-
మరో అమ్మకుట్టి
‘ఇదంజగత్’ సినిమాతో తెలుగు తెరకు అంజు కురియన్ రూపంలో మరో మలయాళీ భామ పరిచయమయింది. ఈ సినిమాలో ‘దూరాలే కొంచెం కొంచెం దూరాలే అవుతున్నట్లు.... దారాలేవో అల్లే్లస్తున్న స్నేహాలేవో’ అని పాట ఉంది. ఈ పాటలాగే సరిహద్దుల దూరాలను దూరం చేస్తూ మన చిత్రసీమకు వచ్చి స్నేహహస్తం చాటుతున్న అంజు కురియన్ గురించి... అప్పుడు అలా ఇప్పుడు ఇలా! తన గురించి తాను ఇలా రాసుకుంది అంజు.ఏజ్ 10: టీచర్ కావాలనుకున్నాను. ఏజ్ 15: డాక్టర్ కావాలనుకున్నాను. ఏజ్ 20: ఆర్కిటెక్ట్ కావాలనుకున్నాను. ఏజ్ 25: మళ్లీ కిడ్ కావాలనుకుంటున్నాను. కిడ్ అయితే కాలేదుగానీ హీరోయిన్ మాత్రం అయ్యింది. ‘అందం అనేది మనసులో నుంచి పుడుతుంది. కాస్మొటిక్స్ నుంచి కాదు’ అని నమ్మే అంజు సహజసౌందర్యానికే తన ఓటు అంటుంది. ప్రేమమ్తో... కేరళలోని కొట్టాయంలో పుట్టిన అంజు కురియన్ చెన్నైలో చదువుకుంది. కాలేజీ రోజుల్లో మోడలింగ్ చేసేది. ఈ సమయంలోనే డైరెక్టర్ ఆల్ఫాన్స్ మలయాళ చిత్రం ‘నేరం’తో ఆమెను వెండితెరకు పరిచయం చేశారు. ఈ బ్లాక్కామెడీ థ్రిల్లర్లో సహాయ పాత్రే అయినప్పటికీ తగిన గుర్తింపు తెచ్చింది. ఇక ప్రేమమ్ (మలయాళం)లో కూడా చేసింది సహాయ పాత్రే అయినా భా.....రీ గుర్తింపు తెచ్చిపెట్టింది. చెన్నై టు సింగపూర్ ‘చెన్నై టు సింగపూర్’ అంజు తొలి తమిళ చిత్రం. ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్లో లీడ్ రోల్ చేసింది. ఈ సినిమాపై విమర్శల మాట ఎలా ఉన్నా అంజు కురియన్ గ్లామర్, నటనకు మంచి మార్కులే పడ్డాయి. ‘ఇదంజగత్’ అంజు తొలి తెలుగు చిత్రం. దీనికి ముందు కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ భాష సమస్య వల్ల నటించలేదు. ‘ఇదంజగత్’ కథ విన్న తరువాత మాత్రం తప్పనిసరిగా చేయాల్సిందేనని అనుకుందట. తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టడానికి ఇదొక మంచి అవకాశం అనుకుంది. భాష విషయంలో సుమంత్ సహకరించాడట. అంజు కోసం ఆయన తెలుగు టీచర్ అయ్యాడన్నమాట! కొత్త ప్రపంచంలోకి... రొటీన్ పాత్రలు కాకుండా భిన్నమైన అనుభూతిని ఇచ్చే పాత్రలు చేయడం తనకు ఇష్టం అని చెబుతుంది అంజు. ఇతర భాషా చిత్రాల్లో నటించడం ద్వారా తన కెరీర్ పరిధిని పెంచుకునే ప్రయత్నంలో ఉన్న అంజు ఇప్పుడు తెలుగు నేర్చుకోవడంపై దృష్టి పెట్టింది. ‘కొత్త భాష నేర్చుకోవడం ద్వారా భాష రావడం మాత్రమే కాదు.... కొత్త సాంస్కృతిక ప్రపంచంలోకి అడుగుపెడతాం’ అని చెబుతుంది అంజు కురియన్. ‘కంఫర్ట్జోన్ నుంచి కదలడం కష్టమే’ అనుకున్న దశ నుంచి ‘నువ్వు దృష్టి పెట్టాల్సింది లక్ష్యం మీదే...నీ భయాల మీద కాదు’ అని నమ్మే దశకు వచ్చింది. ఇక విజయాలకు అడ్డేమున్నది! -
ప్రేమమ్ నాగవల్లి
