హిందూ మత విద్వేషకుల జాబితాలో కేసీఆర్‌

BJP Leader Laxman Slams On KCR - Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టంపై (సీఏఏ) విషం చిమ్మే వారంతా మత విద్వేషకులేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. ప్రధాని మోదీని ఎలా ఢీకొనాలో తెలియక మతాన్ని అడ్డు పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ విద్వేషకుల జాబితాలోకి ఇప్పుడు సీఎం కేసీఆర్‌ కూడా చేరారన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్‌ జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్‌. రామచందర్‌ రావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని కాంగ్రెస్‌ కోరిందని, ఇప్పుడు కేసీఆర్‌ తీర్మానం చేస్తామని చెబుతున్నారన్నారు. కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని కేసీఆర్‌ కట్టు కథలు చెబుతున్నారని విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top