Samuthirakani
-
నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
‘కార్మేని సెల్వం’ మూవీ రివ్యూ
టైటిల్: ‘కార్మేని సెల్వం’నటీనటులు: సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్నిర్మాణ సంస్థ: పాత్వే ప్రొడక్షన్స్నిర్మాత:అరుణ్ రంగరాజులుదర్శకుడు: రామ్ చక్రిసంగీత దర్శకుడు: ‘మ్యూజిక్ యాజ్ ఎ సర్వీస్’ (MAAS)సినిమాటోగ్రఫీ: యువరాజ్ దక్షణ్ఎడిటింగ్: జగన్ ఆర్వీ, దినేష్ ఎస్విడుదల తేది: ఏప్రిల్ 3, 2026దర్శకుడిగా వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించడమే కాకుండా.. విలక్షణ నటుడిగానూ గుర్తింపు సంపాదించుకున్నాడు సముద్రఖని. ఒక పక్క స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే.. మరోపక్క కంటెంట్ ఉన్న సినిమాల్లో లీడ్ రోల్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రమే ‘కార్మేని సెల్వం’. రేపు(ఏప్రిల్ 3) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రత్యేక షో వేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..చెన్నైకి చెందిన సెల్వం(సముద్రఖని) ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి. వ్యాపారవేత్త సంపత్(గౌతమ్ మీనన్) దగ్గర డ్రైవర్గా పని చేస్తుంటాడు. భార్య శాంతి(లక్ష్మీ ప్రియా), కొడుకు బాలునే అతని ప్రపంచం. ఉన్నంతలో సంతోషంగా ఉండాలనేది అతని నైజం. బంధువుల ముందు చిన్నచూపు కావొద్దనేది భార్య శాంతి నైజం. ఫంక్షన్లో అవమానించారని, పౌరుషంతో ఇంట్లో దాచుకున్న డబ్బుతో పాటు మెడపై ఉన్న పుస్తెల తాడుని సైతం అమ్మి ఆడపడుచు కూతురుకి కానుకగా ఇచ్చేస్తుంది. ఓ రోజు కొడుకు తలకు గాయం కావడంతో ఆస్పత్రి ఖర్చులకై సొంత బావ దగ్గర రూ. 10 వేలు అప్పు తీసుకొస్తాడు సెల్వం. ఆ అప్పుని తీర్చేందుకు తన బాసుకు తెలియకుండా ఆయన కారుని టాక్సీలో పెడతాడు. టాక్సీలో ఎక్కినవాళ్ల మాటలు విని..సెల్వంకి డబ్బుపై ఆశ పెరుగుతుంది. ఆ ఆశ తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? భార్య, కొడుకుని వదిలేసి.. వేరే దేశం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు సెల్వం తిరిగి ఇండియాకు వచ్చాడా? రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణఈ సినిమా చివరిల్లో ఒక డైలాగు ఉంటుంది. ‘అవసరం లేనివి కొంటే..అవసరమైనవి కోల్పోతాం’. ఈ ఒక్క డైలాగ్తో ఈ కథ ఇచ్చే సందేశం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఉరుకుల పరుగుల జీవితం ఇది. డబ్బుపై ఆశతో ఫ్యామిలీని దూరం పెట్టి.. చిన్న చిన్న సంతోషలను సైతం మిస్ చేసుకుంటున్నాం. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అన్నట్లుగా.. పక్కవాళ్లను చూసి మన స్థాయిని మించి ఖర్చు చేస్తున్నాం. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలే.. ఇలాంటి పనులు చేసే అప్పులపాలు అవుతున్నాయి. కార్మెనీ సెలం సినిమాలో ఇదే చూపించారు. అప్పుల వల్ల మధ్యతరగతి కుటుంబాల సంబంధాలు, వారు తీసుకునే నిర్ణయాలని ఎలా ప్రభావితం అవుతాయి అనేది చాలా రియలిస్టిక్ ఇందులో చూపించారు. అయితే ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తకాదు. మిడిల్ క్లాస్ కష్టాల నేపథ్యంలో బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచే సినిమాలు వస్తున్నాయి. కానీ ఇందులో ఇప్పటి మధ్యతరగతి కుటుంబాలు చేస్తున్న తప్పులను చూపించారు. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు చాలా ఎమోషనల్గా కథనం సాగుతుంది. ఫస్టాఫ్ మొత్తం మిడిల్ క్లాస్ కష్టాలను, సెకండాఫ్లో ఆ కష్టాల నుంచి బయటపడేందుకు చేసే అప్పులు, తప్పులను చూపిస్తూ..చివరిలో ఓ మంచి సందేశం అందించారు. ఆడపడచు పిలిచింది కదా అని సంతోషంగా ఫంక్షన్కి వెళ్తే.. అక్కడ వాళ్లను అవమానించడం.. అది తట్టుకోలేక దాచుకున్న కొద్ది డబ్బుని కూడా కానుకగా ఇవ్వడం.. అప్పు తీర్చడానికి సెల్వం తొలిసారి తప్పు దారి ఎంచుకున్నప్పటి నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇతరుల మాటలు విని.. సెల్వం చేసే తప్పులన్నీ మనమో లేదా మన చుట్టు ఉన్నవాళ్లో చేసే ఉంటారు. అందుకే ఆ పాత్రతో కనెక్ట్ అయిపోతారు. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తి పెంచుతుంది. సెకండాఫ్ మొత్తం మరింత ఎమోషనల్గా సాగుతుంది. జీవనోపాధి కోసం కుటుంబాలను వదిలి ఇతర దేశాలకు వెళ్లినవాళ్లు, వారి కుటుంబ సభ్యులు ఈ సినిమా చూస్తే వెక్కి వెక్కి ఏడుస్తారు.సెల్వం పాత్రలో సముద్ర ఖని ఒదిగిపోయాడు. . మధ్యతరగతి భర్తగా, తండ్రిగా తనదైన ఎమోషన్ను పండించారు. ఆయన సతీమణిగా లక్ష్మీ ప్రియా తనదైన సహజ నటనతో ఆకట్టుకుంది. అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.రేటింగ్: 2.75/5 -
అప్పులతో బాధపడుతున్న వారికి ధైర్యం ఇచ్చే సినిమా ఇది
విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కార్మేని సెల్వం’. రామ్ చక్రి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామ్ చక్రి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..‘‘నేను తెలుగులో చూసిన మొదటి సినిమా ‘ఆర్య’. ఆ తర్వాత ఆనంద్, గోదావరి మూవీస్ చూశా. అప్పుడు నాకు ఒక విషయం బాగా అర్థమైంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ రెండు భిన్నమైన కథల శైలులను ఎంతో అద్భుతంగా స్వీకరిస్తుంది. ఒక వైపు ఆర్య లాంటి ఎనర్జిటిక్, కమర్షియల్ సినిమాలు ఉంటే, మరో వైపు శేఖర్ కమ్ముల గారి ఆనంద్, గోదావరి లాంటి హృదయాన్ని తాకే రియలిస్టిక్ కథలు ఉంటాయి. ఆ బ్యాలెన్స్ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. నేను శేఖర్ కమ్ముల గారితో నేరుగా పని చేసే అవకాశం రాలేదు. అయినప్పటికీ, ఆయనను నా గురువు, మెంటర్గా భావిస్తాను. ఆయన సినిమాలను చూస్తూ ఎంతో నేర్చుకున్నాను. అలాగే నా దర్శక గురువు కె.వి. గుహన్ గారికి కూడా నా ధన్యవాదాలు. ఈ ఇద్దరూ నాకు ఇన్స్పిరేషన్గా నిలిచారు.ఇక ‘కార్మేని సెల్వం’ విషయానికొస్తే.. ఈ సినిమా మధ్య తరగతి జీవితంపై ఆధారపడి ఉంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కథతో కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా అప్పుల సమస్యతో బాధపడుతున్న వారికి ఈ సినిమా ఒక ధైర్యాన్ని ఇస్తుంది. మధ్య తరగతి కుటుంబాల్లో అప్పులు అనేవి కామన్గా ఉంటాయి. వాటి కారణంగా కుటుంబంలోని సంబంధాలు, వారు తీసుకునే నిర్ణయాలు ఎలా ప్రభావితం చేస్తాయనేది ఇందులో చూపించబోతున్నాం. చాలా రియలిస్టిక్గా మూవీ ఉంటుంది. సముద్రఖని ఆయన పాత్రలోని ప్రతి షేడ్ను అద్భుతంగా పండించారు. మధ్యతరగతి భర్తగా, తండ్రిగా తనదైన ఎమోషన్ను పండించారు. ఆయనతోపాటు గౌతమ్ మీనన్ గారు, లక్ష్మీ ప్రియా, అభినయ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మా టెక్నికల్ టీమ్ కూడా ఎంతో సపోర్ట్ చేసింది.మ్యూజిక్ విషయానికొస్తే.. ఈ సినిమా కోసం మేము ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం . ‘మ్యూజిక్ యాజ్ ఎ సర్వీస్’ పేరుతో మా మ్యూజిక్ డైరెక్టర్ రామానుజన్ టీమ్ వర్క్ చేశారు. సంగీతం అనేది కేవలం మ్యూజిక్ డైరెక్టర్ లేదా సింగర్స్దే కాదు.. ఇన్స్ట్రుమెంటలిస్టులు, సౌండ్ ఇంజినీర్లు, మిక్సింగ్ టీమ్, ఇంకా ఎంతో మంది టెక్నీషియన్లు కలిసి చేసే పనిగా వారు భావించారు. ఈ కాన్సెప్ట్ ద్వారా ప్రతి పాటకు పని చేసిన అందరికీ క్రెడిట్ ఇవ్వడం, అలాగే రెవెన్యూ షేర్ చేయడం మా లక్ష్యం. ఇది మ్యూజిక్ వెనుక ఉన్న అసలు హీరోలకు గుర్తింపు ఇవ్వడానికి మా చిన్న ప్రయత్నం. మా డీఓపీ యువరాజ్ దక్షణ్, ఎడిటర్ జగన్లకు ఎంతో అనుభవం ఉంది. థియేటర్లో ఈ సినిమా విజువల్స్ చూస్తే, కథను ఎంత గ్రాండ్గా తీసుకెళ్లామో అర్థమవుతుంది. ఇక మా ప్రొడ్యూసర్ అరుణ్ రంగరాజులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కథపై నమ్మకం ఉంచి, మంచి క్వాలిటీతో సినిమా చేయడానికి మాకు సహకరించారు. ఈ సినిమా ద్వారా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నా. కుటుంబంలోని పెద్దలు కొందరు విదేశాల్లో జీవనోపాధి కొనసాగిస్తున్నారు. కానీ వారి కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి. ఏడాదికి కనీసం ఒకట్రెండు సార్లు అయినా వారు తిరిగి వచ్చి తమ కుటుంబాలతో కలవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది’’. -
పెయిన్తోనే విజయ్, త్రిషలపై కామెంట్ చేశా: సముద్రఖని
టీవీకే అధినేత విజయ్, త్రిష వివాదానికి సంబంధించి వైరల్ అయిన తన వ్యాఖ్యల వివాదంపై నటుడు, దర్శకుడు సముద్రఖని తాజాగా స్పందించారు. తాను నటించిన ‘కార్మేని సెల్వం’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. విజయ్పై తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, సందర్భానికి సంబంధం లేకుండా వాటికి వక్రీకరణలు చేశారని ఆయన అన్నారు. తాను నిజాయితీగా మాట్లాడానని, ఎవరినీ అవమానించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తన ఆలోచనలను వ్యక్తం చేసినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, ఈ విషయాన్ని అనవసరంగా పెద్దది చేశారని క్లారిటీ ఇచ్చారు. 'పాత వీడియోలో నేను మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి మొదటి నుంచి కాకుండా మధ్యలో వీడియో రికార్డ్ చేశారు. అయితే, తను రికార్డ్ చేస్తున్నాడు కదా అని నేను మాట్లాడటం ఆపలేదు. విజయ్ మొదట సపోర్ట్ ఇచ్చింది నేనే.. కాబట్టే కాస్త నాకు పెయిన్గానే ఉంటుంది.' అని వివరించారు.ఏం జరిగిందంటే..?విజయ్, త్రిష ఒక పెళ్లి వేడుకలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇదే అంశం గురించి సముద్రఖని కొందరితో చర్చిస్తన్న వీడియో వైరల్ అయింది. వారిద్దరి తీరుపై సముద్రఖని తన అసంతృప్తిని బయటపెట్టారు. 'ఇదేమైనా ఆటా..? వ్యక్తిగత విషయాలను ఇలా బయటపెట్టాలా..? ఎవరి మీద పగ తీర్చుకుంటున్నారు..? అంతా సవ్యంగ జరుగుతున్న సమయంలో ఇలాంటివి అవసరమా..? ఈ కారణంతో పార్టీలోని కొందరు సపోర్టర్స్ వెళ్లిపోతున్నారు' అని ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆ వీడియో కాస్త వైరల్ అయింది. -
'అప్పు చేస్తేనే పెద్ద వాళ్లమవుతాం'.. ఆసక్తిగా కార్మేని సెల్వం ట్రైలర్
సముద్రఖని, అభినయ ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ కార్మేని సెల్వం. ఈ ద్విభాషా చిత్రానికి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. ఈ మూవీని పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు నిర్మించారు. ఈ చిత్రంలో డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఓకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ ట్రైలర్ హైదరాబాద్లో రిలీజ్ చేశారు.ట్రైలర్ చూస్తుంటే ఓ మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సామాన్యుడి ఇంటికల, ఆర్థిక సమస్యలు, డబ్బు అనే కోణంలో ఈ కథను రూపొందించారని ట్రైలర్లో అర్థమవుతోంది. అప్పులు అనే కాన్సెప్ట్తో పాటు ఎమోషనల్ స్టోరీగా ట్రైలర్లో చూపించారు. కాగా.. ఈ చిత్రంలో లక్ష్మీ ప్రియ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రిచ్ కావాలంటే...
సముద్ర ఖని ప్రధాన పాత్రలో, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కార్మేని సెల్వం’. రామ్ చక్రి దర్శకత్వంలో అరుణ్ రంగరాజులు తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించి, తెలుగు టీజర్ను విడుదల చేశారు మేకర్స్. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ మూవీ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్లో భాగస్వామిగా ఉంది.‘డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి’ అంటూ సముద్ర ఖని చెప్పే డైలాగ్తో టీజర్ ప్రారంభం అవుతుంది. ‘రిచ్ కావాలంటే రిచ్ మనిషిలా ఖర్చు చేయడం నేర్చుకోవాలి. డబ్బు లేకపోతే అప్పు తీసుకుని ఖర్చు చేయాలి’ అంటూ సముద్ర ఖని చెప్పే డైలాగ్స్ కూడా టీజర్లో ఉన్నాయి. -
కార్మేని సెల్వం టీజర్: అప్పు చేసైనా ఖర్చు పెట్టాలి!
సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘కార్మేని సెల్వం’. ఇందులో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. గురువారం ఈ మూవీ తెలుగు టీజర్ రిలీజ్ చేశారు. "డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి" అని సముద్రఖని వాయిస్ ఓవర్తో టీజర్ మొదలవుతుంది. అధిక ఖర్చులు, భారీ లోన్లు, క్రిప్టో పెట్టుబడులు, త్వరగా ధనవంతులు కావాలనే ఆశతో చేసే ప్రయత్నాలు.. ఇలా నేటి సమాజంలో డబ్బు పట్ల ఉన్న ఆలోచనలను చూపించిన విధానం ఆకట్టుకుంటోంది. రిచ్ కావాలంటే..ముఖ్యంగా ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ ఆధారిత జీవనశైలి, డబ్బు కోసం మనుషులు తీసుకునే నిర్ణయాలు కథలో కీలక పాత్ర పోషించబోతున్నాయని అర్థమవుతుంది. సముద్రఖని కుటుంబంతో కనిపించే సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా ఉండనున్నాయి. టీజర్ చివర్లో.. “ధవంతుడివి కావాలంటే రిచ్ మనిషిలా ఖర్చు చేయడం నేర్చుకోవాలి… డబ్బు లేకపోతే అప్పు తీసుకునైనా ఖర్చు చేయాలి” అని సముద్రఖని చెప్పే డైలాగ్ నేటి మనుషుల పోకడను తెలియజేస్తోంది. సినిమాఈ మూవీని రామ్ చక్రి దర్శకత్వంలో పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు నిర్మిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ మూవీ ఏప్రిల్ 3న విడుదల కానుంది. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. -
థ్రిల్లర్ సిరీస్లో సముద్రఖని.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాక చిన్నాపెద్ద తేడా లేకుండా నటీనటులందరూ అందులోనూ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. తాజాగా సముద్రఖని తొలిసారి ఓ ఓటీటీ వెబ్సిరీస్లో బాగమయ్యాడు. ఆ సిరీస్ పేరు తడయం (క్లూ అని అర్థం). సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో ఫిబ్రవరి 27న ప్రసారం కానుంది.ట్రైలర్ రిలీజ్తాజాగా ట్రైలర్ వదిలారు. అందులో ఒక పాలవాడు రోజూలాగే అందరికీ పాలు పోసేందుకు బయలుదేరతాడు. అయితే ఓ ఇంటికి వచ్చాక మాత్రం ఎంత పిలిచినా ఎవరూ బయటకు రారు. దాంతో అతడే అమ్మా అని పిలుస్తూ లోపలకు వెళ్తాడు. తీరా అక్కడ రక్తపుమడుగు చూసి భయభ్రాంతులకు లోనవుతాడు. ఈ సన్నివేశంతోనే ట్రైలర్ మొదలైంది. వరుస హత్యలను చేధించేందుకు ప్రయత్నిస్తున్న ఎస్ఐ అదియమాన్గా సముద్రఖనిని చూపించారు.ఓటీటీలో తడయంఇది ఎక్కడ మొదలుపెట్టామో అక్కడే ముగించేద్దాం అని తెలుగు నటుడు నవీన్ చంద్ర వాయిస్తో డైలాగ్ వచ్చింది. మరి ఈ సిరీస్లో నవీన్ ఉన్నాడా? లేదా? అన్నది తడయం ఓటీటీలోకి వచ్చాకే తెలియనుంది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. నవీన్ కుమార్ పలనివేల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్కు విబిన్ భాస్కర్ సంగీతం అందించాడు.A story that unfolds frame by frame🔍Samuthirakani's 1st ever web-series #Thadayam Premieres on 27th Feb On ZEE5!@thondankani @SshivadaOffcl @cocktailcinemas @dirNavin_offl#Thadayam #ThadayamOnZEE5 #TamilZEE5Original #ZEE5Tamil #TamilZEE5 pic.twitter.com/xYfK9xg6s4— ZEE5 Tamil (@ZEE5Tamil) February 19, 2026 -
దుర్గాదేవిగా నటి కస్తూరి.. 32 ఏళ్ల తర్వాత..
దాదాపు 35 ఏళ్ల తర్వాత తమిళంలో తెరకెక్కిన పురాణ కథాచిత్రం రాహుకేతు అని చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రఖ్యాత దివంగత దర్శకుడు ఏపీ నాగరాజన్ రూపొందించిన భక్తిరస చిత్రాల తర్వాత ఇంతవరకు పురాణ గాథలతో రూపొందిన చిత్రాలు రాలేదని.. ఆ లోటును రాహుకేతు తీర్చనుందని చెప్తున్నారు. ఈ మూవీలో సముద్రఖని మహాశివుడిగా, నటి కస్తూరి దుర్గాదేవిగా, విగ్నేష్ శ్రీమహావిష్ణువుగా ప్రధాన పాత్రలు పోషించారు. తమిళం థియేటర్స్ పతాకంపై శాంతి బాలచందర్ నిర్మించారు. ఎస్ ఆనంద్, వి. ఉమాపతి సహనిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి కథ మాటలు పాటలను కలయిమామని కేపీ అరివానందన్ సమకూర్చగా తమిళమణి దురై బాలచందర్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 8న విధులకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు తమిళమణి దురై బాలచందర్ మాట్లాడుతూ.. ఇది రాహు కేతువుల జన్మ వృత్తాంతం.. అలాగే ప్రజలపై వారి ప్రభావం వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం రూపొందించామన్నారు. దీనికి భరణి కుమార్ నేపథ్య సంగీతాన్ని అందించగా గిటారిస్ట్ సదానందం మూడు పాటలకు సంగీతాన్ని అందించారని చెప్పారు.చదవండి: పెళ్లి-పిల్లలు.. ఈ రెండూ కావాలి: మృణాల్ ఠాకూర్ -
నటి అభినయ దంపతులను ఆశీర్వదించిన ఓంకార్, సముద్రఖని (ఫోటోలు)
-
ఓటీటీలో రామం రాఘవం.. ఎప్పటినుంచంటే?
సముద్రఖని, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రామం రాఘవం (Ramam Raghavam Movie). ఈ సినిమాతో ధనరాజ్ దర్శకుడిగా మారాడు. ఎప్పుడూ కమెడియన్గా నవ్వించే ధనరాజ్ ఈ మూవీతో ఏడిపించే ప్రయత్నం చేశాడు. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీ(OTT)లోకి వచ్చేందుకు రెడీ అయింది. సన్ నెక్స్ట్లో మార్చి 14న విడుదల కానుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ అందుబాటులోకి రానున్నట్లు సన్ నెక్స్ట్ (Sun NXT) అధికారికంగా ప్రకటించింది.కథేంటంటే?సబ్ రిస్ట్రార్ దశరథ రామం (సముద్రఖని) నిజాయితీపరుడు. కొడుకు రాఘవన (ధన్రాజ్)ను చాలా గారాబంగా పెంచుతాడు. డాక్టర్ను చేయాలని కలలు కంటాడు. కానీ అతడు మాత్రం చదువు ఆపేసి జల్సా చేస్తాడు. సులువుగా డబ్బు సంపాదించడం కోసం అనేక తప్పులు చేస్తాడు. అలా ఓసారి చిక్కుల్లోపడతాడు. అప్పుడు తండ్రే అతడిని పోలీసులకు అప్పగిస్తాడు. జైలు నుంచి బయటకు రాగానే తండ్రినే చంపాలని కుట్రపన్నుతాడు.. ప్రాణంగా ప్రేమించిన తండ్రిని రాఘవ ఎందుకు చంపాలనుకుంటాడు? అతడు చేసిన తప్పేంటి? కొడుకు కోసం రామం తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? అన్నది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే! The father and son journey unfolds in a manner you won’t anticipate... 😊✨Watch Ramam Raghavam streaming from March 14th 🔥[Ramam Raghavam, Samuthirakani, Dhanraj Koranani, Harish Uthaman,Satya, Vennela Kishore, Srinivas Reddy, Sunil, Prudhvi Raj]...#RamamRaghavam… pic.twitter.com/7jrkTU01SO— SUN NXT (@sunnxt) March 5, 2025 చదవండి: వెస్ట్రన్ దుస్తులు వేసుకోనివ్వడు, నాకు కన్యాదానం చేస్తానన్నాడు: అమీషా -
'రామం రాఘవం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'నా కుమారుడికి పిల్లను ఇవ్వొద్దని తండ్రినే చెబుతున్నా'.. రామం రాఘవం ఎమోషనల్ ట్రైలర్
టాలీవుడ్ నటుడు ధనరాజ్ కొరనాని స్వీయ దర్శకత్వం వహిస్తోన్న తొలి చిత్రం 'రామం రాఘవం'. ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంతాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో నాని చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే తండ్రీ, కొడుకుల మధ్య జరిగే కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ జనరేషన్లో తండ్రి, కుమారుల రిలేషన్స్ ఎలా ఉంటాయనే కోణంలోనే రామం రాఘవం చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సునీల్, సత్య, పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి విమానం దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను అందించగా అరుణ్ చిలువేరు సంగీత సమకూర్చారు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి త్వరలో విడుదల కానుంది. Here’s #RamamRaghavam Telugu & Tamil Trailer, looks promising. To khani anna @thondankani and actor turned director @DhanrajOffl and the rest of the team. All the very best. Telugu ▶️ https://t.co/1tg1rzUcdLTamil ▶️ https://t.co/xyVFiSxjFi#RR In theatres on Feb 21st pic.twitter.com/2mZQdn3c5f— Nani (@NameisNani) February 14, 2025 -
‘గేమ్ ఛేంజర్’ HD మూవీ స్టిల్స్
-
ఇతడు ప్రముఖ నటుడు, దర్శకుడు.. మీకు బాగా తెలుసు.. గుర్తుపట్టారా?
ఒకప్పుడు నటులు, దర్శకులు ఎవరి పని వాళ్లు చేసుకునే వాళ్లు. ఇప్పుడు ట్రెండ్ మారింది. సీనియర్ దర్శకులు.. పూర్తిస్థాయి నటులుగా మారిపోతున్నారు. కుర్ర హీరోలు చాలామంది డైరెక్షన్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకొంటున్నామంటే పైన ఉన్నది అలాంటి యాక్టర్ కమ్ డైరెక్టరే. తెలుగు, తమిళ, మలయాళం అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూనే బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతలా చెప్పాం కదా ఇతడెవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన కనిపిస్తున్న వ్యక్తి పేరు సముద్రఖని. అవును మీలో కొందరు ఊహించింది కరెక్టే. ఈ మధ్య కాలంలో వరసగా తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తున్నది ఇతడే. అల వైకుంఠపురములో, క్రాక్, ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట, హనుమాన్.. ఇలా విలన్ అనే కాకుండా డిఫరెంట్ పాత్రలు చేస్తూ ఫేమ్ సొంతం చేసుకున్నాడు.(ఇదీ చదవండి: అబ్బాయినని చెప్పిన వదల్లేదు.. బలవంతం చేశారు: యంగ్ హీరో)నటుడిగా ఇంత పేరు తెచ్చుకున్నాడు గానీ సముద్రఖని కెరీర్ దర్శకత్వ శాఖలో మొదలైంది. డిగ్రీ పూర్తవగానే నటుడు అయిపోదామని ఇండస్ట్రీకి వచ్చాడు. కాకపోతే తొలుత తమిళంలో సీరియల్, సినిమాల్లో అనామక రోల్స్ చేశాడు. ఎప్పుడైతే ప్రముఖ దర్శకుడు బాలచందర్ దగ్గర సహాయ దర్శకుడిగా చేరాడో అప్పటి నుంచి డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ పెంచుకుని పలు హిట్ సినిమాలు తీశాడు.2001 నుంచి తమిళంలో నటుడు, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోగా.. 'అల వైకుంఠపురములో' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ ఫుల్ బిజీ అయిపోయాడు. గతేడాది పవన్ కల్యాణ్ హీరోగా 'బ్రో' మూవీ డైరెక్ట్ కూడా చేశాడు. యాక్టింగ్, డైరెక్షన్తో పాటు పాటలు పాడటం, డబ్బింగ్ చెప్పడం లాంటి కళలు కూడా ఉన్నాయి. ఇకపోతే సముద్రఖని పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పైన ఉన్నది ఈ ఫొటోనే ఇది చూసి మీరు గుర్తుపట్టడమైతే కష్టం. మరి మీలో ఎంతమంది గుర్తుపట్టారు?(ఇదీ చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్.. ప్రెగ్నెన్సీ పిక్ వైరల్) -
డైరెక్టర్గా ధన్రాజ్ కొత్త సినిమా.. టీజర్ విడుదల
టాలీవుడ్లో చిన్న చిన్న పాత్రల నుంచి హాస్యనటుడిగా ఎదిగి ఆ తరువాత కథానాయకుడి స్థాయికి చేరిన నటుడు ధన్రాజ్. ఈయన తాజాగా దర్శకుడిగా అవతారమెత్తి కథానాయకుడిగా నటించిన చిత్రం 'రామన్ రాఘవన్'. నటుడు సముద్రఖని ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రం ద్వారా మోక్ష అనే నటి కథానాయకిగా పరిచయం అవుతున్నారు. స్టేట్ పెన్సిల్ ప్రొడక్షన్స్ పతాకంపై పృధ్వీ పోలవరపు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళం భాషల్లో రూపొందింది. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భం తాజాగా చిత్రం టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ప్రసాద్ల్యాబ్లో నిర్వహించారు. ఇందులో దర్శకుడు బాలా, పాండిరాజ్, నటుడు బాబీసింహ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని టీజర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు, కథానాయకుడు ధన్రాజ్ మాట్లాడుతూ.. అమ్మానాన్నలకు ధన్యవాదాలన్నారు. శివప్రసాద్ రాసిన కథతో రూపొందించిన చిత్రం రామన్ రాఘవన్ అని తెలిపారు. తాను ఈ చిత్రానికి యాక్సిడెంటల్ దర్శకుడినని చెప్పారు. ఏ దర్శకుడి వద్ద పనిచేయలేదని చెప్పారు. వేరే దర్శకుడు చేయాల్సిన ఈ చిత్రానికి తాను అనివార్యకారణాలతో దర్శకుడిని అయ్యానన్నారు. ఈ చిత్రం కథ గురించి సముద్రఖని చెప్పినప్పుడు నువ్వే దర్శకత్వం వహించు అని ధైర్యం ఇచ్చారన్నారు. తాను 100 మంది దర్శకుల చిత్రాల్లో నటించానని, వారి ప్రభావంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. సముద్రఖని లేకపోతే ఈ చిత్రం ఉండేది కాదని ధన్రాజ్ పేర్కొన్నారు. సముద్రఖని మాట్లాడుతూ తాను ఇప్పటివరకూ 10కి పైగా చిత్రాల్లో నాన్నగా నటించానని చెప్పారు. అవి ఒక్కొక్కటి ఒక్కో విధంగా రూపొందాయన్నారు. ఈ చిత్ర దర్శకుడు ధన్రాజ్కు అమ్మా నాన్న లేరని, తనే స్వయం కృషితో ఈ స్థాయికి వచ్చారని పేర్కొన్నారు. నాన్న ఇతి వృత్తంతో కూడిన కథ అని తను చెప్పగానే రండి చేద్దాం అని చెప్పానన్నారు. నమ్మకంతో వచ్చే వాళ్లు చిత్రాన్ని బాగా రూపొందిస్తారని అలా ధన్రాజ్ను నమ్మి తానీ చిత్రం చేశానని చెప్పారు. ఇది తండ్రీ కొడుకుల మధ్య ప్రేమాభిమానాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని సముద్రఖని చెప్పారు. దర్శకుడు బాలా మాట్లాడుతూ సముద్రఖనికి అభిమానిగా తాను ఇక్కడికి వచ్చానన్నారు. ఆయన నటుడిగా తానేమిటో నిరూపించుకున్నారని, ఆయన శ్రమకు తాను అభిమానినని అన్నారు. ఇతరులకు సహాయం చేసే ఆయన గుణం తనను ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు బాలా పేర్కొన్నారు. -
దర్శకుడిగా ధనరాజ్.. ఎమోషనల్ ట్రైలర్ చూశారా?
స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం "రామం రాఘవం". నటుడు ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా రామం రాఘవం చిత్ర గ్లింప్స్ను హీరో ఉస్తాద్ రామ్ పోతినేని తన ట్విటర్ ఖాతాలో రిలీజ్ చేశారు. అలాగే ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ మీడియా గ్లింప్స్ను రిలీజ్ చేసిన అనంతరం మాట్లాడుతూ... ధనరాజ్ నటుడిగా బిజీగా ఉన్నా.. ఒక మంచి కథను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో రామం రాఘవం సినిమా తీశారు. గ్లింప్స్ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. ఎమోషనల్ జర్నీతో రాబోతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రేమికుల రోజున తండ్రీ కొడుకుల మధ్య ఉన్న బాండింగ్ను కళ్లకు కట్టినట్లు చిత్రీకరించి గ్లింప్స్ విడుదల చెయ్యడం కొత్తగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి విమానం దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను సమకూర్చగా అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్. ఇందులోని పాటలను రామజోగయ్య శాస్త్రి రాస్తున్నారు హైదరాబాద్, అమలా పురం, రాజమండ్రి, రాజోలు, చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న 'రామం రాఘవం' తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కానుంది. Congratulations on your Directorial debut @DhanrajOffl . “You know who you love. But, do you know who loves you!!” Here the #RamamRaghavam 🏹 First Glimpse 💜💜 Telugu: https://t.co/MWgHMo70Jn Tamil: https://t.co/T0TXCJNwIU#HappyValentinesDayDAddY My best wishes to entire… pic.twitter.com/YqAgZgNWC6 — RAm POthineni (@ramsayz) February 14, 2024 చదవండి: Tillu Square Trailer: సిద్ధు, అనుపమ 'టిల్లు స్క్వేర్' ట్రైలర్ వచ్చేసింది - పోడూరి నాగ ఆంజనేయులు -
Hanu Man Movie Review: ‘హను-మాన్’ మూవీ రివ్యూ
టైటిల్: హను-మాన్ నటీనటులు: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు నిర్మాణ సంస్థ: ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మాత: కె.నిరంజన్ రెడ్డి దర్శకత్వం: ప్రశాంత్ వర్మ సంగీతం: గౌరహరి,అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సినిమాటోగ్రఫీ: శివేంద్ర ఎడిటర్: ఎస్.బి. రాజు తలారి విడుదల తేది: జనవరి 12, 2024 ఈ సంక్రాంతి బరిలో మూడు బడా హీరోల సినిమాలు ఉన్నాయి. వాటికి పోటీగా అన్నట్లు ‘హను-మాన్’ దిగాడు. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రంపై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు. కానీ ప్రచార చిత్రాలు విడుదలయ్యాక ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి చర్చించుకున్నారు. ఇక ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ‘హను-మాన్’పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు( జనవరి 12) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా అంజనాద్రి అనే ఫిక్షనల్ విలేజ్ చుట్టూ తిరుగుతుంది. అడవి ప్రాంతంలో ఉండే ఆ ఊర్లో అంజనమ్మ(వరలక్ష్మీ శరత్ కుమార్), తన సోదరుడు హనుమంతు(తేజ సజ్జ)తో కలిసి నివాసం ఉంటుంది. హనుమంతు ఓ చిల్లర దొంగ.ఊర్లో చిన్న చిన్న వస్తువులను దొంగలిస్తూ చిల్లరగా తిరుగుతుంటారు. ఆ ఊరి బడి పంతులు మనవరాలు మీనాక్షి(అమృత అయ్యర్) అంటే హనుమంతుకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఓ రోజు బందిపోట్లు మీనాక్షిపై దాడి చేసేందుకు యత్నించగా.. హనుమంతు ఆమెను రక్షించబోయి జలపాతంలో పడిపోతాడు. అక్కడ హనుమంతుడి రక్త ధారతో ఏర్పడి రుధిర మణి హనుమంతుని చేతికి చిక్కుతుంది. అప్పటి నుంచి అతనికి సూపర్ పవర్స్ వస్తాయి. ఇదిలా ఉంటే.. చిన్నప్పటి నుంచి సూపర్ హీరో కావాలని కలలు కంటున్న మైఖేల్(వినయ్ రాయ్)..ఆ శక్తుల కోసం సొంత తల్లిదండ్రులను చంపేస్తాడు. ప్రపంచంలో తనకు మాత్రమే సూపర్ పవర్స్ ఉండాలని, ఆ దిశగా ప్రయోగాలు సైతం చేయిస్తుంటాడు. ఈ క్రమంలో హనుమంతుకి వచ్చిన శక్తుల గురించి తెలుస్తుంది. దీంతో మైఖేల్ తన అనుచరులతో అంజనాద్రి గ్రామానికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? హనుమంతుకి ఉన్న శక్తులను సొంతం చేసుకునేందుకు మైఖేల్ పన్నిన పన్నాగం ఏంటి? అసలు ఆ శక్తులు హనుమంతుకు మాత్రమే ఎందుకు వచ్చాయి? హనుమంతుకి ఆపద వచ్చినప్పుడలా రక్షిస్తున్న స్వామిజీ(సముద్రఖని) ఎవరు? ఎందుకు రక్షిస్తున్నాడు? హనుమంతుకి ఉన్న శక్తులు ఉదయం పూట మాత్రమే ఎందుకు పని చేస్తాయి? అంజనాద్రిని కాపాడుకోవడం కోసం హనుమంతు ఏం చేశాడు? అసలు మీనాక్షి-హనుమంతుల ప్రేమ సంగతి ఏమైంది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. హీరోకి సూపర్ పవర్స్ రావడం.. ఆ శక్తిని మంచి కోసం ఉపయోగించడం.. విలన్ దాన్ని వశం చేసుకోవడానికి ప్రయత్నించడం.. హీరో అతని ప్రయత్నాన్ని తిప్పికొట్టి, ఆ శక్తిని లోక కల్యాణం కోసం వాడడం.. ఈ తరహా కాన్సెప్ట్తో హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, స్పైడర్ లాంటి సూపర్ హీరోలు అందరికి పరిచయమే. అయితే ఈ కథలన్నింటికి మూలం మన పురాణాలే. మన ఇండియాకు ఆంజనేయ స్వామిజీనే ఓ సూపర్ మ్యాన్ అని పురాణాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ హను-మాన్ చిత్రాన్ని తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఏది లేదు. ఈ తరహా కాన్సెప్ట్తో తెలుగులోనూ సినిమాలు వచ్చాయి కానీ.. నేటివిటీ కామెడీని టచ్ చేస్తూ.. తనదైన స్క్రీన్ప్లేతో మాయ చేశాడు ప్రశాంత్ వర్మ. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ తెలుగు నేటివిటీ మిస్ అవ్వకుండా కామెడీతో పాటు క్యూరియాసిటీని చివరి వరకు కంటిన్యూ చేశాడు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా కథను తీర్చి దిద్దాడు. కేవలం సూపర్ పవర్స్ కాన్సెప్ట్నే కాకుండా సిస్టర్ సెంటిమెంట్, ప్రేమ కథను కూడా ఇందులో జోడించాడు. అయితే అంతగా ఆకట్టుకోలేదు. అలా అని అనవసరంగా జోడించినట్లు కూడా లేవు. కథ రొటీన్గా సాగుతుందనే ఫీలింగ్ కలిగేలోపు ఆంజనేయ స్వామి తాలుకు కథను తీసుకురావడం..గూస్బంప్స్ తెప్పించే సీన్స్ పెట్టడంతో చూస్తుండగానే సినిమా అయిందనే భావన కలుగుతుంది. హను-మాన్ కథ ప్రారంభమే ఆసక్తికరంగా ఉంటుంది. విలన్ ఎందుకు సూపర్ పవర్స్ కావాలనుకునేది ప్రారంభ సన్నివేశాల్లోనే చూపించాడు. ఆ తర్వాత కథంతా అంజనాద్రి చుట్టూ తిరుగుతుంది. కోతికి రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వడం..హీరో గురించి ఆ కోతి చెప్పే మాటలు నవ్వులు పూయిస్తాయి. హీరో హీరోయిన్ల లవ్స్టోరీ రొటీన్గా ఉంటుంది. హీరోకి ఎప్పుడైన సూపర్ పవర్స్ వస్తాయో అప్పటి నుంచి కథనం ఆసక్తిరంగా సాగుతుంది. రాకేష్ మాస్టర్ గ్యాంగ్తో హీరో చేసే ఫైట్ సీన్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మరోవైపు సత్య, గెటప్ శ్రీను కామెడీ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్లో కథ సింపుల్గా, ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలోనే అసలు కథంతా ఉంటుంది. సూపర్ పవర్స్ కోసం విలన్ ప్రయత్నించడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు అదిరిపోతాయి. హీరోకి ఇచ్చే ఎలివేషన్ సీన్స్ కూడా విజుల్స్ వేయిస్తాయి. ఓ సందర్భంలో పెద్ద బండరాయిని కూడా ఎత్తేస్తాడు. అయినా కూడా అది అతిగా అనిపించడు. మరో యాక్షన్ సీన్లో చెట్టు వేర్లతో హెలికాప్టర్ని ఆపేస్తాడు..అయినా కన్విన్సింగ్గానే అనిపిస్తుంది. ఇక చివరి 15 నిమిషాలు అయితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. విఎఫెక్స్ అద్భుతంగా ఉన్నాయి. చిన్న చిన్న లోపాలు ఉన్నా ఇంత తక్కువ బడ్జెట్(రూ. 25 కోట్లు అని సమాచారం)లో ఇలాంటి సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మను నిజంగా అభినందించాల్సిందే. రాముడికి ఆంజనేయ స్వామి ఇచ్చిన మాట ఏంటి ? అనే ఆసక్తికర ప్రశ్నతో సీక్వెల్ని ప్రకటించాడు. మరి ఆంజనేయ స్వామి ఇచ్చిన హామీ ఏంటి అనేది 2025లొ విడుదలయ్యే ‘జై హను-మాన్’లో చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. తేజ సజ్జకు నటన కొత్తేమి కాదు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించి, తనదైన నటనతో మెప్పించాడు. హీరోగాను మంచి మార్కులే సాధించాడు. ఇక హనుమాన్ కోసం మరింత కష్టపడినట్లు తెలుస్తోంది. కథ మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు. కామెడీ, ఎమోషన్తో పాటు యాక్షన్ సీన్స్ని కూడా ఇరగదీశాడు. కావాల్సిన చోట మాత్రమే హీరోయిజాన్ని చూపించాడు. సాధారణ మనిషిగా.. సూపర్ పవర్స్ ఉన్న హను-మాన్గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించిన తేజ.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్్ చూపించి ఆకట్టుకున్నాడు. హీరో సోదరి అంజనమ్మగా వరలక్ష్మీ శరత్ కుమార్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రకు కూడా ఇందులో ఓ యాక్షన్స్ సీన్ ఉంది. అమృత అయ్యర్ తన పాత్ర పరిధిమేర నటించింది. సముద్రఖని పోషించిన పాత్రలోని సస్పెన్స్ని తెరపై చూడాల్సిందే. వినయ్ రాయ్ స్టైలీష్ విలన్గా మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. తనదైన బీజీఎంతో గౌరహరి సినిమా స్థాయిని పెంచేశాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ని చాలా రిచ్గా తెరకెక్కించాడు. వీఎఫెక్స్ వర్క్ అబ్బురపరిచేలా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
తెలుగు పొలిటికల్ స్టార్ బయోపిక్లో సముద్రఖని
సముద్రఖని సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. నటుడిగా దర్శకుడిగా ఏది చేసిన తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా ఫుల్ బిజీగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. దర్శకుడిగా చేసినా, నటుడిగా చేసినా సముద్రఖని చేశాడు అంటే అందులో కచ్చితంగా కొత్తదనం ఉంటుంది. తన మనసుకి నచ్చితేనే పాత్ర చేస్తాననే సముద్రఖని గురించి సోషల్ మీడియాలో ఓ వార్తా హల్చల్ చేస్తుంది. ఓ ప్రముఖ రాజకీయ నాయకుని బయోపిక్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు ఇప్పటికే దానికి సంబంధించిన పనులు కూడా మొదలైనట్టు తెలుస్తుంది. తెలంగాణకు చెందిన గుమ్మడి నరసయ్య బయోపిక్లో సముద్రఖని నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయన 1983-1994, 1999-2009 మధ్య యెల్లందు శాసనసభ సభ్యుడిగా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. నర్సయ్య నమోదుకాని రాజకీయ పార్టీ CPI (ML)కి చెందినవారు. యెల్లందు నుంచి ఆయన వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ ఇప్పటికీ ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు. అవినీతి మచ్చలేని వ్యక్తిగా, పేద ప్రజల ఆశ జ్యోతిగా, ఉండడానికి స్వంత ఇళ్ళు కూడా సరిగ్గా నిర్మించుకోలేని ఓ గొప్ప మానవాతివాది కావడంతో అటువంటి గొప్ప వ్యక్తి గురించి ఈ జనరేషన్కు తెలియాలనే ఉద్దేశంతో ఆయన టైటిల్ రోల్ పోషిస్తున్నట్టు సినీ సన్నిహితుల నుంచి సమాచారం. ఇదే కనుక నిజమైతే సముద్రఖని మరో నట విశ్వరూపం మనం చూడబోతున్నాం. ఏం జరుగుతుందో మున్ముందు చూడాలి. ఈ చిత్రంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. -
కార్తి హీరోగా మొదటి సినిమా.. వివాదంపై సముద్రఖని ఆగ్రహం!
కోలీవుడ్లో కొంతకాలంగా వివాదాల పర్వం నడుస్తోంది. ఇప్పటికే గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ధృవనచ్చితిరం సినిమా రిలీజ్ విషయంలోనూ అదే జరిగింది. ఎనిమిదేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా రిలీజ్కు ముందు రోజే అభిమానులకు షాక్ తగిలింది. ఈ సినిమా సమస్య కాస్తా కోర్టుకు చేరడంతో మరోసారి వాయిదా పడింది. ఇదిలా ఉండగా తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈసారి ఏకంగా 16 ఏళ్ల క్రిత రిలీజైన సినిమా విషయంలో ఇప్పుడు వివాదం మొదలైంది. అదేంటో తెలుసుకుందాం. కోలీవుడ్ నటుడు, నిర్మాత సముద్రఖని మరో నిర్మాత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కార్తి నటించిన చిత్రం ‘పరుత్తివీరన్’. ఈ చిత్రం ద్వారానే కార్తి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమా వివాదంపై సముద్రఖని మండిపడ్డారు. అయితే ఈ సినిమా విషయంలో కొన్నిరోజులుగా దర్శకుడు ఆమిర్, నిర్మాత జ్ఞానవేల్ రాజా మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే పరుత్తివీరన్ దర్శకుడికి మద్దతుగా సముద్రఖని ఓ లేఖ విడుదల చేశారు. సముద్ర ఖని లేఖలో ప్రస్తావిస్తూ.. 'పరుత్తివీరన్లో నేను కూడా నటించా. ఆ సినిమా టైంలో డైరెక్టర్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నాకు తెలుసు. నిర్మాతగా ఒక్కరోజు కూడా జ్ఞానవేల్ సెట్కు రాలేదు. సినిమా బడ్జెట్ విషయంలోనూ డైరెక్టర్కు సహకరించలేదు. నా వద్ద డబ్బుల్లేవంటూ షూటింగ్ మధ్యలోనే చేతులెత్తేశావు. బంధువుల దగ్గర నుంచి అప్పులు చేసి మరీ ఆమిర్ షూటింగ్ పూర్తి చేశాడు. దీనికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం. ఎంతో కష్టపడి సినిమా తీస్తే పేరు మాత్రం నువ్వు పొందావు. ఈ రోజు నువ్వు అమిర్పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నావు. ఈ పద్ధతితేం బాగాలేదు. నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు.' అని సముద్రఖని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ లేఖ కోలీవుడ్లో సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే.. ఇటీవలే కార్తి హీరోగా నటించిన చిత్రం ‘జపాన్’. ఈ సినిమాకు జ్ఞానవేల్ రాజా దీనికి నిర్మాతగా వ్యవహరించారు. చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు కార్తితో ఇప్పటివరకూ సినిమాలు చేసిన దర్శకులందరూ హాజరయ్యారు. అయితే ఫస్ట్ మూవీ డైరెక్టర్ ఆమిర్ మాత్రం ఈవెంట్కు రాలేదు. దీనిపై ఆయన ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కార్తి జపాన్ మూవీ ఈవెంట్కు నాకు ఆహ్వానం అందలేదు. సూర్య - కార్తితో నాకు రిలేషన్స్ అంత బాగాలేవు.. జ్ఞానవేల్ వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని అమిర్ అన్నారు. అయితే అమిర్ వ్యాఖ్యలపై జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.. 'అమిర్కు ఆహ్వానం పంపించాం. పరుత్తివీరన్ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు నాతో ఖర్చుపెట్టించాడు. సరైన లెక్కలు చెప్పకుండా డబ్బులు దండుకున్నాడు అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. దీంతో వీరిద్దరి వివాదం ప్రస్తుతం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. pic.twitter.com/JYfQNIgfcw — P.samuthirakani (@thondankani) November 25, 2023 -
యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న 'హిట్ లిస్ట్'.. ఆసక్తి పెంచుతోన్న టీజర్!
దర్శకుడు కేఎస్ రవికుమార్ తన ఆర్కే సెల్యులాయిడ్స్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం 'హిట్ లిస్ట్'. నటుడు శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు విక్రమన్ వారసుడు విజయ్ కనిష్క హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీకి రవికుమార్ శిష్యులు సూర్య, కార్తికేయన్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్ను విజయ్ సేతుపతి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు. (ఇది చదవండి : ఆ కుటుంబం నుంచి కొత్త హీరో ఎంట్రీ.. ట్రైలర్ చూశారా?) పూర్తి యాక్షన్ ఎంటర్టైన్గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాత్మక కార్యక్రమాలను జరుపుకుంటోంది. టీజర్ చూస్తే ఇది మంచి యాక్షన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత కేఎస్ రవికుమార్ వెల్లడించారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్, సముద్ర ఖని, మునీశ్కాంత్, నటి సితార, శతి వెంకట్, ఐశ్వర్య దత్త, బాలా సరవణన్, రెడిన్ కింగ్స్ లీ, అభినక్షత్ర, కేజీఎఫ్ చిత్రం ఫేమ్ గరుడ రామచంద్రా, అనుపమా కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సి. సత్య సంగీతాన్ని అందిస్తుండగా.. రాం చరణ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. (ఇది చదవండి : జబర్దస్త్ ఆర్టిస్ట్పై కేసు నమోదు) -
BRO Success Meet Photos: ‘బ్రో’ మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
'BRO' Movie Success Celebrations: ‘బ్రో’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
BRO Movie HD Wallpapers: సాయి ధరమ్ తేజ్ ‘బ్రో’ మూవీ మూవీ స్టిల్స్
-
BRO Twitter Review ‘బ్రో’ మూవీ ట్విటర్ రివ్యూ
మెగా హీరోలు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. తమిళంలో భారీ విజయం సాధించిన వినోదయ సీతం చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. సముద్రఖని దర్శకత్వం వహించారు. ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ కీలక హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్కు మంచి స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా నిర్వహించడంతో ‘బ్రో’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘బ్రో’ కథేంటి? ఎలా ఉంది? దేవుడిగా పవన్ ఏమేరకు మెప్పించాడు? తదితర విషయాలను సోషల్ మీడియా వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #bro is a powerstar film but lot of lag and many unnecessary scenes makes a below par movie thaman music stands out may be a below average fare for others and vintage papk for fans#BroTheAvatar — Gowtham (@gowthamreddy25) July 28, 2023 ట్విటర్లో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా యావరేజ్గా ఉందని అంటున్నారు. ఓవరాల్గా కథ బాగున్నప్పటికీ కొన్ని అనవసరపు సన్నివేశాలు జోడించడం వల్ల సినిమా యావరేజ్గా అనిపిస్తుంది. గత సినిమాలతో పోలిస్తే తమన్ సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. పవన్ ఫ్యాన్స్కి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #BRO First half review highlights:- 1) Vintage Pawan mannerisms 🤙💥 2) Total fun filled👌 3) Bromance between mama alludu👍👍 4) Taman music K**Ramp 💥🔥🔥#BroTheAvatar#BroReview#PawanaKalyan #SaiDharamTej #ketikasharma#PriyaPrakashVarrier — CinephileX (@CinephileX) July 27, 2023 ‘బ్రో’సినిమా బాగుంది. ఫస్టాఫ్ కామెడీ అదిరిపోయింది. మామఅల్లుళ్ల మధ్య బ్రోమాన్స్ బాగా వర్కౌట్ అయింది. ఇక సెకండాఫ్లో ఆడియెన్స్ ఎమోషల్ అయ్యే సీన్లు ఉన్నాయి.అదే సమయంలో కొన్ని సాగదీత సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. #BroTheAvathar is just good 👍 If you are expecting mass, just leave the theatre, basically an emotional movie with few laughs. @PawanKalyan entry 💥💥 Overall it's good 👌#BroTheAvatar#BroTimeStarts #BRO For more filmy content and exclusive updates follow me❤️💙 pic.twitter.com/KbO6XtZWgO — Lokie (@LokeshD33384473) July 28, 2023 పవన్ కల్యాణ్ మేజరిజం, కామెడీతో ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్గా ఉందట. అయితే సాధారణ ప్రేక్షకులకు మాత్రం అంతగా నచ్చకపోవచ్చు అంటున్నారు. ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొనే కొన్ని సన్నివేశాలను యాడ్ చేశారట. అవి సాధారణ ప్రేక్షకులను ఇబ్బందిగా అనిపిస్తాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. #BRO Strictly for PK fans ….high whistle blowing moments with PK vintage mash up songs …Rest all goes flat …again Trivikram failed to deliver an remake with unwanted emotions and unexceptional Lag in screenplay …BGM 👍🔥 2.75/5 #BroTheAvatar #BROFromJuly28th #BROreview pic.twitter.com/q7H1aZVsVX — Saideep07 (@saideep_satya77) July 27, 2023 #BroTheAvatar First half : ⭐⭐ Second half : ⭐ Overall : ⭐😀 Power"less" movie pic.twitter.com/TMIFrTir8W — Viraj_AADHF (@zooCakePaata) July 28, 2023 #BroTheAvatar First Half Review: ⭐⭐⭐½ Dialogues And Racy Screenplay 👌 Thamman BGM ❤️🔥 Interval Block is Too Good🔥🔥#PawanKalyan SDT Combo working good#BroTheAvathar #BroMovieReview #Bro pic.twitter.com/CiQ2aaAAvL — Thyview (@Thyveiw) July 27, 2023 One time watch for PK. Fun and swag when PK is on the screen. Kids liked these episodes. Wish the story was a bit better.#BRO — Anon (@AnonAndhra) July 27, 2023 #BRO -Good script which should have been executed more convincingly , a pure feast for fans with vintage @pawankalyan show in modern ultra stylish looks with reference to his old super hit songs.. #saidharamtej has done good job and all the characters involved in the movie gave — $h@shi yad@v (@shashiyadav073) July 28, 2023 Surprise Insp. ani vere location Povalsi vasthundi, Denemma life, e Tweets chusthu kurchovali eve varaku. 6:30 PM cheskunna 🥲 Missing My #BRO at Benefit shows 🔥🔥 Meeru njoy Cheyandi Cults … Updates matram pettandroi 🔥🔥#BusyBankLife🥲#BroTheAvatar @PawanKalyan pic.twitter.com/jd1K9AGYae — Srikanth_PawanKalyan 🔯 ✊ (@AlwaysPK143) July 28, 2023 First half report : Starting with rampp BGM 🔥🔥🔥BROOOOO 😉 Fans ki highs iche stuff 💥👌👌chaala kothaga undi.. But slow ga untadi..🤷♂️ Amma.. chelli.. Ramya.. BROO 😁Interval. Overall abv average 1st half 😊 @tollymasti . .#BroTheAvatar #Bro #BroReview #PawanKalyan… — Tollymasti (@tollymasti) July 27, 2023 150. #Bro (Telugu) {2.25/5} 😐#BroTheAvatar #BroReview pic.twitter.com/xgvMsqlplY — Cinema Madness 24*7 (@CinemaMadness24) July 28, 2023 Movie Review :- #BroTheAvatar Not Enough Bro...!! We Are Going With 2.5/5⭐#BroReview #BroTheAvatarReview #PawanKalyan #SaiDharamTej @PawanKalyan @IamSaiDharamTej #Bro #Review #FactInMedia pic.twitter.com/6XZjaoGKg7 — FACT IN MEDIA (@FactInMedia) July 28, 2023 First Half - భీమవరం Second Half - గాజువాక Final Report - అనంతపురం#BroTheAvatar #BroReview — నా ఇష్టం🖕 (@Infidel_KING) July 28, 2023 -
ఓటీటీకి వచ్చేసిన 'విమానం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సముద్ర ఖని, అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్, మాస్టర్ ధ్రువన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'విమానం'. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో జూన్ 9న ఈ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. (ఇది చదవండి: రామ్ చరణ్ -ఉపాసన బిడ్డకు ఖరీదైన గిఫ్ట్.. స్పందించిన మెగా టీం!) జూన్ 30 నుంచే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ జీ5 ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. ఈ చిత్రంలో తండ్రీ కొడుకుల సెంటిమెంట్తో సాగే సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. థియేటర్లలో చూడని వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. -
'విమానం ఎక్కించవా నాన్న ఒకసారి'.. ఆసక్తి పెంచుతోన్న టీజర్
సముద్ర ఖని, అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్, మాస్టర్ ధ్రువన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'విమానం'. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జూన్ 9న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఫస్ట్లుక్, సాంగ్స్ను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. తండ్రీ, కుమారుల మధ్య ప్రేమే విమానం టీజర్ చూస్తే మాస్టర్ ధ్రువన్ కుమారుడిగా నటిస్తే.. తండ్రి పాత్రలో విలక్షణ నటుడు సముద్ర ఖని నటించారు. వీరి మధ్య సాగే విమానం సంభాషణ ఆసక్తికరంగా, ఫన్నీగా ఉంది. అలాగే సినిమాలో బలమైన ఎమోషనల్ అంశాలు కూడా ఉన్నాయి. ‘నాన్నా ఎప్పుడు దేవుడు కనపడినా దండం పెట్టుకోమంటావు ఎందుకు’ అని అడిగిన కొడుకుతో ‘మనం అడిగినవన్నీ ఇస్తాడు’ కాబట్టి అని తండ్రి చెబుతాడు. దానికి ఆ పిల్లాడు ‘అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు.. నాన్నా అంటారు’ అనే ఓ డైలాగ్ చాలు తండ్రీ కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తోంది. ఈ చిత్రంలో రాజేంద్రన్, ధన్రాజ్, రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
'విమానం అంటే నీకెందుకు అంత ఇష్టం నాన్న'.. ఆసక్తిగా ప్రోమో
సముద్ర ఖని, మీరా జాస్మిన్, అనసూయ భరద్వాజ్, ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న చిత్రం 'విమానం'. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్పై సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ప్రోమోను చూస్తే.. అందులో తండ్రీ, కుమారుల కొడుకుల మధ్య అనుబంధం కథాంశంగా తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. సముద్ర ఖని అంగ వైకల్యంతో బాధపడే మధ్య వయస్కుడిగా, భార్య లేకపోయినా పిల్లాడిని జాగ్రత్తగా చూసుకునే వీరయ్య అనే తండ్రి పాత్రలో నటించారు. జీ స్టూడియోస్ సౌత్ మూవీస్ హెడ్ అక్షయ్ క్రేజీవాల్ మాట్లాడుతూ..'కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్తో అసోసియేట్ కావటం చాలా సంతోషంగా ఉంది. బలమైన కథాంశంతో రూపొందిన విమానం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రేక్షకులు మెచ్చే కంటెంట్ను అందించటమే మా లక్ష్యం. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం.' అని అన్నారు. ఈ చిత్రంలో మాస్టర్ ధ్రువన్, రాహుల్ రామకృష్ణ, ధన్రాజ్, రాజేంద్రన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూన్ 9 థియేటర్లలో రిలీజ్ కానుంది. -
‘ఇండియన్ 2’ లో ఏడుగురు విలన్లు.. ముగ్గురు హిరోయిన్లు
తమిళ సినిమా: కమలహాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఇండియన్ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఇండియన్ 2 చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నటి కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్సింగ్, ప్రియా భవాని శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్ నాలుగేళ్ల క్రితమే ప్రారంభమైనా షూటింగ్ స్పాట్లో ప్రమాదాలు, దర్శకుడికి నిర్మాణ సంస్థ మధ్య వివాదం, కరోనా కారణాలతో షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. కాగా పలు పంచాయితీలు, కేసులు అనంతరం ఇటీవలే ఇండియన్ 2 చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం షూటింగ్ చెన్నైలో జరుపుకుంటోంది. చిత్రంలో సేనాపతిగా కమలహాసన్ గెటప్తో కూడిన పోస్టర్ విడుదలై విశేష ప్రేక్షక ఆదరణ పొందుతోంది. గత వారం రోజులుగా చెన్నై, పనైయూర్లో చిత్ర షూటింగ్ను రేయింబవళ్లు నిర్వహిస్తున్నారు. చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సన్నివేశాల్లో తమిళ్, బ్రిటీష్ స్టంట్ కళాకారులు పనిచేస్తున్నట్లు తెలిసింది. కాగా చిత్రంలో కమల్ హాసన్కు ఏడుగురు విలన్లు ఉంటారని అందులో ఒకరు సముద్రఖని అని సమాచారం. మొత్తం మీద ముగ్గురు హీరోయిన్లు, ఏడుగురు విలన్లతో కమలహాసన్ ఇండియన్ 2 చిత్రంతో మరోసారి తెరపై విజృంభిస్తున్నారన్నమాట. -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న నటుడు
‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా దర్శకుడు ఎం.శశికుమార్ ఇచ్చిన ఛాలెంజ్ను నటుడు సముద్రఖని స్వీకరించారు. ఈమేరకు హైటెక్ సిటీలోని శిల్పారామంలో రావి మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో పాల్గొనే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు. ప్రకృతి పచ్చగా ఉంటేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారని, ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ను గొప్ప సామాజిక ఉద్యమంగానే కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యతగానూ తీర్చిదిద్దిన అధినేత జోగినపల్లి సంతోష్ కుమార్, నిర్వాహకుల నిరంతర కృషి ప్రశంసనీయం. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నేను నా ఇంటి నుంచే మొదలు పెడుతున్నాను. ఈ బృహత్తర ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి నా కుమారుడు హరివిఘ్నేశ్వరన్, కూతురు శివానీ, ప్రముఖ దర్శకులు హెచ్.వినోద్లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసురుతున్నా' అన్నారు సముద్రఖని. చదవండి: డూప్లెక్స్ అమ్మిన సోనమ్ కపూర్, ఎన్ని కోట్లంటే? రష్మికపై ట్రోలింగ్, రాళ్లు విసురుతారన్న కన్నడ స్టార్ -
బ్రహ్మానందం ‘పంచతంత్రం’ రిలీజ్ డేట్ ఫిక్స్
బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్పై అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వెల్లడిస్తూ.. ఓ వీడియోని వదిలారు. ఆ వీడియోలో బ్రహ్మానందం కాస్త సీరియస్ గా, వ్యామోహంతో 'పంచతంత్రం' అనే పదం రాసి ఉన్న క్యాసెట్ ని చూస్తున్నాడు. తర్వాత రాహుల్ విజయ్ కాస్త ఆత్రుతగా, గాలిలోకి చూస్తూ నడవడం మనం చూస్తాం. హ్యాపీ మూడ్లో ఉన్న శివాత్మిక రాజశేఖర్ని అతనికి జోడీగా చూపించారు. సముద్రఖని మరియు దివ్య వాణి మధ్య వయస్కులైన జంటగా కనిపిస్తున్నారు. దివ్య శ్రీపాద తన భర్తతో కలిసి ఆనందకరమైన భావోద్వేగ మూడ్లో ఉన్న దృశ్యాలు ఉన్నాయి. సాగాగా అభివర్ణిస్తున్న ఈ చిత్రంలో 'కలర్స్' స్వాతి కీలక పాత్రలో నటిస్తోంది. ఆమె మరోసారి 'పంచతంత్రం' క్యాసెట్తో వృత్తాన్ని పూర్తి చేస్తోంది. మరి ఈ పంచత్రంతం కథేంటో తెలియాలంటే డిసెంబర్ 9వరకు ఆగాల్సిందే. సినిమా విడుదల తేది ప్రకటన సందర్భంగా నిర్మాతలు సృజన్ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలో బ్రహ్మానందం ‘వేదవ్యాస్’ పాత్ర పోషించారు. ఆయనతో పాటు మిగిలిన నటీనటులు కూడా చక్కగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 9న రాబోతున్న మా చిత్రాన్ని ఆదరించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాం’అన్నారు. ‘బ్రహ్మానందం, స్వాతిరెడ్డి మధ్య సన్నివేశాలు ఎంతో హృద్యంగా ఉంటాయి. వీరి పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేస్తాయి. ఇందులో నటించిన వారంతా చాలా చక్కటి నటనను కనబరిచారు. అన్ని వర్గాల వారికి నచ్చేవిధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’అని దర్శకుడు హర్ష పులిపాక అన్నారు. -
Samuthirakani: దర్శకుడి కార్యాలయంలో అపరిచితురాలు
చెన్నై: మదురవాయిల్లో ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని కార్యాలయంలోకి ఒక అపరిచితురాలు చొరబడి కారుపై ఆరేసిన రెయిన్కోట్లను దొంగలించింది. ఈ మేరకు కార్యాలయ మేనేజర్ కార్తీక్ శుక్రవారం సాయంత్రం స్థానిక మదురవాయిల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఒక మహిళ కార్యాలయంలోకి చొరబడి అక్కడ కారుపై ఆరబెట్టిన రెయిన్కోట్లను తీసుకుని వాటిని ధరించి కారుపై కొంచెం సేపు పడుకుని వెళ్లిపోయిన దృశ్యాలు నమోదయ్యాయి. పోలీసులు విచారణ జరుపుతున్నారు. చదవండి: (Simbu-Sudha Kongara: కేజీఎఫ్ చిత్ర బ్యానర్లో శింబు) -
'మాచర్ల నియోజకవర్గం' నటుడిగా సంతృప్తినిచ్చింది: సముద్ర ఖని
మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు థియేరట్స్కి వస్తారు. రీసెంట్గా 'సీతారామం', 'బింబిసార' చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. ఈ సక్సెస్ను మాచర్ల నియోజకవర్గం కొనసాగిస్తుందని నమ్ముతున్నాను అన్నారు దర్శక, రచయిత-నటుడు సముద్ర ఖని. నితిన్, కృతిశెట్టి జంటగా ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 12న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర చేసిన సముద్ర ఖని మాట్లాడుతూ.. ''ఇందులో రాజప్ప అనే పాత్ర చేశాను. నటనకు మంచి ఆస్కారం ఉండటంతో సవాల్గా తీసుకొని నటించాను. ఈ చిత్రకథ తరమాలోనే తమిళనాడులోని ఓ ప్రాంతంలో 25 ఏళ్లు ఎలక్షన్స్ జరగలేదు. చివరికి ఉదయ్శంకర్ అనే ఓ ఐఏఎస్ ఆఫీసర్ చొరవ తీసుకుని స్థానికులతో మాట్లాడి ఎలక్షన్స్ జరిగేలా చేశారు. ఈ అంశాన్ని రాజశేఖర్తో షేర్ చేసుకున్నాను అన్నారు. ఇంకా మాట్లాడుతూ రచన అంటే నాకు ప్రాణం. లొకేషన్లో ఖాళీ సమయం దొరికినప్పుడు కథలు రాస్తుంటాను. ప్రస్తుతం చిరంజీవిగారి గాడ్ఫాదర్, నానీ దసరా సినిమాల్లో నటిస్తున్నాను'' అన్నారు. -
సముద్రఖని ఇన్ పబ్లిక్ ఫస్ట్ లుక్ చూశారా?
దర్శకుడు, నటుడు సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'సముద్రఖనియిన్ పబ్లిక్'. నటుడు కాళి వెంకట్, నటి రిత్విక తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఆర్.పరమన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కేకేఆర్ సినిమాస్ పతాకంపై కేకే రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని, రాజేష్ యాదవ్, వెట్రిల ద్వయం ఛాయాగ్రహణను అందిస్తున్నారు. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను శనివారం విజయ్సేతుపతి, దర్శకుడు వెంకట్ ప్రభు ఆన్లైన్ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు పేర్కొంటూ ఇంతకుముందు రాజకీయ నేపథ్యంలో చాలా చిత్రాలు వచ్చాయన్నారు. కానీ తమిళ సినీ చరిత్రలోనే తొలిసారిగా రాజకీయ పార్టీల కార్యకర్తల ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రం ఇదని తెలిపారు. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్కు పరిశ్రమ వర్గాల నుంచి మంచి స్పందన రావడం సంతోషంగా ఉందని అన్నారు. -
రాజమౌళి మెచ్చిన టీజర్: మీరూ చూసేయండి
దర్శకధీరుడు రాజమౌళి దగ్గర సహాయకుడిగా పని చేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆకాశవాణి. ఎమ్ఎమ్ కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ను డైరెక్టర్ రాజమౌళి శుక్రవారం రిలీజ్ చేశాడు. పచ్చని ప్రకృతి మధ్యలోకి, స్వచ్ఛమైన గాలిని పీల్చే గిరిజనుల మధ్యలోకి మనల్ని తీసుకువెళ్తున్నట్లుగా ఉందీ టీజర్. చెట్టూపుట్టను నమ్ముకునే అడవి బిడ్డల కథలను, వ్యథలను కళ్లకు కట్టినట్లు చెప్పే ప్రయత్నమే ఈ సినిమా అనిపిస్తోంది. కరెంటు లేక అర్ధరాత్రి కూడా కాగడాలు పట్టుకుని నడవడం వారి పరిస్థితిని వివరిస్తోంది. చూడటానికి ఎంతో బాగున్న ఈ టీజర్లో ఇక్కడేదో తప్పు జరుగుతుంది శీను అన్న డైలాగ్ ఒక్కటే ఉంది. ఇక మర్రిచెట్టు ఊడలను పట్టుకుని ఊయలూగుతున్న బాలుడు, మరో ఊడకు రేడియో తగిలించడం చూస్తుంటే ఈ సినిమా మనల్ని గత స్మృతుల్లోకి లాక్కెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ఈ టీజర్పై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోయాడు రాజమౌళి. "ఆ విజువల్స్ , మ్యూజిక్ ఎంతో కొత్తగా ఉన్నాయి. ఈ సినిమాతో అశ్విన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నా" అని పేర్కొన్నాడు. పద్మనాభరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తున్నాడు. సురేశ్ రగుతు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా పని చేస్తున్నారు. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ షూట్లో హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మహేశ్ మరో సినిమా -
‘క్రాక్’ మూవీ రివ్యూ
టైటిల్ : క్రాక్ జానర్ : యాక్షన్ థ్రిల్లర్ నటీనటులు : రవితేజ, శ్రుతీహాసన్, వరలక్ష్మీ శరత్కుమార్, సముద్రఖని, సుధాకర్ కోమాకుల, వంశీ, రవి శంకర్, సప్తగిరి తదితరులు నిర్మాణ సంస్థ : సరస్వతి ఫిలిం డివిజన్ నిర్మాత : ‘ఠాగూర్’మధు దర్శకత్వం : గోపీచంద్ మలినేని సంగీతం : తమన్ ఎస్ సినిమాటోగ్రఫీ : జీకే విష్ణు ఎడిటర్ : నవీన్ నూలి విడుదల తేది : జనవరి 9, 2021 మాస్ మహరాజా రవితేజ సినిమాలు ఈ మధ్య కాలంలో పెద్దగా ఆడలేదు. 'రాజా ది గ్రేట్' తర్వాత ఆయన ఖాతాలో బిగ్ హిట్ మూవీ పడిందే లేదు. గత ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన 'డిస్కో రాజా' ప్రయోగం కూడా విఫలమైంది. ఈ సారి పక్కా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు రవితేజ. ఇందులో భాగంగానే తనకు గతంలో 'డాన్ శ్రీను', 'బలుపు' లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో జత కట్టి 'క్రాక్' అనే మూవీ చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై పాజిటీవ్ బజ్ను క్రియేట్ చేశాయి. దీంతో ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా నేడు ‘క్రాక్’ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా రవితేజను హిట్ ట్రాక్ ఎక్కించిందా?, గోపిచంద్ మలినేని, రవితేజ కాంబో హ్యాట్రిక్ విజయం సాధించిందా?, నిజ జీవిత కథలను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? అనేది రివ్యూలో చూద్దాం. కథ పోత రాజు వీర శంకర్ (రవితేజ) ఒక క్రేజీ పోలీసు. బ్యాగ్రౌండ్ అని ఎవడైనా విర్రవీగితే చాలు వాళ్ల బరతం పడతాడు. ఇలా వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేరస్థులతో తనదైనశైలీలో సీఐ వీర శంకర్ వైరం పెట్టుకుంటాడు. వారిలో ఒంగోలుకు చెందిన కటారి (సముద్రఖని ) అత్యంత శక్తివంతమైనవాడు. అతను అంటే చుట్టుపక్కల 20 ఊర్లకు భయం. అలాంటి వ్యక్తిపై వీరశంకర్ తిరుగుబాటు చేస్తాడు. తన సహోద్యోగి కొడుకు చావుకు కారణాలు తెలుసుకునే క్రమంలో కటారితో వైరం మరింత పెరుగుతుంది. ఈ క్రమంలో వీరశంకర్ని చంపడానికి కటారి రకరకలా ప్లాన్ వేస్తాడు. మరి కటారి, వీర శంకర్ ల మధ్య అసలు ఏమి జరిగింది ?, చివరకు వీరశంకర్ ఏమి చేశాడు ? అనేది మిగిలిన కథ. నటీనటులు మాస్ అనే పదానికి పర్యాయపదంలా కనిపిస్తాడు రవితేజ. ఆయన సినిమాలో కథ మొత్తం అతని చుట్టే తిరుగుతుంటుంది. ఇక ఈ సినిమాలో కూడా ఆయన వన్ మ్యాన్ షో నడిచింది. మాస్ మహారాజాలోని ఫైర్ను మరోసారి మనం తెరపై చూడొచ్చు. రవితేజ అభిమానులకు అయితే కన్నులపండువలా ఉంటుంది. ఎనర్జీతో పాటు స్టైలిష్గా కూడా కనిపించారు. సీఐ పోత రాజు వీర శంకర్ అనే పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర రవితేజ ఒదిగిపోయాడు. సినిమా మొత్తాన్ని తన భుజస్కందాలపై నడిపించారు. అలాగే జయమ్మ అనే నెగెటివ్ పాత్రలో వరలక్ష్మీ శరత్కుమార్ మెప్పించారు. రవితేజ తరవాత సినిమాలో బాగా పండిన పాత్ర సముద్రఖనిది. ’కఠారి‘ అనే విలన్ పాత్రకు ఆయన జీవం పోశాడు. తన ఫెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. శృతీహాసన్, సుధాకర్,రవి శంకర్, తమ పాత్రల పరిధి మేర నటించారు. విశ్లేషణ రియల్ క్యారెక్టర్స్ను కమర్షియల్ సినిమాలోకి పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి తీసిన సినిమా ‘క్రాక్’. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. మాస్ ఆడియన్స్కి నచ్చే సినిమా తీయాలనేది దర్శకుడి మెయిన్ టార్గెట్ అనేది సినిమా మొదలైన కొద్ది నిమిషాలకే అర్థమవుతంది. మావిడికాయలో మేకు గుచ్చి, ఒక యాభై రూపాయల నోటుపై దానిని పెట్టి... కథ మొదలు పెట్టినపుడు ఇదంతా కాస్త సిల్లీగా అనిపిస్తుంది. కానీ సినిమా కథ మొత్తం అదే అని చెబుతూ.. తెరపై చూపించిన విధానం కాస్త కొత్తగా అనిపిస్తుంది. మొత్తానికి దర్శకుడు ఎదో కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. కథ నేపథ్యాన్ని హీరో వెంకటేశ్తో చెప్పించడం, వేటపాలెం బ్యాచ్ ఒకటి బీచ్లో ఇసుకలోంచి బయటకు వచ్చి... గాడిద రక్తం తాగేసి అరగడం కోసం అటు ఇటు పరుగెత్తడం ప్రేక్షకులను కాస్త కొత్తగా అనిపిస్తుంది. అయితే కొన్ని సీన్లు మాత్రం కాస్త సిల్లీగా అనిపిస్తుంది. ఇస్త్రీ బట్టలు తీసుకెళుతున్న మహిళ చేతిలోంచి జారి పడ్డ బట్టల్లో బురఖా జారి పడడం చూసి హీరో వెళ్లి ఒక టెర్రరిస్టుని పట్టుకోవడం, అలాగే మెయిన్ విలన్ కేసుకు సంబంధించి పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీ వెతుకుతుండగా, అది గోడ మీద నుంచి జారిపడడం అంత కన్వీనియంట్గా అనిపించదు. అలాగే సినిమా కథ కూడా కాస్త రొటీన్గా సాగుతుంది. నెక్ట్ ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఈజీగా గెస్ చెయ్యగలడు. కానీ రోటీన్ కథని దర్శకుడు తెరపై చూపించే విధానం చాలా బాగుంది. ఇక హీరో, హీరోయిన్స్ రొమాంటిక్ ట్రాక్ సైతం పండలేదు. శ్రుతి హాసన్ మంచి సినిమాతోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది, కానీ పాపం, ఆమె మాత్రం పాటలకు మరియు కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితం అయిపొయింది. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం సంగీతం. తమన్ తన పాటలతో పాటు.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్తో మ్యాజిక్ చేశాడు. తనదైన బిబీఎంతో యాక్షన్ సీన్లకు ప్రాణం పోశాడు. ఇక రామ్లక్ష్మణ్ పోరాట ఘట్టాలు సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. ఫైట్స్ చాలా కొత్తగా ఉన్నాయి. సినిమాలో రవితేజ విలన్స్ కి మధ్య జరిగే పోరాటాలు సినిమాకు హైలెట్గా నిలుస్తాయి. యాక్షన్ సీన్లు అన్ని మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. జీకే విష్ణు సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. ఫైనల్గా చెప్పాలంటే సంక్రాంతి సందర్భంగా రవితేజ తన ఫ్యాన్స్కి మాస్ మసాలా బిర్యానీని అందించాడు. ప్లస్ పాయింట్స్ : రవితేజ నటన, వరలక్ష్మీ శరత్కుమార్, సముద్రఖని పాత్రలు తమన్ మ్యూజిక్ విలన్లకు, హీరోకి మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలు మైనస్ పాయింట్స్ రొటీన్ కథ ఫస్టాఫ్ ఫ్యామిలీ సీన్స్ అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
సక్సెస్ఫుల్ టీమ్ రిపీట్
తమిళసినిమా: సక్సెస్ఫుల్ టీమ్ రిపీట్ అయితే కచ్చితంగా ఆ చిత్రంపై అంచనాలు ఏర్పడతాయి. దర్శకుడు సముద్రఖని మొదట్లో సక్సెస్ కోసం చాలా పోరాడారు. అలా పోరాడి నాడోడిగళ్ చిత్రంతో కమర్శియల్ విజయాన్ని తొలిసారిగా అందుకున్నారు. అందులో హీరోగా నటించిన శశికుమార్కు ఆ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. అంతే కాదు అందులో నటించిన నటి అనన్య, అభినయ, విజయ్వసంత్, భర ణి, గంజాకరుప్పు వంటి నటీనటులకు మంచి లైఫ్ను ఇచ్చిందనే చెప్పాలి. నాడోడిగళ్ చిత్రం తెలుగు, కన్నడం, హిందీ వంటి భాషల్లోనూ రీమేక్ అయ్యింది. ఆ చిత్రం 2009లో విడుదలైంది. అంటే దశాబ్దం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం శశికుమార్, సముద్రఖనిల కాంబినేషన్లో నాడోడిగళ్–2 చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నటి అంజలి నాయకిగా నటిస్తోంది. మరో నాయకిగా అతుల్యరవి నటిస్తోంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ చిత్ర దర్శకుడు సముద్రఖని శుక్రవారం పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాడోడిగళ్–2 చిత్ర టీమ్ శశికుమార్, అంజలి, అతుల్యరవి, భరణిలతో మరో చిత్రం చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం అవుతుందని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని సముద్రఖని చెప్పారు. -
సెట్లో రాజమౌళితో సముద్రఖని
కోలీవుడ్ విలక్షణ నటుడు సముద్రఖని తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. రఘువరన్ బీటెక్ సినిమాతో హీరోగా తండ్రిగా నటించిన సముద్రఖని, రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్లోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా రాజమౌళితో కలిసి సముద్రఖని దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ ఫొటో ఆర్ఆర్ఆర్ సెట్లో తీసింది కాదు. రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఆకాశవాణి సినిమాలోనూ సముద్రఖని నటిస్తున్నాడు. రామ్చరణ్ గాయం కారణంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్కు బ్రేక్ పడటంతో రాజమౌళి.. ఆకాశవాణి షూటింగ్ స్పాట్కు వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సముద్రఖని, జక్కన్నతో ఫొటో దిగి తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేశారు. సముద్రఖని లుక్ని బట్టి చూస్తే ఆకాశవాణి కూడా పీరియాడిక్ జానర్లోనే తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. WITH MY BROTHER..... DIRECTOR S S RAJAMOWLI.... #aakashavaani VELVOM..... pic.twitter.com/3XsjbBYen4 — P.samuthirakani (@thondankani) 4 April 2019 -
‘ఆర్ఆర్ఆర్’పై మరో ఇంట్రస్టింగ్ అప్డేట్
మెగా పవర్ స్టార్ రామ్చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో దర్శకధీరుడు రాజమౌళి ఓ భారీ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం మెగా, నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రాజమౌళి టీం మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వుకుండా ఊరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో కోలీవుడ్ విలక్షణ నటడు సముద్రఖని కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ విషయాన్ని సముద్రఖని స్వయంగా వెల్లడించారు. ‘నడోడిగల్ సినిమా సమయంలో రాజమౌళి ఓ సుధీర్ఘ మేసేజ్ చేసి నన్ను అభినందించారు. ఇటీవల ఆయన నన్ను స్వయంగా ఇంటికి ఆహ్వానించి ఆర్ఆర్ఆర్లో పాత్ర గురించి చెప్పారు. నేను వెంటనే అంగీకరించాన’ని తెలిపారు. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని -
అలాంటి వ్యక్తితో నేను చేయలేను!
పురుషాధిక్యం గల నిర్మాతతో కలిసి పని చేయలేనని నటి వరలక్ష్మీశరత్కుమార్ అన్నారు.ఈ సంచలన నటి ఎవరి గురించి మాట్లాడుతున్నారన్నదేగా మీ ఆసక్తి. ఆ మధ్య నటుడు విశాల్తో ప్రేమాయణం, ఆ తరువాత అది మనస్పర్థల కారణంగా ముగిసిందనే ప్రచారం మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఇక నటిగా తారాతప్పట్టై చిత్రంలో గరగాట కళాకారిణిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్న వరలక్ష్మీశరత్కుమార్కు ఈ తరువాత వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. ప్రస్తుతం అమ్మాయి వంటి హారర్ కథా చిత్రంతో పాటు కొన్ని చిత్రాల్లో నటిస్తున్న వరలక్ష్మీశరత్కుమార్కు మాలీవుడ్లో రంగప్రవేశం చేసే అవకాశం వచ్చింది. తమిళంలో సముద్రకని స్వీయదర్శకత్వంలో నిర్మించి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అప్పా. ఈ చిత్రం మలయాళంలో రీమేక్ అవుతోంది. సముద్రకనినే దర్శకత్వం వహిస్తున్న ఇందులో జయరామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయనకు జంటగా ఇద్దరు పిల్లల తల్లిగా నటి వరలక్ష్మీశరత్కుమార్ నటించడానికి అంగీకరించారు.ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కొన్ని సన్నివేశాల్లో నటించిన వరలక్ష్మీశరత్కుమార్ సముద్రకని దర్శకత్వంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అలాంటిది అనూహ్యంగా ఆ చిత్రం నుంచి వైదొలిగారు. కారణం ఏమిటన్న ప్రశ్నకు పురుషాధిక్యం, మానవ విలువలు లేని నిర్మాత చిత్రం లో నటించడం తన వల్ల కాదని పేర్కొన్నారు. తన నిర్ణయాన్ని సమర్థించిన దర్శకుడు సముద్రకని, నటుడు జయరామ్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని అన్నారు. ఇంతకీ ఆ చిత్ర నిర్మాతకు నటి వరలక్ష్మీశరత్కుమార్కు మధ్య ఏంజరిగిందన్నది మాత్రం చిత్ర వర్గాల్లో ఆసక్తిగా మారింది. -
ఆణ్ దేవతై అంటున్న సముద్రకని
సాధారణంగా దేవతలు, దేవుళ్లు అంటారు. అలాంటిది నటుడిగా రాణిస్తున్న దర్శకుడు సముద్రకని ఆణ్ దేవతై(మగదేవత) అనే టైటిల్తో చిత్రం చేస్తున్నారు. అప్పా చిత్రంతో దర్శకుడిగా, కథానాయకుడిగా అనూహ్య విజయాన్ని సాధించిన సముద్రకని తాజాగా నటిస్తున్న చిత్రం ఆణ్ దేవతై. దీనికి దివంగత ప్రఖ్యాత దర్శకుడు కే.బాలచందర్ శిష్యుడు తామరై కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తూ తన గురు భక్తికి చిహ్నంగా శిఖరం సినిమాస్ బ్యానర్ను నెలకొల్పి మరో నిర్మాత ప్రకృద్ధీన్తో కలిసి నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తుండడం విశేషం. ఈ దర్శకుడు ఇంతకు ముందు తన గురువు కే.బాలచందర్, మరో ప్రఖ్యాత దర్శకుడు భారతీరాజా నటించిన రెట్టైచుళి అనే చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం.ఈయన తాజా చిత్రం ఆణ్ దేవతై చిత్రాన్ని శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రం గురించి వివరిస్తూ ఇవాళ ప్రపంచీకరణ, నగరీకరణ మనిషి జీవితాన్ని శాసిస్తున్నాయన్నారు. కట్టుకునే బట్టల నుంచి మొబైల్ఫోన్ వరకూ అన్నీ డ్లోబల్ వరల్డ్కనుగుణంగానే జరుగుతున్నాయన్నారు. ఇక తండ్రి పోషణలో పెరిగే పిల్లలకు, తల్లి పెంపకంలో పెరిగే పిల్లలకు మధ్య వ్యత్యాసం ఏమిటీ, అదే విధంగా రుణాలకు అలవాటు పడ్డ మనిషి జీవితం ఎలాంటి స్థితికి దిగజారిపోతుందీలాంటి పలు అంశాల గురించి చర్చించే చిత్రంగా ఆణ్ దేవతై ఉంటుందన్నారు. ఇందులో సముద్రకని, రమ్యాపాండియన్, కవిన్, కస్తూరి, ఇళవరసు, శ్రీనిక, ప్రగదీశ్, అరుణ్మొళి, దిలీపన్ ముఖ్య పాత్రలు పోషింస్తున్నారని తెలిపారు. -
గురువు చివరి స్క్రిప్ట్ శిష్యుడి చేతికి
గురువు స్క్రిప్ట్కు శిష్యుడు దర్శకత్వం వహించాలంటే అదృష్టం కావాలి. అదీ కే.బాలచందర్ వంటి ప్రఖ్యాత దర్శకుడు దర్శకత్వం వహించాలని సిద్ధం చేసుకున్న కథను శిష్యుడు తెరకెక్కించే అవకాశం రావడం నిజంగా ఆయనకు కలిగిన భాగ్యమే అవుతుంది. దర్శకుడు,నటుడు జాతీయ అవార్డు గ్రహీత సముద్రకణికి అలాంటి అరుదైన అవకాశమే తలుపుతట్టింది. ఆయన కే.బాలచందర్ శిష్యుడన్న విషయం తెలిసిందే. ఆ గురువు చివరి స్క్రిప్ట్ను చిత్రంగా మలిచే అదృష్టం ఈ శిష్యుడికి దక్కింది. ఎన్నో అద్భుతాలను తెరపై ఆవిష్కరించిన దర్శక శిఖరం కే.బాలచందర్ కడవుళ్ కాన్బోమ్ అనే కథను తయారు చేసుకున్నారు. దాన్ని చిత్రంగా మలచాలన్నది డ్రీమ్గా భావించారు. ఆ కథను తన శిష్యుడు సమద్రకణికి వినిపించి అందులో ఆయన్ని ఒక పాత్ర పోషించమని అన్నారు. స్వీయ దర్శకత్వంలో కడవుళ్ కాన్బోమ్ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుండగా బాలచందర్ కొడుకు కైలాసం కన్ను మూశారు. ఆ తరువాత కొద్ది కాలానికే ఆయన స్వర్గస్తులయ్యారు. ఇప్పుడాయన కల అయిన కడవుళ్ కాన్బోమ్ చిత్రాన్ని శిష్యుడు సముద్రకణి తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. తన గురువు 2014లో ఆ కథను తనకు చెప్పారన్నారు. అందులో ఒక ముఖ్య పాత్రను ఆయనే పోషించాలని తలచారన్నారు. తనను ఆ చిత్రానికి సహదర్శకుడిగా పని చేయమనడంతోపాటు ఒక పాత్రను చేయమని అన్నారనీ సముద్రకణి చెప్పారు.అప్పట్లో అది జరగలేదని,తన గురువు స్క్రిప్ట్ను తాను తెరకెక్కిస్తానని తెలిపారు.ప్రస్తుతం తాను అప్పా అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ ప్రధాన పాత్రను పోషిస్తున్నానని,ఈ చిత్రం తరువాత కడవుళ్ కాన్బోమ్ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నాలు చేస్తానని పేర్కొన్నారు. -
‘జెండాపై కపిరాజు’ స్టిల్స్
-
‘జెండాపై కపిరాజు’ స్టిల్స్
నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ‘జెండాపై కపిరాజు’ షూటింగ్ కార్యక్రామాలు పూర్తి చేసుకొని ,పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. నాని సరసన అమాలపాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని వాసన్ విజువల్ వెంచర్స్ పతాకంపై సముద్రఖని దర్శకత్వంలో...కె.యస్.శ్రీనివాసన్- కె.యస్.శివరామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ తమిళ హీరో శరత్కుమార్ ఈ చిత్రంలో సి.బి.ఐ ఆఫీసర్గా ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.


