
సాక్షి,అనంతపురం: ఏపీలో దుశ్శాసన పాలన కొనసాగుతోంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భూమి ఆక్రమణకు వ్యతిరేకంగా నిలిచిన మైనర్ బాలికపై టీడీపీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. జేసీబీకి అడ్డుగా వెళ్లిన బాలికను బలవంతంగా లాగిపడేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు.
