కరెంట్ తీగలు తగిలి లారీ, జేసీబీ దగ్ధం | Lorry, jCB breaks out fire mishap in karimnagar | Sakshi
Sakshi News home page

కరెంట్ తీగలు తగిలి లారీ, జేసీబీ దగ్ధం

Jun 14 2016 6:32 PM | Updated on Sep 4 2017 2:28 AM

కరీంనగర్ జిల్లా ఓదెల మండలకేంద్రంలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఓదెల మండలకేంద్రంలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక లారీతోపాటు జేసీబీ కాలిపోయాయి. కొలనూర్ నుంచి లారీలో జేసీబీని తరలిస్తుండగా ఓదెల సమీపంలో కరెంటు తీగలు తగిలాయి. అది గమనించని లారీ డ్రైవర్ లారీని ముందుకు తీసుకెళ్లాడు. ఇంతలో కరెంట్ తీగలు ఒకదానికికోటి రాసుకుని ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

ఈ ప్రమాదంలో లారీ, జేసీబీ పూర్తిగా కాలిపోయాయి. రూ.70 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. కాగా, లారీ డ్రైవర్ మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement