Vijayashanti Feeling Unhappy With State BJP Party Leadership, Details Inside - Sakshi
Sakshi News home page

Vijaya Shanthi: విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. ఆ విషయం పార్టీ నేతలనే అడగండి

Aug 18 2022 2:51 PM | Updated on Aug 18 2022 4:12 PM

Vijayashanti Expressed Displeasure on Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ నాయకత్వం నన్ను నిశ్శబ్దంలో ఉంచిందన్నారు. ఈ మేరకు విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో మాట్లాడటానికి నాకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదో పార్టీ నేతలనే అడగండి. నేను అసంతృప్తిగా ఉన్నానో లేనో పార్టీ నేతల వద్ద స్పష్టత తీసుకోండి.

నేను ఈ రోజు సర్వాయి పాపన్న జయంతి వేడుకల సందర్భంగా మాట్లాడుదాం అనుకున్నా. లక్ష్మణ్‌ వచ్చి మాట్లాడారు వెళ్లిపోయారు. నాకేం అర్థం కాలేదు. నా సేవలను ఏవిధంగా ఉపయోగించుకుంటారో బండి సంజయ్‌, లక్ష్మణ్‌కే తెలియాలి. నేను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది అని విజయశాంతి అన్నారు.

చదవండి: (ఆ ఫోరెన్సిక్‌ రిపోర్టులో వాస్తవాలు లేవు: సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement