breaking news
Wedding postponed
-
ఎంగేజ్మెంట్ రింగ్ తీసేసిన స్మృతి!?.. తొలి పోస్ట్ వైరల్
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025లో భారత్ విజేతగా నిలవడం ఇందుకు ఓ కారణం అయితే.. అర్ధంతరంగా ఆమె పెళ్లి ఆగిపోవడం మరో కారణం.సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో ప్రేమలో ఉన్నట్లు గతేడాది స్మృతి వెల్లడించింది. టీమ్ టూర్లకు సైతం అతడిని స్మృతి వెంట తీసుకువెళ్లేది. ఈ క్రమంలో వన్డే వరల్డ్కప్ టోర్నీ ముగిసిన తర్వాత స్మృతి (Smriti Mandhana) ఇండోర్ (పలాష్ స్వస్థలం) కోడలు కాబోతోందంటూ పలాష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ..అందుకు తగ్గట్లుగానే వరల్డ్కప్ గెలిచిన తర్వాత.. తాము నిశ్చితార్థం (Engagement) చేసుకున్న విషయాన్ని ధ్రువీకరిస్తూ.. స్మృతి మంధాన తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ సహచర ఆటగాళ్లతో కలిసి వీడియో విడుదల చేసింది. అనంతరం పలాష్ సైతం స్మృతి వేలికి ఉంగరాన్ని తొడుగుతూ ఆమెకు ప్రపోజ్ చేసిన వీడియోను షేర్ చేశాడు.ఘనంగా వేడుకలుఆ తర్వాత స్మృతి- పలాష్ హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. అయితే, మరికొన్ని గంటల్లో పెళ్లి ఉందనగా స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. దీంతో వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్మృతి మేనేజర్ వెల్లడించారు.అకస్మాత్తుగా ఆగిన పెళ్లి.. అనుమానాలుఅయితే, ఆ తర్వాత పలాష్ ముచ్చల్ కూడా ఆస్పత్రిలో చేరడం.. అతడు తనతో అసభ్యకర రీతిలో చాట్ చేశాడంటూ ఓ అమ్మాయి స్క్రీన్షాట్లు షేర్ చేయడం అనుమానాలు రేకెత్తించాయి. ఈ క్రమంలో స్మృతిని పలాష్ మోసం చేశాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగగా.. ఇరు కుటుంబాలు మౌనం వహించాయి.భిన్న స్పందనలుఈ క్రమంలో త్వరలోనే స్మృతితో తన కుమారుడి వివాహం జరుగనుందని పలాష్ తల్లి అమితా వెల్లడించగా.. స్మృతి సోదరుడు శ్రవణ్ మాత్రం పెళ్లికి సంబంధించిన తాము కొత్త తేదీ ఫిక్స్ చేయలేదని స్పష్టం చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో స్మృతి మంధాన శుక్రవారం తొలిసారిగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.రింగ్ తీసేసిన స్మృతి?ఓ ప్రముఖ బ్రాండ్ కోసం చేసిన యాడ్లో స్మృతి.. తన వరల్డ్కప్ విన్నింగ్స్ మూమెంట్స్ గురించి మాట్లాడింది. ఇందులో స్మృతి వేలికి ఎంగేజ్మెంట్ రింగ్ కనిపించలేదు. దీంతో ఆమె నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుందని కొంతమంది నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే, ఈ యాడ్ ఎంగేజ్మెంట్కు ముందే షూట్ చేశారని ఆమె అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. ఏదేమైనా స్మృతి ముఖం కళ తప్పినట్లు కనిపిస్తోందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా పెళ్లి వాయిదా పడిన వెంటనే స్మృతి.. తన వివాహ వేడుకలు, ఎంగేజ్మెంట్ రివీల్ వీడియోలను డిలీట్ చేయడం గమనార్హం.చదవండి: ‘మా అన్నయ్య వల్లే ఇదంతా.. నా జీవితమే మారిపోయింది’ View this post on Instagram A post shared by Smriti Mandhana (@smriti_mandhana) -
స్మృతి పెళ్లి: ఆ వార్తలపై తొలిసారి స్పందించిన కుటుంబం
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి అర్ధంతరంగా ఆగిపోవడంపై సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి. పలాష్ ముచ్చల్ ఆమెను మోసం చేశాడంటూ ఓ వర్గం ట్రోల్ చేస్తుండగా.. ఇద్దరి మధ్య అంతా సవ్యంగానే ఉందని మరికొందరు వాదిస్తున్నారు.ఇలాంటి తరుణంలో పలాష్ ముచ్చల్ (Palash Mucchal) తల్లి అమితా ముచ్చల్ ఇటీవల స్పందిస్తూ.. ‘‘స్మృతి- పలాష్ ఇద్దరూ బాధలో ఉన్నారు. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. వారి వివాహం జరుగుతుంది’’ అని హిందుస్తాన్ టైమ్స్తో పేర్కొన్నారు. దీంతో స్మృతి త్వరలోనే పెళ్లి కూతురు కాబోతుందని అభిమానులు సంతోషించారు.కొత్త తేదీ ఇదేనంటూ...ఈ నేపథ్యంలో స్మృతి- పలాష్ పెళ్లి (Smriti Mandhana Wedding Postponed)కి కొత్త తేదీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. డిసెంబరు 7న వీరిద్దరు వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నారంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ విషయంపై స్మృతి మంధాన సోదరుడు శ్రావణ్ మంధాన (Shravan Mandhana) తాజాగా స్పందించాడు.తొలిసారి స్పందించిన మంధాన కుటుంబంహిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. ‘‘ఈ వదంతులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో నాకైతే తెలియదు. ఇప్పటికీ ఈ వివాహం ఇంకా వాయిదా పడే ఉంది’’ అని శ్రావణ్ మంధాన రూమర్లను కొట్టిపాడేశాడు. స్మృతి- పలాష్ల పెళ్లి గురించి ఇప్పటి వరకు తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాడు.2019 నుంచి ప్రేమలో..కాగా సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన 2019 నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. గతేడాది ఈ విషయాన్ని బయటపెట్టిన ఈ జంట.. ఇటీవలే తమ వివాహ తేదీని కూడా వెల్లడించారు. నవంబరు 23న తాము పెళ్లితో ఒక్కటికానున్నట్లు తెలిపారు.అందుకు తగ్గట్లుగానే హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే, పెళ్లికి మరి కొన్ని గంటల సమయం ఉందనగా అనూహ్య రీతిలో తంతు వాయిదా పడింది. స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరగా.. వరుడు పలాష్ కూడా ఆస్పత్రిపాలయ్యాడు.తనతో చాట్ చేశాడంటూ ఓ అమ్మాయి..ఇంతలో పలాష్ తనతో చాట్ చేశాడంటూ ఓ అమ్మాయి.. ప్రైవేట్ విషయాలను బహిర్గతం చేసింది. దీంతో పెళ్లికి ముందు రోజు రాత్రి ఈ విషయం తెలిసి స్మృతి తండ్రి.. పలాష్తో గొడవపడి గుండెపోటుకు గురయ్యాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ఇటు ముచ్చల్.. అటు మంధాన కుటుంబం స్పందించలేదు. కనీసం ఖండించనూ లేదు.దీంతో అనుమానాలు మరింత బలపడగా.. పలాష్ తల్లి మాత్రం త్వరలోనే తన కుమారుడి వివాహం జరుగుతుందని చెప్పడం గమనార్హం. అయితే, ఈ విషయంపై ఇంత వరకు గుంభనంగా ఉన్న మంధాన కుటుంబం మాత్రం తొలిసారి మౌనం వీడి.. పెళ్లికి కొత్త తేదీ ఖరారు చేయలేదని కుండబద్దలు కొట్టడం గమనార్హం.చదవండి: Smriti Mandhana Or Palash Muchhal: ఎవరు రిచ్? -
త్వరలోనే నా కుమారుడి పెళ్లి: పలాష్ ముచ్చల్ తల్లి
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పెళ్లి (Smriti Mandhana) గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ ఆమెను మోసం చేసిన కారణంగానే వివాహం నిరవధికంగా వాయిదా పడిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు తోడు పలాష్తో చాట్ చేసింది తానేనంటూ ఓ అమ్మాయి గురువారం ధ్రువీకరించింది.స్మృతి తన ఆరాధ్య క్రికెటర్ అని, అలాంటి అమ్మాయికి పలాష్ నిజస్వరూపం తెలియాలనే ఉద్దేశంతో మాత్రమే ఇలా చేశానని సదరు యువతి పేర్కొంది. అయితే, పలాష్తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ చాట్స్ కూడా చాన్నాళ్ల క్రితం నాటివంటూ ట్విస్టు ఇచ్చింది.మరోవైపు.. స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా పెళ్లి గురించి ఎలాంటి స్పందన రాకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో పలాష్ ముచ్చల్ (Palash Mucchal) తల్లి అమిత మరోసారి మీడియా ముందుకు వచ్చారు.మానసిక వేదన వర్ణనాతీతంహిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. ‘‘పెళ్లి జరగాల్సిన రోజు ఎదురైన పరిణామాలతో ఇద్దరూ తీవ్రమైన బాధలో కూరుకుపోయారు. ఇద్దరి మానసిక వేదన వర్ణనాతీతం. తన వధువు (భార్య)తో ఇంట్లో అడుగుపెట్టాలని పలాష్ కలలు కన్నాడు.తొందర్లోనే పెళ్లి!నేను కూడా కోడలికి ఘనంగా స్వాగతం పలకాలని ఏర్పాట్లు చేసుకున్నాను. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. తొందర్లోనే పెళ్లి జరుగుతుంది’’ అని అమిత ముచ్చల్ (Amita Mucchal) పేర్కొన్నారు. అయితే, మంధాన కుటుంబం మాత్రం స్మృతి- పలాష్ల పెళ్లి విషయమై స్పందించలేదు.ఘనంగా వేడుకలుకాగా 2019 ప్రేమలో ఉన్న స్మృతి- పలాష్.. 2024లో తమ బంధాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. స్మృతి స్వస్థలం సాంగ్లీలో నవంబరు 23న వివాహ వేడుకకు ముహూర్తం ఖరారు కాగా.. హల్దీ, సంగీత్, మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి.అయితే, ఊహించని రీతిలో పెళ్లికి గంటల ముందు కార్యక్రమం వాయిదా పడింది. స్మృతి తండ్రి గుండెపోటు లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా.. ఆ తర్వాత పలాష్ కూడా ఆస్పత్రి పాలయ్యాడు. పలాష్ స్మృతిని మోసం చేశాడని.. అతడితో గొడవ పడే క్రమంలోనే స్మృతి తండ్రికి గుండెపోటు వచ్చిందని సోషల్ మీడియాలో గాసిప్రాయుళ్లు కథనాలు అల్లారు.ఆ వీడియోలు డిలీట్ చేసిన స్మృతిఈ నేపథ్యంలో పలాష్ తల్లి అమిత ముచ్చల్ స్పందిస్తూ.. స్మృతి తండ్రి అంటే తన కుమారుడికి ఎంతో ఇష్టమని.. ఆయన అనారోగ్యం పాలు కావడం తట్టుకోలేక అతడూ ఆస్పత్రి పాలయ్యాడని తెలిపారు. స్మృతి కంటే ముందు పలాషే వివాహాన్ని వాయిదా వేద్దామని చెప్పారు. తాజాగా ఆమె మరోసారి పైవిధంగా స్పందించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. స్మృతి తన పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలన్నీ డిలీట్ చేయడం గమనార్హం.చదవండి: Smriti Mandhana Vs Palash Muchhal: ఎవరి నెట్వర్త్ ఎంత? -
ఆగిన స్మృతి పెళ్లి.. జెమీమా రోడ్రిగ్స్ సంచలన నిర్ణయం
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025లో భారత్ చాంపియన్గా నిలవడంలో జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues)ది కీలక పాత్ర. లీగ్ దశలో అంతంత మాత్రంగానే ఆడిన ఈ ముంబైకర్ సెమీస్లో మాత్రం అదరగొట్టింది. పటిష్ట ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో భారత్ను ఒంటిచేత్తో గెలిపించి ఫైనల్కు చేర్చింది.చాంపియన్ జట్టు ఆసీస్ విధించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆదిలోనే తడబడగా.. వన్డౌన్లో వచ్చిన జెమీమా జట్టును ఆదుకుంది. అజేయ శతకం (134 బంతుల్లో 127)తో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (89)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఇలా ఆటతోనే విమర్శకులకు సమాధానం చెప్పిన జెమీమా.. వ్యక్తిగత జీవితంలోనూ తనకు తానే సాటి అని చాటుకుంది.అక్కాచెల్లెళ్ల మాదిరిభారత జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) జెమీమాకు ప్రాణ స్నేహితురాలన్న విషయం తెలిసిందే. అక్కాచెల్లెళ్ల మాదిరి వీళ్లిద్దరు కలిసి ఉంటారు. తనకు పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో పెళ్లి కుదిరిన వెంటనే.. ఎంగేజ్మెంట్ విషయాన్ని జెమీమా సోషల్ మీడియా అకౌంట్ ద్వారానే స్మృతి వెల్లడించింది.ఆ తర్వాత స్మృతి- పలాష్ హల్దీ, సంగీత్ వేడుకల్లో జెమీమా తోటి క్రికెటర్లు అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్లతో కలిసి ఆడిపాడింది. కానీ అనూహ్య రీతిలో స్మృతి పెళ్లి నిరవధికంగా వాయిదా పడింది. తొలుత స్మృతి తండ్రి ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరడం.. ఆ తర్వాత పలాష్ కూడా ఆస్పత్రిపాలు కావడం.. ఆ తర్వాత అతడు వేరే అమ్మాయితో చేసినట్లుగా ఉన్న చాట్స్ లీక్ కావడం సందేహాలకు తావిచ్చాయి.ఆగిన వివాహంమరోవైపు.. స్మృతి తండ్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా పెళ్లి గురించి మంధాన కుటుంబం స్పందించలేదు. ఈ నేపథ్యంలో జెమీమా రోడ్రిగ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. కష్టకాలంలో స్మృతికి తోడుగా ఉండేందుకు మహిళల బిగ్ బాష్ టీ20 లీగ్లో మిగిలిన మ్యాచ్లకు కూడా దూరమైంది.స్మృతి కోసం సంచలన నిర్ణయండబ్ల్యూబీబీఎల్లో జెమీమా ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రిస్బేన్ హీట్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇందుకు సంబంధించి.. ‘‘దురదృష్టవశాత్తూ జెమీ ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్లకు కూడా దూరంగా ఉండనుంది. తను భారత్లోనే ఉండిపోవాలని తీసుకున్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం.హోబర్ట్ జట్టు జెమీ, స్మృతి మంధాన కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని కోరుకుంటుంది. నిజానికి తాను తిరిగి రావాలనుకున్నా.. పరిస్థితుల దృష్ట్యా రాలేకపోతున్నానని జెమీ మాకు చెప్పింది. మా ప్లేయర్లతో ఆమె టచ్లోనే ఉంది. జట్టు గెలవాలని ఆమె కోరుకుంటోంది’’ అని ఫ్రాంఛైజీ ఒక ప్రకటన విడుదల చేసింది.కాగా ఈ సీజన్లో హీట్ తరఫున మూడు మ్యాచ్లు ఆడిన జెమీమా 37 పరుగులు చేసింది. హోబర్ట్ హ్యారికేన్స్తో మ్యాచ్ తర్వాత స్మృతి పెళ్లి కోసం స్వదేశానికి తిరిగి వచ్చింది. అయితే, స్నేహానికి ప్రాణమిచ్చే తనకు కెరీర్ కంటే.. క్లిష్ట పరిస్థితుల్లో స్మృతి వెంట ఉండటమే సరైందనే నిర్ణయం తీసుకుంది. ఇక ఈ సీజన్లో భారత్ తరఫున డబ్ల్యూబీబీఎల్ ఆడిన ఏకైక ప్లేయర్ జెమీమా కావడం విశేషం.చదవండి: ఇలాగైతే స్మృతిని ఎవరూ పెళ్లి చేసుకోరు!.. తండ్రికి వేధింపులు.. ఇప్పుడిలా! -
ఇలాగైతే స్మృతిని ఎవరూ పెళ్లి చేసుకోరు!.. తండ్రికి వేధింపులు.. ఇప్పుడిలా!
జాతి గర్వించదగ్గ క్రికెటర్లలో స్మృతి మంధాన (Smriti Mandhana) ఒకరు. భారత జట్టు ఓపెనర్గా, వైస్ కెప్టెన్గా మహిళా క్రికెట్పై ఆమె ముద్ర ప్రత్యేకం. మహారాష్ట్రలోని సాంగ్లీ అనే చిన్న పట్టణంలో 1996, జూలై 18న జన్మించింది స్మృతి.ఆమె తల్లిదండ్రులు స్మిత మంధాన, శ్రీనివాస్ మంధాన. తండ్రి, అన్నని చూసి క్రికెటర్ కావాలన్న కోరిక చిన్న వయసులోనే స్మృతి మనసులో బలంగా నాటుకుపోయింది. అందుకు తగ్గట్టుగానే తండ్రి ప్రోత్సాహంతో ఆశయం దిశగా అడుగులు వేసింది.తొమ్మిదేళ్ల వయసులోఈ క్రమంలో తొమ్మిదేళ్ల వయసులో స్మృతి మంధాన మహారాష్ట్ర అండర్-15 జట్టుకు ఎంపికైంది. పదకొండేళ్లకు అండర్-19 టీమ్ స్థాయికి చేరుకుంది. అత్యంత పిన్న వయసులోనే అంటే.. పదహారేళ్లకే 2013లో స్మృతి భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనా మొక్కవోని సంకల్పంతో ఓపెనర్గా రికార్డులు కొల్లగొడుతూ స్మృతి అగ్ర పథంలో దూసుకుపోతోంది. అత్యుత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్గా అవార్డు అందుకుంది.వరల్డ్కప్ చాంపియన్గాభారత జట్టు వైస్ కెప్టెన్ స్థాయికి చేరుకున్న 29 ఏళ్ల స్మృతి.. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 గెలవడంలో తన వంతు పాత్ర పోసించి.. వరల్డ్కప్ చాంపియన్గా నిలిచింది. అయితే, క్రికెటర్గా ఎదిగే క్రమంలో స్మృతికి, ఆమె తల్లిదండ్రులకు అవహేళనలే ఎదురయ్యాయి.సగటు భారతీయ తండ్రిఈ విషయం గురించి స్మృతి మంధాన 2023లో కౌన్ బనేగా కరోడ్పతి 15 షోలో స్పందించింది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘అవును సర్.. నాకు, మా అన్నయ్యకు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే చాలా ఇష్టం. నాన్న కూడా క్రికెటర్ కావాలని అనుకున్నాడు. కానీ ఆయన కుటుంబం అందుకు అవకాశం ఇవ్వలేదు. క్రీడల్లోకి వెళ్లాలనే ఆలోచన పక్కనపెట్టమని చెప్పారు.అందుకే నాన్న తన కల మా ద్వారా నెరవేరితే బాగుండని కోరుకున్నారు. సగటు భారతీయ తండ్రిగా ఆయన కోరిక అది. నేను మా అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆయన ఈ కల కన్నారు. మా అన్నతో కలిసి నేను క్రికెట్ ఆడేదాన్ని.అన్న నెట్స్లో బ్యాటింగ్ చేస్తున్నపుడు అతడి బ్యాటింగ్ శైలిని పరిశీలించేదాన్ని. నిజానికి నేను రైటీని (కుడిచేతి వాటం). మా అన్న లెఫ్టీ. అన్నను చూసే బ్యాటింగ్ చేస్తూ లెఫ్టాండర్గా మారిపోయా.అందరు ఆడపిల్లల తల్లిదండ్రుల్లాగే మా వాళ్లకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. స్పోర్ట్స్ పర్సన్ జీవితం అంత సాఫీగా ఉండదని మా వాళ్లను చాలా మంది నిరుత్సాహపరిచారు. ఒక రకంగా మా వాళ్లను వేధించారు కూడా!తనను ఎవరు పెళ్లి చేసుకుంటారు?ఎండలో ఆడితే ఆమె ముఖం కందిపోతుంది. నల్లబడుతుంది. అలాంటపుడు తనను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అంటూ భయపెట్టారు. అయినా సరే నా తల్లిదండ్రులు నన్ను వెనక్కి లాగలేదు. క్రికెట్ ఆడేలా ప్రోత్సహించారు’’ అని స్మృతి మంధాన గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది.తన, తండ్రి ఆశయానికి తగ్గట్టుగా క్రికెటర్గా ఎదిగిన స్మృతి.. అత్యుత్తమ వన్డే మహిళా క్రికెటర్గా నీరాజనాలు అందుకుంటోంది. ఇప్పటి వరకు భారత్ తరఫున 7 టెస్టులు ఆడి 629, 117 వన్డేల్లో 5322, 153 టీ20లలో 3982 పరుగులు సాధించింది. అండర్-19 స్థాయిలో లిస్ట్-ఎ మ్యాచ్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన మహిళా క్రికెటర్ స్మృతి.ఉన్నత శిఖరాలకుఇక మహిళల ప్రీమియర్ లీగ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు తొలి టైటిల్ అందించిన కెప్టెన్. కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న స్మృతి.. వరల్డ్ చాంపియన్గా నిలిచిన తర్వాత పెళ్లి బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.