‘రావణాసురుడి వాళ్లావిడ కూడా వాళ్లాయన్ని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది’. ‘అ..ఆ..’ సినిమా ట్రైలర్లో వినిపించే ఈ డైలాగ్తో తెలుగు సినిమా అభిమానుల మనస్సుల్లోకి దూసుకొచ్చిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. నిజానికి అంతకన్నా ముందే ఒక మలయాళ సినిమాతో తెలుగు కుర్రకారుకు ఈ భామ పరిచయమైంది. ఆ సినిమాయే ‘ప్రేమమ్’. ఇదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే, అదే పాత్రలో మళ్లీ కనిపించి మెప్పించింది అనుపమ. పరిచయమైతే మలయాళ పరిశ్రమలోనే అయినా, ఇప్పుడు ఈ హీరోయిన్ స్టార్గా దూసుకెళ్తోంది మాత్రం తెలుగులోనే! ఈ లేటెస్ట్ స్టార్ సెన్సేషన్ గురించి కొన్ని విశేషాలు... తెలుగులోనే స్టార్గా... అనుపమ మలయాళ సినిమాతోనే హీరోయిన్ అయినా ప్రస్తుతానికి ఆమె కెరీర్ తెలుగులోనే సూపర్ సక్సెస్తో దూసుకుపోతోంది. ‘అ..ఆ..’ విడుదలైన వెంటనే అనుపమకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ‘శతమానం భవతి’, ‘ప్రేమమ్’ సినిమాలతో వరుసగా సూపర్హిట్స్ వచ్చాయి. దీంతో మిడిల్ బడ్జెట్ సినిమాలకు ఇప్పుడు స్టార్ అనుపమనే! ప్రస్తుతం ఆమె హీరోయిన్గా నటిస్తోన్న ‘హలో గురూ ప్రేమకోసమేరా!’ దసరా కానుకగా విడుదల కానుంది. కాలేజీకి నో చెప్పి సినిమాల్లోకి! అనుపమ పరమేశ్వరన్ పుట్టి, పెరిగిందంతా కేరళలోనే! మలయాళ భామ. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే పిచ్చి. ఎలాగైనా హీరోయిన్ కావాలని చిన్నప్పట్నుంచీ కలలు కనేది. ఆ పిచ్చే ఆమెకు ‘ప్రేమమ్’ సినిమాలో అవకాశం తెచ్చిపెట్టింది. కొత్తవాళ్ల కోసం దర్శకుడు ఆల్ఫన్స్ పుత్రన్ వెతుకుతూ ఉంటే అనుపమ ఫొటోషూట్ ఆయన కంట్లో పడింది. వెంటనే ‘ప్రేమమ్’లోని మూడు ప్రేమకథల్లో ఒక కథకు హీరోయిన్గా ఎంపికచేశాడు. అప్పటికి అనుపమ వయసు 18 ఏళ్లు. తన డ్రీమ్ కావడంతో కాలేజీకి కూడా నో చెప్పేసింది. డబ్బింగ్ చెప్పిందంటే... ‘అ..ఆ..’ సినిమా అవకాశం వచ్చినప్పుడు అనుపమకు తెలుగు రాదు. కానీ ఆ సినిమాలో తన పాత్రకు ఆమే డబ్బింగ్ చెప్పుకుంది. అనుపమ స్పెషాలిటీస్లో ఆ వాయిస్ కూడా ఒకటి. అందుకే అప్పట్నుంచీ అన్ని సినిమాలకూ తనే డబ్బింగ్ చెప్పుకుంటూ వస్తోంది. అనుపమ వాయిస్ను తెలుగు ప్రేక్షకులు, తెలుగులో విన్నది ‘అ..ఆ..’ ట్రైలర్లోని ఈ డైలాగ్తోనే – ‘రావణాసురుడి వాళ్లావిడ కూడా వాళ్లాయన్ని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది’. లైఫ్లో అదే పెద్ద మిరాకిల్! చిన్న వయసులోనే కెరీర్లో పెద్ద సక్సెస్ చూసిన అనుపమ, సినిమాల్లోకి రావడమే తన జీవితంలో జరిగిన పెద్ద మిరాకిల్ అని చెప్తుంది. ఇప్పటికీ ఇదంతా కలలా ఉంటుందని, ఒక్కోసారి ఎలాంటి సినిమాలు ఎంపికచేసుకోవాలో తెలియనప్పుడు దర్శకులు త్రివిక్రమ్, ఆల్ఫన్స్ పుత్రన్లను అడుగుతానని అంటుంది. ఈ దర్శకులే అనుపమను తెలుగు, మలయాళ సినీ పరిశ్రమలకు పరిచయం చేశారు. బ్లాక్బస్టర్ డెబ్యూట్ ‘ప్రేమమ్’ విడుదలవ్వడమే పెద్ద బ్లాక్బస్టర్. మలయాళ సినిమా రికార్డులన్నీ బ్రేక్ చేసిందీ సినిమా. తెలుగు ప్రేక్షకులు సైతం ఆన్లైన్లో వెతుక్కొని మరీ చూసేలా చేసింది. అలా తెలుగులోకి రాకముందే ‘ప్రేమమ్’లో మేరీ పాత్రలో కనిపించిన అనుపమ ఇక్కడ కూడా ఫేమస్. ఆ క్రేజే ఆమెను వెంటనే తెలుగుకు తీసుకొచ్చింది. తెలుగులో ‘అ..ఆ..’లో నాగవల్లి రోల్తో డెబ్యూట్ ఇచ్చింది అనుపమ. ఆ సినిమా కూడా బ్లాక్బస్టర్ అయింది. తమిళంలో ‘కోడి’ అనే సినిమాతో డెబ్యూట్ ఇచ్చింది. ఆ సినిమా కూడా బ్లాక్బస్టర్. -
విజయ్సేతుపతితో మూడోసారి..
తమిళ సినిమా : విజయ్సేతుపతితో మూడోసారి జత కడుతోంది నటి మడోనా సెబాస్టియన్. కథానాయకుడిగా బిజీగా ఉన్న యువనటుల్లో విజయ్సేతుపతి ఒకరు. ఈయన మళ్లీ మళ్లీ సిఫార్సు చేసే హీరోయిన్లు చాలా తక్కువ మందే. వారిలో నటి గాయత్రి ఒకరైతే, రమ్యానంబీశన్ మరొకరు. తాజాగా ఈ పట్టికలో చేరిన నటి మడోనా సెబాస్టియన్. ప్రేమమ్ చిత్రంలో వెలుగు చూసిన హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. కోలీవుడ్కు విజయ్సేతుపతికి జంటగానే కాదలుమ్ కడందు పోగుమ్ చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సైలెంట్గా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత కేవీ.ఆనంద్ దర్శకత్వం వహించిన కవన్ చిత్రంలో విజయ్సేతుపతితో రెండోసారి జత కట్టింది. ఆ చిత్రం సక్సెస్ అయ్యింది. అయినా ఎందుకనో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోయింది. ఆ మధ్య ధనుష్కు జంటగా పవర్పాండిలో రొమాన్స్ చేసింది.ఆ చిత్రం హిట్టే. ఇలా సక్సెస్ గ్రాస్ బాగానే ఉన్నా మడోనా సెబాస్టియన్ క్రేజ్ను పెంచుకోలేకపోయ్యిందనే చెప్పాలి. చాలా గ్యాప్ తరువాత మళ్లీ విజయ్సేతుపతినే ఈ అమ్మడికి అవకాశం కల్పించారు. ఆయన కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న భారీ చిత్రం జుంగాలో మడోనా సెబాస్టియన్ను సిఫార్సు చేశారు. ఇందులో నటి అయేషా సైగల్ ఒక హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. మరో హీరోయిన్గా మడోనా సెబాస్టియన్ నటిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగు చూడడం విశేషం. కాగా జుంగా చిత్రం ఈ బ్యూటీ కెరీర్కు కీలకంగా మారనుంది. ఈ చిత్రంపై ఈ అమ్మడు చాలా ఆశలు పెట్టుకుంది. ఆమెకు ఈ చిత్రం మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి. గోకుల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాతల మండలి సమ్మె కాలంలో కూడా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఇదే ఇప్పుడు వివాదానికి తెరలేపుతోంది. మరి ఈ వివాదం నుంచి సినిమా ఎలా బయట పడుతుందో వేచి చూడాలి. -
‘వైద్య వృత్తిని వదులుకున్నా’
తమిళసినిమా: సినిమా కోసం కష్టపడి చదివిన వైద్య వృత్తిని వదులుకున్నానని అంటోంది సాయిపల్లవి. నటిగా మలయాళంలో సక్సెస్ అయ్యి ఆ తరువాత తెలుగు చిత్రసీమలో విజయాలను అందుకుని ఆ తరువాతే తమిళ చిత్ర రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ అమ్మాయి ఈ భామ. అయితే మాలీవుడ్లో నటించిన ప్రేమమ్ చిత్రమే ఈ అమ్మడి తొలి చిత్రం అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే అది నిజం కాదన్న విషయాన్ని సాయిపల్లవి తనకు తానే బయటపెట్టింది. ఆ కథేంటో చూద్దాం. ఇంతకుముందు తమిళంలో ధామ్ ధూమ్ చిత్రంలో కంగణాకు స్నేహితురాలిగా, కస్తూరిమాన్ అనే మలయాళ చిత్రంలో మీరా జాస్మిన్కు స్నేహితురాలిగా నటించాను. అయితే సినిమా శాశ్వతం కాదని, హీరోయిన్ల కాలపరిమితి ఐదారేళ్లే అని తన తండ్రి చెప్పారన్నారు. చదువే మంచి భవిష్యత్తునిస్తుందని తను ఎంబీబీఎస్ చదివించేందుకు జార్జియా పంపారన్నారు. జార్జియాలో చదువుతుండగానే ప్రేమమ్ చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. దీంతో చదువుకు ఇబ్బంది కలగకుండా సెలవు రోజుల్లో నటించమని అమ్మానాన్న చెప్పారు. అలా నటించిన ప్రేమమ్ చిత్రం ఘన విజయం సాధించడంతో సినిమాలపైనే పూర్తిగా దృష్టి సారించాను. దీంతో వృత్తిని వదులుకోవలసివచ్చింది. అందుకే పూర్తిస్థాయి నటిగా మారిపోయాను. అయితే దేవుడి దయవల్ల ఈ స్థాయికి చేరుకున్నాను అని సాయిపల్లవి అంది. ఈ అమ్మడు తొలి తమిళ చిత్రం కరు త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. -
మళ్లీ స్టూడెంట్గా
సాధారణంగా స్టూడెంట్ స్థాయి నుంచి టీచర్గా ఎదుగుతారు. కానీ కథానాయిక సాయిపల్లవి మాత్రం మలయాళ సినిమా ‘ప్రేమమ్’లో టీచర్గా ఎంట్రీ ఇచ్చి కాలేజీ స్టూడెంట్గా అలరిస్తున్నారు. ఆల్రెడీ ‘ఫిదా, ఎమ్సీఏ’ సినిమాల్లో ఆమె కాలేజ్ స్టూడెంట్గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఆమె కాలేజీకి వెళ్లడానికి రెడీ అయ్యారని సమాచారం. శర్వానంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘‘పడి పడి లేచె మనసు’’లో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోన్న విషయం తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ కోల్కత్తాలో స్టారై్టంది. ఇందులో సాయి పల్లవి మెడికల్ స్టూడెంట్గా నటిస్తున్నారని సమాచారం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. సాయిపల్లవి రియల్ లైఫ్లోనూ మెడిసిన్ స్టడీస్ను కంప్లీట్ చేశారు. అసలే ఈ మలయాళ బ్యూటీ మంచి నటి. రియల్ లైఫ్లో ఎలానూ మెడిసిన్ చేశారు కాబట్టి.. ఆ అనుభవంతో ఈ పాత్రను అలవోకగా చేసేస్తారని చెప్పొచ్చు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకోవాలి
బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతోంది
నేడు వరంగల్కు ప్రధాని రాక
పోలింగ్ కేంద్రాల సామగ్రిని పరిశీలించిన కమిషనర్
వర్ష బీభత్సం
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి
తప్పక చదవండి
Advertisement