breaking news
sonam
-
‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..
మీరట్: మధ్యప్రదేశ్లోని మీరట్కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్లు వివాహమయ్యాక హనీమూన్ కోసం మేఘాలకు వెళ్లారు. అక్కడ వారిద్దరూ అదృశ్యమయ్యారు. కొద్దిరోజులకు ఒక లోయలో రఘువంశీ మృతదేహం లభ్యమయ్యింది. ఇంతలో సోనమ్ తాను భర్తను హత్య చేశానంటూ పోలీసులకు లొంగిపోయింది. పోలీసుల దర్యాప్తులో సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా హస్తం ఈ హత్య కేసులో ఉందని తేలింది. కేసు దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.సోనమ్ తన వివాహానికి ముందు, ఆ తరువాత సంజయ్ వర్మ అనే వ్యక్తికి 200 కి పైగా కాల్స్ చేయడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో సోనమ్కు సంజయ్ వర్మతోనూ సంబంధం ఉందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే కేసు దర్యాప్తు చేస్తున్న మేఘాలయ పోలీసులు.. సంజయ్ వర్మ మరెవరో కాదని, సోనమ్ ప్రేమికుడు రాజ్ కుష్వాహానే అని తేల్చారు. సోనమ్.. రాజ్ నంబర్ను ‘సంజయ్ వర్మ’ పేరుతో సేవ్ చేసింది. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఉండేందుకు అలా చేసిందని పోలీసులు భావిస్తున్నారు. సోనమ్, సంజయ్ల మధ్య 39 రోజుల వ్యవధిలో 239 కాల్స్ నడిచాయి. అయితే సంజయ్ మొబైల్ నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్లో ఉందని పోలీసులు చెబుతున్నారు. తాజాగా సోనమ్ సోదరుడు గోవింద్ తనకు సంజయ్ అనే వ్యక్తితో పరిచయం లేదన్నారు. మేఘాలయ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘డొక్కు బస్సుల్లో పంపిస్తారా?’.. ఇరాన్ విద్యార్థుల ఆగ్రహం -
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరో ట్విస్ట్
షిల్లాంగ్ : సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. పథకం ప్రకారం భర్త రాజా రఘు వంశీని చంపించిన భార్య సోనమ్ రఘువంశీని ఓ పదునైన ఆయుధం పోలీసులకు పట్టించింది. అయితే, ఈ హత్య చేసేందుకు ఒక్క ఆయుధం కాదని, మరో ఆయుధాన్ని వినియోగించినట్లు పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్లో గుర్తించారు.ఇక ఈ కేసు విచారించేందుకు ఏర్పాటైన సిట్ బృందం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు నిందితుల్ని ఇవాళ (జూన్ 17) ఘటన జరిగిన సోహ్రాలోని వీ సావ్డాంగ్ జలపాత ప్రాంతానికి తీసుకెళ్లింది. ఈ సీన్ రీకన్స్ట్రక్షన్లో నిందితులు రాజా రఘువంశీని హతమార్చేందుకు రెండు మారణాయుధాల్ని వినియోగించినట్లు గుర్తించామని ఈస్ట్ కాశీ హిల్స్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ వివేక్ వివేక్ సియాం వెల్లడించారు.#WATCH राजा रघुवंशी हत्याकांड में क्राइम सीन रिक्रिएशन पर एसपी ईस्ट खासी हिल्स विवेक सियेम ने कहा, "हमने क्राइम सीन रिक्रिट किया कि आरोपियों ने यह कैसे किया होगा। हमने पार्किंग स्थल से शुरुआत की, जहां उन्होंने अपने स्कूटी वाहन रखी थी..हम व्यूपॉइंट पर गए और पता लगाया कि हत्या से… pic.twitter.com/U6xg1KOIIa— ANI_HindiNews (@AHindinews) June 17, 2025మరి మరో ఆయుధం ఎక్కడ?సీన్ రీకన్స్ట్రక్షన్లో హత్య జరిగిన రోజు నిందితులు ఎక్కడ ఏం చేశారు? ఏ ప్రాంతంలో ఉన్నారు? ఏం చేశారు? వంటి వివరాల్ని సేకరించాం. వాళ్లు చెప్పిన వివరాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే హత్య కోసం రెండు ఆయుధాల్ని వినియోగించినట్లు తేలింది. ఇప్పటికే ఒక ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాం. మరో ఆయుధం గురించి అన్వేషణ కొనసాగుతోందన్నారు. సోనమ్ సైగ.. రాజాపై విశాల్ కత్తితో దాడినిందితుల్ని మేం హత్య జరిగిన వ్యూపాయింట్కు తీసుకెళ్లాము. అక్కడ ఎవరి పొజిషన్ ఎలా ఉందో? ఎలా దాడి చేశారో? నిర్ధారించాం. నిజానికి, ఇద్దరు నిందితులు వేర్వేరు ఆయుధాల్ని ఉపయోగించారు. రెండో ఆయుధం కోసం వెతుకుతున్నాం. హత్య అనంతరం రాజా రఘువంశీని ఏ లోయలో పడేశారో అక్కడే ఆకాష్ తన చొక్కాను పడేశాడు. తన భర్త రాజా రఘువంశీని హత్య చేయమని సోనమ్ నిందితులకు సైగ చేసింది. ఆ సైగతో రాజా రఘువంశీనీ విశాల్ చౌహాన్ కత్తితో పొడిచాడు. ఆ తర్వాత రాజా నేలకొరిగాడు. రాజా హత్యను సోనమ్ కళ్లారా చూసింది‘సోనమ్ నేరాన్ని అంగీకరించింది. నేడు మేము క్రైం సీన్ను రిక్రియేట్ చేశాము. ఆమె ఎక్కడ నిల్చుంది? హత్యకేసులో ఆమె పాత్ర ఏమిటో గుర్తించాం. రాజాను ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. హత్యను అక్కడే నిల్చొని సోనమ్ కళ్లారా చూశారు. ఆమె తన ఫోన్ను ధ్వంసం చేసింది. ఇది ముందే ప్లాన్ ప్రకారం చేసిన హత్యే. హత్య అనంతరం ఆ ముగ్గురు రాజా శరీరాన్ని లోయలో పడేశారు’. వీరు హత్యకు వెయ్ సవ్దాంగ్ను ఎంచుకున్న కారణం అక్కడ ఎవ్వరూ ఉండరని. వీరందరు మేఘాలయకు రావడం ఇదే తొలిసారిమా టీమ్ ఇప్పటికే ఇండోర్లో ఉంది. కేసు నిమిత్తం మరికొందరిని విచారిస్తున్నారు’ అని చెప్పారు.పెళ్లైన 12రోజులకే భర్తను హత మార్చిన భార్యఏప్రిల్ 23న రాజా రఘువంశీ,సోనమ్ రఘువంశీల వివాహం జరిగింది.పెళ్లైన 12 రోజులకే ప్రియుడుతో కలిసి జీవించేందుకు సోనమ్ కుట్ర చేసింది. తన భర్త రాజ రఘవంశీ హత్య చేయాలనుకుంది. ఇందుకోసం సోనమ్ తన ప్రియుడు సాయంతో విశాల్ చౌహాన్,ఆనంద్ కుమార్,కాష్ రాజ్పుత్లకు సుపారీ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం.. రాజా రఘువంశీని హతమార్చి తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని వీ సావ్డాంగ్ హిల్స్లో పడేశారు. జూన్ 2న దే జలపాతం వద్ద గుర్తు పట్టలేని విధంగా ఉన్న రాజ రఘువంశీ మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
హనీమూన్ కేసు: సోనమ్ను సిట్ అడగబోయే 20 ప్రశ్నలివే..
న్యూఢిల్లీ: మేఘాలయ ‘హనీమూన్’ కేసులో భర్త రాజా రఘువంశీని అతని భార్య సోనమ్ హత్య చేయించిదని వెల్లడయ్యింది. సోనమ్తో పాటు మరో ముగ్గురు నిందితులను గురువారం ఇండోర్ నుంచి మేఘాలయకు తీసుకువచ్చారు. పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) వారిని షిల్లాంగ్లో విచారించనుంది.సోనమ్ (25),రాజా (29)లకు మే 11న ఇండోర్లో వివాహం జరిగింది. వారు హనీమూన్ కోసం మే 20న అస్సాంలోని గౌహతి మీదుగా మేఘాలయకు చేరుకున్నారు. మే 23న సోహ్రాలోని నోంగ్రియాట్ గ్రామంలో అదృశ్యమయ్యారు. జూన్ 2న వీసావ్డాంగ్ జలపాతం సమీపంలోని ఒక లోయలో రాజా మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. జూన్ 9న తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్లో సోనమ్ పోలీసుల సమక్షంలో లొంగిపోయింది. తరువాత ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాతో పాటు రాజాను హత్య చేసిన ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను పోలీసులు అరెస్టు చేశారు.ఈ వివాహానికి ముందే రాజాను చంపడానికి సోనమ్, ఆమె ప్రేమికుడు రాజ్ కుట్ర పన్నారని పోలీసులు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో సోనమ్ తాను, తన ప్రియుడు రాజ్తో కలిసి ఉండేందుకు భర్తను హత్య చేసినట్లు సోనమ్ అంగీకరించింది. భర్తను దారుణంగా హత్య చేసిన కేసులో సోనమ్ను విచారించేందుకు ‘సిట్’ 20 ప్రశ్నల జాబితాను సిద్ధం చేసిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆ ప్రశ్నలివే..1. మేఘాలయలో మీరు, రాజా హనీమూన్ను ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు?2. రిటర్న్ టిక్కెట్లు ఎందుకు బుక్ చేసుకోలేదు? అది కూడా ప్రణాళికలో భాగమేనా?3. వివాహానికి ముందు మీకు రాజ్ కుష్వాహా తెలుసా? మీ ఇద్దరి మధ్య పరిచయం ఉన్నట్లు పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయి.4. యాప్ చాట్లో హనీమూన్ సమయంలో మీరు రాజ్ కుష్వాహాతో టచ్లో ఉన్నారని తెలుస్తోంది. మీరిద్దరూ దేని గురించి చర్చించుకున్నారు?5. నిందితునికి మీ లైవ్ లొకేషన్ను ఎందుకు పంపించారు?6. మే 23న మీరు ముగ్గురు వ్యక్తులతో మావ్లింగ్ఖైట్లో కనిపించారు. వారి గురించి మాకు ఏమి చెబుతారు?7. మే 22న స్థానిక గైడ్ ఆల్బర్ట్ సర్వీస్ను ఎందుకుతిరస్కరించారు? 8. రాజా హత్య కేసులో ప్రమేయం ఉన్న ముగ్గురు వ్యక్తులను గైడ్ ఆల్బర్ట్ గుర్తించాడు. వారిని మీరు, రాజ్ కుష్వాహా నియమించుకున్నారా?9. రాజా రఘువంశీని హత్య చేయడానికి హంతకులను ఎవరు సంప్రదించారు?10. రాజా రఘువంశీ హత్య కోసం హంతకులకు ఎంత డబ్బు చెల్లించారు? దానిని ఎవరు చెల్లించారు? అది నగదు రూపంలో లేదా ఆన్లైన్ లావాదేవీల ద్వారా చెల్లించారా?11. రాజా హత్యకు మేఘాలయను మీరు, రాజ్ కుష్వాహా ఎందుకు ఎంచుకున్నారు? మరెక్కడికైనా వెళ్లాలనే ప్లాన్ మీకు ఉందా? 12. హత్య ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగితే, రాజ్ కుష్వాహా మీతో మేఘాలయకు ఎందుకు రాలేదు?13. హత్య తర్వాత మీరు 17 రోజులు ఎక్కడికి వెళ్లారు? పోలీసుల నుంచి దాక్కునేందుకు మీకు ఎవరు సహాయం చేసారు?14. రాజా రఘువంశీ హత్య తర్వాత పోలీసుల నుండి తప్పించుకునేందుకు ఏమి ప్లాన్ చేశారు?15. రాజాకు చెందిన స్మార్ట్ వాచ్, ఫోనును పోలీసులు కనుగొన్నారు. అయితే రాజాకు చెందిన దాదాపు రూ. 10 లక్షల విలువైన బంగారం కనిపించకుండా పోయింది. దీని గురించి మీరేమి చెబుతారు?16 రాజాను చంపడానికి ఉపయోగించిన ఆయుధాన్ని మీరు ఎక్కడ కొన్నారు? ఎంతకు కొన్నారు?17 రాజా తల్లి మీరు మేఘాలయకు వెళ్లడానికి ఇష్టపడలేదని, మీ పట్టుదల కారణంగానే అంగీకరించారని చెబుతున్నారు. మీరు రాజాను బలవంతంగా తీసుకువెళ్లారా?18. వివాహ వేడుకల సమయంలో సంతోషంగా లేనట్లు వీడియోలలో కనిపిస్తోంది. కారణమేమిటి?19 మీరు రాజా రఘువంశీని వివాహం చేసుకోకూడదనుకుంటే, ముందుగా మీ కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పలేదు?20. రాజ్ కుష్వాహాతో కలిసి రాజా హత్యకు మీరు ప్లాన్ చేశారా?ఇది కూడా చదవండి: హనీమూన్ కేసు: సోనమ్ తన మంగళ సూత్రాన్ని తీసేసి.. -
భర్త రాజా రఘువంశీని హత్య చేయించినట్టు ఒప్పు కున్న సోనమ్
-
‘మత్తిచ్చి తెచ్చారు’.. ‘హనీమూన్ జంట’ కేసులో మరో ట్విస్ట్
న్యూఢిల్లీ: మేఘాలయలో ఒక హనీమూన్ జంట అదృశ్యం కావడం.. ఆ తరువాత ఈ ఉదంతంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్లు హనీమూన్ ట్రిప్ కోసం మేఘాలయకు వెళ్లి, కనిపించకుండా పోయారు. కొద్ది రోజులకు రాజా రఘువంశీ మృతదేహం ఒక లోయలో లభ్యమయ్యింది. ఈ నేపధ్యంలో అతనిని సోనమ్ హత్య చేయించిందని ఆరోపిస్తూ ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.అదృశ్యంతో మొదలై.. హత్య కేసుగా మారి..మే 23న అదృశ్యమైన ఈ జంటను గాలించే దిశగా మొదలైన దర్యాప్తు.. జూన్ 2న రాజా మృతదేహం లభ్యమైన దరిమిలా హత్యకేసుగా మారింది. అనంతరం పోలీసులు సోనమ్ కోసం వెదికారు. వారం తర్వాత సోనమ్ ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లోని పోలీసుల ఎదుట లొంగిపోయారని పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఈ కేసులో మరిన్ని ఆసక్తికరమైన వివరాలు వెలుగు చూస్తున్నాయి. యూపీ పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) అమితాబ్ యష్ ఈ కేసుకు సంబంధించిన పలు విషయాలను మీడియాకు వెల్లడించారు. తనను నిందితురాలిగా చూపించేందుకు పోలీసులు తనకు మత్తుమందు ఇచ్చి ఘాజీపూర్కు తీసుకువచ్చాని సోనమ్ ఆరోపిస్తున్నదని ఆయన తెలిపారు.ధాబాలో దాక్కున్న సోనమ్పోలీసులు తన కోసం గాలిస్తారని తెలుసుకున్న సోనమ్ సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో, తాను ఘాజీపూర్-వారణాసి రోడ్డులోని ఒక ధాబాలో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు ఫోనులో చెప్పింది. వెంటనే వారు మధ్యప్రదేశ్ పోలీసులకు విషయం తెలియజేశారు. అక్కడి పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సోనమ్ అరెస్టు చేశారు. తరువాత ఆమెను వైద్య పరీక్షల కోసం వన్-స్టాప్ సెంటర్కు తరలించారు. ఇప్పుడు మేఘాలయ పోలీసులు ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించేందుకు రంగంలోకి దిగారు.ప్రియుడితో కలసి..మే 23 నుండి రెండు వారాలుగా కొనసాగుతున్న ఈ కేసు దర్యాప్తు ఆమెను ఘాజీపూర్లో పట్టుకోవడంతో మరోమలుపు తిరిగింది. ఆమెకు వివాహేతర సంబంధం ఉందని మేఘాలయ పోలీసులు భావిస్తున్నారు. ఆమె తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్తను హత్య చేసిందని, ఆ తరువాత పోలీసులకు లొంగిపోయిందని అంటున్నారు. ఈ కేసులో సోనమ్తో పాటు ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన అనుమానితురాలు ఘాజీపూర్కు ఒంటరిగా వచ్చిందని, ఆమె నుంచి లభ్యమైన ఆధారాలను పరిశీలిస్తున్నామని, నిజం త్వరలో బయటపడుతుందని యూపీ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.హతుని సోదరుని అనుమానం ఇదే..ఈ ఘటనపై రాజా రఘువంశీ సోదరుడు విపుల్ రఘువంశీ మాట్లాడుతూ రాజ్ కుష్వాహా .. సోనమ్కు తోటి ఉద్యోగని, వారు ఫోన్లో తరచూ మాట్లాడుకుంటారని సోనమ్ కుటుంబం తనకు చెప్పిందన్నారు. తాను రాజ్ కుష్వాహాను ఎప్పుడూ చూడలేదని, ఇప్పుడే తెలుసుకున్నానని అన్నారు. తన సోదరుని హత్యలో అతని ప్రమేయం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కాగా రాజా రఘువంశీ, సోనమ్లకు మే 11న వివాహం జరిగింది. వారు మే 20న తమ హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. ఒక రోజు తర్వాత ఈ జంట అదృశ్యమయ్యింది.ఇది కూడా చదవండి: ప్రసూతివార్డునూ వదలని రష్యా డ్రోన్లు -
భర్తలకు స్పాట్.. రాజాలా బలవుతున్న భర్తలెందరో!
‘‘అరె మామా.. పెళ్లంటేనే భయమైతుంది రా’’ అంటూ తన స్నేహితుడు రవికి ఫోన్ చేసి ఆందోళనగా చెబుతున్నాడు విష్ణు. ‘‘సడన్ ఎందుకు మామా అలా అనిపిస్తోంది?’’ అంటూ అవతలి నుంచి రవి వాయిస్ వినిపించింది. ‘‘అరేయ్.. మేఘాలయా హనీమూన్ కోసం వెళ్లిన జంట మిస్ అయ్యిందని మొన్న ఓ వార్త లింకు పంపాను కదరా’’ అంటూ గుర్తు చేశాడు విష్ణు. ‘‘ఆ.. అవును.. పాపం ఆ భార్యకి కూడా ఏమైందో తెల్వదంట కదా!. అయితే ఏమైంది ఇప్పుడు’’ అన్నాడు రవి. ‘‘ఏం లేదురా.. ఆ మొగుడ్ని చంపింది ఆ భార్యేనంట!!’’ అంటూ విష్ణు చెప్పడంతో షాక్ తినడం ఇవతల రవి వంతైంది. మేఘాలయా హనీమూన్ జంట మిస్టరీ మిస్సింగ్ ఎపిసోడ్లో బయటపడ్డ ట్విస్ట్ గురించి రవి-విష్ణులాంటి వాళ్లెందరో చర్చించుకుంటున్నారు. అదీ సోషల్ మీడియా వేదికగా..!. మరో వ్యక్తితో బంధంలో ఉండి కూడా రాజా రఘువంశీని వివాహం చేసుకోవడం, ఆపై అతన్ని అడ్డుతొలగించుకునేందుకు ప్రియుడితో స్కెచ్ వేయడం.. హనీమూన్లోనే భర్తకు స్పాట్ పెట్టడం.. ‘‘అసలు ఈ పెళ్లిళ్లు ఎందుకయ్యా?’’ అని చర్చను సోషల్ మీడియాలో తెర మీదకు తెచ్చింది. అయితే ఇందుకు ఈ ఒక్క కేసే కాదు.. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న వరుస ఘటనలే కారణం. సిమెంట్ డ్రమ్ము అంటేనే.. ప్రాణంగా ప్రేమించి మరీ పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు సౌరభ్ తివారీ. అలాంటిది తన గంజాయి ‘ఛప్రీ’ ప్రియుడు షాహిల్ శుక్లా కోసం భర్తనే కడతేర్చింది ముస్కాన్ రస్తోతి. భర్తకు మత్తు మందు ఇచ్చి, ఆపై చంపి ముక్కలు చేసి.. ఆ బాడీని పెద్ద డ్రమ్ములో కుక్కి సిమెంట్తో ముంచేశారు. ఆపై.. సౌరభ్ కుటుంబాన్ని నమ్మించేందుకు అతని ఫోన్ నుంచి సందేశాలు పంపుతూ ఏకంగా 12 రోజులపాటు ఈ గంజాయి జంట సరదాగా గడిపింది. అయితే తిరిగి వచ్చాక శవాన్ని మాయం చేసే క్రమంలో సీల్డ్ డ్రమ్ము పగిలిపోవడంతో.. భయపడిన ముస్కాన్ తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దీంతో బంగారం లాంటి భర్తను చంపిన ముస్కాన్ను ఆమె తల్లిదండ్రులే దగ్గరుండి పోలీసులకు అప్పగించడం ఈ కేసులో కొసమెరుపు. ప్రస్తుతం ముస్కాన్, షాహిల్ శుక్లా జైల్లో శిక్ష అనుభవిస్తుండగా.. ఇండోర్ కేసుగా ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భర్తకు అడ్డంగా దొరికిన యూట్యూబర్ ఆపై.. రవీనా ఓ యూట్యూబర్. అయితే ఆమె చేసే వీడియోలు భర్తకు నచ్చేవి కాదు. దీంతో తనను మందలించడమే తన భర్త పనిగా పెట్టుకున్నాడనుకుని ఆమె రగలిపోయింది. ఈ క్రమంలో ఓరోజు సోషల్ మీడియాలో సురేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తన కంటెంట్ను పొగడ్తలతో ముంచెత్తడంతో సురేష్ ప్రేమలో పీకల లోతుల ప్రేమలో పడిపోయింది. ఈ క్రమంలో ఓరోజు.. మార్చి 25వ తేదీన ఇంట్లోనే ప్రియుడితో ఏకాంతంగా గడుపుతూ భర్తకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. దీనిపై నిలదీసిన భర్తను ఇద్దరూ కలిసి ఊపిరిరాడకుండా చేసి కడతేర్చారు. ఆ కరాళ రాత్రిలో భర్త మృతదేహాన్ని ప్రియుడి సాయంతో బైక్పై తీసుకెళ్లి నగర శివారులోని పడేశారు. విచారణలో హర్యానా భివానిలో జరిగిన ఈ ఘోరం బయటపడింది. భర్తను కడతేర్చి ఆపై పక్కలో.. నిద్రలోనే ఓ వ్యక్తిని పాము పదిసార్లు కాటేసిందని, రాత్రంతా అతని మంచంలోనే ఉంటూ కాటు వేస్తూనే ఉందని, ఆ విష ప్రభావంతో అతను కన్నుమూశాడని ఆ మధ్య ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే ఇది భార్య చేసిన కుట్ర అని తెలుసుకోవడానికి పోలీసులకు ఎంతో టైం పట్టలేదు. మీరట్ అక్బర్పూర్ సదాత్ గ్రామానికి చెందిన అమిత్(25) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వృత్తిరిత్యా బయటి ప్రాంతాలకు వెళ్తుండడంతో.. అమర్జీత్ అనే యువకుడితో ఏడాదిగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. చుట్టాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అమిత్.. భార్యను మందలించాడు. దీంతో ప్రియుడితో కలిసి స్కెచ్ గీసింది. ఏప్రిల్ 14వ తేదీ రాత్రి మంచంలో నిద్రిస్తున్న అతన్ని ఊపిరాడకుండా చంపేసింది. ఆపై అద్దెకు పామును తెచ్చి భర్త మృతదేహం మీద కాట్లు వేయించి మంచంలో పడేసింది. అప్పటికే ప్రాణం పోవడం విషం శరీరానికి ఎక్కలేదు. బదులుగా.. పోస్టుమార్టం నివేదికలో అతను విషం వల్ల కాకుండా ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించాడని తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. భార్య రవిత అసలు విషయం బయటపెట్టింది.