breaking news
Delhi Red Fort Blast
-
అది ఆత్మాహుతి దాడే!
న్యూఢిల్లీ: కారుబాంబు పేలుడు ప్రమాదవశాత్తు జరగలేదని డాక్టర్ ఉమర్ నబీ చారిత్రక ఎర్రకోట సమీపంలో అమాయకులపై జరిపిన ఉద్దేశపూర్వక ఆత్మాహుతి దాడి అని ఎట్టకేలకు నిర్ధారణ అయింది. వైద్యుల ముసుగులో ఉన్న తోటి ఉగ్రవాదుల అరెస్ట్లతో తాను కూడా పట్టుబడతానన్న భయంతో పారిపోతుండగా పేలుడుపదార్థం పేలిపోయిందన్న వాదనల్లో వాస్తవంలేదని రూఢీ అయింది. తాను ఆత్మాహుతికి తెగించబోతున్నట్లు డాక్టర్ నబీ స్వయంగా చెప్పిన సెల్ఫీ వీడియో ఒకటి మంగళవారం బయటికొచ్చింది. దీంతో ఢిల్లీ ఘటన ముమ్మాటికీ ఉగ్రవాది ఆత్మాహుతి దాడి అని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రకటించింది.తనది ఆత్మహత్య కాదని, బలిదాన ఆపరేషన్ అని ఉమర్ తన ఉగ్రదుశ్చర్యను సమర్థించుకోవడం ఆ వీడియోలో కనిపించింది. సంబంధిత వీడియో ఉన్న స్మార్ట్ఫోన్ను జమ్మూకశ్మీర్ పోలీసులు ఎట్టకేలకు సంపాదించారు. ఉమర్ నబీ సోదరుడు జహూర్ ఇలాహీని విచారించగా ఈ మొబైల్ సంగతి వెల్లడించాడు. తన గురించి వినకూడదని వార్త ఏదైనా విన్న వెంటనే ఈ ఫోన్ను నీటిలో పడేసెయ్ అని ఉమర్ సూచించాడని ఇలాహీ పోలీసులకు వెల్లడించాడు. పాక్షికంగా ధ్వంసమైన ఫోన్ నుంచి ఫోరెన్సిక్ నిపుణులు డేటాను వెలికితీయగా అందులో ఈ సెల్ఫీ వీడియో దొరికింది.శ్రీనగర్ సీనియర్ ఎస్పీ సుందర్ చక్రవర్తి సారథ్యంలోని బృందం ఇలాహీని తమదైన రీతిలో ప్రశ్నించడంతో ఫోన్ సంగతి తెల్సింది. ఉమర్ అక్టోబర్ 26 నుంచి నాలుగురోజులపాటు సొంతూరిలో గడిపిననప్పుడు ఈ ఫోన్ను సోదరునికి ఇచ్చి వెళ్లాడు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్), అల్ఖైదా ఉగ్రసంస్థలు గతంలో జరిపిన ఆత్మాహుతి దాడులకు సంబంధించిన వీడియోలను ఉమర్ విపరీతంగా చూసేవాడని ఫోన్డేటా విశ్లేషణతో తేలింది. ఆత్మాహుతి దాడులకు సంబంధించిన సైతం ఉమర్ గతంలో ఎన్నో సెల్ఫీ వీడియోలు తీసినట్లు వెల్లడైంది. ఆత్మాహుతి దాడులు అనేవి ఇస్లాంలో ఎన్నో ప్రశంసలను అందుకున్నాయని ఉమర్ భావించవాడు. ఈ వీడియోలు ఈ ఏడాది ఏప్రిల్లో రికార్డ్చేసినట్లు తెలుస్తోంది. ఉమర్ ఇంట్లో ల్యాబ్ఫరీదాబాద్ సమీపంలో ఉమర్ నివసించిన ఇంట్లో ఒక లేబొరేటరీని దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. పేలుడు పదార్థాలను అతిచిన్న మొత్తాల్లో పేల్చి వాటి తీవ్రతను అంచనావేయడానికి ఈ ల్యాబ్ను ఉమర్ ఉపయోగించేవాడు. టెలిగ్రామ్ యాప్ ద్వారా సత్సంబంధాలు నెరుపుతున్న పాకిస్తాన్ హ్యాండ్లర్ ద్వారా నేర్చుకున్న బాంబు తయారీ కిటుకులను ఉమర్ ఈ ల్యాబ్లోనే పరీక్షించేవాడని తెలుస్తోంది. ఎర్రకోట వద్ద పేల్చిన బాంబును ఇదే ల్యాబ్లో ఉమర్ తయారుచేసినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. రసాయనాలను పరీక్షించడం మొదలు ట్రిగ్గర్ మెకానిజంపై పట్టుసాధించేదాకా అన్నీ ఈ ల్యాబ్లోనే ఉమర్ నేర్చుకున్నట్లు తెలుస్తోంది. హ్యాండ్లర్లు ఫైసల్, హషీమ్, ఉకాసాలతో డాక్టర్ ఉమర్, డాక్టర్ ముజామిల్, డాక్టర్ ఆదిల్ రాఠార్లు టెలిగ్రామ్ యాప్లో దాడి ప్రణాళికపై చర్చించేవారు. ఉమర్ ఉగ్రావేశ వీడియో..ఉమర్ ఉగ్రోన్మాదంతో చేసిన సెల్పీ వీడియోలో తన సూసైడ్ అమరత్వానికి సంబంధించినదని, ఇది సమర్థనీయమంటూ తన హేయమైన చర్యను సమర్థించుకునే ప్రయత్నంచేశాడు. అయితే తన సిద్ధాంతంపై తనకే స్పష్టమైన అవగాహన లేకపోవడంతో తడబడుతూ మాట్లాడటం ఆ వీడియోలో కనిపించింది. ఉగ్రావేశంతో దాదాపు రెండు నిమిషాలపాటు ఉమర్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఎలాంటి స్పష్టమైన ముగింపు లేకుండానే రికార్డింగ్ను అర్ధంతరంగా ఆపేసినట్లు కన్పిస్తోంది. ‘‘ ఆత్మాహుతి బాంబు దాడులను కేవలం సూసైడ్ అనే కోణంలో చూడకూడదు. అవి అమరత్వానికి బలమైన తార్కాణాలు. నాది బలిదాన ఆపరేషన్. బలిదాన ఆపరేషన్లను వీరమరణాలుగా భావించాలి. ఇలాంటి చర్యలకు పాల్పడటం ఆమోదనీయమే.జిహాద్ పవిత్ర యుద్దంలో ఇవి అత్యున్నతమైనవి. అందరూ అనుకుంటున్నట్లు సూసైడ్ బాంబింగ్ అనేది తప్పుడు చర్య కాదు. ఇస్లాంలోనూ సూసైడ్ ప్రస్తావన ఉంది. అయితే సూసైడ్పై ఇస్లాంలోనూ ఎన్నో భిన్నా భిప్రాయాలు, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అయితే ఎవరైనా వ్యక్తి ఏదో ఒక రోజు తప్పకుండా మరణించాల్సిందే ఇది తథ్యం అనే నిర్దారణకు వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా వెళ్లాలని బలంగా నమ్ముతాడు. తనకు నచ్చినప్పుడే తనవు చాలిస్తానని ఆశిస్తాడు. అయితే ఎప్పుడు, ఎక్కడ ఎలా చనిపోతామో ఎవరికీ తెలీదు.విధిరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. చావుకు ఎప్పుడూ భయపడకూడదు. ఇస్లాంలో ఆత్మహత్య అనేది పాపం అని నాక్కూడా తెలుసు. కానీ వీరమరణం, బలిదానం, అమరత్వం కోణంలో చూస్తే ఆత్మాహుతి బాంబింగ్ అనేది ఏ రకంగానూ తప్పుకాదు’’ అని వీడియోలో ఉమర్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వీడియోలో సామాజికమాధ్యమాల్లో వైరల్గా మారింది.అల్ఫలాహ్ గ్రూప్ ఛైర్మన్ అరెస్ట్న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు ఆర్థిక సాయం ఆరోపణలపై నమోదైన మనీ లాండరింగ్ కేసులో అల్–ఫలాహ్ గ్రూప్ చైర్మన్ జావేద్ అహ్మద్ సిద్ధిఖీని ఈడీ అధికారులు మంగళవారం అరెస్ట్చేశారు. తర్వాత ఆయనను రిమాండ్ కోసం సంబంధిత కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు ఢిల్లీ–ఎన్సీఆర్ పరిధిలో అల్–ఫలాహ్ వర్సిటీకి సంబంధించిన ప్రాంగణాల్లో మంగళవారం ఈడీ ముమ్మర తనిఖీలుచేసింది. వర్సిటీ ప్రమోటర్లు, ట్రస్టీల ఇళ్లలో సోదాలు చేసింది. ఉదయం 5.15 గంటలకే 25 ప్రాంతాల్లో సోదాలు చేసి రూ.48 లక్షల నగదును స్వా«దీనంచేసుకున్నారు.వర్సిటీకి నిధులు, డొల్ల కంపెనీల నుంచి పెట్టుబడులు, విరాళాల కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. అల్ఫలాహ్ గ్రూప్తో సంబంధమున్న 9 డొల్ల కంపెనీలు ఒకే అడ్రస్తో నమోదయ్యాయని ఈడీ పేర్కొంది. వర్సిటీ, ట్రస్ట్కు సంబంధించిన కొన్ని కీలక పత్రాల్లో డైరెక్టర్లు/ఉన్నతాధికారుల సంతకాలు లేవని, సిబ్బంది వేతనాల ఈపీఎఫ్ఓ/ఈఎస్ఐ వంటి వివరాలు అప్డేట్ చేయట్లేదని, కేవైసీలు పూర్తిగా లేవని ఈడీ దర్యాప్తులో తేలింది. ఉమర్తో పాటు సహకుట్రదారుగా ఉన్న జసీర్ బిలాల్ వానీని మంగళవారం ఢిల్లీలోని ప్రధాన జిల్లా, సెషన్స్ కోర్టు జడ్జి అంజూ బజాజ్ ఛంద్నా ఎదుట ఎన్ఐఏ ప్రవేశపెట్టింది. మరింత లోతుగా ప్రశ్నించేందుకు బిలాల్ను తమకు 10 రోజులపాటు అప్పగించాలని కోర్టును ఎన్ఐఏ కోరగా అందుకు న్యాయమూర్తి అంగీకరించారు. -
ఢిల్లీ ఉగ్రదాడి కేసులో వీడని మిస్టరీ ఆ మూడు బుల్లెట్లు ఎక్కడివి?
-
ఢిల్లీ ఘటన.. ఉమర్ ఇంటిపై సర్జికల్ స్ట్రయిక్స్
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనకు భద్రతా బలగాలు ప్రతిస్పందనకు దిగాయి. ప్రధాన నిందితుడు ఉమర్ మొహమ్మద్ అలియాస్ ఉమర్ ఉన్ నబీ ఇంటిని నాశనం చేశాయి. దక్షిణ కశ్మీర్లోని పుల్వామాలో ఉన్న అతని ఇంటిని ఈ వేకువ జామున పేలుడు పదార్థాలతో నేలమట్టం చేశాయి. పరిదాబాద్లోని అల్ ఫలాహ్ వర్సిటీలో వైద్యుడిగా పని చేస్తున్న ఉమర్.. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. నేతాజీ సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద హ్యుండాయ్ ఐ20 కారుతో జరిపిన పేలుడులో 13 మంది అమాయకులు ప్రాణాలు వదిలారు. మరో 20 మందికి గాయలయ్యాయి. అయితే.. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం వేకువ జామున ఉమర్ ఇంటిని కూల్చే ప్రక్రియ కొనసాగింది. ఐఈడీ సాయంతో నియంత్రిత పద్ధతిలో ఇంటిని పేల్చేశాయి భద్రతా బలగాలు. ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే వారికి హెచ్చరికగా ఉండాలనే ఈ పని చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంతకు ముందు.. పహల్గాం ఉగ్రదాడి కుట్రలో పాల్గొన్నవారిపై కూడా బుల్డోజర్ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీ బాంబు పేలుడు ఘటనలో ఉమర్ అవశేషాల డీఎన్ఏ పరీక్షలతో నిర్ధారించారు. ఈ దాడి జరగడానికి కొన్ని గంటల ముందే భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. సుమారు 2,900 కిలోల పేలుడు పదార్థాలు, ఆధునిక ఆయుధాలను జమ్ము కశ్మీర్-ఫరీదాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫరీదాబాద్, హైదరాబాద్.. ఇలా దేశంలోని పలు నగరాల్లోని రద్దీ ప్రాంతాల్లో దాడులకు ప్లాన్ చేసినట్లు తేలింది. ముజమ్మిల్, షాహీన్ సయీద్ అనే వైద్యుల వద్ద నుంచి ఇవి లభించాయి. వీళ్లిద్దరూ ఉమర్కు సహచరులుగా తేలింది. అంతేకాదు.. ఢిల్లీ పేలుడు ఘటన కేసు దర్యాప్తులోనూ విస్తూపోయే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.🚨 #BREAKING: Security forces in Pulwama, South Kashmir, have demolished the house of Umar Nabi, the car bomber behind the Delhi terror attack linked to Jaish-e-Mohammed’s Doctor Module. A strong message from India against terrorism. 🇮🇳 #AntiTerrorOperation #Pulwama pic.twitter.com/XjIrOfxDlx— UNKNOWN | 🇮🇳 | | | 𝕏 | (@BhagatSingh_07) November 14, 2025 -
పుల్వామా మాస్టర్మైండ్తో షహీన్కు లింకులు?