మనసిచ్చిన ప్రియుడు పలాష్ ముచ్చల్తో ఏడడుగులు వేసే క్రమంలో హల్దీ, సంగీత్ వేడుకల్లో ఆడిపాడింది. కానీ ఆఖరి నిమిషంలో తండ్రి అస్వస్థతకు గురికావడంతో పెళ్లి నిరవధికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో పలాష్పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. చంచల మనసు గల అతడు స్మృతిని మోసం చేశాడని.. అది తెలిసే స్మృతి తండ్రికి గుండెపోటు వచ్చిందనే వదంతులు వస్తున్నాయి.ఊహించని విధంగా.. ఇప్పుడిలాఏదేమైనా క్రికెటర్ అయితే.. పెళ్లి కాదంటూ స్మృతిని వెక్కిరించిన వాళ్లకు ఆటతోనే ఆమె సమాధానం ఇచ్చింది. దేశాన్ని గర్వపడేలా చేసి ప్రపంచకప్ను ముద్దాడింది. అయితే, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇలా ఊహించని చేదు అనుభవాన్ని చవిచూసింది. అంతా సజావుగా సాగి స్మృతి వివాహ బంధంలో అడుగుపెడితే చూడాలని ఆమె సన్నిహితులు, అభిమానులు కోరుకుంటున్నారు.చదవండి: Smriti Mandhana Vs Palash Muchhal: ఎవరి నెట్వర్త్ ఎంత? -
స్మృతి వర్సెస్ పలాష్: ఎవరి నెట్వర్త్ ఎంత?
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి అనూహ్య పరిస్థితుల్లో వాయిదా పడింది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైన తరుణంలో అకస్మాత్తుగా స్మృతి తండ్రి ఆరోగ్యం చెడిపోయింది. ఈ నేపథ్యంలో తన పెళ్లిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్మృతి తన మేనేజర్తో మీడియాకు చెప్పించింది. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అనేక సందేహాలకు తావిచ్చాయి. స్మృతి తండ్రి శ్రీనివాస్ ఆస్పత్రిలో చేరిన తర్వాత పలాష్ కూడా ఆస్పత్రి పాలు కావడం ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత పలాష్ పేరిట ఓ అకౌంట్ నుంచి మేరీ డికోస్టా అనే అమ్మాయికి అసభ్యకరమైన మెసేజ్లు వెళ్లాయనేలా స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి.మోసం చేశాడా?అందులో స్మృతితో తన బంధాన్ని కించపరిచేలా మాట్లాడిన పలాష్.. డికోస్టాతో డేటింగ్ చేయడానికి ఉవ్విళ్లూరినట్లుగా అనిపించింది. అంతేకాదు.. స్మృతితో తనకు ‘లాంగ్ డిస్టేన్స్’ ఉందంటూ పలాష్.. సదరు అమ్మాయిని తనతో ఎంజాయ్ చేయాలని కోరినట్లుగా ఉన్న మెసేజ్లు వైరల్గా మారాయి.ఈ నేపథ్యంలో పలాష్ తన మాజీ ప్రేయసి బిర్వా షాకు ప్రపోజ్ చేసిన పాత రొమాంటిక్ వీడియోలు కూడా తెరమీదకు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పలాష్.. స్మృతిని మోసం చేశాడని.. ఇది గుర్తించిన ఆమె తండ్రి అతడితో గొడవ పడే క్రమంలోనే అస్వస్థతకు గురయ్యాడనే వదంతులు వ్యాపించాయి. అయితే, సోషల్ మీడియాలో స్మృతి- పలాష్ గురించి ఇంత రచ్చ జరుగుతున్నా ఇరువర్గాల నుంచి ఎలాంటి స్పందనా లేదు.ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. అయినాఅంతేకాదు.. తాజా సమాచారం ప్రకారం స్మృతి తండ్రి సాంగ్లీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయినప్పటికీ పెళ్లి గురించి మంధాన కుటుంబం గురించి ఎటువంటి స్పందన రాకపోవడం అనుమానాలు బలపడేలా చేసింది. ఇద్దరిలో ఎవరు ధనవంతులు?ఈ నేపథ్యంలో పలాష్.. అందం, కీర్తి ప్రతిష్టలు, డబ్బు ఉన్న స్మృతిని ప్రేమ అనే మత్తులో ఉంచి ద్రోహానికి పాల్పడ్డాడంటూ అతడిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరి నెట్వర్త్ ఎంత?.. ఇద్దరిలో ఎవరు ధనవంతులు? అన్న చర్చ నడుస్తోంది.టాప్ క్రికెట్ స్టార్ స్మృతిభారత మహిళా జట్టు వైస్ కెప్టెన్గా, మహిళల ప్రీమియర్ లీగ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు తొలి టైటిల్ అందించిన సారథిగా మంధానకు పేరుంది. ఇటీవల ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 గెలవడంలోనూ ఆమెది కీలక పాత్ర. వెరసి స్మృతి బ్రాండ్ వాల్యూ మునుపటి కంటే భారీ స్థాయిలో పెరిగింది.భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కాంట్రాక్టులో ద్వారా ఆమెకు ఏటా రూ. 50 లక్షల వేతనం వస్తుంది. అదే విధంగా ఒక్కో టెస్టు మ్యాచ్కు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, అంతర్జాతీయ టీ20 మ్యాచ్కు రూ. 3 లక్షలు అదనంగా లభిస్తాయి.ఆమె నికర ఆస్తుల విలువ ఎంతంటే?ఇందుకు తోడు ఆర్సీబీ ప్రధాన ప్లేయర్గా, కెప్టెన్గా స్మృతికి రూ. 3.4 కోట్లు దక్కుతాయి. మహిళా క్రికెటర్లలో ఈ మేరకు అత్యధిక ధరకు ఒప్పందం కుదుర్చుకున్న అమ్మాయి మంధాననే. వీటితో పాటు బ్రాండ్ ప్రమోషన్స్, ప్రచారం ద్వారా కూడా స్మృతి రెండు చేతులా సంపాదిస్తోంది. ఈ నేపథ్యంలో 2025 నాటికి స్మృతి మంధాన నికర ఆస్తుల విలువ రూ. 32- 34 కోట్ల మధ్య ఉంటుందని జాతీయ మీడియా అంచనా. పలాష్ నెట్వర్త్ ఎంత?ఇక పలాష్ విషయానికొస్తే.. మ్యూజిక్ కంపోజర్గా, ఆల్బమ్స్ రూపకర్తగా అతడికి ఆదాయం వస్తోంది. అంతేకాదు.. దర్శకుడిగా, నిర్మాతగా కూడా పలాష్ అదనపు ఆదాయం గడిస్తున్నాడు. వీటితో పాటు లైవ్ షోలు, రాయల్టీల ద్వారా పలాష్కు భారీ మొత్తమే అందుతోంది. వెరసి 2025 నాటికి అతడి నెట్వర్త్ రూ. 20- 41 కోట్ల మధ్య ఉంటుందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాగా 2019 నుంచి స్మృతి- పలాష్ రిలేషన్లో ఉండగా.. గతేడాది తమ ప్రేమను ధ్రువీకరించారు. ఈ జంట నవంబరు 23న పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉండగా అంతా గందరగోళంగా మారిపోయింది.చదవండి: స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి -
స్మృతిని మోసం చేసిన పలాష్?!.. పెళ్లికి ముందు రోజు రాత్రి...
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana)కు కాబోయే భర్త పలాష్ ముచ్చల్ (Palash Mucchal)పై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. అతడు స్మృతిని మోసం చేశాడంటూ సంచలన ఆరోపణలు వచ్చాయి. పెళ్లికి ముందు రాత్రే స్మృతికి ఈ విషయం తెలిసిందని.. వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయడానికి ఇదే కారణమనే వదంతులు వ్యాపిస్తున్నాయి.ఇండోర్ కోడలు కాబోతోంది అంటూకాగా మహారాష్ట్రకు చెందిన స్మృతి మంధాన.. ఇండోర్ మూలాలున్న పలాష్ ముచ్చల్తో 2019 నుంచి డేటింగ్లో ఉంది. కొన్నాళ్ల క్రితం వీరిద్దరు తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా వెల్లడించారు. స్మృతి భారత క్రికెట్ జట్టు ఓపెనర్, వైస్ కెప్టెన్గా రాణిస్తుండగా.. పలాష్ బాలీవుడ్లో సంగీత దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.ఇదిలా ఉంటే.. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత స్మృతి పెళ్లి వార్త తెరమీదకు వచ్చింది. పలాష్ సైతం.. ‘త్వరలోనే స్మృతి ఇండోర్ కోడలు కాబోతోంది’ అంటూ సంకేతాలు ఇచ్చాడు. ఇక ఇటీవల స్నేహితులతో కలిసి నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ.. తనకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని స్మృతి ధ్రువీకరించింది.తండ్రికి గుండెపోటు!ఆ తర్వాత పలాష్.. స్మృతి వరల్డ్కప్ గెలిచిన డీవై పాటిల్ స్టేడియంలోనే ఆమెకు ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ చేశాడు. అనంతరం హల్దీ, సంగీత్ వేడుకల్లో జంటగా సందడి చేశారు. నవంబరు 23న వివాహానికి కొన్ని గంటల ముందు వీరి పెళ్లి వాయిదా పడిందనే వార్త బయటకు వచ్చింది.తండ్రికి గుండెపోటు వచ్చిన కారణంగా ఆస్పత్రిలో చేరడంతో తన పెళ్లిని నిరవధికంగా వాయిదా వేయాలని స్మృతి చెప్పినట్లు ఆమె మేనేజర్ వెల్లడించాడు. ఆ తర్వాత అనూహ్యంగా పలాష్ కూడా ఆస్పత్రి పాలయ్యాడు. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు సంచలన విషయాలు తెరమీదకు తెచ్చారు.‘బంధం’ పాతబడిందని..కొరిగ్రాఫర్ అని చెప్పుకొనే మేరీ డికోస్టా పేరుతో.. పలాష్ తనతో చాట్ చేసినట్లుగా స్క్రీన్ షాట్స్ బయటకు వచ్చాయి. ఇందులో పలాష్.. స్మృతి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తనతో ‘బంధం’ పాతబడిందని.. మేరీని తనతో డేటింగ్కు రావాల్సిందిగా, ఎంజాయ్ చేద్దామంటూ ‘పర్సనల్’ చాట్ చేసినట్లు వైరల్ అవుతోంది.నిజమేనా?ఈ విషయాన్ని గుర్తించిన స్మృతి తండ్రి.. పలాష్ను నిలదీయడంతో గొడవకు దారి తీసిందని.. అప్పుడే ఆయనకు గుండెపోటు వచ్చిందని గాసిప్రాయుళ్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు.. పెళ్లికి సంబంధించిన వీడియోలు డిలీట్ చేసినప్పటికీ.. పలాష్తో గతంలో దిగిన ఫొటోలన్నీ స్మృతి అలాగే ఉంచింది. ఈ నేపథ్యంలో స్మృతి- పలాష్ బంధం గిట్టని వాళ్లే ఇలా చేస్తున్నారని.. స్మృతి తండ్రి కోలుకోగానే.. వీరి పెళ్లి జరుగుతుందంటూ అభిమానులు అండగా నిలుస్తున్నారు.అయితే, నెట్టింట ఇంత రచ్చ జరుగుతున్నా ఇరు కుటుంబాల నుంచి నేరుగా ఎటువంటి స్పందనా రాలేదు. పలాష్ అక్క, బాలీవుడ్ గాయని పాలక్ ముచ్చల్ మాత్రం.. ‘‘స్మృతి తండ్రి అనారోగ్యం వల్లే పెళ్లిని ప్రస్తుతానికి నిలిపివేశారు. ఈ సమయంలో మా గోప్యతకు భంగం కలిగించకండి’’ అని ఇన్స్టా వేదికగా నెటిజన్లకు విజ్ఞప్తి చేసింది. చదవండి: స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి -
స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) వివాహం ఊహించని పరిణామంతో వాయిదా పడింది. ప్రియుడు, బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైన వేళ.. ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యం పాలయ్యారు. గుండెపోటు లక్షణాలతో సాంగ్లీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.స్మృతి- పలాష్ పెళ్లి నిరవధికంగా వాయిదాఈ నేపథ్యంలో తండ్రి చూడని వేడుక తనకు వద్దంటూ స్మృతి.. పలాష్తో పెళ్లిని వాయిదా వేసుకుందని ఆమె మేనేజర్ మీడియాకు చెప్పారు. ఓవైపు తండ్రి విషయంలో స్మృతి ఆందోళన చెందుతుండగా.. మరోవైపు.. ఆమెకు కాబోయే భర్త పలాష్ ముచ్చల్ కూడా ఆస్పత్రిపాలయ్యాడు. వైరల్ ఇన్ఫెక్షన్, ఎసిడిటీతో అతడు ముంబైలోని గోరేగావ్ ఆస్పత్రిలో చేరాడు.వరుస మ్యూజిక్ కన్సర్టులు, పెళ్లి పనుల కారణంగానే పలాష్ ముచ్చల్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని.. అందుకే అతడి ఆరోగ్యం చెడిపోయిందని ఎన్డీటీవీకి అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, స్మృతి- పలాష్ పెళ్లి నిరవధికంగా వాయిదా పడటంపై సోషల్ మీడియాలో ఊహించని విధంగా వదంతులు పుట్టుకువచ్చాయి. ఇరు కుటుంబాల మధ్య సఖ్యత చెడిందా అనేలా గాసిప్రాయుళ్లు పుకార్లు పుట్టిస్తున్నారు.స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడుఈ నేపథ్యంలో పలాష్ ముచ్చల్ తల్లి అమిత.. ట్రోల్స్కు దిమ్మతిగిరేలా కౌంటర్ ఇచ్చారు. హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. ‘‘స్మృతి తండ్రి అంటే పలాష్కు ఎంతో ఇష్టం. స్మృతి కంటే ఆమె తండ్రి దగ్గరే పలాష్కు సాన్నిహిత్యం ఎక్కువ.ఆయన అనారోగ్యం బారిన పడ్డారని తెలియగానే.. స్మృతి కంటే ముందు పలాష్ స్పందించాడు. తనే పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడు. స్మృతి తండ్రి కోలుకునేంత వరకు వివాహ వేడుకను వాయిదా వేయాలని చెప్పాడు. తీవ్రమైన ఒత్తిడిహల్దీ తర్వాత పలాష్ను బయటకు ఎక్కడికీ పంపలేదు. స్మృతి తండ్రికి ఛాతీ నొప్పి వచ్చిందని తెలియగానే పలాష్ చాలా సేపు ఏడుస్తూనే ఉన్నాడు. దీంతో అతడి ఆరోగ్యం కూడా పాడైంది. ఆస్పత్రిలోనే నాలుగు గంటల సేపు ఉంచారు. ఐవీ డ్రిప్ పెట్టారు. ఈసీజీ తీశారు. ఇతరత్రా పరీక్షలు కూడా చేశారు. అన్ని రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయి.అయితే, ఇప్పటికీ ఒత్తిడి నుంచి బయటపడలేకపోతున్నాడు’’ అని పలాష్ ముచ్చల్ తల్లి అమితా ముచ్చల్ తెలిపారు. కాగా పలాష్ అక్క, బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ కూడా తన సోదరుడి వివాహం గురించి స్పందించారు. స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగానే పెళ్లి వాయిదా పడిందని.. ఇలాంటి క్లిష్ట సమయంలో తమ గోప్యతకు భంగం కలిగించవద్దని కోరారు. చదవండి: పీవీ సింధు ఫిట్నెస్పై సైనా నెహ్వాల్ కీలక వ్యాఖ్యలు -
పెళ్లికి సంబంధించిన వీడియోలు డిలీట్ చేసిన మంధాన
భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పేరు గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. వన్డే ప్రపంచకప్-2025లో భారత్ విజేతగా నిలవడంలో బ్యాటర్గా, వైస్ కెప్టెన్గా తన వంతు పాత్ర పోషించిన ఈ మహారాష్ట్ర అమ్మాయి.. ఆ వెనువెంటనే మరో శుభవార్త పంచుకుంది.నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ..తన చిరకాల స్నేహితుడు, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో పెళ్లి బంధంలో అడుగుపెట్టనున్నట్లు ఇటీవలే స్మృతి మంధాన ధ్రువీకరించింది. నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ.. సహచర ఆటగాళ్లు జెమీమా రోడ్రిగ్స్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యదవ్లతో కలిసి తన ఎంగేజ్మెంట్ విషయాన్ని రీల్ ద్వారా రివీల్ చేసింది.అనంతరం పలాష్.. భారత్ విశ్వవిజేతగా నిలిచిన డీవై పాటిల్ స్టేడియంలో మోకాళ్లపై కూర్చుని స్మృతికి ప్రపోజ్ చేశాడు. ఈ రెండు వీడియోలను తన సోషల్ మీడియాలో అకౌంట్లో షేర్ చేసి మురిసిపోయింది మంధాన. అయితే, ప్రస్తుతం వాటిని స్మృతి మంధాన తన అకౌంట్ నుంచి డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.గుండెపోటు లక్షణాలతో ఆస్పత్రిలో..కాగా స్మృతి- పలాష్ పెళ్లి ముందస్తు వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఈ జంట ఉత్సాహంగా గడిపింది. అయితే, ఆదివారం వీరి వివాహం జరగడానికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు గుండెపోటు లక్షణాలు ఉండటంతో వైద్యులు ఆ మేరకు చికిత్స అందిస్తున్నారు.ఆ వీడియోలన్నీ డిలీట్ చేసిన మంధానఆ వెంటనే పలాష్ ముచ్చల్ కూడా వైరల్ ఇన్ఫెక్షన్, ఎసిడిటీతో ఆస్పత్రిలో చేరాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తన ప్రీవెడ్డింగ్ మూమెంట్స్ను స్మృతి మంధాన సోషల్ మీడియా నుంచి తీసివేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. మంధాన తండ్రి ఇంకా ఆస్పత్రిలోనే ఉండగా.. పలాష్ మాత్రం డిశ్చార్జ్ అయ్యాడు.కాగా పరిస్థితులు చక్కబడ్డ తర్వాత స్మృతి మళ్లీ తన ఎంగేజ్మెంట్ రివీల్, ప్రపోజల్ వీడియోలు షేర్ చేస్తుందని అభిమానులు అంటున్నారు. తండ్రి ఆరోగ్యం దృష్ట్యానే వాటిని తాత్కాలికంగా హైడ్ చేసిందని అభిప్రాయపడుతున్నారు. స్మృతి- పలాష్ లాంటి చూడచక్కని జంటకు ఎవరి దిష్టి తగలవద్దని.. త్వరలోనే వారు పెళ్లి పీటలు ఎక్కాలని ఆకాంక్షిస్తున్నారు.చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్ -
ఆస్పత్రి పాలైన పలాష్ ముచ్చల్!.. స్మృతి తండ్రి హెల్త్ అప్డేట్ ఇదే!
ఆనందోత్సవాల నడుమ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైన భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన జీవితంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పలాష్ ముచ్చల్తో కలిసి స్మృతి ఏడడుగులు నడిచేందుకు సిద్ధమైన వేళ... ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన ఉన్నపళంగా అస్వస్థతకు గురయ్యారు.తప్పనిసరి పరిస్థితుల్లో..ఊహించని ఈ పరిణామంతో స్మృతి- పలాష్ పెళ్లితంతును నిరవధికంగా వాయిదా (Smriti Mandhana- Palash Muchhal Wedding Postponed) వేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ‘ఆదివారం ఉదయం శ్రీనివాస్ అల్పాహారం తీసుకున్న తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. అయినప్పటికీ పెళ్లి సమయం కల్లా కోలుకుంటారనే ఇరు కుటుంబసభ్యులు ఎదురుచూశారు.నాన్న చూడని వేడుక నాకొద్దుకానీ ఆశించినట్లుగా ఆరోగ్యం ఏమాత్రం మెరుగవలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లిని వాయిదా వేయాల్సి వచ్చింది’ అని స్మృతి మేనేజర్ తుహిన్ మిశ్రా వెల్లడించారు. నాన్న గారాల పట్టి స్మృతి. అందుకే నాన్న చూడని తన కల్యాణ వేడుక నాకొద్దని స్మృతి కరాకండీగా చెప్పినట్లు తెలిసింది. తన తండ్రి ఆరోగ్యంగా తిరిగొచ్చాకే వివాహ వేడుక ఉంటుందని స్పష్టం చేసింది.ఆస్పత్రి పాలైన పలాష్ ముచ్చల్!కాగా ముందే నిర్ణయించిన సుమూహుర్తం ప్రకారం ఆదివారం స్మృతి, బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం జరగాల్సింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే తండ్రి అనారోగ్యం కారణంగా ఆందోళనలో మునిగిపోయిన స్మృతి మంధానకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. స్మృతికి కాబోయే భర్త పలాష్ ముచ్చల్ కూడా ఆస్పత్రి పాలైనట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఎన్డీటీవీ అందించిన వివరాల ప్రకారం.. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా పలాష్ ముచ్చల్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఎసిడిటీ ఎక్కువ కావడంతో అతడు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, పలాష్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. మెరుగైన చికిత్స కోసం మాత్రమే అతడు ఆస్పత్రికి వెళ్లాడని సమాచారం.స్మృతి తండ్రి హెల్త్ అప్డేట్ ఇదే!ఇక స్మృతి తండ్రి శ్రీనివాస్ను పరీక్షించిన వైద్యుడు డాక్టర్ నమన్ షా పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘మధ్యాహ్నం 1.30 నిమిషాల సమయంలో శ్రీనివాస్ మంధాన ఛాతీలో ఎడమవైపు నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయన కుమారుడు నాకు కాల్ చేసి పరిస్థితి గురించి చెప్పగానే అంబులెన్స్ పంపించాము.వెంటనే ఆయనను ఆస్పత్రికి తీసుకువచ్చి.. చికిత్స మొదలుపెట్టాము. కార్డియాక్ ఎంజైమ్స్ పెరిగిపోయాయి. బీపీ కూడా ఎక్కువగా ఉంది. పరిస్థితిని బట్టి ఆంజియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. స్మృతి, ఆమె కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు మాతో కాంటాక్టులో ఉండి.. అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు’’ అని తెలిపారు. వారం రోజులుగా వేడుకలుకాగా స్మృతి స్వస్థలం సాంగ్లీలో వారం రోజులుగా ముందస్తు పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. భారత జట్టు క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్ తదితరులు హల్దీ, సంగీత్ వేడుకలో ఉత్సాహంతో పాల్గొన్నారు. వధూవరులు స్మృతి- పలాష్ కూడా డాన్సులతో వేదికను హోరెత్తించారు. ఇక మూడు ముళ్లు పడటమే తరువాయి అనే తరుణంలో ఇలా స్మృతి తండ్రి అనారోగ్యం పాలుకావడంతో వాతావరణమంతా ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని.. స్మృతి- పలాష్ల పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా సాగిపోవాలని స్మృతి అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. భారత బ్యాటర్లు అట్టర్ ప్లాప్ -
మహిళా క్రికెటర్ స్మృతి మందాన వివాహం వాయిదా
-
పెళ్లి గురించి చర్చించడం లేదు: మెహ్రీన్
కృష్ణగాడి వీరప్రేమగాథతో తెలుగు యువతరాన్ని కట్టిపడేసింది పంజాబీ హీరోయిన్ మెహ్రీన్ కౌర్. ఎఫ్ 2, మహానుభావుడు, కవచం వంటి పలు సినిమాలతో ఆకట్టుకున్న ఆమె హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్తో పెళ్లికి రెడీ అయింది. మార్చిలో వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. అన్నీ కలిసొస్తే ఈ ఏడాది సెకండాఫ్లో పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించడం లేదని చెప్పారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న మెహ్రీన్ కోవిడ్, పెళ్లి తదితర విషయాల గురించి మీడియాతో మాట్లాడింది. "కరోనా వైరస్ మరికొంతకాలం ఉంటుందని మనందరికీ తెలుసు. ఆ మహమ్మారి మనకు కావాల్సిన వ్యక్తులను ఎందరినో పొట్టనపెట్టుకుంటోంది. ఇది చాలా విషాదకరం. గతేడాది మా నాన్న కరోనా బారిన పడ్డాడు. ఈ ఏడాది ప్రారంభంలో నిశ్చితార్థం జరిగాక మా అమ్మకు, నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. వెంటనే మేము ముంబైలో క్వారంటైన్లో ఉండిపోయాం. చాలా భయపడిపోయాం. కొద్ది రోజుల వరకు ఎంతో ఆందోళన చెందాం. కానీ దాన్నుంచే ఎలాగోలా బయటపడ్డాం" "కరోనాను జయించిన తర్వాత కూడా ఇప్పటికీ నీరసంగా ఉంటోంది. అందుకే వ్యాయామాలు చేయడం మొదలు పెట్టాను. నాకు కరోనా సోకిన సమయంలో భవ్య నాకు నిత్యం కాల్ చేసి నా యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవాడు. నేను కోలుకున్న వెంటనే అతడికి పాజిటివ్ వచ్చింది. అప్పుడు అతడి ఆరోగ్యం మీద నేను శ్రద్ధ చూపించాను. ఇక పెళ్లి గురించి ఇప్పుడే చర్చించడం లేదు. అయినా పరిస్థితులు చక్కబడాలి కదా!" అని మెహ్రీన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ‘ఎఫ్3’లో నటిస్తోంది. చదవండి: ‘చూడచక్కగా ఉన్నారు.. మీ జంట సూపర్’ -
కరోనాలో పెళ్లి వద్దు.. డ్యూటీయే ముద్దు!
భువనేశ్వర్: మందులేని మహమ్మారి కరోనా పోరులో ముందుండే పోలీసులు.. లాక్డౌన్ అమలుకై అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లల్లో కుంటుంబాలతో కలిసి ఉంటే.. పోలీసులు డ్యూటీలో తలమునకలయ్యారు. ఈక్రమంలో ఒడిశాకు చెందిన ఇద్దరు మహిళా పోలీసు సిబ్బంది తమ పెళ్లిని సైతం వాయిదా వేసుకున్నారు. విధి నిర్వహణకే మొగ్గుచూపారు. సుందర్గర్ జిల్లాకు చెందిన హోంగార్డు తిలోత్తమ మెహర్ విహారం ఏప్రిల్ 12న జరగాల్సి ఉంది. కానిస్టేబుల్ అధ వివాహం ఏప్రిల్ 25 న జరగాల్సి ఉంది. కరోనా క్లిష్ట సమయంలో విధులకే ఈ ఇద్దరూ ప్రాధాన్యమిచ్చారని రాష్ట్ర డీజీపీ అభయ్ వెల్లడించారు. ప్రజల మేలు కోసం వివాహాలు వాయిదా వేసుకున్నారని ప్రశంసించారు. ఒడిశా వ్యాప్తంగా ఎంతోమంది పోలీసు సిబ్బంది తమ ఇళ్లల్లో జరిగే శుభకార్యాలను వాయిదా వేసుకున్నారని డీజీపీ తెలిపారు. (చదవండి: కరోనా: ఆరోగ్య సిబ్బంది మరణిస్తే రూ.50 లక్షలు) -
అర్జున్.. అను వచ్చేశారు
‘భీష్మ’ వంటి హిట్ చిత్రం తర్వాత నితిన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రంగ్ దే’. కీర్తీ సురేశ్ కథానాయికగా నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నేడు నితిన్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో అర్జున్ పాత్రలో నితిన్, అను పాత్రలో కీర్తీ సురేశ్ నటిస్తున్నారు. ఈ పాత్రలను పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రానికి కెమెరా: పి.సి. శ్రీరామ్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్). పుట్టినరోజు వేడుకల్లేవ్.. పెళ్లి వాయిదా కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో నేడు తన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవడం లేదని, ఏప్రిల్ 16న దుబాయ్లో జరగాల్సిన పెళ్లిని కూడా వాయిదా వేశానని నితిన్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం దేశంలో ఎలాంటి ఆందోళనకర పరిస్థితులున్నాయో మీకు తెలుసు. లాక్డౌన్ కొనసాగుతుండటంతో నేడు నా పుట్టినరోజుని జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఎక్కడా కూడా నా జన్మదిన వేడుకలు జరపవద్దు. నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఈ సంక్షోభ సమయంలో మనం ఇళ్లల్లో కాలు మీద కాలేసుకొని కూర్చొని, మన కుటుంబంతో గడుపుతూ బయటకు రాకుండా ఉండటమే దేశానికి సేవ చేసినట్లు’’ అన్నారు. ∙కీర్తీ సురేశ్, నితిన్ -
చాలాసార్లు పెళ్లి చేశారు
బాలీవుడ్లో పెళ్లి టాపిక్ వస్తే... అందులో రణ్వీర్సింగ్, దీపికా పదుకోన్ జంట తప్పకుండా ఉంటుంది. ఇటీవల ఈ ఏడాది నవంబర్లో జరగనున్న వీళ్ల వివాహం వాయిదా పడిందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రణ్వీర్సింగ్ ముందు ప్రస్తావిస్తే...‘‘నా పెళ్లి గురించే నాకే తెలియనన్ని కథనాలు వస్తున్నాయి. నేను వేసుకోబోయే షేర్వాణీ ఆ కలర్ అని, ఎవరెవరో పెళ్లి బహుమతులు ఇవ్వబోతున్నారని కూడా వస్తున్నాయి. నేను పెళ్లి చేసుకుంటే అందరికీ చెబుతాను. ఇప్పటికే నాకు, దీపికాకు చాలాసార్లు పెళ్లి చేసేశారు (నవ్వుతూ). అసలు నా పెళ్లి ఎప్పుడో అందరితో చెప్పే చేసుకుంటా’’ అని చెప్పుకొచ్చారు రణ్వీర్. ఇంకా మాట్లాడుతూ– ‘‘లైంగిక వేధింపుల గురించి మహిళలు ధైర్యంగా బయటకు చెప్పాలి. మహిళలపై లైగింక వేధింపులు తప్పు’’ అన్నారు. ‘‘మీటూ’ ఉద్యమం లింగ వివక్షకు సంబంధించినది కాదు. తప్పొప్పులకు చెందినది’’ అన్నారు దీపికా పదుకోన్. ఇదంతా ఓ ప్రైవైట్ కార్యక్రమంలో భాగంగా జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో కమల్హాసన్ పాల్గొన్నారు. కమల్హాసన్, రణ్వీర్, దీపికలు మీడియా అడిగిన పలు ప్రశ్నలకు తమ అభిప్రాయాలను చెప్పారు. -
పెళ్లి వాయిదా వేసుకున్న హీరోయిన్
నటి ప్రియమణికిప్పుడు ఓ భాషలోనూ అవకాశాలు లేవు. పెళ్లి చేసుకుని సంసార జీవితలో సెటిలవ్వాలని భావించారు. అందుకు ప్రియుడి తరపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ పడింది. అన్నట్టు ప్రియమణి ప్రేమ కథ చెప్పలేదు కదూ. ఈ భామ ముస్తాఫారాజ్ అనే ముంబాయికి చెందిన వ్యక్తిని ప్రేమించారు. తదుపరి కథను ప్రియమణినే అడుగుదాం. అసలు విషయం ఏమటంటే వీరి పెళ్లి వాయిదా పడింది. కారణం కొన్ని సినిమాల్లో చూసినట్లు ప్రియమణి పెళ్లి వాయిదాకు విధి తాత్కాలికంగా ఆటంకంగా నిలిసింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రియమణినే తెలిపారు. అదేమిటో ఆమె మాటల్లోనే విందాం. బెంగుళూర్లో జరిగిన కిక్రెట్ క్రీడా పోటీల సమయంలో ముస్తాఫారాజ్తో పరిచయమయ్యింది. ముందుగా ఆయనే నా ఫోన్ నంబర్ అడిగి తీసుకున్నారు. అలా ఒకరికొకరం ఫోన్ చేసుకోవడంతో ప్రేమ మొలకెత్తింది. అయితే నేనే ముందుగా నా ప్రేమను వ్యక్తం చేశాను. దాన్ని నమ్మడానికి ముస్తాఫాకు కొన్ని నెలలే పట్టింది. ఆ తర్వాత నిజంగానే ప్రేమిస్తున్నానని తెలుసుకుని తనూ ఓకే చెప్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అయితే నా జాతక రీత్యా ఇప్పుడే పెళ్లి చేసుకోవడం మంచిది కాదని జ్యోతిష్కుడు చెప్పారు. కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకుంటే వైవిహిక జీవితంతో పాటు నట జీవితం బాగుంటుందని చెప్పడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు ప్రియమణి వెల్లడించారు.


