల్లాలో 4, తూర్పుగోదావరి జిల్లాలో 2, బాపట్ల జిల్లాలో 1 కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కారణంగా 10 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో తొమ్మిది మంది హోం ఐసొలేషన్లో ఉన్నారు. ఇప్పటివరకు ముగ్గురు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు నాలుగు మరణాలు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.


