-
ఏకంగా యజమానినే కిడ్నాప్ చేసి.. రూ.4 కోట్లు తీసుకుని
కర్నూలు: జేసీబీ డ్రైవర్ ఏకంగా తన యజమానినే కిడ్నాప్ చేసి రూ.4కోట్లతో ఉడాయించిన ఘటన గత జూన్లో కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి గతంలో 11 మందిని అరెస్టు చేయగా, ప్రస్తుతం ప్రధాన నిందితుడు సహా ముగ్గురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు విడతల్లో రూ.3.6 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కె.రఘువీర్రెడ్డి శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బనగానపల్లి పట్టణానికి చెందిన వినాయకరెడ్డి క్రషర్ వ్యాపారం చేస్తూ ఉమ్మడి జిల్లాలో పారిశ్రామికవేత్తగా పేరు గడించాడు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు గ్రామానికి చెందిన నరేష్ ఇతని వద్ద గత నాలుగేళ్లుగా జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే క్రమంగా ప్రవర్తనలో మార్పు కనిపించడంతో వినయకరెడ్డి అతడిని తొలగించాడు. ఇది మనసులో పెట్టుకున్న నరేష్ అతన్ని కిడ్నాప్ చేసి కోట్లు రాబట్టేందుకు పథకం వేశాడు. అందులో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని కోలార్కు చెందిన సురేష్, శ్రీనివాస్, ఖలందర్, అజయ్, విజయ్, భార్గవ్, ప్రభు, ప్రకాష్, రంజిత్.. అనంతపురం జిల్లాకు చెందిన రవికుమార్, రంజిత్కుమార్, చెన్నా భాస్కర్, రఘులతో కిడ్నాప్నకు తెరలేపారు. అందరూ కలిసి గత జూన్ 3న బనగానపల్లిలో రెక్కీ నిర్వహించారు. 5వ తేదీ ఉదయం బనగానపల్లి నుంచి బేతంచర్లకు వినాయకరెడ్డితో పాటు ఆయన కుమారుడు భరత్కుమార్రెడ్డి డ్రైవర్తో కలిసి కారులో బయలుదేరారు. అదే సమయంలో కిడ్నాపర్లు నాలుగు కార్లలో వెంబడించి సీతారామాపురం మెట్ట వద్ద అడ్డగించారు. కత్తిని చూపించి భరత్కుమార్రెడ్డి, వినాయకరెడ్డిలను కిందకు దించారు. వారిని కిడ్నాపర్ల కారులో ఎక్కిస్తుండగా డ్రైవర్ సాయినాథ్రెడ్డి అడ్డుకున్నారు. కిడ్నాపర్లు తండ్రీ కొడుకులతో పాటు డ్రైవర్ను కూడా కారులోకి కుక్కి ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత వినాయకరెడ్డి తండ్రి నాగిరెడ్డికి ఫోన్ చేసి రూ.4 కోట్లు ఇవ్వాలని, లేకుంటే వాళ్లను చంపుతామని బెదిరించారు. భయపడిన నాగిరెడ్డి బంధువుల వద్ద డబ్బు తీసుకుని మొదటగా అనంతపురం జిల్లా కొత్తపల్లి వద్ద రూ.2 కోట్లు.. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ వద్ద రూ.2 కోట్లు ముట్టజెప్పాడు. దీంతో కిడ్నాపర్లు 7వ తేదీన కర్ణాటక రాష్ట్రంలో ముగ్గురినీ విడిచిపెట్టారు. అయితే కిడ్నాపర్లు డబ్బు తీసుకొని కూడా తమ కుమారుడిని, మనవడిని వదిలిపెట్టరేమోనన్న ఆందోళనతో నాగిరెడ్డి జరిగిన విషయాన్ని బేతంచర్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ కొనసాగించారు. ఇంతలోనే కిడ్నాప్నకు గురైన ముగ్గురూ ఇంటికి చేరుకున్నారు. అయితే పోలీసులు జూన్ 30న గుత్తి పట్టణంలో 11 మందిని అరెస్ట్ చేసి రూ.40 లక్షల నగదు, కత్తి, మూడు సెల్ఫోన్లు, నాలుగు కార్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న కిడ్నాప్ ప్రధాన నిందితుడు నరేష్, చెన్నా భాస్కర్, రఘులను శుక్రవారం వేకువజామున అనంతపురం జిల్లా గుత్తి వద్ద అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.2.66 కోట్లు నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలో స్వాధీనం చేసుకున్న నగదుతో కలిపి మొత్తం రూ.3.6 కోట్లు రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేసును త్వరితగతిన చేధించిన అడిషనల్ ఎస్పీ వెంకటరాముడుతో పాటు డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ ప్రియతమ్రెడ్డి, ఎస్ఐలు శివశంకర్, నాయక్, రాకేష్, నరేష్, జగదీశ్వరరెడ్డి, రమేష్ రెడ్డి, హరినాథ్రెడ్డి, పీఆర్ఓ చెన్నయ్యలను ఎస్పీ అభినందించారు. -
జేసీ.. జేసీబీ!
తాడిపత్రి: ప్రభుత్వ విద్యాసంస్థల ప్రాంగణంలో దర్జాగా అసాంఘిక కార్యకలాపాలు, పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ప్రహరీ గోడ నిర్మాణాన్ని అడ్డుకోవటమే కాకుండా తన అనుచరులతో కలసి కూల్చివేతలకు పాల్పడ్డారు. శనివారం రాత్రి అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జూనియర్ కళాశాల ప్రహరీ నిర్మాణ పనుల వద్ద వీరంగం సృష్టించారు. జేసీ గ్యాంగ్ కూలగొట్టిన పిల్లర్లను తిరిగి నిర్మించేందుకు ప్రయత్నించిన కార్మికులపై ఆదివారం ఉదయం దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఏం జరిగిందంటే... నాడు–నేడు ఫేజ్ 2 పనుల్లో భాగంగా తాడిపత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ నిర్మాణ పనులను మూడు రోజుల క్రితం చేపట్టారు. జూనియర్ కళాశాల సమీపంలోనే జేసీ ప్రభాకర్రెడ్డి నివాసం ఉంది. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో నిర్మాణ పనుల వద్దకు అనుచరులతో కలసి చేరుకున్న జేసీ ‘రేయ్ జేసీబీతో పిల్లర్లను కూలదోయండిరా..’ అంటూ హుకుం జారీ చేశారు. జేసీబీతో కాంక్రీట్ పిల్లర్లను కూలదోశారు. మర్నాడు అక్కడకు వచ్చిన కూలీలను పనులు నిలిపి వేయాలంటూ జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన అనుచరులు అడ్డగించారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రహరీ నిర్మిస్తున్నామని, అడ్డు తగలడం సమంజసం కాదని చెప్పినా వినిపించుకోలేదు. దీనిపై మేస్త్రీ గురుశంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిర్మాణాలను దౌర్జన్యంగా కూలగొట్టడంపై జేసీ ప్రభాకర్రెడ్డి, వెన్నపూస మల్లికార్జునరెడ్డి, సుబ్బయ్య, వడ్డే మధు, సోమశేఖర్ నాయుడు, దినేష్రెడ్డి, పవన్నాయుడు, మునిసిపల్ కాంట్రాక్టర్ తిరుపాల్రెడ్డి, కుమ్మరి వెంకటేష్, రాంబాబు, గురుజాల శివశంకర్రెడ్డి, చరణ్, హరినాథ్రెడ్డి, గండికోట కార్తీక్ తదితరులపై కేసు నమోదు చేసినట్లు అర్బన్ సీఐ హమీద్ఖాన్ తెలిపారు. -
ఎంతకు తెగించారు.. జేసీబీతో ఏటీఎం దోపిడీకి యత్నం
యశవంతపుర(బెంగళూరు): జేసీబీలను తీసుకొచ్చి ఏటీఎంలను ధ్వంసంచేసి డబ్బు దోచుకోవడానికి ప్రయత్నించడం పెరిగింది. ఇటీవల శివమొగ్గలో ఇటువంటి దోపిడీ యత్నం మరువకముందే మంగళూరు వద్ద సూరత్కల్లో ఇదే మాదిరిగా దొంగలు యత్నించారు. విద్యాదాయిని పాఠశాల సమీపంలో జాతీయ రహదారి అండర్పాస్ వద్ద సౌతిండియా బ్యాంక్ ఎటీఎం ఉంది. శుక్రవారం తెల్లవారు 2:13 గంటలకు దుండగులు జేసీబీతో వచ్చారు. ఏటీఎం మిషన్ను ధ్వంసం చేసేందుకు యత్నించగా సైరన్ మోగడంతో జేసీబీ వదిలి పారిపోయారు. అక్కడికి రెండువందల మీటర్ల దూరంలోనే పోలీసుస్టేషన్ ఉంది. పడుబిద్రి నుంచి జేసీబీని తెచ్చినట్లు తేలింది. దొంగల దాడి సీసీ కెమెరాల్లో రికార్డు కాగా పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి స్మార్ట్ఫోన్ కోసం లోకానికి దూరమై... మరో ఇద్దరికి ప్రాణదాతగా.. -
జేసీబీలో నిండుగర్భిణి తరలింపు
భీమ్గల్: ఓ నిండుగర్భిణి పురిటినొప్పులతో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకుని వెళ్తుండగా దారి మధ్యలో చెరువుకట్ట తెగి నీటి ప్రవాహం పెరిగింది. జేసీబీ సహాయంతో ఆమెను నీటిప్రవాహంలోంచి దాటించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. భీమ్గల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన నిండుగర్భిణి అనిలకు గురువారం పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బయలుదేరారు. మార్గమధ్యంలో పిప్రి నుంచి బాచన్పల్లి వెళ్లే దారిలో ఉన్న చెరువుకట్ట తెగిపోయింది. దీంతో ఆమెను జేసీబీలో కూర్చోబెట్టి దాని సహాయంతో నీటి ప్రవాహాన్ని దాటించారు. అక్కడి నుంచి 108 అంబులెన్స్ ద్వారా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
జేసీబీతో ఏటీఎంపై దాడి.. దోపిడీకి దొంగల యత్నం
శివమొగ్గ: అర్ధరాత్రి.. నగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యం. పెద్ద ప్రొక్లెయినర్తో కొందరు వచ్చారు. వెంటనే ఏటీఎం ముందు నిలిపి నగదు యంత్రాన్ని పెకలించడంలో నిమగ్నమయ్యారు. ఇది సినిమా షూటింగ్ కాదు.. నిజంగా జరిగినదే. జేసీబీ సాయంతో ఏటీఎం యంత్రాన్ని తొలగించి డబ్బులు దొంగిలించేందుకు దొంగలు విశ్వప్రయత్నాలు చేశారు. ఈ వినూత్న సంఘటన శివమొగ్గ నగరంలోని వినోబా నగరలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. నకిలీ తాళాలతో జేసీబీ స్టార్ట్ చేసి వివరాలు.. 100 అడుగుల రోడ్డు శివాలయం ఎదురుగా ఉన్న యాక్సిస్ బ్యాంకు ఏటీఎం సెంటర్ ఉంది. సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద గత కొన్ని రోజుల నుంచి ఒక జేసీబీ వాహనం మరమ్మతుల వల్ల నిలిచి ఉంది. దొంగలు నకిలీ తాళాలను ఉపయోగించి ఈ జేసీబీని స్టార్ట్ చేశారు. తరువాత ఏటీఎం వద్దకెళ్లి దానిని పెకలించే పనిలో పడ్డారు. ఇంతలో అదే రోడ్డులో ట్రాఫిక్ సీఐ సంతోష్ కుమార్తో కూడిన గస్తీ వాహనం వచ్చింది. జేసీబీతో ఏటీఎం వద్ద ఏం చేస్తున్నారని దుండగులను సీఐ ప్రశ్నించారు. దీంతో దుండగులు జేసీబీని వదిలి పారిపోయారు. వినోబనగర పోలీసులు వచ్చి పరిశీలించారు. ఏటీఎం పైభాగం పూర్తి ధ్వంసమైంది. అక్కడి సీసీ కెమెరాల్లో దొంగతనం దృశ్యాలు రికార్డయ్యాయి. దొంగల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement