సాత్నాల: సీజనల్ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో సాధన అన్నారు. మండలంలోని సైద్పూర్ పీహెచ్సీని మంగళవారం తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. మందుల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం సీజనల్ జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండి వైద్యసేవలందించాలని సిబ్బందికి సూచించారు. నవజాతి శిశు సంరక్షణ, తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించాలన్నారు. ఆమె వెంట ఎన్హెచ్ఎం డీపీవో దేవదాస్నాయక్, వైద్య బృందం ఉన్నారు.