ఫరీదాబాద్ పేలుడు పదార్థాల కేసులో అరెస్టయిన డాక్టర్ షహీన్ సయీద్పై ఎన్ఐఏ జరుపుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పుల్వామా దాడుల మాస్టర్ మైండ్ ఉమర్ ఫారుక్ భార్య అపీరా బీబీతో సంబంధాలున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అంతేకాకుండా జైషే-మహమ్మద్ చీఫ్ మసూద్ చెల్లెలితోనూ తను సంప్రదింపులు జరిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పుల్వామా అటాక్ ఈపదం వింటే చాలు భారతావని గుండె బరువెక్కుతోంది. 2019లో సీఆర్పీఎఫ్ సిబ్బంది కాన్వాయ్ పై జైషే-మహమ్మద్ అనే ఉగ్రసంస్థ జరిపిన ఈ దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడుల వ్యూహకర్తగా ఉమర్ ఫారుక్ భావిస్తారు. తాజాగా ఫరీదాబాద్లో అరెస్టయిన డా.షహీన్ సయీద్కి ఫారుక్ భార్య అపీరా బీబీతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ అనుమానిస్తుంది. ఇటీవలే ఏర్పాటైన జైషే మహమ్మద్ మహిళా విభాగం జమాత్-ఉల్-మెమినాత్ లో అపీరా బీబీది ప్రధానపాత్రని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. డా. షహీన్ కేవలం అపీరాతోనే కాకుండా జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ చెల్లెలితోనూ సంప్రదింపులు జరిపినట్లు ఎన్ఐఏ ఆరోపిస్తోంది.ఫరీదాబాద్ పేలుడు పదార్థాల అక్రమ రవాణా కేసులో డాక్టర్ షహీన్ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్టు చేసింది. విచారణలో జైషే మహమ్మద్ మహిళా విభాగాన్ని ఇండియాలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినట్లు తేలింది. దీంతో ఎన్ఐఏ మరింత లోతుగా విచారణ జరుపుతుంది. -
ఢిల్లీ పేలుడు ఘటన.. మరో కారు స్వాధీనం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం(నవంబర్ 10వ తేదీ) రాత్రి జరిగిన భారీ పేలుళ్లలో అక్కడికక్కడే తొమ్మిది మంది దుర్మరణం చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు అసువులు బాశారు. ఈ ఉగ్ర కార్యకలాపాలకు కారణమైన ఒక్కొక్కరినీ స్పెషల్ టీమ్స్ అదుపులోకి తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మరో కారును స్వాధీనం చేసుకున్నారు. హరియాణాలోని ఖండవాలీ గ్రామంలో రెడ్ పోర్డ్ ఈకోస్పోర్ట్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఢిల్లీ కారు బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న డాక్టర్ ఉమర్దిగా గుర్తించారు. ఆ కారు సదరు గ్రామంలో ఓ ఇంటి బయట పార్క్ చేసి ఉండటంతో దాన్ని తనిఖీ చేసి చూడగా అది ఉమర్ మహ్మద్కు చెందినిదిగా కనుగొన్నారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ కారులోనే ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి భారీ పేలుడు పదార్థాలను తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంచితే, ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కారు పేలుడు ఘటనలో తదుపరి కార్యచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సోమవారం రాత్రి జరిగిన పేలుడు ధాటికి సమీప మార్కెట్లోని ప్రజలు, రోడ్లమీద ఉన్న వ్యక్తులు ప్రాణభయంతో పరుగులుతీశారు. తీవ్రస్థాయి పేలుడు కారణంగా మృతదేహాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో అక్కడ భీతావహవాతావరణం నెలకొంది. మంటలు, హాహాకారా లు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీ సమీప ఫరీదాబాద్లో 2,900 కేజీల పేలుడు పదార్థాలను జమ్మూకశ్మీర్, హరియాణా, యూపీ పోలీసుల బృందం స్వాదీనంచేసుకున్న కొన్ని గంటలకే ఢిల్లీలో భారీ పేలుడు సంభవించడం యాధృచ్ఛికం కాదని దర్యాప్తు వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. -
Delhi Blast: ఆపరేషన్ సిందూర్ కు ప్రతీకారంగానే ఢిల్లీ బ్లాస్ట్..?
-
ఢిల్లీ పేలుడు ఘటనపై స్పందించిన అల్లు అర్జున్
