సాక్షి, విజయనగరం: విజయనగరం సమీపంలోని చెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనాన్ని లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. రాయగడ మజ్జి గౌరమ్మ యాత్రకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులను విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం బొత్సపేటకు చెందిన చింతపల్లి రాంబాబు (50), మజ్జి నారాయణ రావు (50), బొత్స మోహన్ నాయుడు (8)గా గుర్తించారు.