పెళ్లై పదిరోజులు తిరగకుండానే.. మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన రాజా రఘువంశీకి మే 11వ తేదీన సోనమ్తో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. మే 20వ తేదీన హనీమూన్ కోసం మేఘాలయా వెళ్లింది ఈ జంట. అయితే ఈ జంట ఆచూకీ లేకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని.. ప్రతికూల వాతావరణంలోనూ దట్టమైన అడవుల్లో గాలింపు చేపట్టారు పోలీసులు. ఈ లోపు.. రాజా రఘువంశీ మృతదేహం దొరకడంతో సోనమ్ ఆచూకీ కోసం అతని కుటుంబం కంగారుపడింది. ఈలోపు విచారణ జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. సోనమే రాజాను హత్య చేయించిందని!. తన తండ్రి కంపెనీలో పని చేసే రాజ్ కుష్వాహ్తో ఆమె ప్రేమలో ఉందని, ఆ విషయం తెలిసి తండ్రి మందలించాడని, ఆపై బలవంతంగా రాజా రఘువంశీకి ఇచ్చి వివాహం చేయడంతో ఆమె భర్తను వదలించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడి సాయంతో ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్స్ను సంప్రదించి తన భర్తను చంపేందుకు సుపారీ ఇచ్చిందామె. అలా.. మూడు రోజుల తర్వాత రాజా రఘువంశీని వాళ్లు మట్టుపెట్టారు. విచారణలో ఈ షాకింగ్ విషయం బయటపడడంతో అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హనీమూన్ వెళ్లే ముందు రఘువంశీని ఒత్తిడి చేసి మరీ రూ.10 లక్షల విలువైన బంగారు నగలు అతని ఒంటిపై వేయించిందని, వాటి కోసమే హత్య జరిగిందన్న కోణంలో నమ్మించాలని ప్రయత్నించింది. అయితే ఆమె రిటర్న్ టికెట్స్ బుక్ చేయకపోవడంతో మొదలైన అనుమానం.. చివరకు మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టింది. ముంబై, థానే, నవీ ముంబైలో గత నాలుగు నెలల్లో.. ఇలా భర్తలను వివాహేతర సంబంధం కోసం బలిగొన్న భార్యల కేసులు ఆరు దాకా నమోదు అయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. కొసమెరుపు ఏంటంటే.. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ఒకరిద్దరు భర్తలు తమ భార్యలను ప్రియుడికి ఇచ్చి వివాహం చేసిన సందర్భాలూ ఈ మధ్యకాలంలోనే చోటు చేసుకోవడం. అయితే ఇందులో ఒక కేసులో ప్రియుడు తాను తప్పు చేశానని గ్రహించి దగ్గరుండి ఆమెను మళ్లీ భర్త దగ్గర దిగబెట్టగా.. మరో కేసులో మాత్రం ఆ భర్త చేసిన త్యాగం అలాగే మిగిలిపోయింది. -
‘సర్.. నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)
-
మళ్లీ సోనమ్ వాంగ్చుక్ దీక్ష.. కారణమిదే!
ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ దేశంలోని లడఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని, ఆరవ షెడ్యూల్ను వెంటనే అమలు చేయాలని కోరుతూ లేహ్లో 21 రోజుల నిరాహార దీక్షకు దిగారు. మార్చి 7న ప్రారంభమైన ఈ నిరాహార దీక్ష 21 రోజుల పాటు కొనసాగనుంది. సోనమ్ వాంగ్చుక్ ఎవరు? సోనమ్ వాంగ్చుక్ వృత్తిరీత్యా ఇంజనీర్, ఆవిష్కర్తగా, వాతావరణ పరిరక్షణకు పాటుపడే వ్యక్తిగా పేరొందారు. లడఖ్లోని విద్యా వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తూ ‘స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లడఖ్’ను స్థాపించారు. కృత్రిమ హిమానీనదాలను సృష్టించే మంచు స్థూప సాంకేతికతను రూపొందించారు. ఇందుకోసం ఆయన 2018లో రామన్ మెగసెసే అవార్డు, 2017లో గ్లోబల్ అవార్డ్ ఫర్ సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ అవార్డులను అందుకున్నారు. లడఖ్కు రాష్ట్ర హోదా, ఆరవ షెడ్యూల్ అమలు డిమాండ్తో వాంగ్చుక్ మరోసారి నిరాహారదీక్షకు దిగారు. ఇవే డిమాండ్లతో గత ఏడాది జనవరిలో ఐదు రోజుల పాటునిరాహార దీక్ష చేశారు. అది కూడా 18 వేల అడుగుల ఎత్తులో -40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య నిరాహార దీక్షకు దిగారు. లడఖ్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని వాంగ్చుక్ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. హిమాలయాల్లో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను నొక్కిచెప్పిన ఆయన, ఈ అంశానికి ప్రభుత్వం తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. వాంగ్చుక్ తన దీక్షతో యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. త్రీ ఈడియట్స్ సినిమాలో.. అమీర్ ఖాన్, శర్మన్ జోషి, ఆర్ మాధవన్లు నటించిన ‘త్రీ ఇడియట్స్’లో అమీర్ ఖాన్ పోషించిన రాంచో పాత్ర వాంగ్చుక్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రం 2009లో విడుదలైంది. అప్పుడు వాంగ్చుక్ గురించి దేశంలోని అందరికీ తెలిసింది. అయితే ఈ సినిమా తన బయోపిక్ కాదని, వినోదం కోసం తన జీవితం నుండి ప్రేరణ పొందారని పలు సందర్భాల్లో వాంగ్చుక్ స్పష్టం చేశారు. #SAVELADAKH #SAVEHIMALAYAS Sonam Wangchuk appeals to the world to live simply, starts #ClimateFast of 21 days (extendable till death) Please watch full video in English here:https://t.co/XHkcIdQQ7b#ILiveSimply #MissionLiFE #ClimateActionNow pic.twitter.com/KQi5EMro9X — Sonam Wangchuk (@Wangchuk66) March 6, 2024 -
Dr. Sonam Kapse: వడ్డించేవారు మనవారే
డౌన్ సిండ్రోమ్, ఆటిజమ్, మూగ, బధిర... వీరిని ‘మనలో ఒకరు’ అని అందరూ అనుకోరు. వీరికి ఉద్యోగం ఇవ్వాలంటే ‘వాళ్లేం చేయగలరు’ అని విడిగా చూస్తారు. కాని ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో అంతర్భాగమే అంటుంది డాక్టర్ సోనమ్ కాప్సే. కేవలం దివ్యాంగులనే స్టాఫ్గా చేసుకుని ఆమె నడుపుతున్న రెస్టరెంట్ పూణెలో విజయవంతంగా నడుస్తోంది. ‘ఇక్కడంతా వడ్డించేవారు మనవారే’ అంటుంది సోనమ్. పుణెలో ఆంకాలజిస్ట్గా, కేన్సర్ స్పెషలిస్ట్గా పని చేస్తున్న సోనమ్ కాప్సేకు బాల్యం నుంచి రకరకాల వంట పదార్థాలను రుచి చూడటం ఇష్టం. ‘మా అమ్మానాన్నలతో విదేశాలకు వెళ్లినప్పుడు హోటళ్ల లో రకరకాల ఫుడ్ తినేదాన్ని. మంచి రెస్టరెంట్ ఎప్పటికైనా నడపాలని నా మనసులో ఉండేది’ అంటుంది సోనమ్. అయితే ఆ కల వెంటనే నెరవేరలేదు. కేన్సర్ స్పెషలిస్ట్గా బిజీగా ఉంటూ ఆమె ఆ విషయాన్నే మర్చిపోయింది. యూరప్లో చూసి ‘నేను ట్రావెలింగ్ని ఇష్టపడతాను. యూరప్కు వెళ్లినప్పుడు ఒక బిస్ట్రో (కాకా హోటల్ లాంటిది)లో ఏదైనా తిందామని వెళ్లాను. ఆశ్చర్యంగా అక్కడ సర్వ్ చేస్తున్నవాళ్లంతా స్పెషల్ వ్యక్తులే. అంటే బుద్ధి మాంద్యం, వినికిడి లోపం, అంగ వైకల్యం, మూగ... ఇలాంటి వాళ్లు. వాళ్లంతా సైన్ లాంగ్వేజ్లో ఆర్డర్ తీసుకుంటున్నారు. కస్టమర్లు వారికి ఎంతో సహకరిస్తున్నారు. ఇటువంటి వారి జీవితం మర్యాదకరంగా గడవాలంటే వారిని ఉపాధి రంగంలో అంతర్భాగం చేయడం సరైన మార్గం అని తెలిసొచ్చింది. మన దేశంలో సహజంగానే ఇలాంటివారికి పని ఇవ్వరు. అందుకే మన దేశంలో కూడా ఇలాంటి రెస్టరెంట్లు విరివిగా ఉండాలనుకున్నాను. ఇప్పటికే కొన్నిచోట్ల ఉన్నాయి కానీ, నేను కూడా ఇలాంటి రెస్టరెంట్ ఒకటి ఎందుకు మొదలు పెట్టకూడదు... అని ఆలోచించాను. అలా పుట్టినదే ‘టెర్రసిన్’ రెస్టరెంట్. టెర్రసిన్ అంటే భూమి రుచులు అని అర్థం. పొలం నుంచి నేరుగా వంటశాలకు చేర్చి వండటం అన్నమాట’ అందామె. 2021లో ప్రారంభం పూణెలో బిజీగా ఉండే ఎఫ్.సి.రోడ్లో స్పెషల్ వ్యక్తులే సిబ్బందిగా 2021లో కోటిన్నర రూపాయల ఖర్చుతో ‘టెర్రసిన్’ పేరుతో రెస్టరెంట్ ప్రారంభించింది సోనమ్. ఇందు కోసం స్పెషల్ వ్యక్తులను ఎంపిక చేసి వారికి ట్రయినింగ్ ఇచ్చింది. ‘వారితో మాట్లాడటానికి మొదట నేను ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఆర్డర్ తీసుకోవడం, సర్వ్ చేయడం వంటి విషయాల్లో ట్రయినింగ్ ఇచ్చాం. కస్టమర్లు సైన్ లాంగ్వేజ్లో ఆర్డర్ చెప్పొచ్చు లేదా మెనూలో తాము ఎంచుకున్న ఫుడ్ను వేలితో చూపించడం ద్వారా చెప్పొచ్చు. అయితే ఆటిజమ్ వంటి బుద్ధిమాంద్యం ఉన్నవాళ్లను ఉద్యోగంలోకి పంపడానికి కుటుంబ సభ్యులు మొదట జంకారు. వారిని ఒప్పించడం కష్టమైంది. ఒకసారి వారు పనిలోకి దిగాక ఆ కుటుంబ సభ్యులే చూసి సంతోషించారు. మా హోటల్ను బిజీ సెంటర్లో పెట్టడానికి కారణం మా సిబ్బంది నలుగురి కళ్లల్లో పడి ఇలాంటివారికి ఉపాధి కల్పించాలనే ఆలోచన ఇతరులకు రావడానికే. మా హోటల్ బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పుడు ఆదాయంలో ఉంది. త్వరలో దేశంలో మరో ఐదుచోట్ల ఇలాంటి హోటల్స్ పెట్టాలనుకుంటున్నాను’ అని తెలిపింది సోనమ్. వారూ మనవారే సమాజ ఫలాలకు అందరూ హక్కుదారులే. దురదృష్టవశాత్తు దివ్యాంగులుగా జన్మిస్తే వివిధ కారణాల వల్ల శారీరక దురవస్థలు ఏర్పడితే ఇక వారిని విడిగా పెట్టడం, ఉపాధికి దూరం చేయడం సరికాదు. వీలైనంత వరకూ వారిని అంతర్భాగం చేసుకోవాలి. ఇలాంటి ఉద్యమాలు అనేకచోట్ల నడుస్తున్నాయి. కొందరు పదిలో రెండు ఉద్యోగాలైనా ఇలాంటివారికి ఇస్తున్నారు. సోనమ్ లాంటి వారు పూర్తి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ రంగంలో ఇంకా ఎంతో జరగాల్సి ఉంది. దురదృష్టవశాత్తు దివ్యాంగులుగా జన్మిస్తే వివిధ కారణాల వల్ల శారీరక దురవస్థలు ఏర్పడితే ఇక వారిని విడిగా పెట్టడం... వారిని ఉపాధికి దూరం చేయడం సరికాదు. వీలైనంత వరకూ వారిని అంతర్భాగం చేసుకోవాలనే ఉద్యమాలు అనేకచోట్ల నడుస్తున్నాయి. రెస్టరెంట్లో సైన్ లాంగ్వేజ్లో ఆర్డర్ తీసుకుంటున్న వెయిటర్ -
19 ఏళ్లకే గర్భం దాల్చా.. ఇండియా వదిలి పోయాను: నటి
మూడు దశాబ్దాల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది సోనమ్. త్రిదేవ్, విశ్వాత్మ, అజూబా వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అర్ధాంతరంగా సినిమాలకు గుడ్బై చెప్పేసిన సోనమ్ దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత రీఎంట్రీకి రెడీ అయ్యింది. ఓ ఓటీటీ షోతో ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సోనమ్.. సినిమాలు వదిలేయడానికి గల కారణాలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ► లాక్డౌన్లో ఓటీటీలో షోలు, సిరీస్లు చూశాను. ఇలాంటివి నేనెందుకు చేయకూడదు అనిపించింది. వెంటనే నా శరీరంపై దృష్టి పెట్టాను. ముప్పై కిలోలు తగ్గాను. నన్ను నేను మెరుగుపపర్చుకున్నాను. ఇప్పుడు రీఎంట్రీకి రెడీ అయ్యాను. 32 సంవత్సరాల తర్వాత మళ్లీ నటనారంగంలోకి వస్తుంటే కొంత సంతోషంగా మరికొంత భయంగానూ ఉంది. ► 1997లో ఇండియా వదిలివెళ్లిపోయాను. పద్నాలుగేళ్లకే పని చేయడం ప్రారంభించా. 19వ ఏటనే గర్భం దాల్చాను. జీవితంలో కష్టసుఖాలెన్నో చూశాను. లైఫ్ అన్నాక అన్నింటినీ దాటుకుంటూ పోవాలి కదా.. కానీ ఇప్పటికీ నేను ఇండస్ట్రీకి తిరిగి రావాలని కోరుకుంటుంటే హ్యాపీగా ఉంది. ► మంచి కథ దొరికితే దానికి తగ్గట్లు ఎలాంటి పాత్రనైనా చేస్తా. 50 ఏళ్లకే వయసైపోలేదని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని మహిళలకు చాటిచెప్పాలని ఉంది. ఎందుకంటే యాభై ఏళ్లు వచ్చాయంటే మహిళలు వారు అప్పటిదాకా ఉన్న ఐడెంటిటీని కోల్పోతున్నారు. నేనేమీ నా ముడతలను చూసి భయపడట్లేదు. నా లుక్స్కు తగ్గట్లు పాత్రలు వస్తే అలానే నటిస్తాను. చదవండి: రజనీకాంత్కు షాకింగ్ రెమ్యునరేషన్.. అన్ని కోట్లా? -
ఆ లేఖలే అమ్మాయిల నుదుటి రాతల్ని మార్చాయి
‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ల కదలిక’ అన్నారు ప్రజాకవి కాళోజీ. కేంద్రం మహిళల వివాహ వయసును పెంచడానికి జయా జైట్లీ నేతృత్వంలో 2020 జూన్ నాలుగున టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. అయితే, కేంద్రంలో కదలిక తీసుకొచ్చే ప్రయత్నానికి బీజం వేసింది మాత్రం కొందరు యువతుల పోస్ట్కార్డ్ రాతలే!. చదవండి: 21 ఏళ్లు వచ్చాకే అమ్మాయి పెళ్లి పాట్నా (బీహార్) వాసి సోనమ్ కుమారి, హిసార్(హరియాణా)కు చెందిన 16 ఏళ్ల పూనమ్ మిథర్వాల్ లాంటి అమ్మాయిలు చేపట్టిన పోస్ట్కార్డ్ ఉద్యమం కేంద్రం నిర్ణయాన్ని ప్రభావితం చేసిన అంశాల్లో ఒకటని చెప్పొచ్చు. 19 ఏళ్ల సోనమ్కు ఇంట్లో వాళ్లు పెళ్లిచేయబోయారు. చదువుతానని, ఇప్పుడే పెళ్లి వద్దని నచ్చజెప్పినా వారు ససేమిరా అన్నారు. ఒత్తిడిని తట్టుకోలేక సోనమ్ ఈ ఏడాది ఆగస్టులో ఇంటిని వదిలి ఢిల్లీకి వెళ్లింది. ఉద్యోగం చేస్తూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదువును కొనసాగిస్తోంది. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు కూడా వివాహ వయసు 21 ఏళ్లకు పెంచాలని ప్రధాని మోదీకి ఆగస్టులోనే లేఖ రాసింది. చదవండి: పెళ్లికి అమ్మాయి కనీస వయసు పెంపు! మన దగ్గరే ఇలాగనా? సోనమ్ సంధించిన లేఖ హరియాణాలో ఏంతోమంది బాలికలను ఆలోచింపజేసింది. నిశ్శబ్ద ఉద్యమం మొదలైంది. వందలాది మంది బాలికలు ప్రధానికి లేఖలు రాశారు. పూనమ్ ఆగస్టులో ఒకరోజు కాలేజీ ముగిశాక నేరుగా పోస్ట్ ఆఫీసుకు వెళ్లింది. ఆమెతో పాటే మరో ఆరుగురు స్నేహితురాళ్లు కూడా. ‘మోదీ జీ.. అమ్మాయిల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచండి’ అని పోస్ట్కార్డుపై హిందీలో చాలా క్లుప్తంగా తమ విజ్ఞప్తికి అక్షర రూపమిచ్చారు. ‘నా స్నేహితురాళ్లు, తెలిసిన వాళ్లలో చాలామందికి 18 ఏళ్లు నిండగానే పెళ్లి చేసేసి పంపించి వేశారు వాళ్ల కుటుంబసభ్యులు. చదువు మాన్పించారు. వివాహ వయసు పెంచితే తల్లిదండ్రులను ఒప్పించి ఉన్నత చదువులు కొనసాగించడానికి వీలుంటుంది’ అని పూనమ్ వాదన. –నేషనల్ డెస్క్, సాక్షి -
స్టార్లుగా ఊహించుకుంటున్నారు: సోనం మాలిక్కు నోటీసు
న్యూఢిల్లీ: తొలిసారి ఒలింపిక్స్కు అర్హత పొందిన మరో మహిళా రెజ్లర్ సోనమ్ మాలిక్ టోక్యో బయల్దేరడానికి ముందు పాస్పోర్ట్ను డబ్ల్యూఎఫ్ఐ కార్యాలయంలో తీసుకోవాలని అధికారులు చెప్పారు. ఆమె మాత్రం తన పాస్పోర్ట్ను తీసుకొని రావాలని ఏకంగా భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) అధికారులను ఆజ్ఞాపించింది. రెజ్లర్ల క్రమశిక్షణా రాహిత్యం ఆ నోటా ఈ నోటా భారత ఒలింపిక్ సంఘానికి (ఐఓఏ) తెలిసింది. రెజ్లర్లు ప్రవర్తన నియమావళిని అతిక్రమించడం ఏమాత్రం రుచించని ఐఓఏ... ‘మీ క్రీడాకారుల్ని మీరు నియంత్రించలేరా’ అని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను తలంటింది. ఈ క్రమంలో సోనమ్ మాలిక్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ‘కెరీర్ మొదట్లోనే వీళ్లు తమను తాము స్టార్లుగా ఊహించుకుంటున్నారు. అందుకే విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నారు. ఇదే మాత్రం క్షమించరానిది’ అని డబ్ల్యూఎఫ్ఐ అధికారి ఈ సందర్భంగా చెప్పారు. ఇక టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా క్రమశిక్షణ రాహిత్యం, విపరీత ధోరణితో వ్యవహరించిన భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్పై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. టోక్యో ఒలింపిక్స్లో జాతీయ కోచ్ సౌమ్యదీప్ రాయ్ సలహాలు తీసుకునేందుకు నిరాకరించిన భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ క్రీడాకారిణి మనిక బత్రాపై భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చదవండి: Neeraj Chopra: గర్ల్ఫ్రెండ్ విషయంపై నీరజ్ చోప్రా క్లారిటీ -
‘టోక్యో’కు అన్షు, సోనమ్
అల్మాటీ (కజకిస్తాన్): ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ రెజ్లింగ్ టోర్నమెంట్లో రెండో రోజు భారత్కు రెండు బెర్త్లు ఖరారయ్యాయి. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత యువ రెజ్లర్లు అన్షు మలిక్ (57 కేజీలు), సోనమ్ మలిక్ (62 కేజీలు) అద్భుతం చేశారు. హరియాణా రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల అన్షు, 18 ఏళ్ల సోనమ్ తమ విభాగాల్లో ఫైనల్కు చేరి టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారు. 57 కేజీల ఫైనల్లో అన్షు 4–7తో ఖాన్గోరుజుల్ బోల్డ్సైఖాన్ (మంగోలియా) చేతిలో ఓటమి చవిచూసి రజతం సాధించగా... 62 కేజీల ఫైనల్లో జియా లాంగ్ (చైనా)తో తలపడాల్సిన సోనమ్ గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో జియా లాంగ్కు స్వర్ణం, సోనమ్కు రజతం లభించాయి. అయితే మిగతా మూడు విభాగాల్లో భారత రెజ్లర్లకు నిరాశ ఎదురైంది. సీమా బిస్లా (50 కేజీలు) నాలుగో స్థానంలో నిలువగా... నిషా (68 కేజీలు), పూజా (76 కేజీలు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సాధించారు. ఫైనల్కు చేరిన వారికి మాత్రమే టోక్యో ఒలింపిక్స్ బెర్త్లు లభిస్తాయి. -
ఈ సోనమ్ ఎవరో తెలుసా
బంజారాహిల్స్: నగరంలోని హిజ్రాలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిచారు. ఓ పక్క సమావేశం జరుగుతోంది.. వివిధ ప్రాంతాలకు చెందిన హిజ్రాలు హాజరవుతున్నారు.. ఇంతలో ఓ యువతి వయ్యారంగా నడుచుకుంటూ స్టేషన్లోకి అడుగు పెట్టింది. ఏదన్నా సమస్యపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిందేమోనని పోలీసు సిబ్బంది.. స్టేషన్కు వచ్చిన మరికొందరు ఫిర్యాదుదారులు ఆమె వైపే చూస్తున్నారు. ఆమె తిన్నగా కౌన్సిలింగ్ హాల్లోకి వెళ్లేసరికి అంతా షాకయ్యారు. ‘నేనూ హిజ్రానే.. పేరు సోనమ్.. ఫ్రమ్ ముంబై’ అని చెప్పేసరికి అంతా అవాక్కయ్యారు. -
బావామరదళ్లతో...
‘మంచి కథతో ఎవరైనా సంప్రదిస్తే సౌత్లో నటించడానికి సిద్ధమే’ - హిందీ హీరోయిన్లు ఎప్పుడూ చెప్పే డైలాగ్ ఇది. సోనమ్ కపూర్ కూడా పలు సందర్భాల్లో ఈ డైలాగ్ చెప్పారు. ఈ బ్యూటీ కోరుకున్న కథ లభించినట్టుంది. తమిళ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులను పలరించనున్నారట. తమిళంలో తొలి చిత్రమైనా, ఈ చిత్రంలో నటించే హీరో ధనుష్తో తొలి చిత్రం కాదు. ఎందుకంటే.. హిందీ సినిమా ‘రాంజనా’లో ధనుష్ సరసన సోనమ్ నాయికగా నటించారు. ఆ సినిమా ధనుష్కి మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు మరదలు సౌందర్యా రజనీకాంత్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించనున్న సినిమాతో సోనమ్ కోలీవుడ్కి పరిచయం కానున్నారట. ఈ సినిమాకి ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’ (చందమామకు నా మీద ఏం కోపం) టైటిల్ ఖరారు చేశారు. చందమామ లాంటి సోనమ్కి ఈ సినిమా ఎలాంటి పేరు తీసుకొస్తుందో! -
ప్రేమ్ సందడి
-
ముంబాయిలో సందడి చేసిన సల్మాన్,సోనమ్
-
నోయిడాలో సల్మాన్ఖాన్,సోనమ్ కపూర్ సందడి
-
ఖాదీ ఫ్యాషన్షోలో ’సల్మాన్’
-
మాంసం నిషేధంపై మరో సెలబ్రిటీ..
ముంబైలో మాంసం నిషేధం నిర్ణయం పై బాలీవుడ్ సెలబ్రిటీలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా లాంటి స్టార్ హీరోయిన్స్ ఈ విషయం పై ట్విట్టర్లో స్పందించగా, మరో బాలీవుడ్ సెలబ్రిటీ రిషీ కపూర్ కూడా బ్యాన్పై ఘాటుగా స్పందించారు. 'జాగో ఇండియా జాగో, మతం పేరుతో దేశాన్ని ఎటు వైపు తీసుకెళుతున్నారు. రాధే మా, మాంసం పై నిషేధం ఏంటి గోల..?' అంటూ కామెంట్ చేశాడు. ఇప్పటికే సోనమ్, సోనాక్షిలా కామెంట్స్ పై దుమారం రేగుతుండటంతో రిషీకపూర్ కామెంట్స్ ఆ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. గతంలో స్వామిజీలపై ఇలాంటి కామెంట్సే చేసిన రిషీకపూర్, ఈ సారి మాత్రం కాస్త ఆలస్యంగా స్పందించారు. 'ఆల్ ఈజ్ వెల్' సినిమా తరువాత యురోపియన్ టూర్కి వెళ్లిన కపూర్ తిరిగి ముంబై చేరుకోగానే ప్రస్తుత పరిస్థితులపై స్పందించారు. Jaago India Jaago. Stop all this in the name of religion.All taking the nation for a ride. Kabhi Radhe baby Kabhi meat ban! Kya ho raha hai? — rishi kapoor (@chintskap) September 9, 2015