ఢిల్లీ పేలుడు ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఈ విషాద సంఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్వీట్ చేశారు. ఇలాంటి సమయంలో బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పోస్ట్ చేశారు. మళ్లీ ఎప్పటిలాగే శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాని ట్విటర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. కాగా..ఈ కారు పేలుడు ఘటనలో దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ సిగ్నల్ వద్ద చోటు చేసుకుంది.కాగా.. అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే పుష్ప-2 తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న వస్తున్న మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ప్రస్తుతం AA22XA6 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. Deeply saddened by the tragic incident near Delhi's Red Fort. My heartfelt prayers are with the victims and their families, and I wish for peace to prevail once again. 🙏🏼 🇮🇳— Allu Arjun (@alluarjun) November 11, 2025 -
ఢిల్లీ పేలుడు ఘటన: మరో ముగ్గురు డాక్టర్లు అరెస్ట్
ఢిల్లీ: ఎర్రకోట సమీపంలోని జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో మరో ముగ్గురు డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు డాక్టర్లు హరియాణాలోని ఆల్ ఫలాహ్ యూనివర్శిటీకి చెందిన వారే కావడం గమనార్హం,. అరెస్ట్ అయిన ముగ్గురు డాక్టర్లలో డాక్టర్ ముజామిల్ షకీల్, డాక్టర్ షహీన్ షహీద్, డాక్టర్ ఉమర్ మహ్మద్లు ఉన్నారు. ఇందులో ఉమర్, ముజామిల్లు కశ్మీర్కు చెందిన వారు కాగా, షహీన్ షహీద్ లక్నోకు చెందిన వారిగా గుర్తించారు. వీరు ముగ్గురు హరియాణాలోని ఫరిదాబాద్ ఆస్పత్రిలో డాక్టర్లుగా పని చేస్తున్నారు. ఫరీదాబాద్ లోని ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేస్తూ దౌజా గ్రామంలో రెండు డాక్టర్ షకీల్ అద్దెకు తీసుకున్నాడు. ఆ రెండు ఇళ్లలో నుంచి 3 టన్నుల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైట్ కలర్ టెర్రర్ మాడ్యూల్ లో డాక్టర్లు, స్టూడెంట్స్ ను ఉగ్రవాదులుగా తయారు చేస్తుంది జైషే మహమ్మద్ సంస్థ. జైషే మహమ్మద్ విమెన్ వింగ్కు డాక్టర్ షహీనా కమాండర్గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే యూనివర్శిటీలోని పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సహా సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కు పెరిగింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన పేలుడులో అక్కడికక్కడే 9 మంది మృతి చెందారు. అయితే.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 12కు చేరింది. గాయపడిన మరో 17 మందికి లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి (LNJP హాస్పిటల్) ఆస్పత్రిలో చికిత్స అందుతోంది.సోమవారం ఉదయం 8గం. ప్రాంతంలో బదర్పూర్ టోల్ బూత్ నుంచి ఢిల్లీలోకి ఎంట్రీ ఇచ్చిన ఐ20 కారు.. పావు గంట తర్వాత ఓకల పెట్రోల్ పంపు స్టేషన్ వద్ద కనిపించింది. మధ్యాహ్నం 3:19గం. సమయంలో ఎర్రకోట పార్కింగ్ ఏరియాలో ఎంట్రీ ఇచ్చింది. సాయంత్రం 6:22 నిమిషాలకు పార్కింగ్ ఏరియా నుంచి బయటికి వచ్చింది. ఆ సమయంలోనూ కారులో ఉమర్ ఉన్నాడు. సరిగ్గా.. రాత్రి 6: 50 నిమిషాలకు ఎర్రకోట సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతూ భారీ శబ్దం చేస్తూ పేలిపోయింది. పేలుడు ఉమర్ కూడా అక్కడికక్కడే మృతి చెందడంతో డీఎన్ఏ పరీక్ష ద్వారా అతని మృతదేహాన్ని నిర్ధారించే పనిలో ఉన్నారు. -
ఢిల్లీ పేలుడు ఘటనపై గౌతమ్ గంభీర్ దిగ్భ్రాంతి
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనను కలిగించింది. ఈ భయంకర పేలుడులో మొత్తం 13 మంది మృతి చెందగా..17 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఢిల్లీలో జరిగిన పేలుడు కారణంగా అమాయకుల ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరం.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని గంభీర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. గంబీర్ ప్రస్తుతం భారత జట్టుతో పాటు కోల్కతాలో ఉన్నాడు. నవంబర్ 14 నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టు ప్రారంభం కానుంది.భద్రతా వలయంలో ఈడెన్..కాగా ఢిల్లీ ఘటన నేపథ్యంలో కోల్కతా పోలీస్లు అలర్ట్ అయ్యారు. మ్యాచ్ జరిగే ఈడెన్ గార్డెన్స్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. తొలి టెస్టు కోసం ఇరు జట్లు ఇప్పటికే కోల్కతాకు చేరుకున్నాయి. దీంతో ఆటగాళ్లు బస చేసే హోటల్స్ వద్ద, స్టేడియంకి వెళ్లే మార్గంలో సెక్యూరిటీని మరింత పెంచారు. సోమవారం నుంచి ఈడెన్ గార్డెన్స్ చుట్టూ పోలీసులు ప్రత్యేక నాకా తనిఖీలు (NAKA checks) చేశారు. -
