AP CM YS Jagan Attends His Personal Assistant Daughter Marriage With His Family In Pulivendula - Sakshi
Sakshi News home page

Pulivendula: వివాహ వేడుకకు హాజరైన​ సీఎం జగన్‌ దంపతులు

Dec 3 2022 10:21 AM | Updated on May 9 2024 1:49 PM

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: సీఎం వ్యక్తిగత సహాయకుడు డి.రవిశేఖర్‌ యాదవ్‌ కుమార్తె వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు హజరయ్యారు. నూతన వధూవరులు హేమలత, గంగాధర్‌లను సీఎం జగన్‌, భారతీరెడ్డి ఆశీర్వదించారు. వివాహానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

శనివారం ఉదయం ఇడుపులపాయ వైఎస్సార్‌ఎస్టేట్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం పులివెందుల భాకరాపురం చేరుకున్నారు. అక్కడ నుంచి కదిరిరోడ్డులోని ఎస్‌సీఎస్‌ఆర్‌ గార్డెన్స్‌కు చేరుకుని వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు.


చదవండి: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్‌ 

Advertisement
 
Advertisement
Advertisement