-
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ మళ్లీ అధికారంలోకి రాగానే ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలులో ఉన్న ముస్లిం రిజర్వేషన్లను తప్పకుండా రద్దు చేస్తామని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటరీబోర్డు సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. ముస్లిం రిజర్వేషన్లు తప్ప.. మరే రిజర్వేషన్లు రద్దు చేయబోమని, అలాగే రాజ్యాంగాన్ని కూడా మార్చేది లేదని ఆయన వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు మినహా.. కుల, మతం పేరిట రిజర్వేషన్లు ఇవ్వడానికి తాము వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. కులాల ప్రతిపాదికన రిజర్వేషన్లు ఇవ్వొద్దన్నదే రాజీవ్గాంధీ అని గుర్తు చేశారు. రంగనాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయని కాంగ్రెస్.. మండల్ కమిషన్ను కూడా రాజీవ్గాంధీ వ్యతిరేకించారన్న విషయాన్ని రాహుల్గాం«దీ, రేవంత్రెడ్డి తెలుసుకోవాలని డాక్టర్ లక్ష్మణ్ సూచించారు. ముస్లిం సంతుష్టీకరణ పేరిట హిందూ సమాజంపై విషం చిమ్ముతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్లో లక్ష్మణ్ పార్టీ నాయకులు ప్రకాశ్రెడ్డి, సుభాష్ రవి కిషోర్తో కలిసి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ముస్లింలను సంతృప్తిపర్చేందుకు కాంగ్రెస్ విచ్చిన్నకర రాజకీయాలు చేస్తోందని, బీసీల రిజర్వేషన్లును తగ్గించి ముస్లింలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.బీజేపీ దేవుళ్లను అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తోందంటున్న సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు ఎక్కడకు వెళ్తే అక్కడ దేవుళ్లపై ఒట్లు పెడుతూ.. అదే దేవుళ్లను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారని ఆయన ప్రశ్నించారు. కులగణనకు మేం వ్యతిరేకం కాదు కానీ.. కుల గణనకు తాము వ్యతిరేకం కాదని, అయితే అది శాస్త్రీయంగా, పరిశోధనాత్మకంగా జరగాల్సిన అవసరం ఉందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తే.. ఈ కూటమి తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ తెస్తామంటున్నారని, సీఏఏపై కూడా దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా సీఏఏను అమలు చేస్తామని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో తాము వికసిత్ భారత్ అంటుంటే.. కాంగ్రెస్ విభజించు భారత్ అంటూ విచ్చిన్నకర రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. అక్షింతలు, కాషాయంతో తిండి లభిస్తుందా అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై లక్ష్మణ్ స్పందిస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చర్మాన్ని ప్రజలు వొలిచిన విషయం గుర్తుంచుకోవాలని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. -
ఆయన లక్షణాలే నా అక్షరాలకు స్ఫూర్తి
ఓ నాయకుడి గురించి రాసేటప్పుడు కలం కదలాలంటే ఆ నాయకుడి వ్యక్తిత్వంలో బలం ఉండాలి. అక్షరాలు పరుగులు తీయాలంటే లక్షణాలు ప్రేరణ కావాలి అంటున్నారు జానపద గేయ రచయిత లక్ష్మణ్.‘నీ బుల్లెట్టు బండెక్కి..’ పాట ద్వారా తెలుగు రాష్ట్రాల్ని ఊపేసిన ఈ యువ రచయిత వైఎస్ జగన్ మోహన్రెడ్డి గుణగణాల్ని వర్మిస్తూ రాసిన ‘జెండాలు జత గట్టడమేమీ అజెండా.. జనం గుండెలో గుడికట్టడమే జగన్ అజెండా’ అనే పాట తెలుగు నాట ఉర్రూతలూగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన సాక్షితో తన అనుభూతిని పంచుకున్నారిలా... – సత్యార్థ్ పేదల ముంగిట్లో పథకాలు పాట రాయడానికి ముందు వలంటీర్లతో స్వయంగా మాట్లాడి ఆయన అమలు చేసిన పథకాల గురించి తెలుసుకున్నా. కడుపు నిండినోడ్ని కాదు ఆకలితో కడుపు మండేవాడ్ని మాత్రమే పట్టించుకోవాలనీ, చాచిన ప్రతీ చేయికీ సాయం అందాలి అనే ఆలోచనలతోనే ఆయన ఆ పథకాలన్నీ తీర్చిదిద్దారని అర్థమైంది. ఆ అవగాహనే ‘‘మా ఇంటికే తెచ్చిండు ప్రభు త్వం మా చేతికే ఇచ్చిండు రా పథకం’’ అంటూ కీర్తించేలా చేసింది. ప్రభుత్వ పథకాలు ఇంటికి రావడం దేశంలోనే జగన్ సార్ వల్ల వచ్చిన గొప్ప మార్పు. నిరుపేదలు ఆస్పత్రి ఖర్చులతో అన్యాయం అయిపోవద్దు. రోగంతో కోలుకున్నాక కూడా వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్లకు పూర్తిగా నయమైంది అని కచ్చితంగా తెలుసుకోవాలి... అని ఆయన మాట విన్నప్పుడు నిజంగా నాకు కళ్లలో నీళ్లొచ్చాయి. కార్యకర్తలు కాలర్ ఎగరేసేలా.. జగన్ పుట్టుకలో వెనుకడుగేయని తత్వం ఉంది. ఆయన్ను నమ్ముకున్న కార్యకర్త ఆత్మగౌరవంతో ఉండాలి. ధైర్యంగా కొట్లాడాలి. ఏదోవిధంగా గెలవాలని, తాను పొత్తులకు దిగజారిపోకూడదు అని ఆయన అనుకుంటారు. తన కోసం వారు మనస్సాక్షిని చంపుకుని బతకొద్దు అనేది ఆయన ఆలోచన అని నాకు అర్థమైంది. పైన ఉన్న దేవుడ్ని కింద ఉన్న జనాన్నే నేను నమ్ముకున్నా అంటూ తరచుగా ఆయన చెప్పడం నాకెంత స్ఫూర్తినిచ్చిందో... పరిచయమైన కొద్దీ... పదునెక్కిన పదం జగన్ మీద అప్పటికే ఎన్నో గొప్ప పాటలు వచ్చాయి. ఆయన కోసం పాట రాయాలంటే మామూలు విషయం కాదు.అందుకే ఈ పాట రాసే అవకాశం నాకు వచ్చినప్పుడు... కొంచెం సందేహించిన మాట నిజం.పైగా నాది తెలంగాణ కావడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి అంతగా తెలియదు. దాంతో పాటకు ముందు ఆయన ఇంటర్వ్యూ లు వరుసపెట్టి చూశా.. రకరకాల మార్గాల ద్వారా తెలుసుకుంటుంటే....అర్ధమవుతూ వచ్చింది జగన్ ఏంటో... నిఖార్సైన గ్రేట్ లీడర్... ఆయన పాట రాసి అది అందరి మెప్పూ పొందడం వల్ల ఎంత ఆనందం పొందుతున్నానో...ఆయన పాలన విశేషాలు, ప్రజాసేవ గురించి తెలుసుకోవడం వల్ల అంతకు మించిన ఆనందం పొందుతున్నాను. ఇలాంటి పేదల పక్షపాతి లాంటి నాయకుడ్ని నేనింత వరకూ చూడలేదు. ఇంత చేసినా.. రకరకాలుగా ఆయనకు చెడు చేయాలనే ఆలోచనలు కొంతమంది చేస్తున్నారని బాధ అనిపిస్తుంది. సారిచ్చిన పథకాలు పేదింటికి ఏ స్థాయిలో అందుతున్నాయి? పేదలు ఎంత తృప్తిగా ఉన్నారు? అనేది కనపడుతున్నా.. వ్యతిరేక మీడియా దు్రష్పచారం చేస్తోంది. అందుకే నా వంతుగా ఆయన వ్యక్తిత్వాన్ని పాట ద్వారా బలంగా చెప్పాలని అను కున్నా. నేను రైటర్గా గతంలోనూ కొందరు నేతల గుణగణాల్ని వర్మిస్తూ రాశాను. అయితే వ్యక్తిగతంగా ఇంతగా ప్రభావితం అయింది ఇదే తొలిసారి. జగన్ గారి గురించి రాసేటప్పుడు తెలియని శక్తి ఏదో ఆవహిస్తుందేమో అనిపించింది. -
సర్వేలు అదే చెబుతున్నాయి: ఎంపీ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తోందని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, 12 రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదన్నారు. సర్వేలు సైతం బీజేపీ గెలుపును ధృవీకరిస్తున్నాయని చెప్పారు. 247 స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ 235 స్థానాల్లో ఓడిపోబోతుందంటూ జోస్యం చెప్పారు. ‘‘కాంగ్రెస్ పార్టీ నేలా విడిచి సాము చేస్తోంది. రాహుల్ గాంధీ ప్రధాని అయినట్లు కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారు. రెండు అంకెల సీట్లు బీజేపీకి రావడం ఖాయం. కాంగ్రెస్, బీఆర్ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పస లేని విమర్శలు చేస్తున్నారు. అభద్రతా భావంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గత చరిత్రగానే మారిపోతోంది. ఆడలేక మద్దెల చెరువు అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటే అసెంబ్లీ సీటు బీజేపీ సాధించగా... 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 4 ఎంపీ స్థానాలు గెలిచింది. తెలంగాణలో నాలుగు సీట్లు గెలవడంతోనే బీజేపీ సీట్ల సంఖ్య 300 మార్క్ దాటింది’’ అని లక్ష్మణ్ తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్: రేవంత్కు కొత్త సవాల్ విసిరిన ఎంపీ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని సీరియస్ కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తాటాకు చప్పుడు కాదని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కాగా, ఎంపీ లక్ష్మణ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడితే.. సందట్లో సడేమియా అన్నట్టుగా అధికారులు సర్దుకున్నారు. గత ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడింది. రాజ్యాంగం కల్పించిన హక్కును గత ప్రబుతం అణచివేసింది. తెలంగాణను అబాసుపాలు చేసింది. పోలీసుల అనుమతితో ఒకటి రెండు ఫోన్ ట్యాపింగ్లు జరగవచ్చని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్పై సీబీఐతో విచారణ జరిపించాలి. వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు తాటాకు చప్పుడు కాదని నిరూపించుకోవాలి. లీక్ వీరుడు కాదు.. గ్రీక్వీరుడైతే సీబీఐ విచారణకు వెంటనే ఆదేశించాలి. కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుంది. కేసీఆర్ కుటుంబాన్ని శిక్షించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
BRS చచ్చిన పాము..ఆ పార్టీని బీజేపీ ఉపేక్షించదు: లక్ష్మణ్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement