క్రిస్మస్‌ ప్రార్థనల్లో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌ ప్రార్థనల్లో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి

Dec 26 2025 8:40 AM | Updated on Dec 26 2025 8:40 AM

క్రిస్మస్‌ ప్రార్థనల్లో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర

క్రిస్మస్‌ ప్రార్థనల్లో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర

ప్రత్తిపాడు: పెదనందిపాడులోని ఆంధ్ర ఇవాంజెలికల్‌ లూథరన్‌ చర్చిలో గురువారం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఫాదర్లు ప్రార్థనల అనంతరం క్రీస్తు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా లావు నాగేశ్వరావు సంఘ పెద్దలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్‌ అంటే ప్రేమ, కరుణకు ప్రతీక అని చెప్పారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement