-
ఈ–రేస్పై చర్యలు తీసుకుంటాం
సాక్షి, హైదరాబాద్: సచివాలయ బిజినెస్ రూల్స్కి విరుద్ధంగా, ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఫార్ములా ఈ–రేస్ ఒప్పందం, నిర్వహణపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఏ విధమైన విధి విధానాలు పాటించకుండా, వ్యాపార సూత్రాలకు విరుద్ధంగా నెక్స్ జెన్ అనే కంపెనీకి లబ్ధి చేకూర్చడం కోసమే గతేడాది హైదరాబాద్లో ‘ఫార్ములా ఈ–రేస్’ నిర్వహించారని ఆరోపించారు. వచ్చే ఫిబ్రవరిలో జరగాల్సి ఉన్న ఈవెంట్ నిర్వహణ కోసం నాటి మంత్రి వర్గం, సంబంధిత శాఖ మంత్రి అనుమతి లేకుండా ఇటీవల బదిలీ అయిన పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రూ.55 కోట్లను ప్రైవేటు కంపెనీకి చెల్లించారని భట్టి తెలిపారు. ఈవెంట్ నిర్వహణకు రూ.110 కోట్లతో ఒప్పందం జరగగా, మిగిలిన రూ. 55 కోట్లను చెల్లించాలని సదరు కంపెనీ నోటీసు పంపిందన్నారు. గత పాలకులు వారి కోరికలు తీర్చు కోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక ‘ఫార్ములా ఈ–రేసు’ను రద్దు చేయడంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి కేటీఆర్పై మండిపడ్డారు. మంగళవారం సచివాలయ మీడియా సెంటర్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ రేస్ వల్ల రాష్ట్రానికి ఏం ఆదాయం వచ్చింది కేటీఆర్? ఫార్మలా ఈ–రేసు రద్దుతో హైదరాబాద్ అభివృద్ధికి నష్టం జరిగిందని సోషల్ మీడియా ‘ఎక్స్’వేదికగా కేటీఆర్ చేసిన ఆరోపణలను ఖండించారు. గతేడాది నిర్వహించిన ఫార్ములా ఈ–రేస్తో హైదరాబాద్కు ఎలాంటి లాభం జరగలేదని, పైగా ప్రభుత్వ నిధులను అప్పనంగా ఒక ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టారని విమర్శించారు. తమ ప్రభుత్వంపై ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయని, ప్రతిపైసా ప్రజల అవసరాల కోసం మాత్రమే తాము ఖర్చు చేస్తామన్నారు. వాళ్లు ఎవరో హైదరాబాద్కు వచ్చి వెళ్లడానికి రూ.100 కోట్లు కట్టాలా? అని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణతో రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం ఉండదని స్పష్టం చేశారు. ప్రజాభవన్లో రోజూ నన్ను కలవచ్చు ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి చిన్న సంఘటన లేకుండా చాలా పకడ్బందీగా నిర్వహించామని భట్టి తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో ఇప్పటి వరకు 6.50 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసి లబ్ధి పొందారన్నారు. ప్రజా భవన్లో ఎవరైనా తనను ప్రతి రోజూ ఉదయం 8.30 నుంచి 9.30 వరకు కలవవచ్చుని స్పష్టం చేశారు. విడతల వారీగా రైతుబంధు నిధులు రోజు వారీగా రైతు బంధు నిధులను విడుదల చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఒక ఎకరం ఉన్న రైతులకు ఇప్పటికే రైతు బంధు నిధులు చెల్లించామని, రెండు ఎకరాలున్న రైతులకు చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. విడతల వారీగా రైతులకు రైతుబంధు నిధులు ఇస్తామన్నారు. -
TS: ఫార్ములా ఈ రేస్.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: ప్రతీ పైసాను రాష్ట్ర ప్రజల అవసరాల కోసమే ఖర్చు చేస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని విమర్శించారు ‘ఫార్ములా ఈ-రేస్పై మాజీ మంత్రులు అనవసర ఆరోపణలు చేస్తున్నారు. రేసుపై మా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదంటున్నారు. ఫార్ములా ఈ-రేస్ వెనక్కి వెళ్లడంతో నష్టం జరిగిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఫార్ములా ఈ-రేస్పై ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. ఫార్ములా ఈ-రేస్ టికెట్లు అమ్ముకుని ఓ కంపెనీ లబ్ధిపొందింది. ఫార్ములా ఈ-రేస్లో ముగ్గురు వాటాదారులున్నారు’ అని భట్టి వెల్లడించారు. కాగా, అవసరమైన అనుమతులు తీసుకోకుండా గత ప్రభుత్వంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి అరవింద్కుమార్ ఫార్ములా ఈ రేసు ఒప్పందం చేసుకున్నారని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అరవింద్కుమార్కు మంగళవారం ప్రభుత్వం మెమో జారీ చేసింది. అరవింద్కుమార్ ప్రస్తుతం విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్గా ఉన్నారు. ఇదీచదవండి.. ఫార్ములా ఈ రేస్.. ఐఏఎస్ అరవింద్కుమార్కు మెమో -
ఫార్ములా-ఈ రేసింగ్: ఐఏఎస్ అరవింద్ కుమార్కు మెమో జారీ
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేసింగ్కు సంబంధించిన వ్యహారంలో ఐఏఎస్ అరవింద్ కుమార్కు తెలంగాణ ప్రభుత్వం మంళవారం మెమో జారీ చేసింది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన ఒప్పందంలోని కొన్ని అంశాలపై పూర్తి వివరణ ఇవ్వాలని అరవింద్ కుమార్కు ప్రభుత్వం మెమో ఇచ్చింది. ఫార్ములా-ఈతో త్రైపాక్షిక లాంగ్ ఫారమ్ ఒప్పందం ఎందుకు నమోదు చేశారో తెలపాలని అరవింద్ కుమార్ను వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా రూ. 54 కోట్లను హెచ్ఎండీఏ నుంచి ఫార్ములా ఈ రేసుకు బదిలీ చేశారని ఆరోపణలు అరవింద్ కుమార్పై ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాద్లో ఫార్ములా-ఈ కార్ రేసింగ్ పోటీలను (రేస్ రౌండ్-4) రద్దు చేసినట్లు ఇటీవల ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్ ఈఓ) ప్రకటించింది. ఫిబ్రవరి 10వ తేదీన నెక్లెస్రోడ్డు స్ట్రీట్ సర్క్యూట్లో నిర్వహించవల్సిన ఈ అంతర్జాతీయ పోటీలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఫార్ములా-ఈ పోటీలపై గతేడాది అక్టోబర్ 30వ తేదీన ఏర్పాటు చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించిన విషయం తెలిసిందే. చదవండి: Hyderabad: పెట్రోల్ బంకుల్లో జనం క్యూ.. పెట్రోల్పై పుకార్లు -
ఫార్ములా–ఈ రేసింగ్ రద్దు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో ఫార్ములా– ఈ కార్ రేసింగ్ పోటీలను (రేస్ రౌండ్ –4) రద్దు చేసినట్లు ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ ఈఓ) ప్రకటించింది. వచ్చే ఫిబ్రవరి 10వ తేదీన నెక్లెస్రోడ్డు స్ట్రీట్ సర్క్యూట్లో నిర్వహించవల సిన ఈ అంతర్జాతీయ పోటీలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్న ట్లు పేర్కొంది. ఫార్ములా–ఈ పోటీలపై గతేడాది అక్టోబర్ 30వ తేదీన ఏర్పాటు చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించింది. ఈ మేరకు తెలంగాణ పురపాలన, పట్టణా భివృద్ధి (ఎంఏయూడీ) విభాగానికి నోటీసులు ఇవ్వను న్నట్లు ఎఫ్ఈఓ తెలిపింది. తెలంగాణ సర్కా ర్ వైఖరి తమను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందని ఎఫ్ఈఓ కో–ఫౌండర్, చీఫ్ చాంపియన్షిప్ ఆఫీసర్ ఆల్బర్ట్ లొంగో అన్నారు. తదుపరి పోటీలను హాంకాంగ్లో నిర్వహించను న్నట్లు తెలిపారు. ఫార్ములా–ఈ పోటీల వల్ల ఎలాంటి ప్రయోజ నం లేదని భావించడం వల్లే ప్రభుత్వం విముఖతతో ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పోటీల నిర్వహణపై ప్రభుత్వ ఉన్నతాధికారు లతో చర్చించేందుకు నిర్వాహ కులు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి సానుకూలత వ్యక్తం కాలేదని ఈ నేపథ్యంలో పోటీలను రద్దు చేసినట్లు సమాచారం. గత ఏడాది భారీ ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మోటార్ స్పోర్ట్స్ ప్రియులను విశేషంగా ఆకట్టుకొనే ఫార్ములా–ఈ పోటీలు గత సంవత్సరం ఫిబ్రవరి 10, 11 తేదీల్లో హైద రాబాద్ నెక్లెస్ రోడ్డులో జరిగాయి. ఈ పోటీల కోసం హెచ్ఎండీఏ సుమారు రూ.100 కోట్లకు పైగా వెచ్చించి స్ట్రీట్ సర్క్యూట్ నిర్మాణంతో పాటు అన్ని ఏర్పాట్లు చేసింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఈ పోటీలు జరగడంతో దేశవ్యాప్తంగా భారీఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు వేలా దిమంది మోటార్ స్పోర్ట్స్ ప్రియులు, రేసింగ్ డ్రైవర్లు హైదరాబాద్ను సందర్శించారు. ట్రాఫిక్ జామ్తో ఇబ్బందులు ఫార్ములా–ఈ పోటీలతో పాటు అంతకంటే రెండు నెలల ముందు జరిగిన ఒక రోజు ఇండియన్ రేసింగ్ కార్ పోటీల సందర్భంగా నగ రంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నెక్లెస్రోడ్డు వైపు వచ్చే వాహనాలను నిలిపివేశారు. దీంతో ఆర్టీసీ క్రాస్రోడ్స్, హిమాయత్నగర్ మార్గాల్లో ఖైరతాబాద్ వైపు ట్రాఫిక్ స్తంభించింది. అమీర్పేట్ వైపు నుంచి లక్డీకాపూల్ వైపు వచ్చే వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఐదు రోజుల ముందు నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పోటీలపై సామాజిక మాధ్యమాల్లో పెద్దయెత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజలకు ట్రాఫిక్ నరకాన్ని చూపుతూ ఎవరి కోసం ఈ పోటీలు అంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకడుగు వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది దుర్మార్గమైన తిరోగమన చర్య: కేటీఆర్ ఫార్ములా –ఈ రేస్కు ప్రభుత్వం వెనుకడుగు వేయడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్య క్షుడు కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గమైన, తిరోగ మన నిర్ణయమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘హైదరాబాద్ ఇ– ప్రిక్స్ వంటివి ప్రపంచవ్యాప్తంగా మన నగరం, దేశం బ్రాండ్ ఇమేజ్ను పెంచుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో హైదరాబాద్ నగరాన్ని ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ప్రపంచానికి చాటేందుకు ఉపకరిస్తాయి. ఎలక్ట్రానిక్ వాహన రంగానికి చెందిన ఔత్సాహికులు, తయారీదారులు, స్టార్టప్లను ఆకర్షిస్తూ ఒక వారం పాటు ఈవీ సమ్మిట్ను నిర్వ హించేందుకు ఫార్ములా–ఈ రేస్ను ఒక సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం ఉపయోగించుకుంది..’ అని కేటీఆర్ పేర్కొన్నారు. సస్టైనబుల్ మొబిలిటీ సొల్యూషన్స్కు కేంద్రంగా రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి తాము తెలంగాణ మొబిలిటీ వ్యాలీని కూడా ప్రారంభించినట్లు తెలిపారు. -
ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా ఈ - రేస్ రద్దు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement