breaking news
Justice Surya Kant
-
తీర్పును టెక్నాలజీ మెరుగుపర్చగలగాలి
కటక్(ఒడిశా): నూతన సాంకేతికత అనేది న్యాయస్థానాల తీర్పును మరింత మెరుగుపర్చాలిగానీ తీర్పును అధిగమించేదిగా ఉండకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఒడిశాలోని కటక్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. పెండింగ్ కేసుల భారం దిగువ కోర్టు నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకు న్యాయ వ్యవస్థలోని ప్రతి స్థాయిలోనూ ఇబ్బందులను సృష్టిస్తున్నాయన్నారు. పైస్థాయిలో తలెత్తిన అడ్డంకులు దిగువ స్థాయిపై ఒత్తిడిని మరింతగా పెంచుతున్నాయని చెప్పారు. పెండింగ్ సమస్యను అధిగమించేందుకు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని సీజేఐ తెలిపారు. అవసరానికి తగినన్ని న్యాయస్థానాలు లేకుంటే, ఎంత చిత్తశుద్ధి కలిగిన న్యాయవ్యవస్థ అయినా కుప్పకూలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆధునిక సాంకేతికతతో ఎన్నో సౌలభ్యాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ దు్రష్పభావాలు కూడా ఉన్న విషయం మరువరాదన్నారు. నేటి డీప్ ఫేక్లు, డిజిటల్ అరెస్ట్ల కాలంలో న్యాయస్థానాలకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పేదలు, వృద్ధులను పట్టించుకోని సంస్కరణ అస్సలు సంస్కరణే కాదు, అది తిరోగమనం కూడా అని తెలిపారు. -
జస్టిస్ సూర్యకాంత్ అనే నేను..
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ సూర్యకాంత్ హిందీ భాషలో భగవంతుడి పేరిట ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు సైతం హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన అక్కడే ఉన్న తన సోదరితోపాటు సోదరుడి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. మాజీ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ని ఆతీ్మయంగా ఆలింగనం చేసుకున్నారు. జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారోత్సవంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్తోపాటు పలువురు కేంద్రమంత్రులు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం జస్టిస్ సూర్యకాంత్ ప్రధాని మోదీ వద్దకు వెళ్లి అభివాదం చేశారు. భారతదేశ న్యాయవ్యవస్థ చరిత్రలో తొలిసారిగా ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవానికి భూ టాన్, కెన్యా, మలేసియా, మారిషస్, నేపాల్, శ్రీలంక, బ్రెజిల్ దేశాల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరుకావడం విశేషం. ప్రధాని మోదీ అభినందనలు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఆయనకు అభినందనలు తెలియజేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బీఆర్ గవాయ్, మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ కలిసి ఫొటో దిగారు. కొలీజియం చీఫ్గా జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇకపై సుప్రీంకోర్టు కొలీజియం అధినేతగానూ వ్యవహరించబోతున్నారు. ఇన్నాళ్లూ ఈ పదవిలో ఉన్న జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీ కాలం ఆదివారంతో పూర్తయ్యింది. సుప్రీంకోర్టు కొలీజియంలో సీజేఐ సహా మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారు. ప్రస్తుతం కొలీజియంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎంఎం సుందరేశ్ సభ్యులు.సీజేఐల గురించి ఐదు విశేషాలు!భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ కాసేపట్లో బాధ్యతలు చేపట్టనున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 52 మంది ప్రధాన న్యాయమూర్తులు ఈ దేశ న్యాయవ్యవస్థ కాపు కాసినవారే. అయితే మనలో చాలామందికి గత సీజేఐల విశేషాలు తెలిసింది తక్కువే. మహిళ న్యాయమూర్తి ఇప్పటివరకూ ఈ అత్యున్నత పదవిని చేపట్టకపోవడం గమనార్హం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు 65 ఏళ్లకు పదవీ విరమణ పొందుతారు. హైకోర్టు న్యాయమూర్తుల విషయంలో ఇది 62 ఏళ్లు మాత్రమే. సుప్రీంకోర్టు సీజేఐకి మాస్టర్ ఆఫ్ ద రోస్టర్గా పేరు. ఏ న్యాయమూర్తి ఏ రకమైన కేసుల విచారణ చేపడతారన్న విషయంపై సీజేఐదే తుది నిర్ణయం. అధికారిక హోదాల ప్రకారం... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్రాల గవర్నర్లు, మాజీ రాష్ట్రపతుల తరువాతి స్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులది. ఇలాంటివే మరికొన్ని ఆసక్తికరమైన వివరాలు ఇలా ఉన్నాయి.1. జస్టిస్ హరిలాల్ జెకిసన్దాస్ కానియాదేశ మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి. 1950లో సుప్రీంకోర్టు ఏర్పాటు తరువాత నియమితులయ్యారు.2. జస్టిస్ కె.జి.బాలక్రిష్ణన్తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి. 2007-2010 మధ్యకాలంలో పనిచేశారు.3. జస్టిస్ బి.ఆర్.గవాయి52వ ప్రధాన న్యాయమూర్తిగా ఈ ఏడాది మేలో నియమితులయ్యారు. బౌద్ధ మతాన్ని అనుసరించిన తొలి సీజేఐ. ఈ అత్యున్నత పదవిని అధిష్టించిన రెండో దళితుడు కూడా.4.జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్1978 - 19875 మధ్య దేశ అత్యున్నత న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఏడేళ్లకాలం ఈ పదవిలో ఉన్న తొలి జస్టిస్.5. జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్1991లో కేవలం పదిహేడు రోజులు మాత్రమే సీజేఐగా పనిచేశారు. అతితక్కువ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తిగా ఇదో రికార్డు. -
53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్
న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24వ తేదీన బాధ్యతలు చేపట్టబోతున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం తదుపరి సీజేఐగా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు సంబంధించిన డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ సూర్యకాంత్ దాదాపు 15 నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు. 2027 ఫిబ్రవరి 9న పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయబోతున్నారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలతో రా ష్ట్రపతి ముర్ము జస్టిస్ సూర్యకాంత్ను సుప్రీంకో ర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. జస్టిస్ సూర్యకాంత్కు అభినందనలు తెలియజేశారు. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హరియాణాలోని హిసార్ జిల్లా పెటా్వర్ గ్రామంలో మధ్య తరగతి కుటుంబంలో జని్మంచారు. 1981లో హిసార్లోని ప్రభుత్వ పీజీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1984లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ లా అభ్యసించారు. 2011లో కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి ‘మాస్టర్ ఆఫ్ లా’లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 2000 జూలై 7 నుంచి 2004 జనవరి 8 దాకా హరియాణా ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్గా సేవలందించారు. 2004 జనవరి 9 నుంచి 2018 అక్టోబర్ 4 దాకా పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2018 అక్టోబర్ 5 నుంచి 2019 మే 23 దాకా హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆరేళ్లుగా సుప్రీంకోర్టులో సేవలందిస్తున్నారు. 2000 సంవత్సరం కంటే ముందే న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన జస్టిస్ సూర్యకాంత్ 2011లో మాస్టర్ ఆఫ్ లా పూర్తిచేయడం విశేషం.కీలక తీర్పుల్లో భాగస్వామి సుప్రీంకోర్టు వెలువరించిన అత్యంత కీలకమైన తీర్పుల్లో జస్టిస్ సూర్యకాంత్ భాగస్వామ్యం కూడా ఉంది. పలు ధర్మాసనాల్లో ఆయన పనిచేశారు. జమ్మూకశీ్మర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తున్న ఆరి్టకల్ 370 రద్దు, భావ ప్రకటనా స్వేచ్ఛ, అవినీతి, పర్యావరణ పరిరక్షణ, లింగ సమానత్వం వంటి కీలక అంశాల్లో ఆయన తీర్పులిచ్చారు. బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని నిలిపివేస్తూ తీర్పు ఇచి్చన బెంచ్లో జస్టిస్ సూర్యకాంత్ కూడా సభ్యుడే. ఈ చట్టం కింద కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయొద్దని ఆయన ఆదేశించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సహా ఇతర బార్ అసోసియేషన్లలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు కేటాయించాలని ఆదేశించి చరిత్ర సృష్టించారు. రక్షణ దళాల్లో వన్ ర్యాంక్–వన్ పెన్షన్ పథకాన్ని సమరి్థంచారు. పెగాసస్ స్పైవేర్ కేసును విచారించిన ధర్మాసనంలో సభ్యుడిగా పనిచేశారు. జాతీయ భద్రత పేరిట ప్రముఖుల గోప్యతకు భంగం కలిగించడం సరైంది కాదని తేలి్చచెప్పారు. 2022లో మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా పరమైన లోపాలు బయటపడ్డాయి. ఈ కేసును జస్టిస్ సూర్యకాంత్ సభ్యుడిగా ఉన్న ధర్మాసనం విచారించింది. -
53వ సీజేఐగా ఆయనే!
సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్య కాంత్ ఎంపిక కానున్నారు. సూర్యకాంత్ పేరును సిఫార్సు చేస్తూ ప్రస్తుత చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్(BR Gavai) కేంద్రానికి ప్రతిపాదన పంపారు. అన్నీ సక్రమంగా జరిగితే నవంబర్ 24వ తేదీన జస్టిస్ సూర్య కాంత్ భారత దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది.52వ ప్రధాన న్యాయమూర్తి అయిన బీఆర్ గవాయ్ పదవీ కాలం నవంబర్ 23తో ముగియనుంది. జస్టిస్ సూర్యకాంత్ గతంలో పంజాబ్-హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. సుప్రీంకోర్టులో ఆయన అనేక కీలక తీర్పులు ఇచ్చారు, ముఖ్యంగా వన్ ర్యాంక్-వన్ పెన్షన్ (OROP) పథకాన్ని రాజ్యాంగబద్ధంగా సమర్థిస్తూ ఇచ్చిన తీర్పు తీవ్ర చర్చనీయాంశమైంది.సూర్యకాంత్.. 1962 ఫిబ్రవరి 10వ తేదీన జన్మించారు. హర్యానాలోని కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1984లో న్యాయవాదిగా హర్యానా & పంజాబ్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2004లో హైకోర్టు న్యాయమూర్తిగా.. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు.. NALSA (National Legal Services Authority) కార్యనిర్వాహక ఛైర్మన్గా ఇటీవల ఈయన నియమితులయ్యారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నందున.. ప్రస్తుత CJI జస్టిస్ బీఆర్ గవాయి పదవీ విరమణ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. సీజేఐగా సూర్యకాంత్ పదవీ కాలం 2027 ఫిబ్రవరి 9వ తేదీతో ముగియనుంది.


