breaking news
Udhayanidhi Stalin
-
నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్
-
యాక్షన్ ప్లాన్ ఏది?.. నేపాల్లో తమిళ యాత్రికుల మిస్సింగ్
నేపాల్–టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. మృతుల సంఖ్య పెరుగుతుండగా.. అక్కడికి వెళ్లిన భారతీయ యాత్రికుల ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళ యాత్రికుల పరిస్థితిపై ఆ రాష్ట్రంలో ఆందోళన నెలకొంది.కుంభకోణానికి చెందిన సూపర్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మొత్తం 57 మంది తమిళ యాత్రికులు మానస సరోవర్ యాత్రకు వెళ్లినట్లు ఇప్పటికే అక్కడి అధికారులు ప్రకటించారు. వీరిలో 20 మంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందగా.. మరో 37 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. అయితే టీవీకే సర్కార్ ఈ మధ్యాహ్నాం దాకా ఎలాంటి హెల్ప్లైన్ ఏర్పాటు చేయకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.ఏం చర్యలు తీసుకున్నారు?ఈ వ్యవహారంపై తమిళనాడు టీవీకే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీశాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. నేపాల్లో చిక్కుకున్న తమిళ యాత్రికుల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రశ్నించారు. “ఎంతమంది యాత్రికులు గల్లంతయ్యారు? ప్రభుత్వ హెల్ప్లైన్కు ఎన్ని కాల్స్ వచ్చాయి? ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టారు?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు.అన్నాడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి కూడా ఆ 57 మంది తమిళ యాత్రికులను సురక్షితంగా తీసుకురావాలని డిమాండ్ చేశారు. మరోవైపు టీవీకే మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ.. నేపాల్లో చిక్కుకున్న యాత్రికుల రక్షణ కోసం ప్రత్యేక హెలికాప్టర్ పంపాలని కోరింది.LoP Udhayanidhi Stalin in Tamil Nadu Assembly on Nepal floods: "Many Tamils who went missing in Nepal are still unreachable. How many calls were received on the Government helpline? What action has been taken? - Udhayanidhi questions.""All 57 Tamils must be rescued and brought… https://t.co/wENvCSTZUl— ANI (@ANI) August 27, 202657 కాదు.. 106 మందితమిళనాడు మంత్రి రాజ్మోహన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, అక్కడి అధికార యంత్రాగంతో ఎప్పటికప్పుడు సమన్వయం జరుపుతున్నామని తెలిపారు. కుంభకోణం ట్రావెల్ ఏజెన్సీ ద్వారా 57 మంది వెళ్లగా.. చెన్నైకి చెందిన మరో ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మరో 49 మంది యాత్రికులు మానస సరోవర్ యాత్రకు వెళ్లినట్లు సమాచారం ఉందన్నారు. వారి వివరాలను కూడా సేకరిస్తున్నట్లు తెలిపారు.చివరి ఫోన్ కాల్.. నో రెస్పాన్స్తమ కుటుంబ సభ్యుల నుంచి చివరిసారిగా వచ్చిన ఫోన్ కాల్ తర్వాత యాత్రికుల బంధువుల్లో ఆందోళన మరింత పెరిగింది. విష్ణు రామస్వామి అనే వ్యక్తి మాట్లాడుతూ.. తన తల్లి, ఇద్దరు సోదరీమణులు యాత్రలో ఉన్నారని తెలిపారు. “ఆగస్టు 23న వారు బయలుదేరారు. ఢిల్లీ, ఖాట్మండు చేరుకున్న తర్వాత ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఫోన్ చేసేవారు. ఆగస్టు 26 ఉదయం 6.15 గంటలకు చివరిసారి మాట్లాడారు. తాము క్షేమంగానే ఉన్నామని చెప్పారు. ఆ తర్వాత ఫోన్ సంబంధాలు తెగిపోయాయి” అని ఆందోళన వ్యక్తం చేశారు.విజయ్ అత్యవసర సమావేశంఅసెంబ్లీలో నేపాల్ వరదల మిస్సింగ్పై ఆందోళనలు వ్యక్తం అయ్యాక.. ముఖ్యమంత్రి విజయ్ ఎమర్జెన్సీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన.. అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.Nepal tragedy - Cm instructions Chief Minster of Tamil Nadu conducted a review meeting to oversee the relief measures post the Nepal tragedy CM has instructed Thiru Ashish Kumar, IAS, Resident Commissioner,TN House, New Delhi along with a team to proceed to Kathmandu to… pic.twitter.com/EqYLS4YzyF— Vignesh Theni (@Vignesh_twitz) August 27, 2026ఆచూకీ కోసం ప్రయత్నాలునేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన భారతీయుల వివరాలను సేకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేపాల్ అధికారులతో సమన్వయం చేస్తున్నాయి. చాలామంది యాత్రికుల బృందాలు వరదల కంటే ముందే ఆ ప్రాంతాన్ని దాటినట్లు సమాచారం అందుతోంది. దీంతో యాత్రికుల సురక్షిత తరలింపుపై కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.ఇదీ చదవండి: విపత్తుల నేపాల్.. ఆ ట్రాక్ రికార్డు అంత ఘోరం మరి! -
సెటైర్ల సంగ్రామం.. ఉదయనిధి వర్సెస్ టీవీకే
తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం వాడీవేడిగా సాగాయి. అధికార టీవీకే ప్రభుత్వం, ప్రతిపక్ష డీఎంకే మధ్య రాజకీయ విమర్శలు వ్యక్తిగత ఆరోపణల స్థాయికి చేరాయి. ఒకానొక టైంలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్ మధ్య చోటుచేసుకున్న మాటల యుద్ధం సభలో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకరిపై ఒకరు వ్యంగ్య వ్యాఖ్యలు చేసుకోవడంతో స్పీకర్ జోక్యం చేసుకుని ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాల్సి వచ్చింది.శాసనసభలో టీవీకే సర్కార్పై ఉదయ్నిధి స్టాలిన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలకు కార్లు గిఫ్ట్ ఇచ్చే ప్రకటన చేశాక.. టీవీకే ఎమ్మెల్యే సింధు ముఖ్యమంత్రి విజయ్ను ప్రశంసిస్తూ ఎంజీఆర్ చిత్రంలోని పాట పాడడంపై ఉదయనిధి స్పందించారు. ‘‘మనం అసెంబ్లీకి వచ్చామా? లేదంటే సూపర్ సింగర్ కార్యక్రమానికి వచ్చామా? అనే సందేహం వస్తోంది’’ అంటూ ఎద్దేవా చేశారు. అలాగే ఎమ్మెల్యేలకు కారు అనేది అనవసరమైన ఖర్చు అని, తమ 59 మంది డీఎంకే ఎమ్మెల్యేలకు అవి అక్కర్లేదంటూ సీఎం విజయ్ ప్రకటనను తిరస్కరించారు.అలాగే అసెంబ్లీ సమావేశాల్ని లైవ్ ప్రసారం చేయకపోవడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే రికార్డుల నుంచి కొన్ని వ్యాఖ్యలను తొలగించినా.. అవి సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో వైరల్ అవుతున్నాయని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో విజయ్ సర్కార్కు ఆయన ఓ సవాల్ సైతం విసిరారు.సినిమా డైలాగులొద్దు..ఇటీవల సీఎం విజయ్.. గత డీఎంకే ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి ఫైళ్లు తన వద్ద ఉన్నాయని అన్నారు. ఆ వ్యాఖ్యలను ఉదయనిధి ప్రస్తావిస్తూ.. ‘‘ఆ ఫైళ్లను బయటపెట్టండి. సినిమా పంచ్ డైలాగులు వద్దు’’ అంటూ విజయ్కు సవాల్ విసిరారు. ‘‘ఆధారాలు ఉంటే విడుదల చేయండి. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోండి. డీఎంకే ఎలాంటి బెదిరింపులకు భయపడదు’’ అని అన్నారు.Leader of the Opposition and DMK leader Udhayanidhi Stalin announced in the Tamil Nadu Assembly that all 59 DMK MLAs will not accept the newly announced government-provided cars. He said such expenditure is unnecessary when Tamil Nadu is facing a heavy debt burden.… pic.twitter.com/RsyYpEEHMB— IndiaToday (@IndiaToday) August 21, 2026నిర్మల్ వ్యాఖ్యలతో దుమారం.. సభలో మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్ ఉదయనిధి స్టాలిన్ను ప్రస్తావిస్తూ తొలుత ‘‘గౌరవనీయ కరూర్ ఎమ్మెల్యే’’ అని అన్నారు. వెంటనే దాన్ని సరిదిద్దుతూ ‘‘కోయంబత్తూరు సౌత్ ఎమ్మెల్యే’’ అని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలతో సీఎం విజయ్ సహా ఎమ్మెల్యేల్లో కొందరు నవ్వుకున్నారు. కరూర్కు గతంలో.. ప్రస్తుతం కోయంబత్తూరు సౌత్ ఎమ్మెల్యేగా ఉంది బాలాజీ సెంథిల్. అవినీతి ఆరోపణల్లో ఆయన అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘కరూర్ గ్యాంగ్’ను డీఎంకే అధిష్టానం రక్షిస్తుందంటూ ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తుంటారు. నిర్మల్ కుమార్ ఆ కోణంలోనే అలా మాట్లాడి ఉంటారని అంతా భావిస్తున్నారు.అయితే నిర్మల్ స్పందించిన ఉదయనిధి వ్యంగ్యంగా.. ‘‘గౌరవనీయ సంఘీ మంత్రి’’ అంటూ వ్యాఖ్యానించి, ఆ వెంటనే ‘‘విద్యుత్ మంత్రి’’ అని సరిదిద్దుకున్నారు. ఈ వ్యాఖ్యలపై టీవీకే సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్మల్ కుమార్ గతంలో.. బీజేపీకి పని చేశారు. ఆ తర్వాత అన్నాడీఎంకేలో చేరి.. కిందటి ఏడాది టీవీకే కండువా కప్పుకున్నారు. బహుశా ఈ కోణంలోనే ఉదయనిధి పంచ్ వేశారు.అయితే.. ఈ సెటైర్ల సంగ్రామం ఇక్కడే ఆగిపోలేదు. నిర్మల్ కుమార్ మరోసారి లేచి.. ‘‘సాధారణంగా ఎవరైనా బాత్రూమ్లో 5 నుంచి 10 నిమిషాలు ఉంటారు. కానీ మూడు గంటలు బాత్రూమ్లో ఉన్న గౌరవనీయ మంత్రి’’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.செந்தில் பாலாஜிய "கரூர் கம்பெனி"னு சொன்னா @Udhaystalin ஏன் இவ்ளோ கோவம் வருது... FYI, DVAC'ல "கரூர் Gang"னு mention ஆகி இருக்கு.. அதுக்கும் தனக்கும் சம்பந்தம் இருக்குனு அவரே ஒதுக்குகிறாரா LoP...??@CTR_Nirmalkumar Mass 🔥🔥🔥#TVK #TVKGovt #DMK #UdhaynidhiStalin #TNAssembly… pic.twitter.com/qwlRXxVIlh— Gomathi Sivam (@GomatiSivam) August 21, 2026 one of a kind blud 👺 pic.twitter.com/cXBx1qoHvX— Fayas.naxiim🐿️ (@_faaaz) August 21, 2026 కావేరీ నీటి వివాదం సమయంలో.. నటి త్రిష మీద ఉదయనిధి స్టాలిన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో.. ఉదయనిధిని అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లినప్పుడు ఆయన భార్య కిరుతిగా ‘‘ఆయన బాత్రూమ్లో ఉన్నారు.. కొంత సమయం ఇవ్వండి’’ అని చెప్పిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఉదయనిధిపై నెట్టింట ట్రోలింగ్ కూడా నడిచింది. ఆ ఘటనను ఉద్దేశించే నిర్మల్ కుమార్ ఈ వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. Everyone attacking Udhay 🤣🤣😹🤣 pic.twitter.com/BD7yHgmrAV— Pokkiri_Victor (@Pokkiri_Victor) August 21, 2026దీనిపై ఉదయనిధి కూడా స్పందిస్తూ.. ‘‘బాత్రూమ్లో ఎవరు, ఎంతసేపు ఉంటారో లెక్కించే ప్రత్యేక శాఖను తమిళనాడులో ఏర్పాటు చేశారా?’’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. వ్యక్తిగత వ్యాఖ్యలతో సభ తప్పుదోవ పడుతుందని గుర్తించిన స్పీకర్ జేసీడీ ప్రభాకర్.. ఇరు పక్షాలను సముదాయించి ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.మరి బంగ్లా ఎందుకో?అయితే.. ఉదయనిధి వ్యాఖ్యలకు టీవీకే కీలక నేత, మంత్రి ఆధవ్ అర్జునా కౌంటర్ ఇచ్చారు. సీఎం విజయ్ ఎమ్మెల్యేలందరినీ సమానంగా చూడాలనే ఉద్దేశంతోనే కార్ల ప్రకటన చేశారని స్పష్టం చేశారు. చిన్న పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించేందుకు వాహనం అవసరమని పేర్కొన్నారు. ఇది విలాసం కాదని, ప్రాథమిక అవసరమని అన్నారు.‘‘ఇప్పటికే కారు ఉన్న ఎమ్మెల్యేలు ప్రభుత్వ వాహనానికి దరఖాస్తు చేయరు. టీవీకే విధానం స్పష్టంగా ఉంది. అందరికీ ఒకే విధమైన అవకాశం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశం’’ అని ఆధవ్ అర్జునా తెలిపారు.అదే సమయంలో ఉదయనిధిపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ‘‘కారు వద్దంటున్న ప్రతిపక్ష నేత.. ఇప్పటికే మూడు బంగ్లాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ క్వార్టర్స్లో ఎందుకు ఉంటున్నారు?’’ అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు వాహనాల కేటాయింపు అనేది ప్రోటోకాల్లో భాగమని స్పష్టం చేశారు.🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/CiVO6eKlpC— Pokkiri_Victor (@Pokkiri_Victor) August 21, 2026ఇదీ చదవండి: విజయ్ సరెండర్.. డీఎంకే చేతికి చిక్కిన అస్త్రం! -
డీలిమిటేషన్ బిల్లుకు మద్దతుపై DMK రియాక్షన్..
-
నో చీప్ పాలిటిక్స్.. ఉదయ్నిధికి విజయ్ స్ట్రాంగ్ కౌంటర్
కావేరి జల వివాదం, కర్ణాటక ప్రతిపాదిస్తున్న మేకెదాటు ఆనకట్ట అంశంపై తమిళనాడు అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతుండగా.. ఆ అవసరం లేదంటూ ముఖ్యమంత్రి విజయ్ తేల్చేశారు. అలాగే కావేరి వివాదంపై కర్ణాటకతో చర్చలకు తానే ప్రతిపాదించానని క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేత ఉదయ్నిధి స్టాలిన్కు ‘చీప్ పాలిటిక్స్’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.తమిళనాడు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం.. అసెంబ్లీలో ప్రతిపక్షాల విమర్శలకు విజయ్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మేకెదాటు అంశాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని ప్రతిపక్షాలకు సూచించారు. “మేకెదాటు ఆనకట్ట విషయంలో చౌకబారు రాజకీయాలు(చీప్ పాలిటిక్స్) చేయాలని నేను అనుకోవడం లేదు. కావేరి జలాల విషయంలో మా వైఖరిని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ ద్వారా తెలియజేశాం. నది జలాల హక్కులు, మేకెదాటు అంశంలో మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదు” అని విజయ్ అన్నారు.అఖిలపక్షం నిర్వహించాల్సిన అవసరం లేదని.. కావేరి జలాల విషయంలో తమ ప్రభుత్వం రాష్ట్ర హక్కులను కాపాడేందుకు చివరి వరకు పోరాడుతుందని, ఎలాంటి రాజీకి వెళ్లబోమని కుండబద్ధలు కొట్టారు. అలాగే తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసం ఎలాంటి అవమానాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను అని పేర్కొన్నారు. క్రెడిట్ కోసం పాకులాడం..గతంలో ఎవరు ఏం చేశారన్న విషయాలను ప్రస్తావిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని తాము భావించడం లేదని సీఎం చెప్పారు. “ఎవరు క్రెడిట్ తీసుకుంటారు? ఎవరికీ రాజకీయ ప్రయోజనం కలుగుతుంది? అనే దానిపై మాకు ఆసక్తి లేదు. కావేరి సమస్య పరిష్కారానికి ఏం చేయాలో మాకు తెలుసు. ఈ అంశాన్ని న్యాయపరమైన మార్గాల్లోనే ముందుకు తీసుకెళ్తాం” అని ఆయన స్పష్టం చేశారు.VIDEO | Cauvery is our lifeline, I do not want to play politics around it; wrote to PM on Mekedatu issue, we will protect state's rights, says CM Vijay speaking in Tamil Nadu Assembly.#CMVijay #TamilNaduAssembly #CauveryWater(Source: Third Party)(Full video available on PTI… pic.twitter.com/XCQrzRohHa— Press Trust of India (@PTI_News) August 7, 2026అఖిలపక్ష భేటీకి ఉదయనిధి డిమాండ్అయితే మేకెదాటు ప్రాజెక్టుపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ డిమాండ్ చేశారు. కర్ణాటక కావేరి నదిపై మేకెదాటు ఆనకట్ట నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో.. తమిళనాడు ప్రభుత్వం అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. అసెంబ్లీలో ఉదయనిధి మాట్లాడుతూ.. ఇది రాజకీయ అంశం కాదని, రైతుల జీవనాధారానికి సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు.“అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించడం లేదు? మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రధానికి లేఖ రాసినందుకు ప్రస్తుత సీఎం విమర్శించారు. ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలి. ఇది ప్రజల జీవనాధారానికి సంబంధించిన విషయం” అని ఉదయనిధి అన్నారు. కావేరి అంశంపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.పేపర్ కౌంటర్కురువై (కావేరి డెల్టాలో వేసే ప్రత్యేక వరి సాగు) పంట సేకరణకు, కరువు నష్టపరిహారానికి మధ్య తేడా కూడా తెలియదా? కేవలం పేపర్లు చదివితే సరిపోదు.. రైతుల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలి అంటూ సీఎం విజయ్కు చురకలు అంటించారు. అయితే.. దీనికి ఆ తర్వాత మాట్లాడిన విజయ్ కౌంటర్ ఇచ్చారు. కేవలం ఒక విషయం గురించి మాట్లాడటం కాదు.. మొత్తం వాస్తవాలు తెలుసుకోవాలి. ముందు వెనకా మొత్తం పేపర్లు చదివి ఉంటే అసలు పరిస్థితి ఏమిటో అర్థమయ్యేది అంటూ ఆయన బదులిచ్చారు.முன்ன பின்ன பேப்பர் படிச்சிருந்தா தான தெரியும்!! 😭😅🤭#CmJosephVijay #CmVijay #Tnassembly pic.twitter.com/BpWGhqatF0— Meena 🐿️❤️ (@hsmeenatchi26) August 7, 2026సీఎం కర్ణాటక పర్యటనపై గందరగోళంమేకెదాటు వివాదంపై తమిళనాడు సీఎం విజయ్ కర్ణాటకకు వెళ్లి చర్చలు జరుపుతారన్న వార్తలు కూడా రాజకీయంగా చర్చకు దారితీశాయి. అయితే దీనిపై ప్రభుత్వంలోని కొందరు మంత్రులు భిన్నమైన ప్రకటనలు చేసినట్లు ఉదయనిధి అసెంబ్లీలో ప్రస్తావించారు. “వ్యవసాయ మంత్రి సీఎం కర్ణాటక వెళ్తారని చెప్పారు. మరోవైపు ఇద్దరు మంత్రులు అలాంటి పర్యటన లేదని చెప్పారు. కర్ణాటక నేతలు కూడా తమిళనాడు సీఎం రావడం తమకు ఇష్టం లేదని, నీళ్లు విడుదల చేయడానికి సిద్ధంగా లేమని చెబుతున్నారు” అని ఉదయనిధి అన్నారు.డెల్టా రైతుల పరిస్థితిపై ఉదయనిధి ఆందోళనకావేరి నీటి కొరత ప్రభావం డెల్టా జిల్లాల రైతులపై పడుతోందని ఉదయనిధి పేర్కొన్నారు. సీఎం విజయ్ స్వయంగా డెల్టా ప్రాంత రైతులను కలుసుకుని వారి సమస్యలు వినాలని కోరారు. గత ప్రభుత్వం హయాంలో 6.8 లక్షల ఎకరాల్లో సాగు జరిగితే.. ప్రస్తుత ప్రభుత్వంలో కేవలం 1.5 లక్షల ఎకరాల్లోనే సాగు జరిగిందని ఆయన ఆరోపించారు.డీలిమిటేషన్ అంశంపైనా విజయ్ దూకుడుఇదిలా ఉండగా.. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై కూడా సీఎం విజయ్ దృష్టి సారించారు. ఈ అంశంపై తమిళనాడు ఎంపీలతో శనివారం సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో.. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అన్ని పార్టీలతో కలిసి చర్చించేందుకు విజయ్ ముందుకు వచ్చారు.కాగా, డీలిమిటేషన్ను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. జనాభా ఆధారంగా సీట్ల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తమిళనాడు పార్టీలు వాదిస్తున్నాయి. ఈ అంశంలో రాష్ట్ర ప్రయోజనాలపై ఏకాభిప్రాయం సాధించేందుకు విజయ్ ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి.ఉదయనిధి అరెస్టు.. కావేరి వివాదం మరింత వేడిఇదిలా ఉండగా.. కావేరి వివాదం నేపథ్యంలో సీఎం విజయ్, నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఉదయనిధి స్టాలిన్ అరెస్టు కావడం కూడా రాజకీయ వివాదానికి దారితీసింది. తన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించినవి కాదని, కావేరి నది పరిరక్షణ కోసమే మాట్లాడానని ఉదయనిధి స్పష్టం చేశారు. తనను అరెస్టు చేయడం కావేరి, మేకెదాటు అంశాలపై ప్రశ్నలు లేవనెత్తకుండా చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని ఆయన ఆరోపించారు.మేకెదాటు ప్రాజెక్టుపై పాత వివాదంకర్ణాటక కావేరి నదిపై మేకెదాటు వద్ద భారీ జలాశయం నిర్మించాలని ప్రతిపాదిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమిళనాడుకు రావాల్సిన నీటి ప్రవాహంపై ప్రభావం పడుతుందని తమిళనాడు వాదిస్తోంది. ఈ అంశంపై రెండు రాష్ట్రాల మధ్య చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. తాజా పరిణామాలతో కావేరి జల వివాదం మరోసారి తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. సీఎం విజయ్ అఖిలపక్ష భేటీకి నిరాకరించడం, ఉదయనిధి ప్రభుత్వం తీరుపై ప్రశ్నలు లేవనెత్తడంతో అసెంబ్లీలో రాజకీయ వేడి మరింత పెరిగింది. -
ఆయన ప్రచారం చేస్తే నీ డిపాజిట్ గల్లంతే!
తమిళనాడు రాజకీయాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. నటి త్రిషపై వ్యాఖ్యల వివాదంలో కేసు, అటుపై నాటకీయ పరిణామాల నడుమ అరెస్టైన ప్రతిపక్ష నేత ఉదయ్నిధి స్టాలిన్.. హైకోర్టు ఊరటతో గత రాత్రి విడుదలయ్యారు. ఆ రిలీజ్ అయిన వెంటనే ఆయన టీవీకే అధినేత విజయ్పై ‘జోకర్ సర్కార్’ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తంజావూర్ పీఎస్లో అసభ్యకర వ్యాఖ్యల కేసులో విచారణ అనంతరం గత రాత్రి ఉదయ్నిధి రిలీజ్ అయ్యారు. ఆ సమయంలో డీఎంకే శ్రేణులు ఆయనకు భారీగా స్వాగతం పలికాయి. ఆపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై తీసుకున్న చర్యలను “సర్కస్ ప్రభుత్వం” వ్యవహారంగా అభివర్ణించారు. పోలీసులు తనను ఉగ్రవాదిలా తీసుకెళ్లారని ఆరోపించారు. తన అరెస్టు అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని ఉదయ్నిధి అన్నారు. కావేరీ జలాల అంశాన్ని ప్రస్తావిస్తూ.. టీవీకే ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. మేకేదాటు డ్యామ్, కావేరీ నీటి వివాదంపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు.అంతేకాకుండా టీవీకే అధినేత విజయ్ను, విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. విజయ్ను డమ్మీ సీఎంగా అభివర్ణించాడు. అంతేకాదు.. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎలాంటి డబుల్మీనింగ్ డైలాగు కొట్టలేదని.. సింగిల్ మీనింగ్తోనే మాట్లాడానని అన్నారు. మహిళలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఈ కేసుపై చట్టపరంగా పోరాడతానని తెలిపారు. టీవీకే ఘాటు కౌంటర్ఉదయ్నిధి వ్యాఖ్యలకు టీవీకే ఘాటు కౌంటర్ ఇచ్చింది. ఆ పార్టీ నేత ఆధవ్ అర్జున ఆ వ్యాఖ్యలను ఖండించారు. తమ ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు. విజయ్ ప్రజల మద్దతుతో రాజకీయాల్లోకి వచ్చారని, డీఎంకేను తాము ప్రత్యర్థిగా కూడా చూడటం లేదని వ్యాఖ్యానించారు.“మా నాయకుడిని విమర్శించాలంటే అర్హత ఉండాలి. ఉదయ్నిధి స్టాలిన్కి దమ్ముంటే.. తన తాత, తండ్రి రాజకీయ వారసత్వాన్ని పక్కన పెట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి. ఆ నియోజకవర్గంలో విజయ్ ఒక్కసారి ప్రచారం చేసినా చాలు.. ఉదయ్నిధికి డిపాజిట్ కూడా దక్కదు” అంటూ ఆధవ్ అర్జున సవాల్ విసిరారు.త్రిష వ్యాఖ్యలతో మొదలైన వివాదంకావేరీ జల వివాదంపై తంజావూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయ్నిధి స్టాలిన్ ప్రసంగిస్తుండగా.. ప్రేక్షకుల నుంచి త్రిష పేరు వినిపించింది. దీనికి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యల్లో ద్వంద్వార్థం ఉందని టీవీకే ఆరోపించింది.రాజకీయాల్లో మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని టీవీకే విమర్శించింది. ఉదయ్నిధి క్షమాపణలు చెప్పేంత వరకు ఊరుకోబోమని అంటోంది. అయితే తన వ్యాఖ్యలకు వక్రీకరణ జరిగిందని, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం లేదని ఉదయ్నిధి వివరణ ఇచ్చారు. డీఎంకే కూడా విజయ్ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తోంది. ప్రస్తుతం ఈ వివాదం డీఎంకే–టీవీకే మధ్య రాజకీయ పోరుగా మారింది. ఇవాళ్టి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠను రేకెత్తిస్తోంది. -
ఉదయ్నిధి బాత్రూంలో ఉన్నారు.. కాస్త ఆగండి
డీఎంకే నేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయ్నిధి స్టాలిన్ అరెస్టు రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడి పెంచింది. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చెన్నైలోని నివాసానికి వెళ్లిన సమయంలో చోటుచేసుకున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులను కాస్త ఆగాలంటూ ఉదయ్నిధి భార్య కృతికా విజ్ఞప్తి చేసిన దృశ్యాలు చర్చకు దారితీశాయి.తంజావూరులో కావేరీ నీటి వివాదంపై జరిగిన డీఎంకే నిరసన కార్యక్రమంలో ఉదయ్నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని.. సీఎం విజయ్ను అవమానించేలా ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయ్నిధిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు.వైరల్గా మారిన వీడియోలో.. పోలీసులు ఉదయ్నిధిని కలిసేందుకు ఆయన ఇంట్లో వేచి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో కృతికా ఉదయ్నిధి, డీఎంకే నేత మా. సుబ్రమణియన్ పోలీసులతో మాట్లాడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. “ఆయన టాయిలెట్లో ఉన్నారు. కాస్త సమయం ఇవ్వండి” అంటూ కృతికా పోలీసులను కోరారు. మరికొన్ని నిమిషాలు ఆగాలని విజ్ఞప్తి చేశారు.On Cam: Moments Before Udhayanidhi Stalin Arrest- TIMES NOW accesses the sequence of events- On Cam: Udhayanidhi's wife argues with policemen@dharannniii & @DEKAMEGHNA breaks down the details. pic.twitter.com/WMdaMW0r99— TIMES NOW (@TimesNow) August 4, 2026 VIDEO CREDITS:TimesNowదీనికి స్పందించిన ఓ పోలీసు అధికారి.. తాము చట్టపరమైన విధులు నిర్వహించేందుకు వచ్చామని, ఎక్కువ సమయం వేచి ఉండలేమని పేర్కొన్నారు. “ఎంతసేపు వేచి ఉండాలి? ఇది మా విధి. మేం చట్టాన్ని ఉల్లంఘించడం లేదు” అంటూ ఆయన చెప్పినట్లు వీడియోలో వినిపిస్తోంది.మా. సుబ్రమణియన్ కూడా పోలీసులను మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. ఉదయ్నిధి సిద్ధమయ్యే వరకు వేచి ఉండాలని, న్యాయవాది కూడా వస్తారని చెప్పారు. అలాగే ఉదయ్నిధిని తంజావూరుకు తీసుకెళ్లాల్సి ఉందని.. దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం ఉంటుందని, బయలుదేరే ముందు కొంత సమయం ఇవ్వాలని మంత్రి కోరినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం అనంతంగా వేచి ఉండలేమని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని తెలిపారు.கைது செய்து தஞ்சாவூர் அழைத்து செல்லப்படும் எதிர்க்கட்சி தலைவர்.. ஜன்னல் ஓரத்தில் பெரும் யோசனையோடு அமர்ந்து செல்லும் உதயநிதிDMK | Udhayanidhi Arrest | Udhayanidhi Speech | #NewsTamil24x7 #UdhayanidhiStalin #PoliceArrest pic.twitter.com/6afl9S9XCo— News Tamil 24x7 (@NewsTamilTV24x7) August 4, 2026ఏ కేసులో అరెస్ట్?కావేరీ నీటి సమస్యపై తంజావూరులో జరిగిన డీఎంకే నిరసనలో ఉదయ్నిధి చేసిన ఓ వ్యాఖ్య వివాదానికి కారణమైంది. నిరసన సమయంలో కొందరు కార్యకర్తలు నటి త్రిష పేరును ప్రస్తావించగా.. ఉదయ్నిధి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంలో పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళ గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించడం, ఉద్దేశపూర్వక అవమానం, బెదిరింపులు, కుట్ర తదితర ఆరోపణలతో పాటు తమిళనాడు మహిళల వేధింపుల నిరోధక చట్టం, ఐటీ చట్టంలోని సెక్షన్లను కూడా చేర్చినట్లు సమాచారం.రాజకీయంగా ముదిరిన వివాదంఉదయ్నిధి అరెస్టు వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో కొత్త దుమారానికి దారితీసింది. అధికార టీవీకే, బీజేపీ నేతలు ఉదయ్నిధిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు డీఎంకే మాత్రం ఈ కేసును రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తోంది. కావేరీ సమస్య నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ వివాదాన్ని పెద్దదిగా చేస్తున్నారని డీఎంకే వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
ఉదయ్నిధికే మా మద్దతు: ప్రేమలత విజయ్కాంత్
తమిళనాట ఉదయ్నిధి స్టాలిన్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. సీఎం విజయ్, నటి త్రిషలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారంటూ కేసు నమోదు చేసి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓవైపు పలువురు ఉదయ్నిధి వ్యాఖ్యల్ని తప్పుబడుతుంటే.. డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయ్కాంత్ మాత్రం ఆ అరెస్ట్ను ఖండించారు.డీఎంకే నేత, ప్రతిపక్ష నేత ఉదయ్నిధి స్టాలిన్పై పోలీసు చర్యల నేపథ్యంలో మంగళవారం డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ మీడియా ఎదుట కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయ్నిధి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని పేర్కొంటూ.. ఆయనకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో రాజకీయ భిన్నాభిప్రాయాలను అరెస్టులతో అణచివేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రభుత్వాన్ని విమర్శించారు.ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరి హక్కు అని ప్రేమలత విజయకాంత్ అన్నారు. ఒకరి వ్యాఖ్యలను మరో పార్టీ రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప.. అరెస్టులు పరిష్కారం కాదని పేర్కొన్నారు. స్వతంత్ర భారతంలో రాజకీయ వ్యాఖ్యలపై అరెస్టులు చేయడం ప్రజల్లో అసంతృప్తిని, ప్రజాస్వామ్యంపై అనుమానాలను పెంచుతుందని వ్యాఖ్యానించారు.“ఉదయ్నిధి మాట్లాడిన దాంట్లో తప్పు లేదు”ఉదయ్నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సమర్థించిన ప్రేమలత.. ఆయన మాటల్లో తప్పేమీ లేదని అన్నారు. రాజకీయ వేదికలపై ప్రతిపక్ష నేతలకు తమ అభిప్రాయాలను చెప్పే హక్కు ఉందని స్పష్టం చేశారు. “ఉదయ్నిధికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. అందులో అభ్యంతరకరం ఏంటో అర్థం కావడం లేదు” అంటూ ఆమె వ్యాఖ్యానించారు.నీటి కోసం మేం పోరాడుతుంటే..ఇదే సమయంలో తమిళనాడులోని రాజకీయ పోరాటాలపై కూడా ప్రేమలత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలపై, ముఖ్యంగా కావేరీ జలాల సమస్యల పరిష్కారం కోసం తాము పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు నటుడు విజయ్ రాజకీయ పోరాటం చేస్తున్న తీరును ప్రస్తావిస్తూ.. “మేం నీటి కోసం పోరాడుతుంటే.. నటి కోసం విజయ్ పోరాడుతున్నారు” అంటూ వ్యాఖ్యానించారు.అక్రమ అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరురాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కేందుకు అరెస్టులను ఉపయోగించడం సరైన విధానం కాదని ప్రేమలత విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఉన్న హక్కులే ప్రతిపక్షాలకు కూడా ఉంటాయని అన్నారు.అధికార పార్టీ, ముఖ్యమంత్రి తమ అభిప్రాయాలను రాజకీయ వేదికలపై వ్యక్తం చేయవచ్చని.. అదే విధంగా ప్రతిపక్షాలు కూడా తమ వైఖరిని ప్రజల ముందుకు తీసుకెళ్లే హక్కు కలిగి ఉంటాయని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలను ఎదుర్కోవాల్సింది రాజకీయంగానే కానీ.. అరెస్టులతో కాదని స్పష్టం చేశారు.చట్టం అందరికీ సమానంగా ఉండాలిఇటీవల రాణిపేటలో జర్నలిస్టులపై జరిగిన దాడి విషయంలో పోలీసులు వెంటనే చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలను ప్రస్తావించిన ప్రేమలత.. ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలపై మాత్రం తక్షణ చర్యలు తీసుకోవడం చట్ట అమలులో సమానత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందు ప్రతిపక్ష నేతపై అరెస్టు చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు తగదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించాలని కోరారు. మొత్తంగా.. ఉదయ్నిధి స్టాలిన్ విషయంలో ప్రేమలత విజయకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. -
DMK ఉదయనిధి అరెస్ట్
-
CM విజయ్ VS కోలీవుడ్
-
తమిళనాడు అసెంబ్లీలో 'పుష్ప' గురించి చర్చ
తమిళ రాజకీయాల గురించి తెలుగు రాష్ట్రాల్లోనూ ఎప్పుడూ లేనంతగా గత కొన్నిరోజులుగా చర్చ జరుగుతోంది. అందుకు కారణం స్టార్ హీరో విజయ్ ముఖ్యమంత్రి కావడం. టీవీకే పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అధికారం దక్కించుకున్నారు. రీసెంట్గానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి బుధవారం అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల బలపరీక్షలోనూ నెగ్గారు. 144 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్కి దక్కింది. అయితే అధికారం దక్కించుకునే సీఎం విజయ్ సోఫా రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్ష నేత ఉదయనిధి విమర్శలు చేశారు.(ఇదీ చదవండి: సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు)ఉదయనిధి.. విజయ్పై విమర్శలు చేసిన సందర్భంలోనే తెలుగు బ్లాక్బస్టర్ హిట్ సినిమా 'పుష్ప' గురించి ప్రస్తావన వచ్చింది. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ముఖ్యమంత్రి విజయ్పై ఘాటు విమర్శలు చేసిన ఉదయనిధి స్టాలిన్.. సోఫా సెట్ రాజకీయం చేశారంటూ సీఎంపై కౌంటర్లు వేశారు. ఆయన పుష్ప తరహా సోఫా రాజకీయం చేశారని విమర్శించారు. ముందు సోఫాని ఎమ్మెల్యేకి పంపిన తర్వాతే సీఎం.. పూల బొకేలతో అక్కడికి వెళ్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలని అప్పుగా తీసుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చురకలు వేశారు. టీవీకే హార్స్ ట్రేడింగ్కు పాల్పడిందని ఉదయనిధి ఆరోపించారు. ఉదయనిధి ఆరోపణలపై స్పందించిన ముఖ్యమంత్రి విజయ్.. ప్రభుత్వాన్ని నడపడానికి రేసు గుర్రాలని కొనే అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.'పుష్ప 2' సినిమాలో హీరో, కేంద్రమంత్రి పాత్రధారిని కలవడానికి ముందే డబ్బుల కట్టలతో నిండిన సోఫాని ఆయనకు పంపిస్తాడు. అలానే రావు రమేశ్ పాత్రని ముఖ్యమంత్రి చేసేందుకుగానూ ఎమ్మెల్యేలకు డబ్బులతో నిండిన సోఫా సెట్లని పంపిస్తాడు. అలా ఈ చిత్రంలోని సన్నివేశాల్ని రిఫరెన్స్గా తీసుకుని తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: పాపం పాకిస్తాన్.. 'ధురంధర్'పై ప్రతీకారంతో సినిమా తీసి) View this post on Instagram A post shared by ETamil News (@etamilnewsig) -
ఉదయనిధికి సీఎం విజయ్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, చెన్నై: తమిళనాడు కొత్త అసెంబ్లీలో పొలిటికల్ పంచులు పేలడం అప్పుడే ప్రారంభమైంది. టీవీకే ప్రభుత్వ బలనిరూపణ వేళ.. ప్రతిపక్ష డీఎంకే సంచలన ఆరోపణలకు దిగింది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు సీఎం విజయ్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారంటూ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలకు సీఎం విజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైందని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ బలనిరూపణ చర్చ వేళ విమర్శలు గుప్పించారు. ‘‘65 శాతం ఓటర్లు విజయ్ను తిరస్కరించారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ఓటేశారు. విజయ్కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదు. డీఎంకే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న సంగతి మరిచిపోవద్దు. టీవీకే హార్స్ ట్రేడింగ్కు పాల్పడింది. కొందరు ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోయారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను సీఎం కలవడం విడ్డూరం. సీఎం కన్నా ముందుసోఫాసెట్లు వెళ్తున్నాయి. ఆ తర్వాత పూల గుచ్ఛాలతో సీఎం వెళ్తున్నారు’’ అని ఆరోపించారాయన. ఆ సమయంలో.. ఉదయనిధి ప్రసంగాన్ని ఏఎంఎంకే ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం టీవీకే తీరుకు నిరసనగా డీఎంకే ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేశారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి విజయ్ ప్రసంగించారు. ‘‘నాకు మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. సామాన్యుల ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాం. ప్రజలు మాపై నమ్మకం ఉంచారు. కోటి 72 లక్షల మంది మాకు ఓటేశారు. అతిపెద్ద పార్టీగా ప్రజలు మమ్మల్ని ఇక్కడికి పంపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాకు మద్దతు ఇచ్చారు. కాబట్టి ప్రజా భద్రతే మాకు ముఖ్యం.. .. మేం నిజమైన లౌకిక ప్రభుత్వాన్ని నడిపిస్తాం. అదే మా లక్ష్యం. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మేం ప్రయత్నించలేదు. మున్ముందు ఆ ప్రయత్నం చేయబోం. మా ప్రభుత్వం రేసు గుర్రంలా పరిగెడుతుంది. కాబట్టి వేరే గుర్రాలను కొనాల్సిన అవసరం లేదు. ఇచ్చిన అన్నీ హామీలను నెరవేరుస్తాం. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ అనేది చూడం.. మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్లకు కూడా మంచి పాలన అందిస్తాం. అలాగే గత ప్రభుత్వంలోని మంచి పథకాలను కొనసాగిస్తాం. మా ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం. మా ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది’’ అని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో విజయ్ టీవీకే సర్కార్ నెగ్గింది. -
ఫస్ట్ టైమ్ నా కొడుకు ఓటు వేస్తున్నాడు: ఉదయనిధి భార్య
చెన్నై: ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సతీమణి కృతిగ ఉదయనిధి కోరారు. చెన్నైలోని జస్టిస్ బషీర్ అహ్మద్ సయీద్ మహిళా కళాశాలలో కుటుంబ సభ్యులతో పాటు ఆమె తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. "మీరు బయటకు వచ్చి ఓటు వేయండి. నేను గత 25 ఏళ్లుగా ఇదే చేస్తున్నాను. నా కుమారుడు ఇన్బానిథి మొదటిసారి ఈ ఎన్నికల్లో ఓటు వేస్తున్నాడు" అని తెలిపారు. తన అత్తమామలు దుర్గ, స్టాలిన్తో పాటు భర్త ఉదయనిధితో కలిసి ఆమె ఓటు వేశారు. కాగా, కృతిగ- ఉదయనిధి స్టాలిన్ దంపతులకు ఇన్బానిథితో పాటు కూతురు తన్మయ ఉన్నారు. మా అబ్బాయి కూడా.. ఫస్ట్ టైమ్ ఓటు వేస్తున్నాడు: దయానిధి మారన్తన కుమారుడు కూడా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నాడని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వెల్లడించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలో ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. "నా ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడానికి, ఓటు వేయడానికి నేను నా కుటుంబంతో వచ్చాను. నా కుమారుడు మొదటిసారి ఓటు వేస్తున్నాడు. అతడు కూడా తన ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నందుకు సంతోషంగా ఉన్నాడు. సుపరిపాలన కొనసాగుతుందని, తమిళనాడు విజయం సాధిస్తుందని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇది 'చెడు' ఢిల్లీకి, 'మంచి' తమిళనాడుకు మధ్య జరుగుతున్న యుద్ధం'' అని అన్నారు. ఆలోచించి ఓటు వేశా: కరణ్ దయానిధి మారన్తన రాజ్యాంగబద్దమైన హక్కును వినియోగించుకోవడం తనకు ఉత్సాహాన్ని కలిగించయిందని కరణ్ దయానిధి మారన్ అన్నారు. ఓటు వేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాగా ఆలోచించి ఓటు వేశానని చెప్పారు. తాను సరైందని నమ్మిన దానికే మద్దతు ఇచ్చానని అన్నారు. తమిళనాడు ప్రజలు చాలా విద్యావంతులని, వారు కూడా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని నమ్ముతున్నట్టు తెలిపారు.చదవండి: ఫస్ట్ టైమ్.. ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసిన విజయ్ఓటు వేసిన సినీ సెలబ్రిటీలుతమిళ అగ్ర కథానాయకులు రజనీకాంత్, కమల్హాసన్, అజిత్, విజయ్, సూర్య, కార్తి, శరత్ కుమార్, శశికుమార్, విక్రమ్, శివకార్తికేయ, ధనుష్, విజయ్ సేతుపతి, ప్రదీప్ రంగనాథన్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కథానాయికలు రాధిక, కుష్బూ, గౌతమి, స్నేహ, త్రిష, జ్యోతిక, శృతి హాసన్, వరలక్ష్మి శరత్కుమార్ కూడా ఓటు వేశారు. సంగీత దర్శకుడు ఇళయరాజా, దర్శకులు ప్రభుదేవా, ఆట్లీ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితో నటులు సత్యరాజ్, సిద్ధార్థ్, యోగిబాబు, సూరి తదితరులు ఓటు వేసిన వారిలో ఉన్నారు. సెలబ్రిటీల గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విజయ్కు డీఎంకే మాస్టర్ స్ట్రోక్!
తమిళనాడు ఎన్నికలకు పట్టుమని ఆరు నెలల సమయం లేదు. దీంతో ప్రధాన పార్టీల నడుమ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నెలాఖరుకల్లా లేదంటే సంక్రాంతి లోపే ఏయే పార్టీలు, ఎవరెవరితో పొత్తులో కొనసాగుతాయో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగానే..కరూర్ ఘటన తర్వాత టీవీకే అధినేత విజయ్.. అధికార డీఎంకేపైనే ఫుల్ ఫోకస్ పెడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మొన్న పుదుచ్చేరి.. నిన్న ఈరోడు బహిరంగ సభల్లో ఆయన చేసిన విమర్శలే అందుకు నిదర్శనం. ఈ క్రమంలో.. గురువారం ఈరోడులో జరిగిన టీవీకే ‘మక్కల్ సందిప్పు’బహిరంగ సభలో విజయ్ మాట్లాడుతూ.. డీఎంకే ఓ దుష్ట శక్తి అని, టీవీకే స్వచ్ఛమైన శక్తి అని వ్యాఖ్యానించారు. 2026 ఎన్నికల్లో ఈ రెండింటి మధ్యే పోటీ అన్నారు. అయితే.. ‘‘ఎంజీఆర్, జయలలిత డీకేంను తీవ్రంగా విమర్శించారని, వారు ఎందుకు అంతగా విమర్శించారో అప్పట్లో నాకు తెలియలేదు. వారు చెప్పిందే నేనిప్పుడు చెబుతున్నా. డీఎంకే దుష్టశక్తి, టీవీకే స్వచ్ఛమైన శక్తి. టీవీకే అంటే డీఎంకేకు భయం పట్టుకుంది. నా గురించి 24 గంటలూ ఆలోచిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. కానీ డీఎంకే ప్రభుత్వం దానిని మూసి పెడుతోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత నేనేంటో తెలుస్తుంది. సెంగోట్టైయ్యన్ మనతో కలిసిపోవడం గొప్ప బలం’’ అని విజయ్ ప్రసంగించారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా చెన్నై ఎయిర్పోర్టులో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. ‘‘విజయ్ని ఏనాడైనా ఇలా అడిగారా?.. ముందు అసలు ఆయన్ని మీ ముందు మాట్లాడించండి’’.. అని మీడియాకే చురక అంటించారాయన. ఈలోపు.. ఆయన మరో దారిలో విజయ్ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జోరందుకుంది.ఖాకీ ఫేమ్ వినోద్ డైరెక్షన్లో విజయ్ ‘జన నాయగన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఇది ఆయన చివరి చిత్రంగా ఓ ప్రచారం సాగుతోంది. దీంతో.. అభిమానులు ఈ సినిమాను గ్రాండ్ హిట్ చేసి విజయ్కు సెండాఫ్ ఇవ్వాలని భావిస్తున్నారు. పొంగల్ కానుకగా జనవరి 9వ తేదీన ఈ చిత్ర రిలీజ్కు ముహూర్తం ఖరారైంది కూడా. అయితే..ఎలాంటి క్లాష్ లేకుండా.. మిగతా చిత్రాలు రిలీజ్ అవుతాయనుకున్న టైంలో కోలీవుడ్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అప్పటికే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న ‘పరాశక్తి’.. జనవరి 14వ తేదీ నుంచి 10వ తేదీకి ముందుకు జరిగింది. ఈ ప్రీపోన్ నిర్ణయం విజయ్ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చింది. ఇది చాలదన్నట్లు.. మరో స్టార్ నటుడు అజిత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మంకత్త (తెలుగు డబ్ మూవీ గ్యాంబ్లర్)ను దాదాపుగా ఆ టైంలోనే రిరీలీజ్ కాబోతోంది. అయితే.. ఈ రెండు నిర్ణయాల వెనుకా ఉదయ్నిధి హస్తం ఉందనే ప్రచారం ఇప్పుడు జోరుగా నడుస్తోంది అక్కడ..సుధా కొంగర డైరెక్షన్లో తెరకెక్కిన పరాశక్తిలో శివకార్తీకేయన్, జయం రవి, అధర్వ, శ్రీలీల, రానా దగ్గుబాటి లాంటి స్టార్కాస్టింగ్ ఉంది. ఈ చిత్ర నిర్మాత ఆకాశ్ భాస్కరన్ ఉదయ్నిధికి అత్యంత సన్నిహితుడు కూడా. ఈ కారణంగానే ఆకాశ్పై ఈడీ దాడులు జరిగాయని అప్పట్లో జోరుగా చర్చ నడిచింది. కాబట్టి.. ఉదయ్నిధి కోరిక మేరకే పరాశక్తి ప్రీపోన్ జరిగిందనే బలమైన ప్రచారం మొదలైంది. అలాగే.. అజిత్ మంగథాను నిర్మించింది సన్ పిక్చర్స్. అది స్టాలిన్ కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థ అని తెలిసిందే. అలా విజయ్ చివరి సినిమా కలెక్షన్లకు గండికొట్టేందుకు.. ఉధయ్నిధి ఆధ్వర్యంలో డీఎంకే ఇలాంటి మాస్టర్స్ట్రోక్ ఇచ్చారని చర్చించుకుంటున్నారు. అయితే ఈ ప్రచారంలో వాస్తవమెంత అనేది పక్కన పెడితే.. దానికి విజయ్ అభిమానులు ఇస్తున్న కౌంటర్లతో సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోందక్కడ. -
బైసన్ మూవీ టీమ్పై సీఎం ప్రశంసలు
మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ్విక్రమ్ (Dhruv Vikram) కథానాయకుడిగా నటించిన చిత్రం బైసన్ (Bison Movie). అనుపమ పరమేశ్వరన్, రజీషా విజయన్, పశుపతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అప్లాస్ సంస్థతో కలిసి నీలం ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకుడు పా.రంజిత్ నిర్మించారు. నివాస్ కే ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రం తమిళనాడులో అక్టోబర్ 17న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.బైసన్ టీమ్ను అభినందించిన సీఎంబైసన్ మూవీ చూసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్.. ఆఫీసుకు పిలిచి మరీ మారిసెల్వరాజ్, ధ్రువ్విక్రమ్లను అభినందించారు. బైసన్ చిత్రం గురించి ఎక్స్లో ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ.. మారిసెల్వరాజ్ సినీమకుటంలో ఇది మరో వజ్రం. ప్రతిభను మాత్రమే నమ్ముకున్న ఒక యువకుడు అటు కబడ్డీ కోర్టులో, ఇటు బయట ఎదురైన సమస్యలను ఎదుర్కొని విజయం సాధించిన కథను చాలా గొప్పగా తీర్చిదిద్దారు. చక్కగా చూపించారుక్రీడలు నేపథ్యంగా చేసుకుని ఒక యువకుడు చేరుకోవాల్సిన మార్గాన్ని దర్శకుడు మారిసెల్వరాజ్ చక్కగా చూపించారన్నారు. అద్భుతమైన నటనతో మారిసెల్వరాజ్ కథకి ప్రాణం పోసిన నటుడు ధ్రువ్విక్రమ్, పశుపతి, అనుపమ పరమేశ్వరన్, రెజీషా విజయన్.. ఇతర నటినటులు, తెర వెనుక శ్రమించిన సాంకేతిక వర్గానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. సీఎం రివ్యూతో పొంగిపోయిన మారి సెల్వరాజ్ ఎక్స్ మీడియా ద్వారా స్టాలిన్కు కృతజ్ఞతలు తెలిపారు. #BisonKaalamaadan: மாரி செல்வராஜின் திரைமகுடத்தில் மற்றுமொரு வைரக்கல்!தன் திறமையை மட்டுமே நம்பி, கிராமத்தில் இருந்து சாதிக்கக் கிளம்பிய ஓர் இளைஞன், கபடிக் கோட்டுக்கு உள்ளேயும் வெளியேயும் சந்திக்கும் போராட்டங்களை எதிர்கொண்டு வெற்றி பெற்ற கதையை மிகச் சிறப்பான திரை அனுபவமாக… pic.twitter.com/q345pPYkxl— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) October 25, 2025 చదవండి: హిట్ మూవీలో వేశ్యగా నటించిన బ్యూటీ.. 'ప్రభాస్' ఫౌజీలో ఛాన్స్ -
ఉదయ్నిధి దీపావళి శుభాకాంక్షలు.. భగ్గుమన్న బీజేపీ
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయ్నిధి స్టాలిన్ దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పడం.. రాజకీయంగా దుమారాన్ని రేపింది. నమ్మకం ఉన్నవారికే.. అంటూ చేసిన కామెంట్పై బీజేపీ భగ్గుమంది. ఇది హిందువులపై వివక్షేనంటూ తీవ్రస్థాయిలో ఆ పార్టీ నేతలు విరుచుకుపడతున్నారు.తాజాగా ఉదయ్నిధి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘వేదికపైకి వచ్చినప్పుడు కొందరు నాకు పుష్పగుచ్ఛాలు, పుస్తకాలు ఇచ్చారు. అయితే దీపావళి శుభాకాంక్షలు చెప్పడం కోసం కొందరు సంకోచించారు. ‘చెబితే వీడు ఎక్కడ కోపపడతాడేమో?’ అని అనుకుని ఉండొచ్చు. అందుకే నమ్మకం ఉన్నవారికి మాత్రమే శుభాకాంక్షలు చెబుతున్నా’’ అని ఆయన అన్నారు.ఈ వ్యాఖ్యలపై(Udhayanidhi Stalin Diwali wish) బీజేపీ నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. ‘‘వాళ్లు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా హిందువులే. అందుకే మేం అందరికీ శుభాకాంక్షలు చెబుతాం" అంటూ ఉదయ్నిధి కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఇతర మతాల విషయంలో ఇలా ఎందుకు చేయబోరని.. ఆయన వ్యాఖ్యలు హిందువులపై వివక్ష చూపుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన నమ్మకం ‘‘ఉన్నవారికి దీపావళి శుభాకాంక్షలు" అనే వ్యాఖ్యపై బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా తీవ్రంగా స్పందిస్తున్నారు. తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి ANS ప్రసాద్ స్పందిస్తూ.. హిందూ పండుగలపై డీఎంకే ప్రభుత్వం కనీస గౌరవం ప్రదర్శించబోదని మండిపడ్డారు. ‘‘అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పౌరుడిని సమానంగా గౌరవించాల్సిన బాధ్యత ఉంది. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. అయినప్పటికీ ఎందుకనో డీఎంకే ప్రభుత్వం హిందూ మతంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తోంది. ఆ పార్టీ హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది’’ అని ప్రసాద్ విమర్శించారు. ఇదిలా ఉంటే.. డీఎంకే నేత ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయ్నిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం అనేది సామాజిక అసమానతలకు మూలం అంటూనే.. సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించకూడదు, నిర్మూలించాలి. ఇది డెంగీ, మలేరియా లాంటి వ్యాధిలా ఉంది అంటూ విమర్శించారు. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడగా.. దేశవ్యాప్తంగా కేసులు కూడా నమోదు కావడంతో కోర్టుల్లో విచారణ జరుగుతోంది.ఇదీ చదవండి: తమిళనాడు ఎలక్షన్స్.. వార్నీ.. అప్పుడే తొలి జాబితా రిలీజ్ -
వారసుడొచ్చాడు.. ఎవరీ ఇన్బన్?
హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ 'ఇడ్లీ కడై' అక్టోబర్ 1న ధియేటర్లలో విడుదల కానుంది. తమిళనాడులో ఈ సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ విడుదల చేస్తున్నట్టు ధనుష్ 'ఎక్స్'లో వెల్లడించారు. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థను ప్రస్తుతం తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ స్థాపించారు. సినిమాల నిర్మాణం, పంపిణీ చేస్తుంటుంది రెడ్ జెయింట్ మూవీస్. అయితే తాజా ప్రకటనలో ఉదయనిధి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇన్బన్ ఉదయనిధిని (Inban Udhayanidhi) సమర్పకుడిగా అందులో పేర్కొన్నారు. రెడ్ జెయింట్ మూవీస్ కొత్త సీఈవో అతడేనని వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి గురించి ఆరా మొదలైంది.ఎవరీ ఇన్బన్?ఇన్బన్ ఉదయనిధి.. దివంగత మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే మాజీ అధినేత కరుణానిధి (Karunadhini) ముని మనవడు. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు మనవడు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కుమారుడు. చిన్న వయసులోనే రెడ్ జెయింట్ మూవీస్ సీఈవోగా బాధ్యతలు భుజానకెత్తుకున్నారు. ఉదయనిధి 2002లో కిరుతిగను వివాహం చేసుకున్నారు. వారి ఇద్దరు పిల్లలు ఇన్బన్, తన్మయ. ప్రస్తుతం ఇన్బన్ వయసు 20 ఏళ్లు.రొనాల్డో ప్రేరణతో..ఫుట్బాల్ ఆటగాడైన ఇన్బన్.. భారత ఫుట్బాల్ క్లబ్ నెరోకాతో డిఫెండర్గా ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత తొలిసారిగా వెలుగులోకి వచ్చాడు. దిగ్గజ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) ప్రేరణతో అతడు ఫుట్బాట్ను సీరియస్గా తీసుకున్నాడు. రియల్ మాడ్రిడ్ టీమ్కు వీరాభిమాని అని టైమ్స్ ఇండియా వెల్లడించింది. 'రొనాల్డో ఆటలో దూకుడు, అకింతభావం అంటే నాకెంతో ఇష్టం. రియల్ మాడ్రిడ్ మిడ్ఫీల్డర్లు లూకా మోడ్రిక్, సెమిరో తమ జట్టు కోసం పడే శ్రమ నన్ను ఆకట్టుకుంది. రియల్ మాడ్రిడ్ (Real Madrid) మ్యాచ్లన్నీ చూస్తాను. వారి ప్రత్యర్థుల మ్యాచ్లను కూడా చూస్తాన'ని అతడో సందర్భంలో చెప్పాడు.ప్రేమించడానికి భయపడొద్దుసినిమా పరిశ్రమలో అడుగు పెట్టడానికి చాలా కాలం ముందే ఇన్బన్ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ యువతితో తాను కలిసివున్న ఫొటోలు 2023లో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎదుర్కొన్నాడు. అయితే దీని గురించి అతడు ఎక్కడా మాట్లాడలేదు. ఇన్బన్ తల్లి కిరుతిగ ఉదయనిధి (Kiruthiga Udhayanidhi) మాత్రం ట్విటర్లో నర్మగర్భంగా స్పందించారు. 'ప్రేమించడానికి, దాన్ని వ్యక్తీకరించడానికి భయపడవద్దు. ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ఇది ఒక మార్గం' అంటూ ఆమె ట్వీట్ చేశారు. కొడుకును వెనుకేసుకొచ్చేలా కిరుతిగ ట్వీట్ ఉందని అప్పట్లో జనాలు అనుకున్నారు. చదవండి: ఆరాటం ముందు ఆటంకం ఎంతహీరో ధనుష్ విషెష్ఇన్బన్ తండ్రి ఉదయనిధి 2012లో 'ఒరు కల్ ఒరు కన్నడి' సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు. కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో తన కుమారుడికి జెయింట్ మూవీస్ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ ఘనమైన వారసత్వాన్ని కలిగిన ఇన్బన్ ఎలా ముందుకెళతాడో చూడాలి. కాగా, కొత్త ప్రయాణం విజయవంతం కావాలని ఇన్బన్కు హీరో ధనుష్ (Hero Dhanush) శుభాకాంక్షలు తెలిపారు. రెడ్ జెయింట్ మూవీస్ ప్రస్థానంరెడ్ జెయింట్ మూవీస్ ప్రస్థానం 2008లో ప్రారంభమైంది. విజయ్- త్రిష కాంబినేషన్లో ధరణి తెరకెక్కించిన కురువి సినిమాను ప్రొడక్షన్ హౌస్ మొదట నిర్మించింది. తర్వాత ఆధవన్ (2009), మన్మధన్ అంబు (2010), 7 ఓమ్ అరివు (2011), ఒరు కల్ ఒరు కన్నాడి (2012), నీర్పరావై (2012), వణక్కం చెన్నై (2013), మనితన్ (2016), మామన్నన్ (2023) సినిమాలను నిర్మించింది. కిరుతిగ ఉదయనిధి దర్శకత్వం వహించిన కాదలిక్క నేరమిల్లై, కమల్ హాసన్-మణిరత్నంల థగ్ లైఫ్ సినిమాలను ఈ ఏడాది విడుదల చేసింది. ఇడ్లీ కడై సినిమాను అక్టోబర్ 1న విడుదల చేయబోతోంది. IdliKadai – releasing across Tamil Nadu by @RedGiantMovies_Wishing Inban Udhayanidhi the very best on his new journey! pic.twitter.com/gFUTJgbFwm— Dhanush (@dhanushkraja) September 3, 2025 -
ఈడీ, మోదీలకు బెదరం: ఉదయనిధి స్టాలిన్
పుదుక్కొట్టై: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను చూసి డీఎంకే భయపడదని ఆ పార్టీకి చెందిన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. తమపై పెట్టే కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటామని తేల్చి చెప్పారు.ఉదయనిధి స్టాలిన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘రాష్ట్ర ప్రజల హక్కుల కోసం డీఎంకే పోరాటం కొనసాగిస్తుందని, ఎలాంటి బెదిరింపులకైనా భయపడబోదని చెప్పారు. తాత, మాజీ సీఎం కరుణా నిధి పెంచి పోషించిన డీఎంకే, హేతువాది పెరియార్ బోధించిన ఆత్మ గౌరవ నినాదానికి కట్టుబడిన పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. నిధి హక్కులు అడిగేందుకే ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లారన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షనేత ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎవరో బెదిరిస్తే భయపడిపోయే పాలన తమది కాదన్నారు. తాము ఏ తప్పూ చేయలేదని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఏదైనా చట్టపూర్వకంగా ఎదుర్కొంటామని తెలిపారు. ఇండోర్ స్టేడియం పూర్తి చేయడానికి రూ.3.5 కోట్ల నిధులు కేటాయించారన్నారు. టాస్మాక్పై ఈడీ దాడుల నేపథ్యంలో ఢిల్లీలో జరిగే నీతిఆయోగ్ సమావేశానికి వెళ్లేందుకు సీఎం స్టాలిన్ తొందరపడుతున్నారంటూ ప్రతిపక్ష ఏఐఏడీఎంకే చేసిన వ్యాఖ్యలపై పైవిధంగా స్పందించారు. -
ఉదయనిధి సవాల్.. అన్నామలై సై
అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య అప్పుడే సవాళ్ల పర్వం మొదలైంది. యువనేతలు ఉదయనిధి స్టాలిన్, అన్నామలై (annamalai) పరస్పరం సవాళ్లు విసురుకోవడం తమిళ రాజకీయాల్లో (Tamil Politics) హాట్టాపిక్గా మారింది. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆరోపిస్తూ అన్నామలై చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి కౌంటర్ ఇచ్చారు. తన ఇంటిని ముట్టడిస్తామన్న అన్నామలైకు ఉదయనిధి బహిరంగ సవాల్ విసిరారు. ఈ చాలెంజ్ను స్వీకరిస్తున్నట్టు అన్నామలై ప్రకటించారు.చైన్నెలోని షెనాయ్నగర్లో గురువారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో డీఎంకే యువనేత, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ (udhayanidhi stalin) పాల్గొన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల సంక్షేమం లక్ష్యంగా ముందుకెళ్తున్న తమ ప్రభుత్వంపై కొంతమంది అనవసరంగా విమర్శలు చేస్తున్నారని.. అందరికీ అన్ని లక్ష్యంగా సాగుతున్న సీఎం స్టాలిన్పై (CM Stalin) నోటికి వచ్చింది మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తమిళనాడులో విద్య, ఉపాధికి అడ్డంకులు సృష్టించే విధంగా కేంద్రం సైతం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. సీబీఎస్ఈ విద్యా సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు.తన ఇంటిని ముట్టడిస్తానని ప్రకటించిన అన్నామలైకు ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ సవాల్ విసిరారు. ధైర్యం ఉంటే అన్నాసాలైలోకి అడుగు పెట్టమనండి అంటూ వ్యాఖ్యానించారు. ‘తొలుత అన్నా అరివాలయం అన్నారు. ఇప్పుడు మా ఇల్లు ముట్టడిస్తామంటున్నారు. ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను. ఎక్కడికీ వెళ్లను, ఇంట్లోనే ఉంటా.. ధైర్యం ఉంటే రమ్మనండి’ అంటూ ఓపెన్ చాలెంజ్ చేశారు.అన్నాసాలైలో ఎక్కడికి రావాలి?ఉదయనిధి స్టాలిన్ సవాల్కు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై స్పందించారు. సేలంలో బీజేపీ నాయకుడి ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు గురువారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఉదయనిధి స్టాలిన్ సవాల్ను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. ‘ధైర్యం ఉంటే అన్నాసాలైకు రావాలని ఉదయనిధి అన్నారు. నేను సిద్ధంగా ఉన్నాను. చైన్నెలోని అన్నాసాలైలో ఎక్కడికి రావాలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ను చెప్పమనండి. స్థలం, రోజు, సమయం చెబితే అక్కడికి ఒంటరి వెళ్లడానికి నేను రెడీగా ఉన్నాను’ అంటూ ప్రతి సవాల్ విసిరారు.క్షీణించిన శాంతిభద్రతలుకాగా, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలపై నేరాలు పెరిగాయని అన్నామలై ఆరోపించారు. ఈ విషయాన్ని లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ సర్క్యులర్ ద్వారా వెల్లడించారని తెలిపారు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని ముఖ్యమంత్రి స్టాలిన్ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. అసత్యాలు కట్టిపెట్టి శాంతిభద్రతల పరిరక్షణకు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ బీజేపీ, డీఎంకే పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ‘గెట్ అవుట్ మోదీ’ అంటూ డీఎంకే ప్రచారం మొదలెట్టగా, ‘గెట్ అవుట్ స్టాలిన్’ అంటూ బీజేపీ కౌంటర్ ఇచ్చింది.చదవండి: మన ట్వీట్లలో ఎవరు గెలిచారో చూద్దామా? -
మరోసారి మతపరమైన వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ గతేడాది వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పోలీసు కేసులు ఎదుర్కొన్న తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ యువనేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి మతపరమైన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో గురువారం జరిగిన క్రిస్మస్ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ.. తనను తాను గర్వించదగిన క్రైస్తవుడిగా ప్రకటించుకున్నారు. తనకు అన్ని మతాలు సమానమని, మత సామరస్యానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. మతం పేరుతో విభజించేవారిని, విద్వేషాన్ని చిమ్మేవారికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. నాకు అన్ని మతాలు సమానం‘గత ఏడాది క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నేను క్రిస్టియన్నని సగర్వంగా చెప్పాను. ఇది పలువురు సంఘీలకు చిరాకు తెప్పించింది. ఈ రోజు మళ్లీ చెబుతున్నా. నేను గర్వించదగిన క్రైస్తవుడిని. నేను క్రిస్టియన్ని అని మీరు అనుకుంటే, క్రిస్టియన్ని. ముస్లింనని మీరు అనుకుంటే, ముస్లింను. హిందువు అనుకుంటే, నేను హిందువును. నాకు అన్ని మతాలు సమానం. అన్ని మతాలు మనకు ప్రేమను చూపించడమే నేర్పుతాయి’అని నొక్కి చెప్పారు.బీజేపీ–అన్నాడీఎంకే మధ్య రహస్య పొత్తుమతాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకునే వారు విద్వేషాలు, విభజనను వ్యాప్తి చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి ఆరోపించారు. ‘ఇటీవల అలహాబాద్కు చెందిన ఓ న్యాయమూర్తి ఒక మతాన్ని కించపరిచేలా మాట్లాడటం చూశాం. ఆయన ముస్లింలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి న్యాయమూర్తి పదవిలో ఉంటే ఆయన కోర్టులో న్యాయం ఎలా ఆశిస్తాం?’ అని ప్రశ్నించారు. ఆయనను తొలగించడానికి లోక్సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు సంతకాలు చేసినా, అన్నాడీఎంకే ఎంపీలు మాత్రం సంతకాలు చేయలేదన్నారు. ‘‘బీజేపీకి బానిసలుగా కొనసాగుతున్నారు కాబట్టే.. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించిన న్యాయమూర్తిని తొలగించాలని కోరుతూ చేసిన తీర్మానానికి అన్నాడీఎంకే మద్ధతివ్వలేదు’’ అని అన్నాడీఎంకేను విమర్శించారు.చదవండి: మీరూ ఏదో ఒకరోజు సీఎం అవుతారుబీజేపీ–అన్నాడీఎంకే మధ్య రహస్య పొత్తు కొనసాగుతోందని, రాజ్యాంగ విలువల కంటే రాజకీయ విధేయతకే అన్నాడీఎంకే ప్రాధాన్యమిస్తోందని ఆయన ఆరోపించారు. కాగా, సనాతన ధర్మంపై గతేడాది ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపాయి. ఆయనపై చాలా చోట్ల పోలీసు కేసులు నమోదయ్యాయి. -
మరికొన్ని గంటల్లో డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్!
చెన్నై: తమిళనాడు డిప్యూటీ సీఎంగా మంత్రి ఉదయనిధి స్టాలిన్ పగ్గాలు అందుకోనున్నట్లు అధికార డీఎంకేలో ఎప్పటి నుంచో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. తన తనయుడికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టనున్నారని కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగోతంది.ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి ఖరారు అయినట్లు తెలుస్తోంది. కేవలం మరికొన్నిగంటల్లో ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. అధికారిక ప్రకటన వెలువడగానే.. ఉదయనిధి కొత్త పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై 24 గంటల్లో స్పష్టత రానుంది.చదవండి: Kolkata: వెనక్కి తగ్గని వైద్యులు.. ఆగని నిరసనలుకాగా ఉదయనిధి ప్రస్తుతం డీఎంకే కేబినెట్లో క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా చెన్నై మెట్రో రైలు ఫేజ్-2 వంటి ప్రత్యేక కార్యక్రమాల అమలుకు సంబంధించిన కీలక శాఖలను కూడా నిర్వహిస్తున్నారు.మరోవైపు డిప్యూటీ వార్తలను ఉదయనిధి ఇప్పటికే కొట్టి పారేసిన విషయం తెలిసిందే. మీడియాలో వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని, ముఖ్యమంత్రి మాత్రమే దానిపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఇక ఈ వార్తలపై సీఎం ఎంకే స్టాలిన్ ఇటీవలే స్పందిస్తూ.. ఉదయనిధి డిప్యూటీ సీఎం అయ్యే టైమ్ ఇంకా రాలేదంటూ చెప్పుకొచ్చారు. అయితే 2026లో ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. -
చిత్రపరిశ్రమలో మీ జోక్యం ఎందుకు అంటూ విశాల్ ఫైర్
కోలీవుడ్ హీరో విశాల్ తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో ప్రభుత్వ జోక్యం ఎక్కువైందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం చిత్ర పరిశ్రమలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలో తన రత్నం సినిమా విడుదల సమయంలో జరిగిన సంఘటనను గుర్తు చేశారు.తమిళ చిత్రసీమలో రెడ్ జెయింట్ మూవీస్ ఆధిపత్యం గురించి బహిరంగంగానే విశాల్ మాట్లాడారు. ఆ సంస్థ అధినేత తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్పై కూడా విశాల్ విమర్శలు చేశారు. తను నటించిన రత్నం సినిమా విడుదలను కూడా అడ్డుకున్నారంటూ.. వారికి అలాంటి అధికారం ఎవరిచ్చారో చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కడలూరులో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన విశాల్ మీడియాతో సమావేశమై మాట్లాడారు. ఇక సినిమా రంగంపై డీఎంకే ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని సంచలన ఆరోపణ చేశాడు.ఆయన మాట్లాడుతూ.. 'తమిళ సినిమాకు ఈ ఏడాది చాలా కష్టం కాలంగా ఉంది. సినిమాలను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడమే దీనికి కారణం. రాబోయే రోజుల్లో 10 పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. ఆ 10 సినిమాలు కూడా దీపావళి, దసరా, క్రిస్మస్ పండుగలను టార్గెట్ చేసుకుని విడుదలవుతున్నాయి. దీంతో చిన్న సినిమాలను కొనేవారు లేరు, విడుదల చేసేవారు లేరు. మంచి సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. అయితే ఈ ఏడాది కమర్షియల్గా చిత్ర పరిశ్రమకు కష్టతరమైన సంవత్సరంగా మారనుంది. దీనికి ప్రధాన కారణం సినిమా పరిశ్రమలోకి ప్రభుత్వం చొచ్చుకు రావడమే.. ఇందులోకి ప్రభుత్వం ఎందుకు రావాలి..? గత ప్రభుత్వం ఇలాంటి పనులు చేయలేదు. అని విశాల్ తెలిపారు. తమిళనాడులో తాము షూటింగ్కి వెళ్లినప్పుడు తాగునీరు లేని గ్రామాలు ఎన్నో చూశామని విశాల్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పైగానే అవుతున్నా తాగునీరు లేని గ్రామాలు చూస్తున్నామంటే కాస్త విడ్డూరంగానే ఉందని ఆయన పేర్కొన్నారు. -
ఉదయనిధి స్టాలిన్కు డిప్యూటీ సీఎం పదవి.. మంత్రి రియాక్షన్ ఇదే!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, యువజన సంక్షేమ శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందనున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ఆయన శనివారం స్పందించారు. డీఎంకే ఒక కుటుంబమని.. తమ ప్రభుత్వంలోని మంత్రులంతా డిప్యూటీ సీఎంలేనని పేర్కొన్నారు. గతంలో కూడా తాను ఇదే చెప్పానని తెలిపారు.‘డీఎంకేలోని మంత్రులందరూ మా ముఖ్యమంత్రికి డిప్యూటీలు. నాకు ఏ పెద్ద పదవి లేదా బాధ్యత ఇచ్చినా.. నా మనసుకు దగ్గరయ్యేది డీఎంకే యువజన విభాగం కార్యదర్శి పదవే. నాకు ఏ పదవి వచ్చినా డీఎంకే యువజన విభాగం ఎప్పటికీ మర్చిపోలేను. నాకు డిప్యూటీ సీఎం పదవిపై అనేక వార్తలు వచ్చాయి. అది ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొన్నారు.