ఢిల్లీ పేలుడు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
భుటాన్: ఢిల్లీ పేలుళ్లపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. నిన్న ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై స్పందించారు. థింపూలో ఆయన మాట్లాడుతూ.. ఉగ్ర కుట్రలను సహించేది లేదని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఢిల్లీ పేలుళ్ల కుట్ర వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదు. రాత్రంతా అధికారులు, నిఘా సంస్థలతో మాట్లాడుతూనే ఉన్నాం. బాధితుల దుఃఖాన్ని అర్థం చేసుకుంటా.. దేశం మొత్తం ఢిల్లీ పేలుళ్ల బాధితులకు అండగా ఉంది’’ అని మోదీ పేర్కొన్నారు.‘‘ఈ దాడికి సూత్రధారులను వదిలిపెట్టం. ఢిల్లీ పేలుడు ఘటనలో ఉగ్ర కుట్రమూలాలను గుర్తించాం. వాళ్లను న్యాయ స్థానం ముందు నిలబెడతాం. పేలుళ్లపై అర్థరాత్రి వరకు సమీక్షలు చేశాను. వివరాలు తెలుసుకున్నాను. పేలుళ్ల వెనుక ఉన్నది ఎవరైనా వదిలిపెట్టబోం. ఢిల్లీ పేలుడు ఘటన కలిచి వేసింది. చాలా బాధాకరమైన హృదయంతో భూటాన్కు వచ్చాను’’ అని మోదీ చెప్పారు.రాజ్నాథ్ సింగ్ వార్నింగ్..ఢిల్లీలోని ఎర్రకోట పేలుళ్లకు పాల్పడినవారిని కఠినంగా శిక్షిస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని విడిచిపెట్టం అంటూ రాజ్నాథ్ స్పష్టం చేశారు. దేశంలోని ప్రముఖ దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై వేగంగా సమగ్ర విచారణ జరుపుతున్నాయి. దర్యాప్తు వివరాలను త్వరలోనే ప్రజలకు వెల్లడిస్తాం. పేలుళ్ల ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుందని.. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఢిల్లీ పేలుడు ఘటన.. 12కి చేరిన మృతుల సంఖ్య
ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన పేలుడులో అక్కడికక్కడే 9 మంది మృతి చెందారు. అయితే.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురు కాసేపటి కిందట చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 12కు చేరింది. గాయపడిన మరో 17 మందికి లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి (LNJP హాస్పిటల్) ఆస్పత్రిలో చికిత్స అందుతోంది.ఉగ్రసంస్థతో లింకులు ఉన్న డాక్టర్ ఉమర్ మహ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉంటాడని పోలీసులు ఓ అంచనాకి వచ్చారు. ఎర్రకోట పేలుడు ఘటన కేసులో ఉమర్ కుటుంబ సభ్యులు సహా ఆరుగురిని జమ్ముకశ్మీర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వాళ్లలో ఉమర్ తల్లి షమీనా భానో, ఉమర్ సోదరులు ఆశిక్ అహ్మద్, జాహ్ర్ అహ్మద్తో పాటు ప్లంబర్గా పని చేసే అమిర్ రషీద్, ప్రభుత్వ ఉద్యోగి అమీర్ రషీద్ మిర్, బ్యాంకు సెక్యూరిటీ గార్డ్ తారీఖ్ మాలిక్ ఉన్నారు.జమ్ము కశ్మీర్ పహల్గాంకు చెందిన ఉమర్.. ఫరీదాబాద్ ఆయుధాల స్వాధీనం కేసులో పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో.. తానూ దొరకిపోతాననే కంగారులో ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పేలుడుకు ముందు కారు తిరిగిన ప్రదేశాలను సీసీటీవీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. ఉదయం 8గం. ప్రాంతంలో బదర్పూర్ టోల్ బూత్ నుంచి ఢిల్లీలోకి ఎంట్రీ ఇచ్చిన ఐ20 కారు.. పావు గంట తర్వాత ఓకల పెట్రోల్ పంపు స్టేషన్ వద్ద కనిపించింది. మధ్యాహ్నం 3:19గం. సమయంలో ఎర్రకోట పార్కింగ్ ఏరియాలో ఎంట్రీ ఇచ్చింది. సాయంత్రం 6:22 నిమిషాలకు పార్కింగ్ ఏరియా నుంచి బయటికి వచ్చింది. ఆ సమయంలోనూ కారులో ఉమర్ ఉన్నాడు. సరిగ్గా.. రాత్రి 6: 50 నిమిషాలకు ఎర్రకోట సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతూ భారీ శబ్దం చేస్తూ పేలిపోయింది. పేలుడు ఉమర్ కూడా అక్కడికక్కడే మృతి చెందడంతో డీఎన్ఏ పరీక్ష ద్వారా అతని మృతదేహాన్ని నిర్ధారించే పనిలో ఉన్నారు.ఇదీ చదవండి: ఉగ్రవాదంవైపు డాక్టర్లు.. అసలేంటీ వైట్కాలర్ టెర్రరిజం? -
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఉగ్రవాదుల పనే!
సాక్షి, ఢిల్లీ: ఎర్రకోట వద్ద కారు పేలుడు ఘటనలో దర్యాప్తు వేగవంతంగా జరుగుతోంది. ఎన్ఐఏ, ఎన్ఎస్జీ సంస్థలతో పాటు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఇందులో భాగం అయ్యింది. ఉగ్రవాద నిరోధక చట్టం (UAPA) కింద కేసు నమోదు చేశారు. పేలుడు పదార్థాల చట్టం (ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్) సహా పలు కీలక సెక్షన్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. అయితే ఈ పేలుడు ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడేనని పోలీసులు ఓ అంచనాకి వచ్చారు. ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం, జైష్-ఎ-మొహమ్మద్ (JeM), లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థలు భారతదేశంలోని స్థానిక ఉగ్రవాద నెట్వర్క్ సహాయంతో సంయుక్తంగా ఈ కుట్రను నిర్వహించాయి. జైషే మహమ్మద్ సానుభూతిపరుడు డాక్టర్ ఉమర్ ఆత్మాహుతి దాడి చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పేలుడుకు కారణమైన ఐ20 కారును నడిపింది ఉమర్ అని నిర్ధారణ అయ్యింది. ఈ కారు ముగ్గురి చేతులు మారినట్లు తెలుస్తోంది. హర్యానా రిజిస్ట్రేషన్తో ఉన్న ఈ కారు అసలు ఓనర్ మహ్మద్ సల్మాన్ను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు.. దానిని తారిఖ్ అనే వ్యక్తికి అమ్మినట్లు గుర్తించారు. అయితే అక్కడి నుంచి అది డాక్టర్ ఉమర్ చేతికి వెళ్లింది. డాక్టర్ ఉమర్ ఆ కారును నడిపినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఫరీదాబాద్ ఆయుధాల స్వాధీనం కేసులో డాక్టర్ ఉమర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్న సమయంలో.. ఇలా ఆత్మాహుతి జరిపి ఉంటాడని భావిస్తున్నారు. పేలుళ్లలో చనిపోయిన అతన్ని.. డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. 2019లో జమ్ముకశ్మీర్లోని పుల్వామాలోనూ వాహనంలో పేలుడు పదార్థాలను ఉగ్రవాదులు పేల్చేసి ఘాతుకానికి పాల్పడ్డారు. సరిగ్గా అదే తరహాలో ఇప్పుడు ఈ దాడి చేసి ఉంటారని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో.. దేశంలో భారీ ఉగ్రకుట్రను భద్రతాబలగాలు భగ్నం చేసి, పెద్దఎత్తున మందుగుండును స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల్లోనే ఈ పేలుడు ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. రెండు రోజుల కిందట పట్టుబడిన డాక్టర్ ఆదిల్, డాక్టర్ ముజంమిల్ అహ్మద్లను అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్ల నుంచి 2,900 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పట్టుబడిన నలుగురిని మరింత లోతుగా విచారించాలని భావిస్తున్నారు.చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో లాల్ఖిలా మెట్రోస్టేషన్కు చేరువగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సోమవారం సాయంత్రం ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. దాని ధాటికి అనేక వాహనాలు బుగ్గిఅయ్యాయి. 9 నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మరో 20 మంది గాయాలపాలయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటనతో దేశమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పలు నగరాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి, పరిస్థితిని సమీక్షించారు. పేలుడుపై ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతస్థాయిలో సమీక్షించారు. క్షతగాత్రులకు ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
ఢిల్లీలో పేలుడు.. ఏపీలో హైఅలర్ట్
సాక్షి, అమరావతి: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ అప్రమత్తం చేసింది. ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, చిత్తూరు, బెంగళూరు సరిహద్దులో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. టూరిస్ట్ స్పాట్లలోని లాడ్జిలలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. కొత్తగా ఆయా ప్రాంతాల్లోకి వచ్చిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. -
ఢిల్లీ పేలుడు.. ఘటనా స్థలానికి అమిత్షా
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో 10మంది మృతి చెందారు. 20మందికి పైగా గాయపడ్డారు. అయితే, పేలుడు ఘటనలో గాయాల పాలై స్థానిక ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పరామర్శించారు. అనంతరం బాంబు పేలుడు జరిగిన ప్రాంతానికి వెళ్లనుళ్లనున్నారు.అంతకుముందు ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. సాయంత్రం 7గం. సమయంలో సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఘటన జరిగింది. హుండాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలువురు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.. పలు వాహనాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పది నిమిషాల్లో అధికారులు ఘటనా స్థలిలోకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారుపేలుడుపై విచారణ జరుగుతోంది. ఎన్ఐఏ, ఎన్ఎస్జీ దర్యాప్తు చేస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. త్వరలోనే నేను ఘటనా స్థలానికి వెళ్తాను.. క్షతగాత్రులను పరామర్శిస్తాను’అని వ్యాఖ్యానించారు. #WATCH | Delhi: Blast near Red Fort Metro Station | Union Home Minister Amit Shah meets the people injured in the blast, at Lok Nayak Hospital. pic.twitter.com/IMPj2c77rv— ANI (@ANI) November 10, 2025 -
ఢిల్లీ బాంబు పేలుడు: జీపీఎస్ స్పూఫింగ్ అందుకేనా?
ఇటీవల ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)లో సమస్యలతో వందకు పైగా విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం కనిపించిన విషయం తెలిసిందే..! ఇందుకు కారణం.. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) సిగ్నల్స్ స్పూఫింగ్ జరగడమేనని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేసినా.. అధికారికంగా ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అయితే.. తాజా ఢిల్లీ బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో కొన్ని రోజులుగా భారత కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు జీపీఎస్ స్పూఫింగ్ చేసి ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కుట్ర కోణంపై ఉప్పందండంతో..నిజానికి 10 రోజులుగా దేశంలో ఏదో ఒక చోట ఉగ్రవాదులు అరెస్టవుతున్నారు. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఆపరేటివ్లు, లష్కరే తాయిబా ఉగ్రవాదులు, సానుభూతిపరులు పట్టుబడుతున్నారు. జమ్మూకశ్మీర్, హర్యానాల్లో ఏకంగా 300 ఆర్డీఎక్స్, 2,900 కిలోల అమ్మోనియం నైట్రేట్ పేలుడు పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. దీన్ని బట్టి.. ఉగ్రవాద చర్యలపై ముందుగానే నిఘా వర్గాలకు ఉప్పందింది. ఆ కుట్రలను భగ్నం చేసేందుకే జీపీఎస్ స్పూఫింగ్ చేపట్టారు. ఈ కారణంగానే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. అయితే.. బాంబు పేలుళ్లకు యత్నించే ఉగ్ర మూకలకు సైతం జీపీఎస్ స్పూఫింగ్ కారణంగా తమ టార్గెట్ లొకేషన్ను ఎంచుకోవడంలో అడ్డుకట్ట వేసినట్లవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.జీపీఎస్ స్పూఫింగ్ సాధ్యమేనా?సాధారణంగా హ్యాకర్లకు శాటిలైట్ ఆధారిత జీపీఎస్ సిగ్నళ్లను స్పూఫ్ చేయడం దాదాపుగా అసాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. అయితే.. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్(సీఐ సెల్), భారత నిఘా సంస్థ(ఐబీ), మిలటరీ ఇంటెలిజెన్స్ వంటి సంస్థలు జీపీఎస్ స్పూఫింగ్ చేసే అవకాశాలున్నాయి. శత్రుడ డ్రోన్లు, నిఘా విమానాలను తప్పుదోవ పట్టించేందుకు, వాటిని దాడుల నుంచి నిరోధించేందుకు ఈ చర్యలు తీసుకుంటారు. ముఖ్యమైన ప్రదేశాలను ‘హార్డ్డెన్’ (రక్షణ) కల్పించేందుకు రియల్ టైమ్ మాస్క్ వేస్తారని సమాచారం. ఢిల్లీ విమానాశ్రయం కూడా అత్యంత కీలకమైనది కావడంతో.. రన్వే నుంచి సుమారు 60 నాటికల్ మైళ్ల పరిధి వరకు జీపీఎస్ స్పూఫింగ్ ప్రభావం కనిపించింది. సాధారణంగా ఇంతటి పరిధిలో స్పూఫింగ్ జరగడం చాలా అరుదు. యుద్ధాల సమయంలోనే ఇలా స్పూఫింగ్ చేస్తుంటారని తెలుస్తోంది. శత్రు దాడుల నుంచి రక్షణ రంగ సంస్థలను కాపాడేందుకు కూడా ఓపెన్ సోర్స్ ట్రాప్ పేరుతో జీపీఎస్ స్పూఫింగ్ చేస్తారని తెలుస్తోంది. ఎలా చేస్తారు?జీపీఎఫ్ స్పూఫింగ్కు రెండు మార్గాలను నిఘావర్గాలు ఎంచుకుంటాయని సమాచారం. వాటిల్లో మొదటిది జామింగ్(blocking) కాగా.. రెండోది జీపీఎస్ స్పూఫింగ్. మొదటి దాంట్లో జీపీఎస్ రిసీవర్కు ఉపగ్రహ సిగ్నళ్లను బ్లాక్(no fix) చేస్తారు. రెండో పద్ధతిలో ఫేక్ సిగ్నల్స్ని పంపుతారు. అంటే.. అసలైన జీపీఎస్ లొకేషన్ కాకుండా.. ఫేక్ లొకేషన్ కనిపిస్తుంది. ఇలా స్పూఫింగ్ చేయడానికి మిలటరీ గ్రేడ్ ప్రీక్వెన్సీ- ఈడబ్ల్యూ ట్రాన్స్మిటర్లు అవసరమని రేడియో ఫ్రీక్వెన్సీ(ఆర్ఎఫ్) ఇంజనీర్లు చెబుతున్నారు. -
ఢిల్లీ పేలుడు ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ఢిల్లీ ఎర్రకోట దగ్గర భారీ పేలుడు ఘటనతో దేశం మొత్తం ఉలిక్కి పడింది. పేలుడు ధాటికి 10 మంది మృతి చెందగా.. 24 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ‘‘ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారాయన. Deeply shocked and saddened to learn about the massive explosion near Red Fort Metro Station in Delhi. My heart goes out to the families who lost their loved ones in this strongly condemnable incident.Praying for a speedy recovery of all those injured in this ghastly tragedy.— YS Jagan Mohan Reddy (@ysjagan) November 10, 2025 సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద భారీ పేలుడు సంభవించింది. తొలుత పార్క్ చేసి ఉన్న కారు పేలి ఈ ఘోరం సంభవించిందని అంతా భావించారు. అయితే 6.52గం. ప్రాంతంలో పేలుడు సంభవించిందని, రెడ్సిగ్నల్ వద్ద కారు నెమ్మదిగా ఆగి ఆగుతుండగానే పేలిందని, ఆ సమయంలో కారులో ప్రయాణికులు ఉన్నారని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. పేలుడుకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు తర్వాతే స్పష్టమైన ప్రకటన చేస్తామని అన్నారు.


