ఢిల్లీ పేలుడు ఘటనపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి | YS Jagan expresses deep shock over Delhi Red Fort Incident | Sakshi
Sakshi News home page

ఢిల్లీ పేలుడు ఘటనపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Nov 10 2025 8:58 PM | Updated on Nov 10 2025 10:36 PM

YS Jagan expresses deep shock over Delhi Red Fort Incident

సాక్షి, తాడేపల్లి: ఢిల్లీ ఎర్రకోట దగ్గర భారీ పేలుడు ఘటనతో దేశం మొత్తం ఉలిక్కి పడింది. పేలుడు ధాటికి 10 మంది మృతి చెందగా.. 24 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. 

‘‘ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని ఎక్స్‌ ఖాతాలో ఓ ట్వీట్‌ చేశారాయన. 

 

సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్‌ గేట్‌ నెంబర్‌ 1 వద్ద భారీ పేలుడు సంభవించింది. తొలుత పార్క్‌ చేసి ఉన్న కారు పేలి ఈ ఘోరం సంభవించిందని అంతా భావించారు. అయితే 6.52గం. ప్రాంతంలో పేలుడు సంభవించిందని, రెడ్‌సిగ్నల్‌ వద్ద కారు నెమ్మదిగా ఆగి ఆగుతుండగానే పేలిందని, ఆ సమయంలో కారులో ప్రయాణికులు ఉన్నారని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. పేలుడుకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు తర్వాతే స్పష్టమైన ప్రకటన చేస్తామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement