గుండెపోటుతో కండక్టర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

కుమారుడు పైచదువుల కోసం అమెరికా వెళ్తుండగా..

Aug 23 2023 1:46 AM | Updated on Aug 23 2023 10:55 AM

- - Sakshi

ఆదివారం రాత్రి తన కుమారుడు కృష్ణ పైచదువుల కోసం అమెరికా వెళ్తుండగా శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో కుటుంబ సభ్యులంతా వీడ్కోలు పలికి హైదరాబాద్‌లోని ఇంటికి వచ్చారు.

ఆదిలాబాద్: మండల కేంద్రానికి చెందిన దాసరి శివరాజ్‌(57) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శివరాజ్‌ కుమార్‌ భైంసా డిపోలో ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి తన కుమారుడు కృష్ణ పైచదువుల కోసం అమెరికా వెళ్తుండగా శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో కుటుంబ సభ్యులంతా వీడ్కోలు పలికి హైదరాబాద్‌లోని ఇంటికి వచ్చారు.

అంతలోనే గుండెపోటు రావడంతో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. కుమారుడికి సమాచారం అందించడంతో తిరుగు పయనమయ్యాడు. మంగళవారం జరిగిన అంతక్రియలో డిపో మేనేజర్‌ అమృత పాల్గొని నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement