కారు రేసు కేసులో ట్విస్ట్‌.. ఈడీ విచారణకు బీఎల్‌ఎన్‌ రెడ్డి డుమ్మా | ED To Investigate HMDA Ex Chief BLN Reddy Over Formula E-car Race, More Details Inside | Sakshi
Sakshi News home page

కారు రేసు కేసులో ట్విస్ట్‌.. ఈడీ విచారణకు బీఎల్‌ఎన్‌ రెడ్డి డుమ్మా

Jan 2 2025 8:51 AM | Updated on Jan 2 2025 1:40 PM

ED Investigate BLN Reddy Over Formula E-car race

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసులో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. నేడు ఈడీ విచారణకు హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా.. ఆయన వెళ్లలేదు. విచారణకు మరింత సమయం కావాలని ఈడీ అధికారులను కోరారు.

ఫార్ములా ఈ-కారు రేసు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిని ఈడీ అధికారులు నేడు విచారించాల్సి ఉండగా.. ఆయన విచారణకు హాజరు కాలేదు. విచారణకు రావడానికి మరింత సమయం కావాలని బీఎల్ఎన్ రెడ్డి కోరారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్న అధికారికి ఆయన మెయిల్‌ పంపారు. దీంతో, బీఎల్‌ఎన్‌ రెడ్డి మెయిల్‌కు ఈడీ సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా తిరిగి ఎప్పుడు విచారణకు రావాలో చెబుతామని అధికారులు చెప్పారు.

ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు విచారణలో ఈడీ అధికారులు స్పీడ్‌ పెంచారు. రేపు ఈడీ విచారణకు ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌ విచారణకు హాజరవనున్నారు. ఈనెల ఏడో తేదీన కేటీఆర్‌.. ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఈ కేసులో కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇక, ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్‌-ఏ1, ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌-ఏ2, బీఎల్‌ఎన్‌ రెడ్డి-ఏ3గా ఉన్నారు. అయితే, కారు కేసులో ఫెమా నిబంధనలు ఉల్లఘించినట్టు ఈడీ పేర్కొంది. ఇందులో భాగంగానే ఈడీ.. ఈసీఐఆర్‌ నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. రూ.55కోట్ల విదేశీ కంపెనీ ఎఫ్‌ఈవోకు సంబంధించిన బదిలీలపై నేడు ఈడీ విచారించనుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement