సాక్షి, కాకినాడ: గోదావరిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అదృష్టం వరించింది. వారి వలకు ఏకంగా 23 కేజీల భారీ పండుగప్ప చేప చిక్కింది. అనంతరం, భారీ చేపను వేలం వేయగా.. 16000లకు అమ్ముడైంది. ఈ చేప సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వివరాల మేరకు.. కాకినాడ జిల్లాలో మత్స్యకారులకు 23 కేజీల భారీ పండుగప్ప చేప చిక్కింది. దీంతో, యానాం మార్కెట్కు తీసుకెళ్లిన ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు. అనంతరం చేపను వేలం వేయగా కోలాటి దేవి అనే వ్యాపారి రూ.16 వేలకు దక్కించుకున్నారు. భారీ పరిమాణంలో ఉన్న పండుగప్ప చేప వలకు చిక్కడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీకి భారీ వర్షసూచన


