
ఎవరే.. ఎవరే..!
నాలుగు కోట్లతో తీసిన సినిమా 50 కోట్ల రూపాయలు వసూలు చేస్తే అది సూపర్ డూపర్ హిట్ కింద లెక్క. మలయాళ ‘ప్రేమమ్’
నాలుగు కోట్లతో తీసిన సినిమా 50 కోట్ల రూపాయలు వసూలు చేస్తే అది సూపర్ డూపర్ హిట్ కింద లెక్క. మలయాళ ‘ప్రేమమ్’ ఈ కోవకే వస్తుంది. తమిళనాడులో రెండొందల రోజులకు పైగా ఆడిన మొదటి మలయాళ చిత్రంగా రికార్డ్ సాధించింది. ఇక, మలయాళంలో అయితే ఇప్పటివరకూ ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రాల్లో రెండోస్థానం సంపాదించింది.
ఈ చిత్రం నాగచైతన్య, శ్రుతీహాసన్, మడొన్నా సెబాస్టియన్, అనుపమా పరమేశ్వరన్ ముఖ్య తారలుగా ‘ప్రేమమ్’ పేరుతో తెలుగులో రీమేక్ అయింది. చందూ మొండేటి దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రంలోని తొలి పాట ‘ఎవరే..’ను గురువారం హైదరాబాద్లో విడుదల చేశారు. శ్రీమణి రాసిన ఈ పాటను విజయ్ ఏసుదాస్ ఆలపించారు.
ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ- ‘‘ఇందులో నా పాత్ర మూడు దశలుగా సాగుతుంది. నా మనసుకు బాగా దగ్గరైన పాత్ర ఇది. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఉంటాయి’’ అని తెలిపారు. ‘‘ఈ నెల 24న పాటలను విడుదల చేయబోతున్నాం. సెప్టెంబర్లో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, రాజేష్ మురుగేషన్, కెమేరా: కార్తీక్ ఘట్టమనేని