Android operating system
-
జనవరి 1 నుంచి వాట్సప్ పని చేయదు! కారణం..
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ వాట్సప్ జనవరి 1, 2025వ తేదీ నుంచి కొన్ని ఫోన్లలో పని చేయదని మెటా ప్రకటించింది. ఇప్పటికీ చాలామంది వినియోగదారులు ఆండ్రాయిడ్ పాత వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్తోనే వాట్సప్ను ఉపయోగిస్తున్నారని తెలిపింది. దాంతో వాట్సప్ అప్డేట్లు విడుదల చేసినప్పుడు ఆయా డివైజ్ల్లో పని చేయడం లేదని పేర్కొంది. వినియోగదారులకు మెరుగైన సర్వీసు, భద్రతను అందించేందుకు కంపెనీ అందిస్తున్న అప్డేట్లను పాత ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న వారు అందుకోలేకపోతున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. భవిష్యత్తులో భద్రత కారణాల వల్ల కొన్ని ఫోన్లలో వాట్సప్ను నిలిపేస్తున్నట్లు తెలిపింది. జనవరి 1, 2025 నుంచి వాట్సాప్ పని చేయని డివైజ్ల లిస్ట్కు ప్రకటించింది.సాంసంగ్: గెలాక్సీ ఎస్3, గెలాక్సీ నోట్ 2, గెలాక్సీ ఏస్ 3, గెలాక్సీ ఎస్4 మినీమోటరోలా: మోటో జి (1వ జనరేషన్), రేజర్ హెచ్డీ, మోటో ఈ 2014హెచ్టీసీ: వన్ ఎక్స్, వన్ ఎక్స్+, డిజైర్ 500, డిజైర్ 601ఎల్జీ: ఆప్టిమస్ జీ, నెక్సస్ 4, జీ 2 మినీ, ఎల్ 90సోనీ: ఎక్స్పీరియా జెడ్, ఎక్స్పీరియా ఎస్పీ, ఎక్స్పీరియా టీ, ఎక్స్పీరియా వీయాపిల్ ఓఎస్లోనూ..ఆండ్రాయిడ్తోపాటు యాపిల్ ఓఎస్ ఇన్స్టాల్ అయిన కొన్ని పరికరాల్లోనూ వాట్సప్ పని చేయదని మెటా తెలిపింది. అయితే అందుకు మే 5 వరకు గడువు ఉందని పేర్కొంది. జనవరి నుంచి ఐదు నెలల నోటీస్ పీరియడ్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఐఓఎస్ 15.1 వర్షన్ కంటే ముందున్న ఓఎస్లు వాడుతున్న డివైజ్ల్లో వాట్సప్ పనిచేయదని కంపెనీ తెలిపింది. కంపెనీ వివరాల ప్రకారం ప్రధానంగా ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ వాడుతున్న వినియోగదారులపై ఈ ప్రభావం పడుతుంది.ఇదీ చదవండి: అప్పుడు పరీక్షలో ఫెయిల్.. గూగుల్లో జాబ్: జీతం తెలిస్తే..అప్డేట్లు ఎందుకు అవసరం అంటే..ఆన్లైన్ యాప్లు నిత్యం కొత్త అప్డేట్లు తీసుకొస్తుంటాయి. కొన్ని అప్డేట్లు వినియోగదారులకు మరింత మెరుగైన సర్వీసు అందించేలా ఉంటే, మరికొన్ని భద్రత పరమైనవి ఉంటాయి. పాత డివైజ్ల్లోని హార్డ్వేర్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ను సపోర్ట్ చేయవు. దాంతో కొత్తగా వస్తున్న యాప్ అప్డేట్లు పాత ఓఎస్ల్లో పని చేయవు. ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఏదైనా అప్డేట్లు వస్తున్నప్పుడు అందుకు వీలుగా ఓఎస్లు, డివైజ్ల్లోని యాప్లను అప్డేట్ చేసుకోవడమే మేలని కొందరు సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
కొత్త ఆండ్రాయిడ్15లో అబ్బురపరిచే ఫీచర్లు
సరికొత్త గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 15 అందుబాటులోకి వచ్చేసింది. స్మార్ట్ఫోన్లను మరింత మెరుగ్గా చేసేందుకు ఇందులో అనేక కొత్త ఫీచర్లను జోడించారు. వీటిలో అబ్బురపరిచే కొన్ని ఫీచర్లను ఇక్కడ తెలుసుకుందాం..ప్రైవేట్ స్పేస్ప్రైవేట్ స్పేస్ అనేది వర్చువల్ లాకర్. వ్యక్తిగతమైన, గోప్యమైన యాప్లను ఇక్కడ ఉంచవచ్చు. ఈ యాప్లను మీరు మాత్రమే యాక్సెస్ చేయగలిగేలా భద్రతను ఇస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఫోన్ ఇచ్చే పేరెంట్స్కు ఇది బాగా ఉపయోగపడుతుంది. బ్యాంకింగ్, షాపింగ్ వంటి యాప్లు ఇక్కడ సురక్షితంగా ఉంటాయి.చార్జింగ్ లిమిట్ ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ జీవిత కాలం తగ్గిపోతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఆండ్రాయిడ్ 15లో 80% లిమిట్ ఆప్షన్ తీసుకొచ్చారు. దీని ద్వారా బ్యాటరీ తొందరగా దెబ్బతినకుండా నివారించుకోవచ్చు.థెఫ్ట్ ప్రొటెక్షన్ఆండ్రాయిడ్ 15లో తీసుకొచ్చిన థెఫ్ట్ ప్రొటెక్షన్ ఫీచర్ అసాధారణ చర్యలతో మీ ఫోన్ను ఎవరైనా చోరీ చేయడానికి ప్రయత్నించి ఉంటే తెలియజేస్తుంది. ఒక వేళ మీ ఫోన్ చోరీకి గురైతే మీ డేటాను రక్షించడానికి, ఫ్యాక్టరీ రీసెట్ చేయకుండా ఇది ఆటోమేటిక్గా లాక్ చేస్తుంది. మీ ఫోన్ నంబర్ని ఉపయోగించి వేరొక ఫోన్ నుంచి మీ ఫోన్ను లాక్ చేయవచ్చు.అడాప్టివ్ వైబ్రేషన్కొందరికి రింగ్ టోన్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అందుకే ఫోన్ను వైబ్రేషన్ లేదా సైలెంట్ మోడ్లో పెట్టుకుంటారు. మీటింగ్స్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేస్తుంటారు. అయితే దీని వల్ల కొన్నిసార్లు కాల్స్ వచ్చినప్పుడు గుర్తించలేం. దీని పరిష్కారం కోసమే ఆండ్రాయిడ్ 15లో అడాప్టివ్ వైబ్రేషన్ ఫీచర్ ఇచ్చారు. సందర్భానికి అనుగుణంగా దానంతట అదే వైబ్రేషన్ను అడ్జెస్ట్ చేస్తుంది.యాప్ పెయిర్స్తరచూ స్ప్లిట్ స్క్రీన్ ఉపయోగించేవారి కోసమే ఈ ఫీచర్. ఏవైనా రెండు యాప్లను జతగా వినియోగించేవారు వాటిని సేవ్ చేసుకునే అవకాశం ఇందులో ఉంది. వీటిని హెమ్ స్క్రీన్పై షార్ట్కట్స్గా సేవ్ చేసుకోవచ్చు.యాప్ ఆర్కైవింగ్ఫోన్లో స్టోరేజ్ అయిపోయినప్పుడు పాత యాప్లను వదిలించుకోవాలి. అయితే యాప్ను అన్ఇన్స్టాల్ చేయడం వలన దాని డేటా మొత్తం పోతుంది. మళ్లీ ఇన్స్టాల్ చేస్తే మొదటి నుండి సెటప్ చేయాలి. దీన్ని పరిష్కరించడానికి గూగుల్ గతంలో ప్లేస్టోర్కి యాప్ ఆర్కైవింగ్ని జోడించింది. ఇప్పుడిదే ఫీచర్ను ఆండ్రాయిడ్ 15తో ఇన్బిల్ట్గా తీసుకొచ్చింది. తొలగించిన యాప్ను మళ్లీ ఇన్స్టాల్ చేసినప్పడు పాత డేటా అలాగే ఉంటుంది.శాటిలైట్ ద్వారా ఎస్ఎంస్శాటిలైట్ ద్వారా ఎస్ఎంస్లు పంపించే ఈ సరికొత్త ఫీచర్ను ఆండ్రాయిడ్ 15లో ప్రకటించినప్పటికీ ప్రస్తుతానికి దీన్ని ఉపయోగించలేం. క్యారియర్లు ఈ సర్వీస్కు ధర నిర్ణయించే పనిలో ఉన్నాయి. దీని కోసం కొంత కాలం వేచి ఉండవలసి ఉంటుంది. -
క్రోమ్లో ఐదు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగపడతాయంటే?
కంప్యూటర్ లేదా మొబైల్లో ఏదైనా సెర్చ్ చేయాలంటే చాలామందికి క్రోమ్ గుర్తొస్తుంది. క్రోమ్ ఇప్పుడు యూజర్ల కోసం ఐదు కొత్త ఫీచర్స్ తీసుకువచ్చింది. ఇంతకీ క్రోమ్ తీసుకువచ్చిన ఈ కొత్త ఫీచర్స్ ఏంటి? అవి ఎలా పనిచేస్తాయని విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.👉సమీపంలో ఉండే ఏదైనా స్థలాలను సెర్చ్ చేయాలనుకున్నప్పుడు క్రోమ్ బార్లో ఎంటర్ చేయగానే మీ పనిని మరింత సులభతరం చేయడానికి మూడు ఆప్షన్స్ చూపిస్తుంది. ఉదాహరణకు మీరు ఓ రెస్టారెంట్ లేదా షాపింగ్ మాల్ వెళ్లాలనుకున్నప్పుడు.. క్రోమ్ బార్లో సెర్చ్ చేయగానే దానికి కింద కాల్, డైరెక్షన్, రివ్యూ అనేవి కనిపిస్తాయి. ఇవి షార్ట్కట్ బటన్స్ అన్నమాట. ఈ ఫీచర్ ఇప్పుడు కేవలం ఆండ్రాయిడ్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో యాపిల్ క్రోమ్లో కూడా అందుబాటులోకి వస్తాయి.👉ఐప్యాడ్లు, ఆండ్రాయిడ్ టాబ్లెట్లు వాటి పెద్ద స్క్రీన్ పరిమాణాలను సద్వినియోగం చేసుకోవడానికి.. క్రోమ్ అడ్రస్ బార్ను రిఫ్రెష్ చేసింది. ఒకసారి అడ్రస్ బార్ ఉపయోగించిన తరువాత.. మళ్ళీ తిరిగి వెళ్తే అప్పటికే హిస్టరీ లేదా వెబ్సైట్ డ్రాప్ డౌన్ క్రింద ట్రెండింగ్ అంశాలను చూపిస్తుంది.👉ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలో షార్ట్కట్స్ అందిస్తోంది. ఉదాహరణకు సిటీ మెట్రో కోసం సమయాలను చూడడానికి మీరు సాధారణంగా షెడ్యూల్స్ అని టైప్ చేసి ఉండవచ్చు. దాన్ని మళ్ళీ మీరు సెర్చ్ చేసినప్పుడల్లా వెంటనే కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మీ సమయాన్ని సేవ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది.👉ఐఓఎస్లో ట్రేండింగ్ సెర్చ్.. అంటే మీరు క్రోమ్ సెర్చ్ బార్లో.. సెర్చ్ చేయడానికి ముందే.. ట్రెండింగ్లో ఉన్న విషయాలు కింద కనిపిస్తాయి.👉ఐఓఎస్లో గతంలో వెతికిన విషయాలకు సంబంధించిన వార్తలు, స్పోర్ట్స్ కార్డులు డిస్కవర్ ఫీడ్లో కనిపిస్తాయి. ఈ ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్లో అందుబాటులో ఉంది. మీరు మూడు-చుక్కల మెనుని ఎంచుకోవడం ద్వారా క్రోమ్ మొబైల్ యాప్లో డిస్కవర్ ఫీడ్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. -
ఆండ్రాయిడ్ 15 బీటా 2లోని కొత్త ఫీచర్లు
ఆల్ఫాబెట్ ఇంక్ ఇటీవల నిర్వహించిన గూగుల్ I/O 2024 సదస్సులో ఆండ్రాయిడ్ 15 బీటా 2ను పీచర్లను ప్రకటించింది. ఈ ఫీచర్లు ఇప్పటికే పిక్సెల్ మొబైల్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. పిక్సెల్ ఫోన్ను గూగుల్ ప్రత్యేకంగా తయారుచేస్తోంది. దాంతో కొత్త ఫీచర్లు తమ వినియోగదారులకు ఇప్పటికే అందుబాటులో ఉంచింది.గూగుల్ ప్రకటించిన ఈ ఫీచర్లను త్వరలో ఆండ్రాయిడ్ వాడుతున్న ఇతర కంపెనీ ఫోన్లలోనూ ప్రవేశపెట్టనున్నారు. డెవలపర్ ప్రివ్యూ లేదా బీటా వెర్షన్లలో పాల్గొంటున్న వారికి ఆటోమేటిక్గా బీటా 2 అప్డేట్ లభిస్తుందని కంపెనీ తెలిపింది.ఆండ్రాయిడ్ 15 బీటా 2లో కొన్ని ఫీచర్లు..ఆండ్రాయిడ్ 15 బీటా 2లో ప్రైవేట్ స్పేస్ సౌకర్యం అందిస్తున్నారు. దీనివల్ల ప్రత్యేక ప్రొఫైల్ను క్రియేట్ చేసి కావాల్సిన యాప్లను విడిగా సేవ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ లాక్ చేసినప్పుడు అవి కనిపించవు.ప్రైవేట్ స్పేస్లోని యాప్లన్నీ లాంఛర్లోని ప్రత్యేక కంటైనర్లో ఉంటాయి. రీసెంట్ యాప్స్, నోటిఫికేషన్స్, సెటింగ్స్లోనూ కనిపించవు.ఫీచర్ యాప్ పెయిర్స్ అనే కొత్త ఫీచర్తో స్ప్లిట్ స్క్రీన్ మోడ్లో ఒకేసారి రెండు యాప్లను లాంఛ్ చేయొచ్చు. తరచూ ఉపయోగించే యాప్లను వెంటవెంటనే ఓపెన్ చేయొచ్చు.ఇదీ చదవండి: పాలసీదారులను మోసం చేస్తున్న బీమా ప్లాట్ఫామ్లుహెల్త్ కనెక్ట్ ఫీచర్లో స్కిన్ టెంపరేచర్, ట్రైనింగ్ ప్లాన్స్ అనే విభాగాలు చేర్చారు. దాంతో యూజర్లు తమ ఆరోగ్యం, ఫిట్నెస్పై మరింత శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంది. -
మొన్న శాంసంగ్.. తాజాగా యాపిల్ ప్రొడక్ట్లపై కేంద్రం హైరిస్క్ అలర్ట్..
కేంద్రప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్-ఇన్) ఇటీవల శాంసంగ్ కంపెనీ ఉత్పత్తుల్లో అనేక లోపాలు ఉన్నాయని గుర్తించిన సంగతి తెలిసిందే. ఫలితంగా సైబర్ నేరస్థులు శాంసంగ్ ఫోన్లు వాడుతున్న లక్షల మంది వినియోగదారుల నుంచి తమ వ్యక్తిగత డేటాను దొంగలించే ప్రమాదం ఉందని సెర్ట్ పేర్కొంది. తాజాగా యాపిల్ ఉత్పత్తులకు కూడా ఇదే తరహాలో ప్రమాదం ఉందని కేంద్రం తెలిపింది. ఈ కంపెనీకి చెందిన పలు ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సెర్ట్-ఇన్) వెల్లడించింది. దీని వల్ల యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యూజర్లు వెంటనే తమ ఉత్పత్తులను లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఐఫోన్, యాపిల్ వాచ్, మ్యాక్ బుక్, ఐపాడ్, యాపిల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్లతో పాటు సఫారీ బ్రౌజర్లో ఈ భద్రతా పరమైన లోపాలను గుర్తించినట్లు సెర్ట్-ఇన్ తన అడ్వైజరీలో వివరించింది. ‘యాపిల్ ఉత్పత్తుల్లో పలు సెక్యూరిటీ లోపాలు బయటపడ్డాయి. దీని వల్ల హ్యాకర్లు యాపిల్ ఉత్పత్తుల్లోని భద్రతా పరిమితులను అధిగమించి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉంది’ అని సెర్ట్ తెలిపింది. ఈ లోపాలను హ్యాకర్లు గుర్తిస్తే సెక్యూరిటీ పరిమితులను అధిగమించగలరని, ఏకపక్షంగా కోడ్ను ఎగ్జిక్యూట్ చేసి కీలక సమాచారాన్ని పొందే ప్రమాదం ఉందని తెలిపింది. ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 17.2 కంటే ముందు వెర్షన్లు, ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 16.7.3 కంటే ముందు వెర్షన్లు, మ్యాక్ ఓఎస్ సొనోమా 14.2, వెంట్యురా 13.6.3, మానిటరీ 12.7.2, యాపిల్ టీవీ ఓఎస్ 17.2, యాపిల్ వాచ్ ఓఎస్ 10.2, సఫారీ 17.2 కంటే ముందు వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు సెర్ట్-ఇన్ వెల్లడించింది. కాగా.. యాపిల్ ఉత్పత్తులకు కేంద్రం గతంలోనూ పలుమార్లు ఇలాంటి అలర్ట్లు జారీ చేసింది. ఇదీ సంగతి: స్మార్ట్ఫోన్ వినియోగదారులకు కేంద్రం హై అలర్ట్! ఇటీవలే శాంసంగ్ స్మార్ట్ఫోన్ యూజర్లకు కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఓఎస్తో పనిచేసే శాంసంగ్ ఫోన్లలో భద్రతాపరమైన లోపం ఉందని, దీనివల్ల వినియోగదారులకు తెలియకుండానే వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది. కాబట్టి యూజర్లు లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ వివరించింది. -
గూగుల్ కొత్త ఫీచర్.. ఆండ్రాయిడ్ ఫోన్లను అలా కూడా వాడొచ్చు!
కోవిడ్ మహమ్మారి అనంతరం జాబ్ ఇంటర్వ్యూలు, ఆఫీస్ మీటింగ్లు.. ఇలా అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెబ్క్యామ్లకు ప్రాధాన్యం బాగా పెరిగింది. స్మార్ట్ఫోన్లతో పోలిస్తే వెబ్క్యామ్ నాణ్యత చాలా తక్కువ. కాబట్టి స్మార్ట్ఫోన్లే వెబ్క్యామ్లుగా మారితే.. బాగుంటుంది కదా.. అవును అలాటి ఫీచర్నే గూగుల్ (Google) తీసుకొస్తోంది. ఆన్లైన్ మీటింగ్లు, ఇంటర్వ్యూల కోసం ల్యాప్టాప్లు, పర్సనల్ కంప్యూటర్లకు ఉపయోగించే వెబ్క్యామ్లకు (Webcam) బదులుగా మంచి కెమెరా ఫీచర్లున్న ఆండ్రాయిడ్ ఫోన్లను (Android Smartphone) ఉపయోగించే ఫీచర్పై టెక్ దిగ్గజం గూగుల్ కసరత్తు చేస్తోంది. ఏ ఆపరేటింగ్ సిస్టమ్కైనా.. గూగుల్ రూపొందించిన ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వెబ్కెమెరా ఫీచర్ను గూగుల్ ఉత్పత్తులకే కాకుండా విండోస్ ల్యాప్టాప్, మ్యాక్బుక్ లేదా మరొక ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా సరే ఉపయోగించుకోవచ్చు. ఇలా పని చేస్తుంది.. ఆండ్రాయిడ్ ఫోన్ని పర్సనల్ కంప్యూటర్కి కనెక్ట్ చేయాలి. USB ప్రాధాన్యతల మెనూలో 'వెబ్క్యామ్ ఫంక్షనాలిటీ' ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో వెబ్క్యామ్ ఆప్షన్ను ఎంచుకోవాలి. ఫీచర్ ప్రస్తుతానికి బీటా వర్షన్లో ఉంది. "Android 14 QPR1 Beta 1"ని ఇన్స్టాల్ చేసి ఉంటే దీన్ని ఉపయోగించవచ్చు. అక్టోబర్లో పిక్సెల్ 8 లాంచ్ తర్వాత స్థిరమైన వెర్షన్ డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది. -
వాట్సాప్లో మరో అదిరిపోయే ఫీచర్.. దాని వల్ల ఉపయోగం ఏంటంటే?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మరో అప్డేట్తో ముందుకు వచ్చింది. ఇప్పటికే చాట్ లాక్, స్క్రీన్ షేరింగ్ వంటి ఫీచర్లను అందించిన వాట్సాప్ తాజాగా చాట్లో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. వీబీటా ఇన్ఫో ప్రకారం.. వాట్సాప్ యూజర్లు చాట్చేసే సమయంలో గతంలో చేసిన చాట్లను వెతికేందుకు, చదవని మెసేజ్లను చదివేందుకు కాంటాక్ట్స్, బిజినెస్ కాంటాక్ట్స్ను సులభంగా గుర్తించ వచ్చు. ఇందుకోసం చాట్పేజ్పై భాగంలో సెర్చ్ బార్ను తీసుకొని రానుంది. కొత్త ఫీచర్ ఎలా ఉంటుందంటే నివేదిక ప్రకారం.. కొత్త డిజైన్ స్క్రీన్షాట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. స్క్రీన్షాట్లో యాప్ పై భాగంలో బార్ తెలుపు రంగులో కనిపిస్తుంది. అయితే యాప్ పేరుతో సహా ఇతర ఆప్షన్లు గ్రీన్ కలర్లో ఉంటాయి. నావిగేషన్ బార్ సైతం దిగువ భాగంలో ఉన్నట్లు కనిపిస్తుంది. కాగా, వాట్సాప్ ఈ కొత్త డిజైన్.. గూగుల్ డిజైన్3 మార్గదర్శకాలకు అనుగుణంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. -
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో చాలా లోపాలు
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో చాలా లోపాలున్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ పేర్కొంది. ఆండ్రాయిడ్– 13 సహా పలు వెర్షన్లు వైరస్ల బారిన పడే ప్రమాదం చాలా ఉందని ఆందోళన వెలిబు చ్చింది. వాటి వినియోగంలో జాగ్రత్తగా ఉండాలంటూ యూజర్లకు సోమవారం ’అతి తీవ్ర’ హెచ్చరిక లు జారీ చేసింది. లేదంటే మొబైల్స్ తదితరాల్లో సున్నిత సమాచారం హాకర్ల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని వివరించింది. ఆండ్రాయిడ్ 10, 11, 12, 12ఎల్, 13 వెర్షన్లలో వీటిని ప్రధానంగా గమనించినట్టు చెప్పింది. వీటివల్ల ఫ్రేంవర్క్, ఆండ్రాయిడ్ రన్ టైం, సిస్టం కంపోనెంట్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్స్, కెర్నల్, ఆర్మ్ కంపోనెంట్స్, మీడియా టీ కంపోనెంట్, కలోకాం క్లోజ్డ్ సోర్స్ కంపోనెంట్స్ వంటివాటి పనితీరు లోపభూయిష్టంగా మారుతుందని వివరించింది. అప్డేషన్ ఇలా... ఆండ్రాయిడ్ ఆధారిత డివైస్ల భద్రత కోసం లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచెస్కు తక్షణం అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఇందుకు డివైస్ సెట్టింగ్స్లోకి వెళ్లి సిస్టమ్పై క్లిక్ చేయాలి..సిస్టమ్ అప్ డేట్స్పై క్లిక్ చేయండి. అప్డేట్స్ ఉంటే డౌన్ లోడ్ చేసుకోండి. -
చాట్జీపీటీ ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్, రిజిస్ట్రేషన్స్ షురూ!
ChatGPT for Android users: ఓపెన్ ఏఐకిచెందిన పాపులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్బాట్ చాట్ జీపీటీ ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చాట్ జీపీటీ యాప్ ఎట్టకేలకు వచ్చే వారమే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఇది ఐవోఎస్ యూజర్లకు ఈ ఏడాది మేలోనే అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇపుడిక ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. వచ్చే వారం ఈ యాప్ అధికారికంగా అందుబాటులోకి వస్తుంది. దీనికి సంబంధించి గూగుల్ ప్లే స్టోర్ లో ఇప్పటికే ఈ యాప్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. బ్రౌజర్ ద్వారా అందుబాటులో ఉన్న చాట్జీపీటీ ఆండ్రాయిడ్ అప్లికేషన్ వినియోగదారుల కోసం చాట్బాట్కి సులభంగా త్వరితగతిన సేవలు అందించనుంది. Chat GPT CTO మీరా మురాఠీ చేసిన ట్వీట్ ఇది. We’re rolling out ChatGPT for Android users next week https://t.co/3tNLNcG5Kw — Mira Murati (@miramurati) July 21, 2023 చాట్ జీపీటీ రిజిస్ట్రేషన్ ♦ గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి చాట్జీపీటీ అని సెర్చ్ చేయాలి ♦ ఇన్ స్టాల్ పై క్లిక్ చేసి, ఒకే చేయాలి. ♦ ఒకసారి యాప్ లాంచ్ అయిన తరువాత, ఈ యాప్ ఆటోమేటిక్ గా ఇన్ స్టాల్ అవుతుంది. ♦ అంతేకాదు.. ఆటోమెటిక్ ఇన్ స్టాలేషన్ వద్దు అనుకుంటే అన్ రిజిస్టర్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. కాగా చాట్పీజీటీ గతేడాది (2022 నవంబరు) అందుబాటులోకి వచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ చాట్జీపీటీ ఇంటర్నెట్ ప్రపంచంలో సునామిలా దూసుకొచ్చింది. ప్రారంభించిన రెండు నెలల్లోనే 100 మిలియన్లకు డౌన్లోడ్లను నమోదు చేసింది. తొలుత వెబ్ అప్లికేషన్గా వచ్చినప్పటికీ, ఈ ఏడాది మే లో ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. దాదాపు మూడునెలల తరువాత ఇపుడిక ఆండ్రాయిడ్ యూజర్లకు చాట్జీపీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
ఆండ్రాయిడ్ ఫోన్ స్పీడ్ తగ్గిందా? ఇదిగో పరిష్కారం!
నేడు ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో మొబైల్ బ్రౌసింగ్ స్పీడ్ తగ్గినట్లు అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి? ఎలా క్లియర్ చేయాలి, అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి మనం మొబైల్ ఫోన్ ఉపయోగించే సమయంలో అనేక బ్రౌజర్లను ఓపెన్ చేస్తుంటాము. అవన్నీ కూడా బ్యాకెండ్లో సేవ్ అయి ఉండే అవకాశం ఉంటుంది. దీని కారణంగానే మొబైల్ ఫోన్ వేగం మునుపటి కంటే కొంత తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఆండ్రాయిడ్ ఫోన్లో క్యాచ్ ఫైల్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తరువాత తప్పకుండా స్పీడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్లో క్యాచ్ ఫైల్స్ క్లియర్ చేయడం ఎలా? మొదట మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ లేదా టాబ్లెట్లో క్రోమ్ యాప్ ఓపెన్ చేయాలి క్రోమ్ ఓపెన్ చేసిన తరువాత కుడివైపున మూలలో మరిన్ని అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే మెనూలో హిస్టరీ ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత 'క్లియర్ యువర్ బ్రౌసింగ్ డేటా' అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి, అందులో ఆల్ టైమ్ మీద క్లిక్ చేస్తే అప్పటికి సేవ్ అయిన హిస్టరీ మొత్తం డిలీట్ అవుతుంది. ఫైల్స్ ఎక్కువగా ఉంటే దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది, దీని ద్వారా మొబైల్ స్పీడ్ తప్పకుండా పెంచుకోవచ్చు. (ఇదీ చదవండి: మంచి స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో టాప్ 5 మొబైల్స్!) మొబైల్ స్పీడ్ తగ్గింది అనిపించినప్పుడు క్యాచ్ క్రమం తప్పకుండా క్లియర్ చేసుకుంటూ ఉండాలి. క్యాచ్ క్లియర్ అనేది కేవలం మొబైల్ ఫోన్కి మాత్రమే కాకుండా అప్లికేషన్లకు కూడా వర్తిస్తుంది. దీన్ని కూడా క్లియర్ చేసుకోవడం వల్ల అప్లికేషన్ వేగం పెరుగుతుంది. -
తస్మాత్ జాగ్రత్త! .. గూగుల్ ప్లే స్టోర్లో ఫేక్ చాట్జీపీటీ యాప్స్ కలకలం
టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది సైబర్ నేరస్తులు తెలివి మీరిపోతున్నారు. ఈజీ మనీ పేరుతో యూజర్ల జేబును ఖాళీ చేసేందుకు అదే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. గత ఏడాది విడుదలైన చాట్జీపీటీ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఏఐ టూల్తో సైబర్ నేరస్తులు ఆండ్రాయిడ్ యూజర్ల ఫోన్లలో మాల్వేర్ను పంపిస్తున్నారు. బ్యాంకు అకౌంట్లో సొమ్ము కాజేస్తున్నారు. లేదంటే యూజర్ల డేటాను డార్క్ వెబ్లో సొమ్ము చేసుకుంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. పాలో ఆల్టో నెట్వర్క్స్ పరిశోధకులు చాట్జీపీటీ ఫేక్ యాప్స్లలో మీటర్ప్రెటర్ ట్రోజన్ అనే మాల్వేర్ను గుర్తించారు. ఈ మాల్వేర్ వేరియంట్లు ప్రత్యేకంగా చాట్జీపీటీ వంటి ఏఐ టూల్ ఉపయోగించడానికి ఆసక్తి ఉన్న యూజర్లను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు గుర్తించారు. కాబట్టి, ఏఐ యాప్స్ పట్ల వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో సైబర్ నేరస్తులు ఫేక్ చాట్జీపీటీ యాప్స్ సాయంతో పెద్ద మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేసిన కాంటాక్ట్ నెంబర్లకు మెసేజ్లు పంపుతున్నారు. ఆ మెసేజ్లను క్లిక్ చేయడం ద్వారా మాల్వేర్లు సదరు యూజర్ల ఫోన్లలోకి ఈజీగా చొరబడుతుంది. తద్వారా డబ్బుల కోసం అడ్డదార్లు తొక్కుతున్న కేటుగాళ్లు బాధితుల్ని బెదిరించి వారికి కావాల్సినంత డబ్బుల్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ తరహా ఫోన్ నెంబర్లనే మాల్వేర్ క్రియేటర్లు, స్కామ్లు, మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ తరుణంలో గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉన్న చాట్జీపీటీ ఫేక్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ టెక్నాలజీ నిపుణులు యూజర్లను హెచ్చరిస్తున్నారు. డౌన్లోడ్ చేసుకునే సమయంలో రివ్యూలతో పాటు గతంలో ఆ యాప్ను ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారో గుర్తించాలని చెబుతున్నారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా ఫేక్ యాప్స్ జోలికి పోవద్దని సలహా ఇస్తున్నారు. -
షాకింగ్: 100కు పైగా డేంజరస్ యాప్స్, వెంటనే డిలీట్ చేయకపోతే
యాప్స్కు సంబంధించి యూజర్లకు మరో షాకింగ్న్యూస్. స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసి భయంకర వైరస్లను ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా డేటాను కొట్టేస్తున్న కేటుగాళ్లపై తాజా పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. తాజాగా గూగుల్ ప్లే స్టోర్లోని 100 కంటే ఎక్కువ యాప్లకు సోకిన అత్యంత ప్రమాదకరమైన మాల్వేర్ను పరిశోధకులు గుర్తించారు. గూగుల్ ప్లే స్టోర్ లోని 100 కంటే ఎక్కువ యాప్లకు సోకిన ‘స్పిన్ ఓకే’ అనే కొత్త స్పైవేర్ను ఇటీవల గుర్తించారు. పైగా ఈ యాప్స్ 400 మిలియన్లకు పైగా డౌన్లోడ్లు నమోదైనాయి, అంటే దాదాపు 40 కోట్ల మంది సైబర్ ముప్పులో పడిపోయినట్టే. రోజువారీ రివార్డ్లు, మినీ గేమ్లను ద్వారా ఈ ట్రోజన్ మాల్వేర్ నిజమైందిగా కనిపిస్తుందని, వినియోగదారులను ఆకర్షిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ విషయాన్ని గూగుల్కి తెలియజేసి. వాటిని తొలగించినప్పటికీ, ఇలాంటి డేంజరస్ యాప్స్పై అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తునారు. భవిష్యత్తులో ఇలాంటి యాప్లను గుర్తించి, డౌన్లోడ్ చేయొద్దని హెచ్చరించారు. (బుగట్టి రెసిడెన్షియల్ టవర్...నెక్ట్స్ లెవల్: దిమ్మదిరిగే ఫోటోలు) ప్రభావితమైన యాప్లు ఇవే నాయిజ్: వీడియో ఎడిటర్ విత్ మ్యూజిక్ జాప్యా: ఫైల్ బదిలీ, షేర్ వీఫ్లై: వీడియో ఎడిటర్&వీడియో మేకర్ ఎంవీ బిట్- ఎంవీ వీడియో స్టేటస్ మేకర్ బియూగో- వీడియో మేకర్&వీడియో ఎడిటర్ క్రేజీ డ్రాప్ క్యాష్జైన్ – క్యాష్ రివార్డ్ ఫిజ్జో నావల్ – ఆఫ్లైన్ రీడింగ్ క్యాష్ ఈఎం: రివార్డ్స్ టిక్: వాట్ టు ఎర్న్ మాల్వేర్ సోకిన యాప్లను ఎలా గుర్తించాలి ♦ యాప్ అనుమతులను చెక్ చేసుకోవాలి.యాక్సెస్ లేదా నెట్వర్క్ కనెక్టివిటీ వంటి వాటిని పరిశీలించాలి. ♦ నకిలీ ఆఫర్లు లేదా రివ్యూస్లో అధిక ప్రకటనలుంటే పట్ల జాగ్రత్తగా ఉండాలి. యూజర్ అభిప్రాయానికి, సపోర్ట్కు స్పందించే డెవలపర్ల విశ్వసనీయతను గమనించాలి. ♦ ఇన్స్టాల్ల-టు-రివ్యూల రేషియోను గమనించాలి. ఇన్స్టాల్ల-టు-రివ్యూల నిష్పత్తి ఎంత; ఎంతమంది యాప్ను ఇన్స్టాల్ చేసారనే దానితో పోలిస్తే ఎంతమంది రివ్యూ చేశారనేది చూడాలి. డౌన్లోడ్లకు మించి రివ్యూలుంటే అనుమానించాల్సిందే. ♦ యాప్ డెవలపర్ని ఇతర సోషల్మీడియా హాండిల్స్, చట్టబద్ధతను చూడాలి. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) ♦ స్పెల్లింగ్ లేదా వ్యాకరణ లోపాలు, అస్పష్టమైన సమాచారం లేదా యాప్ ఫంక్షనాలిటీ వివరాల కొరత గురించి జాగ్రత్తగా గమనించాలి. ♦ పాస్వర్డ్లు లేదా క్రెడిట్ కార్డ్ వివరాల వంటి సున్నితమైన డేటాను అభ్యర్థించే యాప్ల జోలికి అసలు వెళ్ల వద్దు. ముఖ్యంగా యాప్లను డౌన్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త గా ఉండాలి. యాప్ అనుమానాస్పదంగా అనిపిస్తే, ఇన్స్టాల్ చేయకపోవడమే మంచిది. మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి:సాక్షిబిజినెస్ -
స్మార్ట్ టీవీ కొనుగోలు దారులకు గూగుల్ హెచ్చరిక.. అలాంటి టీవీలతో
స్మార్ట్టీవీ కొనుగోలు దారులకు ప్రముఖ టెక్ దిగ్గజం కీలక సమాచారం అందించింది. మార్కెట్లో కొనుగోలు చేస్తున్న ప్రతిటీవీ ఆండ్రాయిండ్ టీవీగా ప్రచారం జరుగుతుందని, అయితే, అందులో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ఇటీవల కమ్యూనిటీ పోస్ట్లో ఆండ్రాయిడ్ ఓఎస్ పేరుతో టీవీలను విక్రయించినట్లు గూగుల్ గుర్తించింది. వాస్తవానికి అవి ఆండ్రాయిడ్ ఓపెన్ స్టోర్స్ ప్రాజెక్ట్ను (aosp)ని ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. ఆండ్రాయిడ్ టీవీ వర్సెస్ ఏఓఎస్పీ గూగుల్ సమాచారం మేరకు..ఆండ్రాయిడ్ టీవీల్లో గూగుల్ యాప్స్ లైసెన్స్ లేకుండానే ప్లే అవుతాయి. ఆండ్రాయిడ్ టీవీ కొన్న ప్రతి ఒక్కరూ వాటిని వినియోగించుకోవచ్చు. కానీ ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్తో రూపొందించబడిన టీవీల్లో గూగుల్ యాప్స్ను ప్లే చేయలేం. అందుకే ఆయా సంస్థలు ప్లే ప్రొటక్ట్ సర్టిఫికెట్ విషయంలో జాగ్రత్త వహిస్తాయి. టీవీ కొనేముందు తీసుకోవాల్సిన చూడాల్సిందిదే కస్టమర్లు తాము కొనుగోలు చేస్తున్న టెలివిజన్ సురక్షితమా? కాదా? అని నిర్ధారించేందుకు ఆండ్రాయిటీవీ వెబ్సైట్ను విజిట్ చేయాలని గూగుల్ సిఫార్స్ చేస్తోంది. ఆ వెబ్సైట్లో కొనుగోలుదారులు అధికారిక Android TV, Google TV, Android TV ఉత్పత్తులను చూడొచ్చు. ప్లేస్టోర్లోకి వెళ్లి గూగుల్ లైసెన్స్ పొందిందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. టీవీకి ప్లే ప్రొటెక్ట్ సర్టిఫికేట్ లేకపోతే అది గూగుల్ ధృవీకరించలేదని అర్థం. చదవండి👉 నీళ్లను తెగ తాగేస్తున్న చాట్ జీపీటీ! -
ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్..
ఆండ్రాయిడ్ పరికరాల కోసం గూగుల్ సరికొత్త ఫీచర్ను తీసుకొస్తోంది. ఫోన్లలో స్టోరేజ్ సమస్యకు పరిష్కారంగా ‘ఆటో ఆర్కైవ్’ అనే ఫీచర్ను తీసుకొస్తున్నట్లు తన బ్లాగ్ పోస్ట్లో గూగుల్ పేర్కొంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లకు సంబంధించిన ఎలాంటి డేటా తొలగిపోదు. ఇది కేవలం తక్కువగా వాడిన యాప్ల డేటాను మాత్రమే ఆర్కైవ్ చేస్తుంది. ఆ యాప్లకు సంబంధించిన క్లౌడ్ ఐకాన్ ఫోన్లలో అలాగే ఉంటుంది. ఆటో ఆర్కైవ్ అంటే ఏమిటి? ఆటో ఆర్కైవ్ అనేది యాప్ను పూర్తిగా అన్ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్లు, ఇతర పరికరాల్లో స్టోరేజ్ స్పేస్ను ఖాళీ చేయడానికి రూపొందించిన కొత్త ఫీచర్ . ఈ ఫీచర్ను యూజర్లు ఎంచుకుంటే వారి ఫోన్లు, ఇతర ఆండ్రాయిడ్ పరికరాల్లో తక్కువగా వినియోగించే యాప్లు పాక్షికంగా తొలగిపోతాయి. దీంతో ఆ మేరకు స్టోరేజ్ స్పేస్ ఖాళీ అవుతుంది. అయితే తమకు సంబంధించిన ముఖ్యమైన డేటా తొలగిపోతుందని యూజర్లు కంగారు పడాల్సిన పని లేదు. యూజర్ల డేటా, పాక్షికంగా తొలగించిన యాప్ ఐకాన్లు కూడా ఫోన్లో అలాగే ఉంటాయి. కాబట్టి ఒకవేళ యూజర్లు తొలగించిన యాప్ను మళ్లీ ఉపయోగించాలనుకున్నప్పుడు దాన్ని మరో సారి డౌన్లోడ్ చేసుకుని ఎక్కడి నుంచి యాప్ డేటా తొలగిపోయిందో తిరిగి అక్కడి నుంచి కొనసాగించవచ్చు. అయితే ఆ యాప్ గూగుల్ ప్లేస్టోర్ అందుబాటులో ఉన్నంతవరకే. ఎలా పనిచేస్తుంది? ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏదైనా యాప్ను ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒకవేళ వారి ఫోన్లు, ఇతర పరికరాల్లో స్టోరేజ్ స్పేస్ తక్కువగా ఉన్నట్లయితే ఆటో ఆర్కైవింగ్ ఫీచర్ను ఉపయోగించుకోవాలని వారికి సూచన అందుతుంది. ఆ ఫీచర్ను ఎంచుకున్న వెంటనే తక్కువ వినియోగంలో ఉన్న యాప్లను గుర్తించి ఆటోమేటిక్గా ఆర్కైవ్ చేస్తుంది. ఆటో ఆర్కైవింగ్ ఫీచర్ వల్ల దాదాపు 60 శాతం వరకు స్టోరేజీ స్పేస్ ఆదా అవుతుంది. గూగుల్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. యాప్ బండిల్ని ఉపయోగించి రూపొందించిన యాప్లకు మాత్రమే ఈ ఆటో ఆర్కైవింగ్ ఫీచర్ పనిచేస్తుంది. యాప్ బండిల్ అనేది యాప్ల రూపకల్పన కోసం 2021 నుంచి తప్పనిసరి చేసిన ఫార్మాట్. -
ఆండ్రాయిడ్ సృష్టికర్త, టెక్ దిగ్గజం బాబ్లీ దారుణ హత్య!
ఆండ్రాయిడ్ సృష్టికర్త, ప్రముఖ మొబైల్ పేమెంట్ సర్వీస్ ‘క్యాష్ యాప్’ ఫౌండర్ బాబ్లీ (Bob Lee) దారుణ హత్యకు గురయ్యారు. ఫాక్స్ న్యూస్ కథనం ప్రకారం..శాన్ ఫ్రాన్సిస్కోలో గుర్తు తెలియని దుండగులు బాబ్లీపై కత్తితో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అతనిని ఆస్పత్రికి తరలించే లోపే మరణించినట్లు శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు తెలిపారు. బాబ్లిని కత్తులతో దాడికి పాల్పడ్డారంటూ మంగళవారం ఉదయం 2.35 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మెయిన్ 300 బ్లాక్ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ప్రాణాలతో కొట్టమిట్టాడుతున్న బాబ్లీని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే దురదృష్టవ శాత్తూ మార్గం మద్యంలోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ దుర్ఘటనలో శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు ఎటువంటి అనుమానితుల పేర్లను విడుదల చేయలేదు. ఎవరినీ అరెస్టు చేయలేదని న్యూయార్క్ పోస్ట్ నివేదిక తెలిపింది. బాబ్లీ మరణంపై క్యాష్ యాప్ ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మంచి వ్యక్తుత్వం ఉన్న తమ సీఈవో మరణించాడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మొబైల్ కాయిన్ వెబ్సైట్ ప్రకారం బాబ్లీ గూగుల్కు చెందిన ఆండ్రాయిడ్ తయారీలో ముఖ్యపాత్ర పోషించాడు. టెక్ వరల్డ్లో ‘క్రేజీ బాబ్’గా పేరొందిన బాబ్లీ ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సేతో కలిసి పనిచేశారు. జాక్ డోర్సే ఫౌండర్గా ‘స్కైర్’ అనే సంస్థను స్థాపించారు. 2010లో ఆ సంస్థ సీటీవోగా, ఆ తర్వాత క్యాష్ యాప్ ఫౌండర్గా ఇలా ఫిన్ టెక్, టెక్నాలజీ రంగాల్లో విశేషంగా రాణించారు. ఇప్పుడు బాబ్లీ దారుణ హత్యకు గురికావడం టెక్ రంగాన్ని విస్మయానికి గురి చేస్తోంది. చదవండి👉 అబ్బా ..ఇది కదా ఆఫర్ అంటే, ఐఫోన్ 14ను తక్కువ ధరకే సొంతం చేసుకోండి! -
ఉబెర్ కొత్త డిజైన్: రైడర్లకు కొత్త ఫీచర్లు...ఇకపై ఈజీగా!
ముంబై: రైడ్ షేరింగ్ కంపెనీ ఉబర్ మరింత మెరుగ్గా యాప్ను తీర్చిదిద్దింది. రైడ్ సమయంలో యాప్ను ప్రతీసారి తెరవకుండానే లాక్ స్క్రీన్పైనే లైవ్ యాక్టివిటీతో రైడ్, వాహన వివరాలు, ట్రిప్ స్టేటస్ను చూడవచ్చు. తన హోమ్స్క్రీన్, కొత్త ఫీచర్ల రీడిజైన్ చేసింది. కస్టమర్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తొలిసారి ఇలాంటి మార్పులు ప్రకటించింది. యాప్ను మునుపెన్నడూ లేనంత సులభంగా, స్పష్టంగా , పర్సనలైజ్డ్గా తీసుకొస్తున్నామని ఉడెర్ హెడ్ జెన్ యు అన్నారు. తద్వారా క్యాబ్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్ రైడ్ ట్రాకింగ్ ఈజీగా ఉండేలా ఇంటర్ఫేస్ని రూపొందించింది. సో నెక్ట్స్ రైడ్ లేదా ఆర్డర్ ఫుడ్ బుక్ చేస్తే, యాప్ కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఐవోఎస్ ఉపకరణాలకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ డివైసెస్కు విస్తరించనున్నట్టు కంపెన ప్రకటించింది. సర్వీసెస్ ట్యాబ్ సైతం పొందు పరిచింది. శరవేగంగా లైఫ్ గడిచిపోతున్న ప్రస్తుత తరుణంలో కొన్ని, సెకన్లలో యాప్ ద్వారా నావిగేట్ చేయగలిగే అవసరాన్ని అర్థం చేసుకున్నామని ఉబర్ ఇండియా దక్షిణాసియా సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ నితీష్ భూషణ్ అన్నారు. తక్కువ ట్యాప్లతో ప్రయాణాలను మరింత సులభంగా బుక్ చేసుకునేందుకు రైడర్లకు సహాయ పడేందుకు హోమ్స్క్రీన్ను అనుభవాన్ని కూడా మెరుగ్గా అందించనుంది. ఇందుకోసం 'సర్వీసెస్' ట్యాబ్ను జోడించింది. దీని ద్వారా కొత్త యాప్లో సమీపంలోని మోటో నుండి ఆటో, ఇంటర్సిటీ, అద్దెలు, ఇతర వాటితో పాటు నగరంలోని రైడర్లకు అందుబాటులో ఉన్న అన్ని ఉత్పత్తులను కనుగొనడానికి ఒక-స్టాప్ షాప్గా కూడా ఉపయోగపడనుంది. అలాగే కొత్తగా యాడ్ చేసిన 'యాక్టివిటీ హబ్' గత రాబోయే రైడ్లను ఒకే చోట ట్రాక్ చేయడంలో సహాయపడుతుందని ఉబెర్ తెలిపింది. -
సామ్సంగ్ గెలాక్సీ ఎస్23 ఆల్ట్రా
సైజ్: 6.8 అంగుళాలు బరువు: 234 గ్రా. రిజల్యూషన్: 1440x3088 పిక్సెల్స్ వోఎస్: ఆండ్రాయిడ్ 13, వన్ యూఐ 5.1 మెమోరీ: 256జీబి 8జీబి ర్యామ్ 256జీబి 12జీబి ర్యామ్ 512 జీబి 12జీబి ర్యామ్ కలర్స్: ఫాంటమ్ బ్లాక్, గ్రీన్, క్రీమ్, స్కైబ్లూ, రెడ్, బీఎండబ్ల్యూ ఎం ఎడిషన్ వాట్సాప్ ‘ఫొటో క్వాలిటీ’ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లు ఒరిజినల్ క్వాలిటీతో, కంప్రెస్డ్ ఫార్మట్లో ఫొటోలను పంపి డాటా సేవ్ చేసుకోవచ్చు. యూజర్లు తమ వాట్సాప్ సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా ఈ ఫీచర్ను ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్లో (ఐఫోన్) ఒరిజినల్ క్వాలిటీ ఫొటోలు సెండ్ చేయడానికి... ► వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఐకాన్ ట్యాప్ చేయాలి. ► స్టోరేజ్ అండ్ డాటా–ట్యాప్ ► మీడియా అప్లోడ్ క్వాలిటీ–ట్యాప్ ► ఆటో–సెలెక్ట్ -
సొంత ఓఎస్పై ప్రభుత్వ భారీ కసరత్తు: ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఖేల్ ఖతం?
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ యూజర్లకు భారత ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించనుందా? సొంతంగా ఒక దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ను రూపొందించి, వినియోగదారులకు మరింత సురక్షితమైన అనుభవాన్ని అందించే ప్రాజెక్ట్పై పని చేస్తోందని విశ్వసనీయంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారిక ప్రకటనపై ఆసక్తి నెలకొంది. ఇండ్ ఓఎస్ పేరుతో తీసుకురానుంది. ప్రభుత్వం, స్టార్టప్లు , విద్యాసంస్థల చొరవతో దీన్ని రూపొందిస్తోంది. ఎపుడు, ఎలా లాంచ్ చేస్తుందనే దానిపై స్పష్టతేదు. ఇది యూజర్లకు ఒక కొత్త భారతీయ OS సురక్షితమైన అనుభవాన్ని అందించడమే కాకుండా Google, Appleకి దీటుగా గట్టి పోటీ ఇస్తుందని అంచనా. కాగా ప్రస్తుతం, గూగుల్ ఆండ్రాయిడ్ 97 శాతం వాటాతో టాప్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటుండగా, ఐఫోన్కోసం రూపొందించిన ఆపిల్ ఐఓఎస్ వాటా పరిమితంగానే ఉంది. మరోవైపు నోకియా, శాంసంగ్, బ్లాక్బెర్రీ నోకియా, మైక్రోసాప్ట్ ,ఫైర్ఫాక్స్ లాంటి దిగ్గజాల ఆపరేటింగ్ సిస్టమ్స్ పెద్దగా ఆదరణకు నోచుకోలేకపోయాయి. ఈ క్రమంలో ఇండ్ఓఎస్ ఆవిష్కారంపై భారీ అంచనాలే ఉన్నాయి. -
గూగుల్కు సీసీఐ జరిమానా..భారత్లో కస్టమర్లు, వ్యాపారాలకు పెద్ద ఎదురుదెబ్బ
మొబైల్ వెబ్ బ్రౌజర్లు, ఆన్లైన్ వీడియో హోస్టింగ్లలో క్రోమ్, యూట్యూబ్ వంటి యాప్ల స్థానాన్ని కాపాడుకోవడానికి ఆన్లైన్ సెర్చ్, ఆండ్రాయిడ్ కోసం యాప్ స్టోర్ వంటి మార్కెట్లలో గూగుల్ తన ఆధిపత్య స్థానాన్ని ఉపయోగించుకుందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) గూగుల్కు రూ.1,338 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా అనుచిత వ్యాపార విధానాలు అమలు చేయడాన్ని మానుకోవాలని ఆదేశించింది. నిర్దిష్ట వ్యవధిలోగా తన తీరును మార్చుకోవాలని సూచించింది. అయితే భారత్ నిర్ణయంపై గూగుల్ స్పందించింది. భారత్ నిర్ణయం.. దేశంలోని వినియోగదారులు, వ్యాపారాలకు పెద్ద ఎదురుదెబ్బ అని గూగుల్ తెలిపింది. ఆండ్రాయిడ్ అనేది వినియోగదారులకు ఏం కావాలో.. దాన్ని ఎంపిక చేసేందుకువ వీలుగా సృష్టించింది ఈ ఆండ్రాయిడ్. భారత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారందరికి మద్దతుగా నిలుస్తుందని గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు. సీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అటు కొనుగోలుదారులకు ఇటు వ్యాపారస్థులకు ఇది పెద్ద ఎదురు దెబ్బ. సెక్యూరిటీ పరంగా ఆండ్రాయిడ్ ఫీచర్ను వినియోగిస్తున్న వారందరూ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మొబైల్ ధరలు పెరుగుతాయని వెల్లడించారు. చదవండి👉 గూగుల్కు భారీ షాక్! -
తక్కువ ధరలో ఎల్ఈడీ టీవీలు:గూగుల్తో డిక్సన్ జోడీ
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ఉన్న డిక్సన్ టెక్నాలజీస్ తాజాగా అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం గూగుల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా స్థానికంగా ఆండ్రాయిడ్, గూగుల్ టీవీ ప్లాట్ఫామ్స్పై ఎల్ఈడీ టీవీలను డిక్సన్ తయారు చేయనుంది. స్మార్ట్ టీవీల కోసం ఆన్డ్రాయిడ్, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్స్ను గూగుల్ అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. తక్కువ ఖర్చుతో కూడిన స్మార్ట్ టీవీని అందించడంతోపాటు, ఎల్ఈడీ టీవీ విభాగంలో దాని మార్కెట్ లీడర్షిప్ను మరింత బలోపేతం చేసుకోవాడనాఇకి ఇది సహాయ పడుతుందని డిక్సన్ టెక్నాలజీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆండ్రాయిడ్, గూగుల్ టీవీలకై భారత్లో సబ్ లైసెన్సింగ్ హక్కులను పొందిన తొలి ఒప్పంద తయారీ కంపెనీ తామేనని డిక్సన్ ప్రకటించింది. ఎల్ఈడీ టీవీల తయారీలో దేశంలో అతిపెద్ద సంస్థ అయిన డిక్సన్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 60 లక్షల యూనిట్లు. ఈ భాగస్వామ్యం కారణంగా ఎల్ఈడీల ఉత్పత్తిలో కంపెనీ సామర్థ్యం మరింత బలపడుతుందని సంస్థ వివరించింది. వాషింగ్ మెషీన్లు, ఎల్ఈడీ బల్బులు, ఎల్ఈడీ బ్యాటెన్స్, మొబైల్ ఫోన్స్, సీసీటీవీల వంటి ఉత్పత్తులను సైతం ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. -
కీలక నిర్ణయం, గేమింగ్ యాప్ను షట్డౌన్ చేయనున్న ఫేస్బుక్!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్లో ఫేస్బుక్ గేమింగ్ యాప్స్ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ సంస్థ యూజర్లు భారీగా తగ్గనున్నారు. 2018లో గేమ్ స్ట్రీమింగ్, గేమింగ్ ఫ్లాట్ ఫామ్లో ట్విచ్, యూట్యూబ్కు పోటీగా ఫేస్బుక్ అడుగు పెట్టింది. రెండేళ్ల తర్వాత అంటే 2020లో గేమింగ్ యాప్, క్రియేటర్ పోగ్రాంను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం మైక్రోసాఫ్ట్ స్ట్రీమింగ్ యాప్ మిక్సర్ను సైతం కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో స్పష్టమైన కారణాలేంటనే విషయం వెలుగులోకి రానప్పటికీ..ఫేస్బుక్ తన గేమింగ్ యాప్ను స్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 28 నుంచి ఆ సేవల్ని వినియోగించుకోలేరని, వెబ్ బేస్డ్ వెర్షన్ గేమింగ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని చెప్పింది. -
స్మార్ట్ఫోన్ యూజర్లకు అలర్ట్..! ఈ యాప్ను వెంటనే డిలీట్ చేయండి..! లేకపోతే అంతే సంగతులు..!
రోజురోజుకి టెక్నాలజీ ఎంత వేగంగా విస్తరిస్తుందో...అంతే వేగంతో సైబర్ నేరాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. సైబర్ నేరస్తులు కొంత పుంతలు తొక్కుతూ అమాయక ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. కొత్త మంది హ్యకర్లు ఏకంగా గూగుల్ప్లే స్టోర్లోకి నకిలీ యాప్స్ను చొప్పించి..సదరు యాప్స్ ద్వారా మాల్వేర్స్ను స్మార్ట్ఫోన్లలోకి ఎక్కిస్తున్నారు. ఇలాంటిదే తాజాగా కార్టూనిఫైయర్ యాప్ వెలుగులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా ఆండ్రాయిడ్ యూజర్ల ఫేస్బుక్ డేటాను దొంగిలిస్తోన్నట్లు తెలుస్తోంది. లక్ష మందిపై ప్రభావం..! కార్టూనిఫైయర్ యాప్లో FaceStealer అనే మాల్వేర్ను గుర్తించారు. కార్టూనిఫైయర్ యాప్(cartoonifier app)తో హ్యకర్లు ఆయా యూజర్ల ఫేస్బుక్ ఖాతాల పాస్వర్డ్స్ను సొంతం చేసుకుంటున్నట్లు ప్రడియో(Pradeo) వెల్లడించింది. ఇప్పటికే ఈ యాప్ను సుమారు లక్షకు పైగా ఆండ్రాయిడ్ యూజర్లు ఇన్స్టాల్ చేసినట్లు ప్రడియో తన నివేదికలో పేర్కొంది. కాగా ఈ యాప్పై గూగుల్ ప్రతినిధులు స్పందించారు. 'క్రాఫ్ట్సార్ట్ కార్టూన్ ఫోటో టూల్స్' పేరుతో ఉన్న యాప్ ఇకపై డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో లేదని, ప్లే స్టోర్ నుంచి తొలగించమని గూగుల్ ప్రతినిధి ప్రముఖ టెక్ బ్లాగింగ్ సంస్థ బ్లీపింగ్ కంప్యూటర్కు తెలియజేశారు. ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్న వారు వెంటనే అన్ఇన్స్టాల్ చేయాలని సూచించారు. అంతేకాకుండా గూగుల్ ప్లే స్టోర్లో సదరు యాప్స్ను చెక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడం మంచిందంటూ సూచించారు. ఒక యాప్ను డౌన్లోడ్ చేసే ముందు వీటిని దృష్టిలో పెట్టుకోండి. యాప్ను ఇన్స్టాల్ చేసే ముందు సంబంధింత యాప్ డెవలపర్ ఎవరో, తనీఖీ చేసి ధృవీకరించాలి. యాప్పై గల రివ్యూలను, రేటింగ్లను చూడడం మంచింది. మాల్వేర్ కల్గిన యాప్స్ను యూజర్లు రివ్యూలో రిపోర్ట్ చేస్తూ ఉంటారు. యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మైక్రోఫోన్, కాంటాక్ట్స్, ఇతర డేటాను యాక్సెస్ చేసే వాటిని అసలు ఇన్స్టాల్ చేయకండి. ఎల్లప్పుడు Google Play Store లేదా Apple App store నుంచి మాత్రమే యాప్స్ను ఇన్స్టాల్ చేయాలి. చదవండి: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసిన రియల్మీ..! ధర ఎంతంటే..? -
ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త చిక్కు.. యూటూబ్ నుంచి ఆ ఆప్షన్ అవుట్ !
ఓటీటీ కంటెంట్ యాప్లు ఎన్ని మార్కెట్లోకి వచ్చినా ఇప్పటికీ వీడియోస్ చూడాలంటూ మొదటగా గుర్తొచ్చేది యూట్యూబ్నే. సవాలక్ష టాపిల్లపై ఇక్కడ సమాచారం దొరుకుతుంది. కానీ వాటిని ప్రశాంతంగా చూడనీయకుండా మధ్యలో వచ్చే యాడ్స్ సతాయిస్తుంటాయి. యాడ్స్ లేకుండా యూట్యూబ్ ప్రీమియం పేరిట పెయిడ్ సర్వీసులు కూడా అందిస్తోంది. అయితే ఎటువంటి సొమ్ము చెల్లించకుండా పెయిడ్ సర్వీస్ ఝంజాటం లేకుండా యాడ్స్ ఫ్రీగా యూట్యూబ్ చూసే అవకాశం వాన్సెడ్ యాప్తో ఉండేంది. ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్పై లభించి ఈ యాప్ను ఉపయోగించి యాడ్ ఫ్రీగా యూట్యూబ్ వీడియోలు చూసేవాళ్లు. అయితే యాడ్ ఫ్రీగా కంటెంట్ చూపిస్తున్న వాన్సెడ్కు ఇటీవల చిక్కులు ఎదురయ్యాయి. తమ కంటెంట్పై వాన్సెడ్ పెత్తనం ఏంటంటూ లీగల్ కొర్రీలు పడ్డాయి. దీంతో వాన్సెడ్ యాప్ సృష్టికర్త అయిన వెర్జ్ వెనక్కి తగ్గింది. దీంతో వాన్సెడ్ యాప్ని వెనక్కి తీసుకుంది. అంతేకాదు ఇప్పటికే డౌన్లోడ్ అయిన యాప్లు సైతం త్వరలోనే బంద్ అవుతాయంటూ వెర్జ్ చెబుతోంది. వాన్సెడ్ యాప్ రద్దు కావడంతో ఆండ్రాయిడ్ ఫ్లాట్ఫామ్పై యాడ్ ఫ్రీగా వీడియోలు చూస్తున్న చాలా మందికి ఇక నిరాశే మిగలనుంది. గతంలో యూట్యూబ్ నుంచి వీడియోలు, ఆడియోలు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కలిగించిన ట్యూబ్మేట్ యాప్ విషయంలోనే ఇలానే జరిగింది. చదవండి: యూట్యూబ్ చేస్తున్న అద్భుతం, ఇండియన్ ఎకానమీ సూపరో సూపరు! -
ఉక్రెయిన్పై బాంబుల మోత..! రష్యా దాడులను చెక్ పెట్టేందుకు గూగుల్ భారీ స్కెచ్..!
గత 17 రోజల నుంచి ఉక్రెయిన్పై రష్యా బలగాలు విరుచుకుపడుతూనే ఉన్నాయి. రష్యా బలగాలకు ఉక్రెయిన్ సైన్యం ధీటైన జవాబునిస్తున్నాయి. ఇక ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై రష్యా బాంబుల మోత మోగిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సైనికులతో పాటుగా, సామాన్య ప్రజలు కూడా తమ ప్రాణాలను కోల్పోతున్నారు. రష్యన్ వైమానిక బాంబు దాడుల నుంచి ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలను కాపాడుకునేందుకు గూగుల్ వారికి సరికొత్త యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ముందుగానే పసిగడుతోంది..! రష్యన్ వైమానిక దళం ఉక్రెయిన్లోని ఆయా ప్రాంతాల్లో జరిగే ఎయిర్స్ట్రైక్స్ గురించి ‘ర్యాపిడ్ ఎయిర్ రైడ్’ ఉక్రెయిన్ ప్రజలను ముందుగానే హెచ్చరికలను జారీ చేయనుంది. ఈ యాప్ ఉక్రెయిన్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉండనుంది. ఈ యాప్ను తొలుత భూకంప హెచ్చరికలను గుర్తించడం కోసం గూగుల్ తీసుకొచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లో ఉక్రెయిన్లోని అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్ అందుబాటులోకి వస్తోందని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ డేవ్ బ్రుక్ వెల్లడించారు. ఉక్రెయిన్లకోసం ఈ యాప్ను గూగుల్ ప్లే స్టోర్స్లోకి మార్చి 4న గూగుల్ వదిలింది. ఈ యాప్ సహాయంతో వైమానిక దాడుల నుంచి ఉక్రెయిన్ ప్రజలను అలర్ట్ చేస్తోంది. ఈ యాప్ను ఉక్రెయిన్ ప్రభుత్వం సహకారంతో ఉక్రేనియన్ డెవలపర్లు ఈ యాప్ను రూపొందించారు . ఇప్పుడు ఉక్రేనియన్లు థర్డ్-పార్టీ యాప్ లేకుండానే వారి ఫోన్ లొకేషన్, ఇంటర్నెట్ ఆన్ చేసి ఉంటే వారు వైమానికి దాడుల అలర్ట్లను పొందగలరని గూగుల్ పేర్కొంది. చదవండి: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్..! ఇకపై ఐఫోన్ల నుంచి సులువుగా..! -
ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్..! ఇకపై ఐఫోన్ల నుంచి సులువుగా..!
ఆండ్రాయిడ్ యూజర్లకు టెక్ దిగ్గజం గూగుల్ త్వరలోనే శుభవార్తను అందించనుంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లకు మధ్య టెక్స్ట్ సందేశాలను మరింత సులభతరం చేయడానికి గూగుల్ ప్రయత్నిస్తోంది. ఐఫోన్ యూజర్లతో చాట్ చేయడం అనేది ఆండ్రాయిడ్ యూజర్లకు ఎల్లప్పుడూ సవాలే.దీనికి కారణం సదరు ఆండ్రాయిడ్ యూజర్ ఐఫోన్ యూజర్కు పంపిన స్టికర్స్, ఎమోజీలను వారి సందేశాలలో చూపలేదు. టెక్స్ట్ మెసేజ్స్లో పంపే ఎమోజీ, స్టికర్స్ను కేవలం గూగుల్ మెసేజ్స్ యూజర్లు మాత్రమే చూడగలరు. ఇక ఐఫోన్ ఐమెసేజ్స్ ద్వారా పంపినా ఎమోజీ, స్టికర్స్కు బదులుగా టెక్స్ట్ మెసేజ్లు ఆండ్రాయిడ్ యూజర్లకు కన్పించేవి. దీన్ని పరిష్కరించడానికి iMessages భాగస్వామ్యంతో ఎమోజీలను గూగుల్ మెసేజెస్ యాప్లో ఎమోజీలుగా చూపే కొత్త ఫీచర్ను గూగుల్ పరీక్షించడం ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్లో భాగంగా iMessages నుంచి ‘హార్ట్’ ఎమోజీ ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లకు ఫేస్ విత్ హార్ట్ ఎమోజీ వచ్చేలా గూగుల్ చేసింది. దీంతో iMessages నుంచి ఆండ్రాయిడ్ యూజర్లకు పంపే వివిధ రకాల స్టిక్కర్స్, ఎమోజీలు నేరుగా వచ్చేలా గూగుల్ పనిచేస్తోంది. కాగా ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. రానున్న రోజుల్లో ఈ ఫీచర్ ద్వారా సదరు ఐఫోన్ యూజర్లు ఆండ్రాయిడ్ యూజర్లకు పంపే అన్నీ ఎమోజీ, స్టికర్స్ను టెక్స్ట్ మెసేజ్ రూపంలో కాకుండా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో వచ్చేలా గూగుల్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. చదవండి: పెను ప్రమాదంలో పలు ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్స్..! -
పెను ప్రమాదంలో పలు ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్స్..!
ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్..! తాజాగా వెలుగులోకి వచ్చిన బగ్తో పలు ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్స్ పెను ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ ప్రమాదం ఎక్కువగా ఆండ్రాయిడ్ 12తో నడుస్తోన్న స్మార్ట్ఫోన్స్లో ఉండనుంది. డర్టీ పైప్ డర్టీ పైప్ అనే బగ్ ఆండ్రాయిడ్ 12తో నడుస్తున్న పలు స్మార్ట్ఫోన్స్ను అత్యంత తీవ్రంగా ప్రభావితం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ బగ్తో హ్యాకర్లు స్మార్ట్ఫోన్స్పై యాక్సెస్ను సులువుగా పొందుతారు. అంతేకాకుండా రీడ్-ఓన్లీ ఫైల్స్లో డేటాను ఓవర్రైట్ చేసే అవకాశం ఉంది. జర్మన్ వెబ్ డెవలప్మెంట్ కంపెనీ CM4కి చెందిన భద్రతా పరిశోధకుడు మాక్స్ కెల్లర్మాన్ 'డర్టీ పైప్' దుర్బలత్వాన్ని గుర్తించారు. దీనిని మొదటగా లైనక్స్ (Linux) కెర్నల్లో గుర్తించారు. ఈ వారం ప్రారంభంలో CVE-2022-0847గా నమోదు చేయబడిన సెక్యూరిటీ బ్రీచ్ను కెల్లర్మాన్ బహిరంగంగా వెల్లడించారు. చదవండి: శాంసంగ్కు గట్టిషాకిచ్చిన హ్యాకర్లు..! ప్రమాదంలో గెలాక్సీ స్మార్ట్ఫోన్ యూజర్లు.! కెల్లర్మాన్ ప్రకారం...ఈ సమస్య Linux 5.16.11, 5.15.25 , 5.10.102లో పరిష్కరించనప్పటికీ, వెర్షన్ 5.8 లైనక్స్ కెర్నల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది 2018లో వచ్చిన డర్టీ కౌ(Dirty CoW)ను పోలీ ఉందని పరిశోధకులు తెలిపారు. అప్పట్లో పలు ఆండ్రాయిడ్ యూజర్లను ఎంతగానో ప్రభావితం చేసింది. ఆ సమయంలో గూగుల్ సెక్యూరిటీ ప్యాచ్ను విడుదల చేయడంతో ఈ లోపాన్ని వెంటనే పరిష్కరించగల్గింది. ఎన్క్రిప్డెడ్ సందేశాలను సులువుగా..! డర్టీ పైప్ బగ్ సహయంతో హ్యాకర్లు సులువుగా ఆయా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ యూజర్లపై విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా స్మార్ట్ఫోన్ సిస్టంలోని రీడ్-ఓన్లీ ఫైల్లలో డేటాను ఓవర్రైట్ చేయడానికి యాక్సెస్ను హ్యాకర్లు పొందుతారు. ఆండ్రాయిడ్ సిస్టంకు లైనక్స్ కెర్నల్ను కోర్గా ఉపయోగిస్తుంది దీంతో ఆయా స్మార్ట్ఫోన్ యూజర్లపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎన్క్రిప్టెడ్ వాట్సాప్ సందేశాలను చదవడానికి, మార్చడానికి, ఓటీపీ సందేశాలను క్యాప్చర్ చేయడానికి ఈ బగ్ హ్యకర్లకు ఉపయోగపడనుంది. అంతేకాకుండా స్మార్ట్ఫోన్లో ఇన్స్టాల్ చేసిన బ్యాంకింగ్ యాప్స్ను రిమోట్గా నియంత్రించేందుకు వారికి అనుమతి లభిస్తోంది. వీటిపై ప్రభావం ఎక్కువగా..! ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్స్లో ఆండ్రాయిడ్ వెర్షన్ 12 కి ముందు వెర్షన్స్ అస్సలు ప్రభావితం కావు. అయితే ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఉన్న పలు స్మార్ట్ఫోన్స్ ప్రభావితమవుతాయని కెల్లర్మాన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ 6, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 22 స్మార్ట్ఫోన్స్ బగ్తో ప్రభావితమైనట్లు తెలుస్తోంది. ఈ బగ్ గురించి గూగుల్ ఇప్పటికే తెలుసు కానీ దాని పరిష్కారాన్ని ఇంకా చూపలేదు. కాగా ఈ బగ్ నుంచి తప్పించుకోవడం కోసం ఆండ్రాయిడ్ యూజర్లు ఎలాంటి థర్డ్-పార్టీ సోర్స్ నుంచి యాప్స్ను ఇన్స్టాల్ చేయకూడదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. చదవండి: నోకియా సంచలన నిర్ణయం..! -
ఆండ్రాయిడ్ యూజర్లకు శుభవార్త..! సరికొత్త ప్రణాళికతో గూగుల్..అదే జరిగితే..!
ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ త్వరలోనే శుభవార్తను అందించనుంది. యూజర్ల ప్రైవసీ విషయంలో భారీ మార్పులను తెచ్చేందుకు గూగుల్ సన్నాహాలు చేస్తోంది. దీంతో ఆండ్రాయిడ్ యూజర్లకు యాపిల్ తరహాలో భద్రత కలగనుంది. యాపిల్ బాటలో... యాపిల్ బాటలోనే గూగుల్ నడవనుంది. ఐఫోన్లకు అందించే యూజర్ ప్రైవసీను ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు తెచ్చేందుకు టెక్ దిగ్గజం గూగుల్ ప్రణాళికలను సిద్దం చేస్తోంది. 2021 ఏప్రిల్లో ఐఫోన్ల కోసం కొత్త యూజర్ ప్రైవసీ పాలసీని యాపిల్ తీసుకొచ్చింది. దీని సహాయంతో థర్డ్ పార్టీ యాప్స్ సదరు యూజర్ను ట్రాక్ చేయకుండా చేసే ఫీచర్ను యాపిల్ అందిస్తోంది. ఇదే ఫీచర్ ను గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్లకు తెచ్చే పనిలో పడింది. ప్రైవసీ సాండ్ బాక్స్..! థర్డ్ పార్టీ యాప్ యూజర్ల డేటాను షేర్ చేసే విషయంలో గూగుల్ కొత్తగా ప్రైవసీ సాండ్ బాక్స్ ఫీచర్ ను తీసుకురానుంది. ప్రైవసీ మార్పుల గురించి ఆండ్రాయిడ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆంథోనీ చవెజ్ ఓ బ్లాగ్లో అభిప్రాయాలను వెల్లడించారు. ప్రైవేట్ అడ్వర్టయిజింగ్ సొల్యూషన్లు, కొత్త ప్రైవసీని తీసుకొచ్చేందుకు కొన్ని సంవత్సరాల కార్యక్రమాన్ని మేం ప్రకటిస్తున్నమని చెప్పారు. థర్డ్ పార్టీలతో డేటాను షేర్ చేయడాన్ని తగ్గిస్తామని చెప్పారు. కాగా ఇది ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు. అయితే ఈ పాలసీల్లో ఈ మార్పులను తీసుకొచ్చేందుకు కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని, దీన్ని అమలు చేసేందుకు భాగస్వాములతో కలిసి గూగుల్ పని చేస్తుందని ఆంథోని వెల్లడించారు. మరో వైపు ఆండ్రాయిడ్ డివైజ్ల్లో ట్రాకింగ్ను కట్టడి చేస్తే చాలా సంస్థలకు ఇబ్బందిగా మారే అవకాశము ఉన్నట్లు తెలుస్తోంది. -
వాట్సాప్ యూజర్లకు కొత్త తలనొప్పి..! యాప్లో సమస్య..ఇలా చేస్తే బెటర్..!
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో కొత్త సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యతో తరుచూ వాట్సాప్ యాప్ క్రాష్ అవుతున్నట్లు సమాచారం. అయితే ఈ సమస్య కేవలం వాట్సాప్ బీటా వెర్షన్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే పరిమితమైనట్లు తెలుస్తోంది. ఒపెన్ చేస్తే ఎర్రర్..! వాట్సాప్ బీటా యూజర్లు యాప్ను ఓపెన్ చేసినప్పుడు లేదా మీడియాను షేర్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చినట్లు పలువురు యూజర్లు నివేదించారు. ఈ సమస్యకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. అయితే వాట్సాప్ బీటా ఫర్ ఆండ్రాయిడ్ యాప్ క్రాష్ అవుతున్నట్లు మెటా కూడా నిర్థారించింది. యాప్ క్రాష్కు కారణమైన బగ్కు మెటా పరిష్కారాన్ని కూడా చూపింది. ఇలా చేస్తే సెట్..! వాట్సాప్ ట్రాకర్ WABetaInfo ప్రకారం..కొత్త మంది బీటా యూజర్లకు యాప్ క్రాష్ సమస్య వస్తోన్నట్లు నివేదించింది. వాట్సాప్ బీటా ఫర్ ఆండ్రాయిడ్ 2.22.4.6, 2.22.4.7 వెర్షన్ల యూజర్లు మీడియాను ఇతర యూజర్లతో షేర్ చేస్తున్నప్పుడు క్రాష్ అవుతున్నట్లు సమాచారం. ఈ సమస్యకు మెటా పరిష్కారాన్ని చూపింది. వాట్సాప్ బీటా 2.22.4.6, 2.22.4.7 వెర్షన్లను వాడే యూజర్లను వెంటనే 2.22.4.8 వెర్షన్కు అప్డేట్ చేయాలని మెటా సూచించింది. వాట్సాప్ యూజర్ల డేటాను భద్రంగా ఉంచేందుకుగాను ఆయా యూజర్లు తమ గూగుల్ డ్రైవ్తో బ్యాకప్ చేసుకోవాలని వాట్సాప్ ట్రాకర్ WABetaInfo తెలిపింది. చదవండి: మీరు వాట్సాప్ గ్రూప్ అడ్మినా..! అయితే మీకో గుడ్న్యూస్..! -
వామ్మో బ్రాటా.. కొంచెం కొంచెంగా స్మార్ట్ఫోన్ను కబళిస్తది
Android Users ALERT: స్మార్ట్ఫోన్లోని బ్యాంకు లాగిన్ వివరాలను లూటీ చేయడంతో పాటు ఫోన్ సర్వడాటాను కబళించేందుకు మహా డేంజర్ ఆండ్రాయిడ్ మాల్వేర్ ‘బ్రాటా’ సిద్ధమైపోయింది. అప్పుడెప్పుడో 2019లో ఈ ‘బ్యాంకింగ్’ మాల్వేర్ కలకలం సృష్టింంచిన విషయం తెలిసిందే. బ్రెజిల్ ఆర్థిక పురోగతిపై పంజా విసిరిన ఈ మాల్వేర్ ఇప్పుడు మరోసారి ఆండ్రాయిడ్ ఫోన్లపై దాడికి కోరలు చాచింది. గతంలో బ్రెజిల్ కేంద్రంగా బ్రాటాతో లక్షల యూజర్ల స్మార్ట్ఫోన్ డాటాలను దుండగులు కొల్లగొట్టారు. కాస్పర్ స్కీ గుర్తించి.. అప్రమత్తం చేయడంతో మిగతా యూజర్లు జాగ్రత్తపడ్డారు. ఆ టైంలో మాయమై.. మళ్లీ ఈమధ్యే ప్రత్యక్షమైంది. పోయిన నెల(డిసెంబర్)లో పలువురి బ్యాంకు ఖాతాలు ఖాళీ కావడం, ఆపై ఫోన్లలోని డేటా గాయబ్ అయిపోవడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కంప్యూటర్ సెక్యూరిటీ సంస్థ క్లీఫీ అధ్యయనంలో ఈ విషయం తేలింది. బ్రిటన్, పోల్యాండ్, ఇటలీ, స్పెయిన్, చైనాతో పాటు పలు లాటిన్ అమెరికా దేశాల్లోని నెట్ బ్యాంకింగ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు బ్రాటాతో దాడులు చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో క్లిఫీ స్టడీ మిగతా దేశాలను అప్రమత్తం చేస్తోంది. ఎలాగంటే.. పుష్ నోటిఫికేషన్లు, గూగుల్ ప్లే, ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజ్ లు, కాల్స్ ద్వారా ‘బ్రాటా’ మాల్వేర్ ను యూజర్ల ఫోన్లలోకి జొప్పిస్తున్నారు సైబర్ దుండగులు. అయితే డౌన్ లోడర్ ద్వారా ఫోన్లలోకి ఎక్కిస్తున్న ఈ వైరస్ ను యాంటీ వైరస్ లు కూడా అడ్డుకోలేకపోతుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. అచ్చం వైరస్ వేరియెంట్లలాగానే ఈ మాల్వేర్ వేరియెంట్లు సైతం స్టార్ట్ఫోన్ను కొంచెం కొంచెం కబళించేస్తుండడం విశేషం. మూడు రకాలుగా.. బ్రాటా.ఏ.. కొన్ని నెలలుగా ఎక్కువగా వ్యాప్తిలో ఉందని, దాంట్లోని జీపీఎస్ ట్రాకింగ్ ఫీచర్ తో ఫోన్ను ఏకంగా ఫ్యాక్టరీ రీసెట్ కొట్టే అవకాశం ఉంది. బ్రాటా.బీ.. లోనూ బ్రాటా ఏ టైప్ ఫీచర్లే ఉన్నాయి. కాకపోతే.. మొదటి రకంతో పోలిస్తే మరింత డేంజర్. రకరకాల కోడ్లు, పేజీలతో బ్యాంకుల లాగిన్ వివరాలను బ్రాటా.బీ తస్కరిస్తుంది. బ్రాటా.సీ విషయానికొస్తే.. స్మార్ట్ ఫోన్లలో మాల్వేర్ను జొప్పించడానికి ఉపయోగిస్తున్నారు. డౌన్ లోడ్ చేసుకున్న యాప్(మాల్వేర్ యాప్) ద్వారా.. డాటా అంతా చోరీ చేస్తున్నారు. కాబట్టి దీని విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. గుర్తించడం ఎలా.. ►ఉన్నట్లుండి ఫోన్ స్లో కావడం, క్రాష్ కావడం, ఎర్రర్ మెసేజ్ అంటూ రిపీట్గా చూపించడం. ►రీబూట్(రీస్టార్ట్) లేదంటే షట్ డౌన్ కాకపోవడం ►ఏదైనా యాప్, సాఫ్ట్వేర్ ఎంతకు డిలీట్ కాకపోవడం, ►పాప్ అప్స్, సంబంధంలేని యాడ్స్, పేజీ కంటెంట్ను డిస్ట్రర్బ్ చేసే యాడ్స్ ►అధికారిక వెబ్సైట్లలోనూ అవసరమైన యాడ్స్ కనిపిస్తుండడం. ►పోర్న్ వీడియోలకు దూరంగా ఉండడం, అనధికారిక గేమ్స్ జోలికి పోకపోవడం!. ►ప్లేస్టోర్లోనూ అధికారిక యాప్లను.. అదీ రేటింగ్, రివ్యూలను చూశాకే డౌన్లోడ్ చేసుకోవడం. -
జీమెయిల్ సరికొత్త రికార్డు..! ప్రపంచజనాభా కంటే ఎక్కువగా..!
గూగుల్ రూపొందించిన ఈ-మెయిల్ సర్వీస్ జీ మెయిల్ సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో అత్యధికంగా ఇన్స్టాల్ఐనా నాల్గవ యాప్గా జీ-మెయిల్ నిలిచింది. 10 బిలియన్ల మైలు రాయి..! ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలోజీమెయిల్ యాప్ 10 బిలియన్(1000 కోట్ల) ఇన్స్టాల్లను సాధించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి 10 బిలియన్లకు పైగా ఇన్స్టాల్ఐనా మైలురాయిని గూగుల్కు చెందిన మరో మూడు యాప్స్ గూగుల్ ప్లే సర్వీసెస్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ నిలిచాయి. ఇక్కడ విశేషమేమిటంటే ప్రపంచ జనాభా కంటే అధికంగా యాప్స్ డౌన్లోడ్స్ జరిగాయి. అద్భుతమైన ఫీచర్స్తో..! జీమెయిల్ పేరుతో ఈమెయిల్ సేవలను గూగుల్ ఏప్రిల్ 2004 ప్రారంభించింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్ భారీ ఆదరణను సాధించింది. కాలానుగుణంగా జీమెయిల్ అత్యధిక సంఖ్యలో అద్బుతమైన ఫీచర్స్ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ మీట్స్ను యాప్కు జోడించింది. అంతేకాకుండా యూజర్లు ఆడియో, వీడియో కాల్స్ను చేసుకునే ఫీచర్నుకు అందుబాటులోకి తెచ్చింది జీమెయిల్. చదవండి: ఓలాపై ‘గుత్తాధిపత్య ధరల’ ఆరోపణలు కొట్టివేత -
యాపిల్పై గూగుల్ సంచలన ఆరోపణలు
టెక్ దిగ్గజ కంపెనీలు పరస్పర ఆరోపణలతో మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. యాపిల్ మెసేజింగ్ సర్వీస్.. ఐమెసేజ్ విషయంలో యూత్ యూజర్లు ఆందోళన చెందుతున్నారట. అందుకు కారణం.. ఐఫోన్ యూజర్లు.. ఐమెసేజ్ ఉపయోగించి మెసేజ్లు పంపించుకున్నప్పుడు బ్లూ కలర్లో మెసేజ్లు చూపిస్తున్నాయి. అదే గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి రిసీవ్ చేసుకున్నప్పుడు మాత్రం గ్రీన్ కలర్ నోటిఫికేషన్ కనిపిస్తోంది. ఇది యూజర్లను ఇబ్బందికి గురి చేస్తోందట!. ఈ మేరకు ది వాల్ స్ట్రీట్ జర్నల్.. డజన్ల మంది టీనేజర్లను, కాలేజీ స్టూడెంట్లను ప్రశ్నించి.. వాళ్ల అభిప్రాయాల ఆధారంగా ఓ కథనం ప్రచురించింది. వాళ్లలో చాలామంది ఈ ఆప్షన్పై ఇబ్బందిగా ఫీలవ్వడం విశేషం. మరోవైపు ఈ ఫీచర్పై గూగుల్ సైతం మండిపడింది. పోటీతత్వం పేరుతో భిన్నత్వం ప్రదర్శించడం, యువత మానసిక స్థితిని యాపిల్ దెబ్బ తీస్తోందని గూగుల్ ఆరోపణలు గుప్పించింది. Apple’s iMessage lock-in is a documented strategy. Using peer pressure and bullying as a way to sell products is disingenuous for a company that has humanity and equity as a core part of its marketing. The standards exist today to fix this. https://t.co/MiQqMUOrgn — Hiroshi Lockheimer (@lockheimer) January 8, 2022 అయితే యాపిల్ ఈ ఆరోపణల్ని ఓపెన్గా ఖండించకపోయినా.. ఓ ప్రకటనలో అదేం లేదని పేర్కొంది. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది యాపిల్.. ఎపిక్ గేమ్స్ కేసు సందర్భంగా.. ఆండ్రాయిడ్ యూజర్లకు ఐమెసేజ్ ఫీచర్ అందుబాటులో ఉంచాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ.. చివరకు ఆ ప్రతిపాదనను యాపిల్ మేనేజ్మెంట్ తిరస్కరించిందని తేలింది. -
Blackberry The Fall: ఆ ఆలస్యమే బ్లాక్బెర్రీ కొంప ముంచింది
ఒకప్పుడు స్మార్ట్ఫోన్ రారాజు. చేతిలో ఆ కంపెనీ ఫోన్ ఉంటే అదో దర్పం. ప్రొఫెషనల్స్కి అదొక అవసరం కూడా. ఒకానొక సీజన్లో ఏకంగా ఒక 5 కోట్ల డివైజ్లు అమ్ముడు పోయిన చరిత్ర ఉంది. కానీ, అటుపై ఘోరమైన పతనాన్ని చవిచూసింది. అందుకు కారణం ఆలస్యమేనన్న విశ్లేషణ నడుస్తోంది ఇప్పుడు. ‘ఆలస్యం అమృతం విషం’ అంటారు పెద్దలు. రీసెర్చ్ ఇన్ మోషన్(RIM) అలియాస్ బ్లాక్బెర్రీ లిమిటెడ్ విషయంలో ఇదే జరిగింది. పోటీతత్వాన్ని తేలికగా తీసుకున్న బ్లాక్బెర్రీ.. రాంగ్ స్టెప్పులు వేసింది. నష్టాలను సైతం పట్టించుకోకుండా విలువల పేరుతో ఈ కెనెడియన్ టెలికాం కంపెనీ స్వీయ తప్పిదాలు చేసి పతనం వైపు అడుగు వేసింది. ఇంతకీ బ్లాక్బెర్రీ ది రైజ్ అండ్ ది ఫాల్ ఎలా సాగిందో చూద్దాం.. పేజర్లు, హ్యాండ్సెట్ల తయారీతో మొదలైన RIM(బ్లాక్బెర్రీ) ప్రస్థానం.. స్మార్ట్ఫోన్ రాకతో కొత్త పుంతలు తొక్కింది. పూర్తిగా ఐకానిక్ కీబోర్డుతో పదిహేనేళ్లపాటు కోట్ల మంది యూజర్లను అలరించింది. ఒకానొక టైంలో బ్లాక్బెర్రీ.. అమెరికాలో 50 శాతం స్మార్ట్ఫోన్ మార్కెట్ను, ప్రపంచం మొత్తం మీద 20 శాతం మార్కెట్ను శాసించింది. 2011, 2012లో ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయి హ్యాండ్సెట్ల అమ్మకాలతో సంచలనం సృష్టించిన బ్లాక్బెర్రీకి.. పోటీదారుల ఒరవళ్లతో గడ్డుకాలం మొదలైంది. 2016 నుంచి ఏకంగా ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన బ్లాక్బెర్రీ.. తాజాగా సొంత ఓఎస్ ఫోన్లు పని చేయవంటూ ప్రకటించింది. దీంతో కోట్ల ఫోన్లు మూగబోయాయి. ఇంతకీ ఏం జరిగింది? బీజం.. 1984లో మైక్ లాజరడీస్,డౌగ్లస్ ఫ్రాగ్ అనే కెనెడియన్ ఇంజీనీర్లు RIMను ప్రారంభించారు. మొదట్లో ఈ కంపెనీ ఐబీఎంకోసం ఎల్ఈడీ సిస్టమ్, మోడెమ్స్ తో పాటు పేజెస్ వంటి లోకల్ నెట్ వర్కింగ్ కనెక్టివిటీ టెక్నాలజీ డెవలప్ చేసింది. అలాగే ఫిల్మింగ్ ఎడిటింగ్ సిస్టమ్ను డిజైన్ చేసింది. అందుకు గాను 1998లో ఆస్కార్ అవార్డ్ను గెలుచుకుంది. ఆ తర్వాత 1989లో కెనడియన్ ఫోన్ కంపెనీ అయిన రోజెర్స్ ఫోన్ మెసేజింగ్ కోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన తన మొబైల్ నెట్వర్క్లో పనిచేసేలా రిమ్(RIM)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా పేజర్ల తయారీ మొదలుపెట్టింది. 1996లో వాటర్లూ(ఒంటారియో) వేదికగా రిమ్ నుంచి పేజర్లు కలర్ ఫీచర్లతో రిలీజ్ అయ్యాయి. ఫోన్ల రాక.. బ్లాక్ బెర్రీ డివైజ్ 850 1999 నుంచి అధికారికంగా రిలీజ్ అయ్యింది. 2000 సంవత్సరంలో ఫిజికల్ బోర్డుతో కూడిన 957 మోడల్ స్మార్ట్ఫోన్ రిలీజ్ అయ్యింది. 2006లో ట్రాక్ బాల్ను అమర్చింది. బిజినెస్ ప్రొఫెషనల్స్ కోసం తీసుకొచ్చిన ఫోన్లు.. సాధారణ జనాలకు సైతం కిక్కు ఇచ్చింది. బ్లాక్ బెర్రీ అంటే.. ముందుగా వచ్చిన అడ్వాన్స్డ్ స్మార్ట్ఫోన్ అనే ముద్ర పడింది. 2007లో కంపెనీ ఆదాయం అక్షరాల 3 బిలియన్ డాలర్లు దాటేసింది. బ్లాక్బెర్రీ సెల్ ఫోన్లు ఒకప్పుడు చాలా ప్రజాదరణ పొందిన వ్యక్తులు వాటిని "క్రాక్బెర్రీస్" అని పిలిచేవారు. కిమ్ కర్దాషియాన్, బరాక్ ఒబామా లాంటి ప్రముఖులు ఈ ఫోన్లనే వాడేవాళ్లు. పెద్ద కీబోర్డు, మధ్యలో ఐబాల్.. కీ సెటప్తో ప్రత్యేకంగా ఆకర్షించేవి ఫోన్లు. అందులో నెట్ ఇన్కమ్ 631 మిలియన్ డాలర్లు. ఈ లోపు బ్లాక్బెర్రీ స్ఫూర్తితో యాపిల్ ఐఫోన్లను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా స్టీవ్ జాబ్స్ అంగీకరించడం విశేషం. పైగా ఇకపై బ్లాక్బెర్రీకి తాము గట్టి పోటీ ఇవ్వబోతున్నామంటూ ఆయన ప్రకటించాడు కూడా. కానీ, బ్లాక్బెర్రీ మాత్రం ఏనాడూ యాపిల్ను పోటీగా చూడలేదు. అదే కొంప ముంచింది. ఏడాదికో అప్డేట్ లేకపాయే! 2008లో రిలీజ్ అయిన ఫ్లిప్ఫోన్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టించింది. అయితే ఆ వెంటనే వచ్చిన టచ్ మోడల్ మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. అదే సమయంలో ఐఫోన్ అమ్మకాలు మొదలైనా ఖరీదు ఎక్కువ కావడంతో బ్లాక్బెర్రీ హవానే నడిచింది. అలా 2011 వరకు బ్లాక్బెర్రీ ఫోన్ల డామినేషన్ కొనసాగింది. అయితే స్మార్ట్ఫోన్ మార్కెట్లో వస్తున్న మార్పును పసిగట్టడంలో బ్లాక్బెర్రీ ఘోరంగా విఫలమైంది. ఐఫోన్లో ప్రతీ ఏడాది ఓ అప్డేట్ రావడం, ఆపై మోటోరోలా అమ్మకాల సంచలనం కొనసాగడంతో బ్లాక్బెర్రీ పతనం చిన్నగా మొదలైంది. అదే సమయంలో టార్చ్, ప్లేబుక్ టాబ్లెట్ అంటూ ఇన్నోవేషన్లు చేసిందే తప్ప.. అప్డేట్కి ప్రయత్నించలేదు. దీంతో ఆ తర్వాత వచ్చిన మోడల్స్ ఏవీ పెద్దగా అమ్ముడుపోలేదు. బోర్ కొట్టించాయి. సొంత యాప్ స్టోర్ బ్లాక్బెర్రీలో మరో ఫెయిల్యూర్ అంశం. యాపిల్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్లా మ్యాజిక్ చేయలేకపోయింది. ఎంత ప్రయత్నించినా.. చిన్న చిన్న ఫీచర్లు తీసుకొచ్చేందుకు బోలెడంత సమయం తీసుకునేది. ఇదంతా యూజర్లకు విసుగు తెప్పించింది. తోటి పోటీదారులు ఫ్రంట్ బ్యాక్ కెమెరాలంటూ అడ్వాన్స్డ్ ఫీచర్లు తెస్తుంటే.. బ్లాక్బెర్రీ మాత్రం అక్కడే ఆగిపోయింది. దీంతో పతనం ఉధృతి పెరిగింది. 2009లో 20 శాతానికి పడిపోయిన బ్లాక్బెర్రీ మార్కెట్.. మూడేళ్లలో 5 శాతానికి పడిపోయింది. అయితే 2013లో టచ్ మోడల్స్ స్పెసిఫికేషన్స్ వచ్చినప్పటికీ.. అప్పటికే చాలా ఆలస్యమైంది. అదే ఏడాది రిమ్ అధికారికంగా బ్లాక్బెర్రీ అనే పేరును ప్రమోట్ చేసుకుంది. కానీ, ఆ వ్యూహం కూడా బెడిసి కొట్టింది. కస్టమర్లు, యూజర్ల పట్ల నిజాయితీగా ఉందనుకునే తప్పా.. పతనాన్ని ఊహించలేదు. 2016 చివరి క్వార్టర్కు చేరుకునే సరికి.. 432 మిలియన్ల స్మార్ట్ఫోన్లో అమ్ముడుపోయినవి కొన్నే. దీంతో స్మార్ట్ఫోన్ మార్కెట్ షేర్ సున్నాకు చేరింది. చేతులు మారినా.. 2015 నుంచి బ్లాక్బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్ను నిలిపివేసి.. సొంత ఓఎస్ ప్లేస్లో ఆండ్రాయిడ్ భాగస్వామిగా సాగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణలో సంచలనాలకు నెలవైన బ్లాక్బెర్రీ లిమిటెడ్.. అనూహ్యంగా ఓనర్షిప్ నుంచి పక్కకు జరిగింది. 2016లో చైనీస్ కన్జూమర్ ఎలక్ట్రిక్ కంపెనీ టీసీఎల్.. బ్లాక్బెర్రీని కొనుగోలు చేసింది. బ్లాక్బెర్రీ 10, బ్లాక్బెరర్రీ వోఎస్లతో పని చేసింది. 1999 నుంచి కెనెడియన్ కంపెనీ బ్లాక్బెర్రీ లిమిటెడ్ (RIM) ఆధ్వర్యంలో పని చేసి.. 2016 నుంచి బీబీ మెరాహ్ పుతిహ్(ఇండోనేషియా), ఒప్టిమస్ ఇన్ఫ్రాకమ్(ఇండియా), టీసీఎల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో నడిచింది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టీసీఎల్ కార్పొరేషన్ మాత్రమే బ్లాక్బెర్రీ డెవలపర్గా ఉంది. కస్టమైజ్డ్ ఆప్షన్స్, సెక్యూరిటీ ఫీచర్స్.. ఇలా ఎన్నో.. 2018లో రిలీజ్ అయ్యింది. BlackBerry KeyOne అండ్ Key2 వంటి స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది టీసీఎల్. ఇక జనవరి 4, 2022 తేదీ నుంచి బ్లాక్బెర్రీ మోడల్స్ ఫోన్లలో బ్లాక్బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్ను పూర్తిగా నిలిపివేశాయి. కానీ బ్లాక్బెర్రీ ఫోన్లలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. 2021 నుంచి టెక్సాస్కు చెందిన స్టార్టప్ ఆన్వార్డ్మొబిలిటీ 5జీ బ్లాక్బెర్రీ స్మార్ట్ఫోన్ల లైసెన్స్ను చేజిక్కించుకుంది. స్మార్ట్ఫోన్ మార్కెట్ నుంచి బ్లాక్బెర్రీ ఫోన్లు ఇంకా పూర్తిగా కనుమరుగు కాకపోయి ఉండొచ్చు.. కానీ, క్లాసిక్ టచ్తో వచ్చిన ఫోన్లు, ఫీచర్లు, సొంత సాఫ్ట్వేర్ మాత్రం ఇక కనిపించవు. బహుశా.. రాబోయే రోజుల్లో ఆ పేరు కనుమరుగు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే.. బ్లాక్బెర్రీ నోస్టాల్జియా కేటగిరీలో చేరిపోవడం ఖాయం. -సాక్షి, వెబ్స్పెషల్ -
ఆండ్రాయిడ్ 13 ఫీచర్లు లీక్, వారెవ్వా..అదరగొట్టేస్తున్నాయ్!
ప్రస్తుతం అన్నీ స్మార్ట్ ఫోన్లలో ఓఎస్ ఆండ్రాయిడ్ 12 వెర్షన్ నడుస్తోంది. అయితే త్వరలో ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 13 వెర్షన్ అప్డేట్ అవుతుందని పలు రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి.ఆ రిపోర్ట్ల ఆధారంగా ఆండ్రాయిడ్ 13 వెర్షన్ ఫీచర్లు అదరగొట్టేస్తున్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఈ ఏడాది మేలో గూగుల్ ఆండ్రాయిడ్ 13 వెర్షన్ విడుదల చేస్తుండడంతో ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన రిపోర్ట్లు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇక ఈ ఆండ్రాయిడ్ 13 వెర్షన్లో ఉన్న సరికొత్త ఫీచర్ల గురించి తెలుసుకుందాం. యాడ్స్కు చెక్ పెట్టొచ్చు స్మార్ట్ ఫోన్లో బ్రౌజింగ్ చేసే సమయంలో కొత్త కొత్త వెబ్సైట్లను ఓపెన్ చేస్తుంటాం. ఆ సమయంలో మన పర్మీషన్ లేకుండా వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు మన ఫోన్కు వస్తుంటాయి. చిరాకు పెట్టిస్తుంటాయి. కానీ ఆండ్రాయిడ్ 13 వెర్షన్ అప్ డేట్తో పర్మీషన్ లేకుండా నోటిఫికేషన్ లు మన ఫోన్కు రాలేవు. పైగా నోటిఫికేషన్ కావాలని ఎనేబుల్ చేసినా , బ్లాక్ చేయాలంటే ఈజీగా బ్లాక్ చేయొచ్చు. లాంగ్వేజ్ కూడా ఫోన్లో యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు లాంగ్వేజ్ మార్చుకోవాల్సి వచ్చేది. కానీ ఆండ్రాయిడ్ 13లో అలా కాదు. యూజర్ ఒక్కసారి యాప్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్లో లాంగ్వేజ్ మార్చుకుంటే..ఆ లాంగ్వేజ్లో కంటెంట్ను చూపించాల్సి ఉంటుంది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఆండ్రాయిడ్13లో ఉన్నాయని వెలుగులోకి వచ్చిన రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. కాగా, గూగుల్ ఆండ్రాయిడ్ 13వెర్షన్ ఈ సంవత్సరంలో మే, సెప్టెంబర్ నెలలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ అనూహ్యంగా ఓఎస్ ఫీచర్లు లీకవ్వడంతో ఆండ్రాయిడ్ 13వెర్షన్ను ఉపయోగించుకునేందుకు యూజర్లు టెంప్ట్ అవుతున్నారు. చదవండి: సంచలన ఆవిష్కరణ.. ఇక స్మార్ట్ఫోన్లో కెమెరా బంప్స్ కనపడవు! -
మీ స్మార్ట్ఫోన్లో మెమరీ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా..! ఐతే ఇలా ట్రై చేయండి..!
మీరు ఒక యాప్ను ఇన్స్టాల్ చేస్తోన్న సమయంలో ‘స్టోరేజ్ ఫుల్ డిలీట్ సమ్ ఐటమ్స్’ అంటూ మెసేజ్ వస్తే వెంటనే మనకు పనికిరాని ఫోటోలను, ఇతర ఫైళ్లను డిలీట్ చేస్తాం. ఇలాంటి సందర్భాలను మనలో చాలా మందే ఎదుర్కొని ఉంటాం. మీకున్న స్మార్ట్ఫోన్తోనే మెమరీ స్టోరేజ్ సమస్యలను ఈ చిన్న చిట్కాతో తొలగించవచ్చును. స్మార్ట్ఫోన్ మెమరీ స్టోరేజ్లో కాకుండా క్లౌడ్ స్టోరేజ్ యాప్స్తో మీకు నచ్చినంతా మెమరీ క్లౌడ్లో సేవ్ చేసుకోవచ్చును. పలు క్లౌడ్ యాప్స్ అత్యంత సురక్షితమైనవి, సమర్థవంతమైనవి. మీ డేటాను ఇంటర్నెట్ సహయంతో క్లౌడ్ స్టోరేజ్లో సేవ్ చేసుకోవడంతో మీ స్మార్ట్ఫోన్లో ఎప్పుడూ..‘ స్టోరేజ్ ఫుల్ డిలీట్ సమ్ ఐటమ్స్..’ అనే మెసేజ్ ఎప్పుడు రాదు. ఇప్పటివరకు వందల్లో క్లౌడ్ యాప్స్లో అందుబాటులో కలవు. వాటిలో కొన్ని ఉచితంగానే సర్సీస్ను అందిస్తున్నాయి. మరికొన్ని యాప్స్ కొంత మేర ఫీజును వసూలు చేస్తున్నాయి. టాప్ క్లౌడ్ స్టోరజ్ యాప్స్ మీ కోసం... ► అమెజాన్ డ్రైవ్ అమెజాన్ తీసుకొచ్చిన క్లౌడ్ ఆధారిత స్టోరేజ్ యాప్ అమెజాన్ డ్రైవ్. అమెజాన్ ప్రైమ్ యూజర్లు వీటి సేవలను పొందవచ్చును. ఫోటోలు, వీడియోల కోసం అపరిమిత బ్యాకప్తో పాటు 5GB ఉచిత నిల్వను అమెజాన్ డ్రైవ్ యూజర్లకు అందిస్తోంది. మీరు సంవత్సరానికి సుమారు రూ. 700 చెల్లిస్తే అపరిమిత స్టోరేజ్ను అప్గ్రేడ్ కావచ్చు. ► ఆటోసింక్(Autosync) ఈ యాప్ను మెటాకంట్రోల్ రూపొందించింది. క్లౌడ్ స్టోరేజ్ మెనేజర్గా ఆటోసింక్ ఎంతబాగో ఉపయోగపడుతుంది. ఈ యాప్లో మీరు గూగుల్ డ్రైవ్, వన్డ్రైవ్, డ్రాప్ బాక్స్, బాక్స్, మెగా లాంటి క్లౌడ్ యాప్స్ను ఒకే దగ్గర కల్పిస్తోంది. అపరిమిత స్టోరేజ్ కోసం నెలకు 9.99 (సుమారు రూ. 745)డాలర్లను వసూలు చేస్తోంది. ► డ్రాప్ బాక్స్ ఈ యాప్ మనలో కొంత మందికి సుపరిచితమే. డ్రాప్ బాక్స్ ఇప్పటికే చాలా మంది స్మార్ట్ఫోన్ యూజర్స్ వాడుతున్నారు. ఇది 2జీబీ డేటా వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్ అప్షన్ను అందిస్తోంది. నెలకు రూ. 12 వందలను చెల్లిస్తే 2టీబీ స్టోరేజ్ను ఒకేసారి ఆరుగురు సభ్యులు వాడవచ్చును. ► గూగుల్ డ్రైవ్ ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్తో పాటుగా క్లౌడ్ స్టోరేజ్ సౌకర్యాన్ని గూగుల్ అందిస్తోంది. యూజర్లు 15 జీబీ వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్ను పొందవచ్చును. నెలకు సుమారు రూ. 150 చెల్లించి 100జీబీ డేటాను క్లౌడ్ స్టోరేజ్ను పొందవచ్చును. ► మైక్రోసాఫ్ట్ వన్డ్రైవ్ గూగుల్ డ్రైవ్ మాదిరి క్లౌడ్ స్టోరేజ్ విషయంలో మైక్రోసాఫ్ట్ వన్డ్రైవ్ సేవలను మైక్రోసాఫ్ట్ అందిస్తోంది. మైక్రోసాఫ్ట్ వన్డ్రైవ్ అనేది ఒక ప్రముఖ క్లౌడ్ స్టోరేజ్ ఎంపిక. ఎందుకంటే ఇది వివిధ రకాల విండోస్ ఉత్పత్తులతో నేరుగా కలిసిపోతుంది. యూజర్లు 5జీబీ వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్ను పొందవచ్చును. నెలకు 6.99 డాలర్లను చెల్లిస్తే 1టీబీ వరకు క్లౌడ్ స్టోరేజ్ను పొందవచ్చును. వన్డ్రైవ్తో పాటుగా ఆఫీస్365 సేవలను కూడా పొందవచ్చును. ► నెక్స్ట్క్లౌడ్ నెక్స్ట్క్లౌడ్ అనేది విభిన్నమైన క్లౌడ్ స్టోరేజ్ యాప్. ఇది రెసిలియోసింక్ యాప్ లాగా పని చేస్తుంది.మీ కంప్యూటర్ , మీ ఫోన్ మధ్య ఫైల్లను సమకాలీకరించడానికి యాప్ మిమ్మల్ని అనుమతిస్తుంది. నెక్స్ట్ క్లౌడ్ సర్వర్లో మీ క్లౌడ్ స్టోరేజ్ సపరేట్గా ఆన్లైన్లో ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ► రెసిలియో సింక్ రెసిలియో సింక్ (బిట్టోరంట్ సింక్)గా కొత్త మందికి ఈ క్లౌడ్ స్టోరేజ్ యాప్ పరిచయం. స్వంత క్లౌడ్ స్టోరేజీని చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఉత్తమమైన క్లౌడ్ స్టోరేజ్ సొల్యూషన్ రెసిలియో సింక్. ఇది డ్రాప్బాక్స్, గూగుల్ డ్రైవ్ మొదలైన క్లౌడ్ స్టోరేజ్ యాప్స్లా పనిచేస్తుంది. మీ స్టోరేజ్ను ఈ యాప్ను సింక్లో ఏర్పాటుచేయడం ద్వారా క్లౌడ్లో మీ ఫైల్స్ భద్రంగా సేవ్ అవుతాయి. ► ట్రెసోరిట్ ట్రెసోరిట్ అనేది సరికొత్త, ఖరీదైన క్లౌడ్ స్టోరేజ్ యాప్స్లో ఒకటి. అయితే, ఈ యాప్ భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడదు. అప్లోడ్ చేయబడిన ప్రతి ఫైల్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను కలిగి ఉంటుంది. ప్రైమరీ యూజర్లకు 1 జీబీ వరకు ఉచిత స్టోరేజ్ను పొందవచ్చును. నెలకు 12.50 డాలర్లను చెల్లించి 500జీబీ క్లౌడ్ స్టోరేజ్ డేటాను ప్రీమియం యూజర్లకు అందిస్తోంది. చదవండి: స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో కింగ్..జనవరి నుంచి ఆ స్మార్ట్ ఫోన్ ఇక కనిపించదు! -
ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్..! ఈ యాప్స్ ఫోన్లో ఉంటే..మీ ఖాతాలు ఖాళీ..!
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ యూజర్లకు హెచ్చరిక. ది డేంజరస్ మాల్వేర్ ‘జోకర్’ మళ్లీ వచ్చేశాడు. దేశంలో ఇప్పటికే ఐదు లక్షల మంది ఆండ్రాయిడ్ యూజర్స్ జోకర్ మాల్వేర్తో లింకులు ఉన్న యాప్స్(సురక్షితం కానీ) ను డౌన్లోడ్ చేసుకున్నారని, వాళ్లలో చాలామంది ఆర్థిక లావాదేవీలు ప్రమాదం అంచున ఉన్నాయని ప్రముఖ రీసెర్చ్ సంస్థ ప్రడియో ఒక బ్లాగ్ పోస్ట్లో వెల్లడించింది. జోకర్ మాల్వేర్.. మొదటిసారి 2017లో గూగుల్లో కన్పించింది. ఇది చాలా ప్రమాదకరమైన మాల్వేర్ అని.. దీనికి అడ్డుకట్ట వేసేందుకు మూడేళ్లపాటు శ్రమించామని పోయినేడాది గూగుల్ ప్రకటించింది. కానీ, కిందటి ఏడాది జులైలో గూగుల్ ప్లే స్టోర్లో మళ్లీ జోకర్ కదలికలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన గూగుల్.. కొన్ని అనుమానాస్పద యాప్ల్ని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. గూగల్ ప్లే స్టోర్పై మరోసారి జోకర్ మాల్వేర్ విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా ప్రడియో ఒక అలర్ట్ జారీ చేసింది. జోకర్ మాల్వేర్ సుమారు పది యాప్స్లో ఉన్నట్లు ప్రడియో గుర్తించింది. ఈ యాప్స్ వెంటనే డిలీట్ చేయాలని ప్రడియో పేర్కొంది. ఈ యాప్స్ మీ స్మార్ట్ఫోన్లలో ఉంటే హ్యకర్లు మీ బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను క్షణాల్లో ఊడ్చేస్తారని ప్రడియో వెల్లడించింది. జోకర్ మాల్వేర్ డిటెక్ట్ఐనా యాప్స్ ఇవే..! కలర్ మెసేజ్ యాప్ సేఫ్టీ యాప్లాక్ కన్వీనియెంట్ స్కానర్ 2, ఎమోజి వాల్పేపర్స్ సెపరేట్ డాక్ స్కానర్ ఫింగర్టిప్ గేమ్బాక్స్ ఈజీ పీడీఎఫ్ స్కానర్ సూపర్-క్లిక్ వీపీఎన్ యాప్ వాల్యూమ్ బూస్టర్ లౌడర్ సౌండ్ ఈక్వలైజర్ ఫ్లాష్లైట్ ఫ్లాష్ అలర్ట్ యాప్ చదవండి: టెస్లా కంటే తోపు కారును లాంచ్ చేసిన హువావే..! ఏకంగా 1000కిమీ మేర..! ప్రత్యర్థి ఆటోమొబైల్ కంపెనీలకు చుక్కలే..! -
ఆండ్రాయిడ్కు శాంసంగ్ గుడ్బై!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఆండ్రాయిడ్కు గుడ్బై చెప్పనుందా?. వేరే ఆపరేటింగ్ సిస్టమ్తో మొబైల్స్ తీసుకురానుందా?. అవునని చెబుతూ పలు టెక్ బ్లాగులు కథనాలు వెలువరుస్తున్నాయి. ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్ తీసేసి ‘ఫుచ్సియా’ (Fuchsia) అని పిలిచే ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మొబైల్స్ తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశేషం ఏంటంటే.. ఫుచ్సియా కూడా గూగుల్ డెవలప్ చేసిన ఆపరేటింగ్ సిస్టమే కావడం. ఇది ఓపెన్ సోర్స్ ఓఎస్.. అంటే గూగుల్, యాపిల్ ప్లేస్టోర్లాగా మొబైల్ తయారీదారుల నుంచి ఛార్జ్లు వసూలు చేయదు. రాబోయే రోజుల్లో స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లు, ఐఓటీ టెక్నాలజీ ఉపయోగించే విధంగా ఆండ్రాయిడ్ ఓఎస్ ప్లేస్లో ఫుచ్చియా వెర్షన్ ను అప్డేట్ చేయనుందని పలు టెక్ బ్లాగ్లు కథనాలు ఇస్తున్నాయి. అయితే.. ఇదంతా సులభం కాదని, అలా కొత్త ఓఎస్ అప్డేట్ చేయాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని మరికొన్ని రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. టెక్ మార్కెట్లో ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ప్రాసెస్ ఆటోమెషిన్, ఎడ్జ్ కంప్యూటింగ్, వర్చువల్ రియాలిటీ, అగుమెంటడ్ రియాలిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంట్నెట్ ఆఫ్ థింగ్స్, 5జీ వంటి కొత్త కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఆయా టెక్నాలజీలకు కనెక్ట్ అయ్యే విధంగా ప్రముఖ సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ యూజర్లు వినియోగిస్తున్న ఆండ్రాయిడ్ ఓఎస్ నుండి ఫుచ్సియా వైపు అడుగులు వేస్తోంది. కానీ, ఇది శాంసంగ్ ఆలోచన కాదని, దీని వెనుక మాస్టర్ మైండ్ గూగుల్ అనేది మరో ప్రచారం నడుస్తోంది. అయితే మార్కెట్లో కాంపిటీటర్ల కంటే ముందుగా ఈ వెర్షన్ అప్డేట్ చేయడం వల్ల శాంసంగ్ పైచేయి సాధించొచ్చు.. లేకపోవచ్చు!. కానీ, కొత్త ఓఎస్ వల్ల యూజర్లు ఇబ్బంది పడితే శాంసంగ్ భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. అందుకే ఆండ్రాయిడ్ వెర్షన్ను అప్డేట్ చేసే విషయంలో శాంసంగ్ ఆచితూచి అడుగులు వేస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చదవండి: వెబ్ 3.0 అంటే ఏమిటి? వాళ్లకు ఎందుకంత కళ్లమంట? -
శెభాష్ దాస్.. క్యాష్రివార్డ్ ప్రకటించిన గూగుల్
టెక్ దిగ్గజం గూగుల్ భారతీయ యువకుడికి నజరానా ప్రకటించింది. హ్యాకర్ల పాలిట కల్పతరువుగా మారిన ఓ బగ్ను కనిపెట్టిన కృషికి ఫలితంగా ఆ యువకుడికి క్యాష్ ప్రైజ్ను అందించింది. అస్సాంకు చెందిన రోనీ దాస్ అనే యువకుడు.. గూగుల్ ఆండ్రాయిడ్ ఫోర్గ్రౌండ్ సర్వీసులో ఒక బగ్ను గుర్తించాడు. ఈ బగ్ సాయంతోనే హ్యాకర్లు యూజర్ల ఫోన్ను హ్యాక్ చేయడంతో పాటు వ్యక్తిగత డాటాను తస్కరించే అవకాశం ఉంది. ఈ బగ్ను రిపోర్టింగ్ చేసినందుకు గానూ 5 వేల డాలర్లను(మన కరెన్సీలో మూడున్నర లక్షల రూపాయలు) ప్రకటించింది గూగుల్. దాస్ ఈ బగ్ను ఈ ఏడాది మే నెలలోనే గుర్తించాడు. ఈ కష్టానికి గుర్తింపుగా 5వేల డాలర్లు అందిస్తున్నాం అని గూగుల్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ టీం ఒక మెయిల్ ద్వారా దాస్కు తెలియజేసింది. దాస్ చెప్తున్న వివరాల ప్రకారం.. ఈ బగ్ ద్వారా ఫోన్ కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్..ఇలాంటి వివరాలు కూడా హ్యాకర్ల చేతికి వెళ్తాయట. అయితే గోప్యత కారణంగా బగ్కి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించేందుకు దాస్ ఇష్టపడలేదు. సైబర్ అన్వేషణలో ఆసక్తి ఉన్న దాస్.. గతంలో గువాహటి యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లోనూ బగ్ను గుర్తించాడు. ఇక రోనీ దాస్ గుర్తించిన బగ్ను ఫిక్స్ చేసిందా? లేదా? అనే విషయంపై గూగుల్ స్పష్టత ఇవ్వలేదు. బగ్లను గుర్తించిన రీసెర్చర్లు, ఇంజినీర్లు, సైబర్ ఎక్స్పర్ట్స్లకు టెక్ దిగ్గజాలు నజరానా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఆసక్తి ఉంటే మీరూ ఆ దిశగా ప్రయత్నం చేసి అదృష్టం పరీక్షించుకోండి. చదవండి: భారత్లో గూగుల్, ఫేస్బుక్ ఆదాయం.. వామ్మో! -
ఆండ్రాయిడ్లో అదిరిపోయే ఫీచర్స్..! పిల్లలను, కార్లను కంట్రోల్ చేయొచ్చు....!
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో అదిరిపోయే ఫీచర్స్ను త్వరలోనే యూజర్లకు గూగుల్ అందించనుంది. ఈ కొత్త ఫీచర్స్తో, పిల్లల దినచర్యలను, కార్లను కంట్రోల్ చేయవచ్చునని గూగుల్ వెల్లడించింది. గూగుల్ తెస్తోన్న అద్బుతమైన ఫీచర్లతో యూజర్లకు స్మార్ట్ఫోన్స్ మరింత సహాయకరంగా మారనుంది. వీటిలో ఫ్యామిలీ బెల్, డిజిటల్ కార్ కీ లాంటివి సూపర్ ఫీచర్స్గా నిలవనున్నాయి. ఫ్యామిలీ బెల్..కుటుంబ సభ్యులతో మమేకం..! ఈ ఫీచర్తో కుటుంబంలోని సభ్యుల రిమైండర్స్ను, రోజువారీ షెడ్యూళ్లను మానిటర్ చేయవచ్చును. ఉరుకుల పరుగుల జీవితంలో కుటుంబ సభ్యులు కలిసి ఉండే క్షణాలు చాలా తక్కువయ్యాయి. ఈ ఫీచర్తో బ్రేక్ఫాస్ట్, లంచ్, హాలిడే లాంటివి ప్లాన్ చేసేందుకు ఉపయోగపడుతోంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయంపాటు గడిపేందుకు సహాయపడుతుంది. దీనిలో గూగుల్ ప్లే బుక్స్, యూట్యూబ్ మ్యూజిక్ లాంటి విడ్గెట్స్ కూడా రానున్నాయి. గూగుల్ ఫోటోస్ గూగుల్ ఫోటోస్లో రానున్న కొత్త ఫీచర్స్తో మీ కుటుంబం, స్నేహితులతో గడిపిన జ్ఞాపకాలను మీకు గుర్తు చేసే లక్ష్యంతో గూగుల్ ఫోటోస్ కొత్త మెమోరీస్ ఫీచర్ను కూడా అందిస్తోంది. ఈ జ్ఞాపకాలను ఫోటో గ్రిడ్లో కనిపిస్తాయి. డిజిటల్ కార్ కీ.. ఆండ్రాయిడ్ యూజర్లు తమ స్మార్ట్ఫోన్లనుపయోగించి సదరు ఫీచర్ కల్గిన కార్లను లాక్ చేయడానికి, అన్లాక్ చేయడానికి గూగుల్ డిజిటల్ ఆటోమోటివ్ కీను అందుబాటులోకి తేనుంది. ఇది తొలుత బీఎమ్డబ్ల్యూ వాహనాల కోసం పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 స్మార్ట్ఫోన్లలో ఎంపిక చేయబడిన దేశాలలో విడుదల కానుంది. ఆండ్రాయిడ్ ఆటో సిస్టమ్ను సపోర్ట్ చేసే కార్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉండనుంది. గత ఏడాది డిజిటల్ ఆటోమోటివ్ కార్ల కీను యాపిల్ పరిచయం చేసింది. ఈ సదుపాయం కొన్ని లగ్జరీకార్లకు మాత్రమే అందుబాటులో ఉంది. జీబోర్డ్ ఎమోజీ కీబోర్డ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లకు గూగుల్ జీబోర్డ్ అనే కీబోర్డ్ను పరిచయం చేసింది. జీబోర్డ్కు కూడా అప్డేట్ తీసుకురానుంది. ఈ అప్డేట్తో మీరు ఇతరులకు చెప్పదల్చుకున్న విషయాలను రెండు ఎమోజీలను ఒకే ఎమోజీగా కనవర్ట్ చేసి సెండ్ చేయవచ్చును. బీటా యూజర్లు రాబోయే రెండు, మూడు వారాల్లో జీబోర్ట్ ఎమోజీకిచెన్ ఫీచర్ అందుబాటులో రానుంది. ఆటో రిసేట్..! ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ తీసుకువస్తోన్న చివరి ప్రధాన మార్పు ఆటో-రీసెట్ పరిష్మన్స్. మీరు ఇంతకాలం ఉపయోగించని డౌన్లోడ్ చేసిన యాప్ల కోసం రన్టైమ్ అనుమతులను ఆటోమెటిక్గా ఆఫ్ చేయడానికి ఈ ఫీచర్ మీ గాడ్జెట్ను ఎనేబుల్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 6.0 లేదా అంతకంటే ఎక్కువ ఆండ్రాయిడ్ ఓఎస్ ఉన్న స్మార్ట్ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉండనుంది. చదవండి: వాట్సాప్ గ్రీవియన్స్ ఆఫీసర్ రాజీనామా? -
గూగుల్ నుంచి ‘స్నోకోన్’, దాని వెనుక చరిత్ర ఏంటో తెలుసా ?
స్మార్ట్ఫోన్ మార్కెట్లో గూగుల్కి ఎదురే లేదు. యాపిల్ నుంచి తీవ్ర పోటీ నెలకొన్నా గూగుల్కి చెందిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ స్థానం చెక్కు చెదరడం లేదు. ఆండ్రాయిడ్కి పోటీగా హువావే, శామ్సంగ్, వన్ప్లస్లు కొత్త ఓఎస్లు అభివృద్ధి చేసినా ఆండ్రాయిడ్ ముందు నిలవలేకపోయాయి. కాగా గూగుల్ సరికొత్త ఓఎస్ ఆండ్రాయిడ్ 12 రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. స్నో కోన్ రెండేళ్ల గ్యాప్ తర్వాత గూగుల్ మరోసారి పాత సంప్రదాయం కొనసాగించేందుకు రెడీ అయ్యింది. మరోసారి తమ అప్డేట్లకు ఐస్క్రీమ్ల పేరు పెట్టే సంప్రదాయం కొనసాగించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా త్వరలో రిలీజ్ కాబోతున్న గూగుల్ అప్డేట్కి స్నోకోన్గా పేరు పెట్టింది. ముందుగా పిక్సెల్ ఎప్పటిలాగే పిక్సెల్ ఫోన్లకే ముందుగా స్నోకోన్ అప్డేట్ని అందివ్వనుంది గూగుల్. ఆ తర్వాత ఒప్పో, వన్ప్లస్ సంస్థలకు అందివ్వనుంద. ఇక మోటరోలా సైతం ఈ అప్డేట్ని ముందుగా అందుకునే కంపెనీల జాబితాలో ఉంది. స్నోకోన్లో ప్రైవసీ సెట్టింగ్స్, థీమ్స్లో కొత్త ఫీచర్లు జోడించినట్టు సమాచారం. 2008లో మొదలు ఫీచర్ ఫోన్లు రాజ్యమేలుతున్న కాలంలో స్మార్ట్ఫోన్లుగా యాపిల్ రంగ ప్రవేశం ఓ సంచలనంగా మారింది. ఆ వెంటనే బ్లాక్బెర్రీ మెస్సేజింగ్ యాప్తో మార్కెట్లో చొచ్చుకుపోయింది. భవిష్యత్తు ఈ రెండు ఫోన్లదే అనుకునే తరుణంలో 2008 సెప్టెంబరులో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో గూగుల్ తెర మీదకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురన్నదే లేకుండా గూగుల్ ఆండ్రాయిడ్ విజయ ప్రస్థానం కొనసాగుతోంది. ఐస్క్రీమ్ల పేరు గూగుల్ 2008 సెప్టెంబరు 23న రిలీజ్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్కి 1.0 పేరుతో కోడ్ నేమ్ ఇచ్చింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ప్రతీ ఏడు ఆపరేటింగ్ సిస్టమ్కి కొత్త మెరుగులు దిద్దుతూ కొత్త కోడ్ నేమ్తో వస్తోంది. రెండో సారి వచ్చిన ఆప్డేటెడ్ ఓఎస్కి 1.1 కోడ్ నేమ్ ఇచ్చింది. ఆ తర్వాత 2009లో వచ్చిన మూడో అప్డేట్ నుంచి ఓఎస్లకు పలు రకాల ఐస్క్రీమ్ల పేరుతో కోడ్ నేమ్ ఇవ్వడం మొదలు పెట్టింది గూగుల్. కప్కేక్తో మొదలు 2009 ఏప్రిల్లో విడుదలైన ఆపరేటింగ్ సిస్టమ్కి కప్కేక్గా కోడ్ నేమ్ ఇచ్చింది గూగుల్. ఆ తర్వాత వరుసగా డోనట్, ఎక్లయిర్స్, ఫ్రోయో, జింజర్బ్రెడ్, హనీకోంబ్, ఐస్క్రీం శాండ్విచ్, కిట్కాట్, లాలీపాప్, మార్ష్మాలో, నౌగట్, ఓరియో, పై వరకు వరుసగా తొమ్మిది అప్డేట్లకి ఐస్క్రీమ్ల పేరు పెట్టింది. టెన్తో బ్రేక్ గూగుల్ అప్డేట్స్కి ఐస్క్రీమ్ల పేరు పెట్టడంతో ఆండ్రాయిడ్ యూజర్లలో ఎంతో క్రేజ్ వచ్చింది. దీంతో గూగుల్ తదుపరి అప్డేట్కి ఏం పేరు పెడుతుందనే అంశంపై ఆసక్తి పెరిగింది. 9వ అప్డేట్ అయిన పై తర్వాత వచ్చే అప్డేట్కి కోడ్నేమ్ క్యూగా ఇచ్చింది గూగుల్. కానీ అప్డేట్ విడుదలైన తర్వాత క్యూ స్థానంలో 10 వచ్చి చేరింది. ఆ తర్వాత అప్డేట్కి సైతం ఐస్క్రీం పేరు ఇవ్వకుండా ఆండ్రాయిడ్ 11గానే గూగుల్ పేర్కొంది. చదవండి : 2ఎస్వీ.. ఇక యూజర్ పర్మిషన్ లేకుండానే! హ్యాకర్లకు చుక్కలే! -
Google: ఆండ్రాయిడ్ 12 ఎప్పుడంటే..
Android 12 update: ఆండ్రాయిడ్ 12 అప్డేట్పై గూగుల్ కంపెనీ గుడ్న్యూస్ చెప్పింది. నవంబర్ రెండో వారంలోపు లేటెస్ట్ వెర్షన్ను యూజర్ల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈలోపే ఆండ్రాయిడ్ అప్డేట్(లేటెస్ట్)కు సంబంధించిన కోడ్ను ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్లో అప్లోడ్ చేసింది. మరికొన్ని వారాల్లో రాబోతున్న గూగుల్ పిక్సెల్ ఫోన్లతో లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్డేట్ను అందించబోతోంది గూగుల్. ఆ తర్వాత శామ్సంగ్, వన్ప్లస్, ఒప్పో, రియల్మీ, టెన్కో, వివో, షియోమీ డివైజ్లకు ఇవ్వనుంది. పూర్తిస్థాయిలో ఆండ్రాయిడ్ సంబంధిత ఫోన్లకు 12-వెర్షన్ ఈ ఏడాది చివరిలోపు ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ 12 బేటా వెర్షన్ ద్వారా(పిక్సెల్ డివైస్లతోనే) ఫీడ్బ్యాక్ తీసుకున్న గూగుల్.. ఆండ్రాయిడ్ 12 సోర్స్ను ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్టు(AOSP)లో ఉంచేసింది. చదవండి: ఇంటర్నెట్తో ఇక చాలా కష్టం! ఫ్రెండ్లీ ఫీచర్స్తో పాటు ప్రైవసీ డ్యాష్బోర్డ్, డైనమిక్ బిల్ట్ లాక్ స్క్రీన్, డైనమిక్ స్క్రీన్ లైటింగ్తో పాటు కెమెరా ఎఫెక్ట్స్, ఫొటోల ఎడిటింగ్ ఎఫెక్ట్ అనుభవాల్ని అందించబోతోంది నయా వెర్షన్. ఇక ఆండ్రాయిడ్ 12 వెర్షన్కి సంబంధించిన పూర్తి వివరాలను అక్టోబర్ 27-28 తేదీల్లో జరగబోయే ఆండ్రాయిడ్ డేవ్ సమ్మిట్లో తెలియజేయనున్నారు. 2010 నుంచి ఆండ్రాయిడ్లో ఒక్కో వెర్షన్ను రిలీజ్ చేస్తూ వస్తున్న గూగుల్.. ప్రస్తుతం ఆండ్రాయిడ్లో 11 వెర్షన్ని నడిపిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఐఫోన్లలో ఐవోఎస్ 15 వెర్షన్లు నడుస్తోంది. గూగుల్ క్రోమ్ వాడుతున్నారా..! ఐతే బీ కేర్ఫుల్...! ఈ 26 యాప్స్ ఇవి చాలా డేంజర్.. చెక్ చేస్కోండి! -
అలర్ట్: ప్రమాదంలో 70 దేశాల ఆండ్రాయిడ్ యూజర్లు
ప్రపంచ వ్యాప్తంగా 70దేశాల్లో 10మిలియన్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లు ప్రమాదంలో పడనున్నారు. సైబర్ నేరస్తులు 'గిఫ్ట్ హార్స్' అనే మాల్వేర్ సాయంతో సైబర్ నేరస్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్ సెక్యూరిటీ సంస్థ జింపేరియం రిపోర్ట్ను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 70దేశాలకు చెందిన ఆండ్రాయిడ్ యూజర్స్ అకౌంట్లలో నుంచి ఉన్న మనీని కాజేసేందుకు క్యాంపెయిన్ నిర్వహిస్తుందని జింపేరియం హెచ్చరికలు జారీ చేసింది.ఇదే విషయం తమ రీసెర్చ్లో వెలుగులోకి వచ్చిందని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.సైబర్ నేరస్తులు పక్కా ప్లాన్తో గూగుల్ ప్లే స్టోర్, థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా(ఫిష్షీ) లింక్స్ పంపి యూజర్ల ఈమెయిల్, బ్యాంక్ అకౌంట్లను తస్కరిస్తారు. Zimperium's zLabs team recently discovered an aggressive #mobile premium services campaign. This scam has hidden behind #malicious Android #apps acting as Trojans. The #Trojan attack, which we have named #GriftHorse, steals money from the victims. https://t.co/tz7R3KJ0yX — ZIMPERIUM (@ZIMPERIUM) September 29, 2021 డబ్బుల్ని ఎలా దొంగిలిస్తారు? సైబర్ నేరస్తులు ముందుగా లోకల్ లాంగ్వేజ్లో యూజర్లను అట్రాక్ట్ చేసేలా యాడ్స్ను ఆండ్రాయిడ్ ఫోన్లకు సెండ్ చేస్తారు. ఆ యాడ్స్ లో ఉన్న లిక్ క్లిక్ చేస్తారో వారికి కళ్లు చెదిరే బహుమతులు అందిస్తామని ఊరిస్తారు. ఆ ఆఫర్లకు అట్రాక్ట్ అయిన యూజర్లు పొరపాటున ఆ లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతులు. మీరు సెలక్ట్ చేసుకున్న గిఫ్ట్ మీకు కావాలనుకుంటే ఫోన్నెంబర్తో పాటు మెయిల్ ఐడీ, వ్యక్తిగత వివరాల్ని నమోదు చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్ పంపిస్తారు. వ్యక్తిగత వివరాల్ని యాడ్ చేసే సమయంలో ఐపీ అడ్రస్ ద్వారా వాటిని దొంగిలించి డైరెక్ట్గా యూజర్ అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తారు. అంతేకాదు తాము అందించే భారీ గిఫ్ట్లు కావాలనుకుంటే ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇలా 70 దేశాల్లో ఒక్కో యూజర్ నుంచి ప్రతి నెలా రూ.3100లు వసూలు చేస్తారని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ జెడ్ల్యాబ్స్ తెలిపింది. 2021లో ఇదే అత్యంత ప్రమాదకరమైన సైబర్ దాడి' అని అభిప్రాయం వ్యక్తం చేసింది. చదవండి: ఆన్లైన్లో గేమ్స్ ఆడేవారిపై సైబర్ నేరస్తుల దాడులు..! -
జియో ఫోన్ లాంచ్కు ముందు..మరో కంపెనీపై ముఖేశ్ అంబానీ కన్ను..!
రిలయన్స్ చేయని వ్యాపారం అంటూ ఏది లేదు. టెలికాం, ఇంటెర్నెట్ సేవలు, ఈ-కామర్స్, రిటైల్ నెట్వర్క్, చమురు, గ్యాస్ ఇలా వివిధరంగాల్లో రిలయన్స్ విస్తరిస్తూనే ఉంది. రిలయన్స్ తన స్వంత ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేస్తూన్న తరుణంలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ విస్తృత శ్రేణిపై రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. చదవండి: 35వేల కోట్ల జరిమానా సరే! యాపిల్ సంగతేంది? ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ఫోన్స్ ఫీచర్ను అందించే కంపెనీపై తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కన్ను వేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్స్ లాక్ పడినప్పుడు వచ్చే న్యూస్, ఫోటోస్ను అందించే గ్లాన్స్ ఫీచర్ ముఖేశ్ అంబానీ ఎంతగానో ఆకర్షించినట్లు తెలుస్తోంది. గ్లాన్స్లో సుమారు 300 మిలియన డాలర్లను పెట్టుబడి పెట్టేందుకు ముఖేశ్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఏంటీ గ్లాన్స్..! గ్లాన్స్ అనేది యాప్ కాదు, ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలో అంతర్నిర్మిత ఫీచర్. దీనిని బెంగుళూరుకు చెందిన ఇన్మొబి కంపెనీ రూపొందించింది. స్మార్ట్ఫోన్లలో గ్లాన్స్ ఎనేబుల్ చేసిన యూజర్లు తమ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ను మేల్కొన్నప్పుడు, వారు తప్పనిసరిగా న్యూస్ హెడ్లైన్తో ఆకర్షణీయమైన చిత్రాన్ని గమనిస్తారు. యూజర్లు వారి స్మార్ట్ఫోన్లో ఒకసారి కుడివైపుకి స్వైప్ చేస్తే, వారు లైవ్స్ వీడియోస్, షార్ట్ వీడియో కంటెంట్ను, ఫోటో స్టోరీలను చూడవచ్చు, అంతేకాకుండా పలు గేమ్స్ను కూడా ఆడవచ్చును. వార్తలు, వినోదం, టెక్, క్రీడలు, ఫ్యాషన్ , ట్రావెలింగ్ వంటి అంశాలను లాక్ స్క్రీన్లో గ్లాన్స్ అందిస్తుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీతో పాటు మరిన్నీ భారతీయ భాషలను గ్లాన్స్ అందిస్తోంది. చదవండి: Anand Mahindra: తాలిబన్ల ఇలాకాలో ఆ ఛాన్స్ వస్తేనా.. -
అలెర్ట్: మీరు ఆ ఫోన్లు వాడుతుంటే ఇకపై వాట్సాప్ పనిచేయదు
యూజర్లకు వాట్సాప్ హెచ్చరికలు జారీ చేసింది. యూజర్లు వాట్సాప్ ఆండ్రాయిడ్ వెర్షన్ 4.0 వినియోగిస్తున్నట్లైతే వెంటనే అప్డేట్ చేసుకోవాలని తెలిపింది. లేదంటే అప్డేట్ చేయని స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని స్పష్టం చేసింది. వీటితో పాటు పలు పాత మోడల్ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ ఆండ్రాయిడ్ 4.1 సపోర్ట్ చేయదని, అందుకే ఆఫోన్లలో వాట్సాప్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు చెప్పింది. వాట్సాప్ ఫీచర్ లీకర్ వీ బీటా ఇన్ఫో ప్రకారం..కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లకు ఆకట్టుకునేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తుంది.పనిలో పనిగా ఆండ్రాయిడ్ వెర్షన్లలో మార్పులు చేస్తుంది. తాజాగా వాట్సాప్ ఆండ్రాయిడ్ వెర్షన్ 4.0 ను అప్ డేట్ చేసింది. ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ వర్షన్ 4.0ను వినియోగిస్తున్న యూజర్లు ఆండ్రాయిండ్ వెర్షన్ 4.1కి అప్ డేట్ అవ్వాలని తెలిపింది. అధికారిక సపోర్ట్ పేజీలో సైతం వాట్సాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ 4.1 సపోర్ట్ చేస్తున్నట్లు పేర్కొంది. నవంబర్1,2021 నుంచి ఆండ్రాయిడ్ వెర్షన్ 4.0.4 ఉంటే వాట్సాప్ పనిచేయదని చెప్పింది. ఇక వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ సపోర్ట్ చేయని స్మార్ఫోన్ల జాబితాలో ఆప్టిమస్ ఎల్ 3, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ఐఐ, గెలాక్సీ కోర్, జెడ్టిఇ గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్, హువాయ్ అసెండ్ జి 740లు ఉన్నాయి. ఈ ఫోన్లలో లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ కాదని వాట్సాప్ ప్రకటించింది. చదవండి: ఫీచర్లతో డబ్బులే డబ్బులు, వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్! -
గూగుల్, యూట్యూబ్.. ఏవీ పని చేయవు! రేపటి నుంచే..
లక్షలాది డివైజ్లలో! జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్ ఇతరత్ర సౌకర్యాలను బ్లాక్ చేసేందుకు గూగుల్ రంగంలోకి దిగింది. రేపటి(సెప్టెంబర్ 27) నుంచి పాత స్మార్ట్ ఫోన్లలో గూగుల్ సంబంధిత అకౌంట్లను శాశ్వతంగా పనిచేయకుండా నిలిపివేయనుంది. గూగుల్ అకౌంట్ బ్లాక్ కాకుండా ఉండాలంటే.. ఫోన్లను అప్గ్రేడ్ చేయడం లేదంటే కొత్త మొబైల్కు మారిపోయి లాగిన్ అవ్వాల్సిందే. ఇలా చేయకపోతే జీమెయిల్, గూగుల్ సెర్చ్, గూగుల్ డ్రైవ్, యూట్యూబ్, ఇతర గూగుల్ సేవలను పొందలేరని(యాప్స్ ద్వారా) గూగుల్ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 27 నుంచి 2.3 వెర్షన్ డివైజ్లలో ఆయా గూగుల్ యాప్స్లో లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తే యూజర్నేమ్, పాస్వర్డ్ ఎర్రర్ వస్తుంది. అది కరెక్ట్ మెయిల్, పాస్వర్డ్ అయినా సరే. చదవండి: ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు ఇక లీక్ కావా? ఆండ్రాయిడ్ 2.3 వెర్షన్ లేదా అంతకంటే తక్కువ వెర్షన్తో నడుస్తోన్న స్మార్ట్ ఫోన్లలో గూగుల్ సైన్ ఇన్ సపోర్ట్, ఇతరత్ర సేవలను నిలిపివేయనుంది. యూజర్ల భద్రత, డాటా పరిరక్షణ అంశాల్ని దృష్టిలో ఉంచుకొని గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం డివైజ్ తయారీదారులు చాలాకాలంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ గూగుల్ మొండిగా ముందుకు పోతోంది. అయితే ఆ ఫోన్ బ్రౌజర్లో మాత్రం ఈ సర్వీసులను యూజర్లు పొందే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. చదవండి: గూగుల్ ఇన్కాగ్నిటో బ్రౌజింగ్ చేస్తున్నారా? ఫోన్ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయమని లేదా ఫోన్లనే మార్చేయమని గత కొంతకాలంగా గూగుల్, యూజర్లను అప్రమత్తం చేస్తూ వస్తోంది కూడా. గూగుల్ తీసుకున్న నిర్ణయంతో ఈ ఆండ్రాయిడ్ వెర్షన్ను కల్గి ఉన్న స్మార్ట్ఫోన్లను కొత్త ఫోన్లతో రిప్లేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఈరోజుల్లో ఆండ్రాయిడ్ 3.0 వెర్షన్.. అంతకంటే ఎక్కువ ఆపరేటింగ్ వెర్షన్స్నే వాడుతున్నారని గూగుల్ పేర్కొంది. ఒకవేళ వాడుతుంటే గనుక తక్షణమే ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్(అప్గ్రేడ్) చేస్కోమని సూచిస్తోంది. చదవండి: గూగుల్ క్రోమ్ను బీభత్సంగా వాడుతున్నారా? ప్రస్తుతం ఆండ్రాయిడ్లో 11 వెర్షన్, ఐఫోన్లలో ఐవోఎస్ 15 వెర్షన్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. 2010 నుంచి గూగుల్ ఒక్కో వెర్షన్ను రిలీజ్ చేస్తూ వస్తోంది. 2017లో ఆండ్రాయిడ్ 2.3 ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లకు గూగుల్ పే సేవలను నిలిపివేసింది. అయితే ఆండ్రాయిడ్ 2.3 వెర్షన్తో ఇప్పటికీ నడుస్తున్న కొన్ని ఫోన్లు ఇవి.. Sony Xperia Advance, Lenovo K800, Sony Xperia Go, Vodafone Smart II, Samsung Galaxy S2, Sony Xperia P, LG Spectrum, Sony Xperia S, LG Prada 3.0, HTC Velocity, HTC Evo 4G, Motorola Fire, Motorola XT532 చదవండి: వీటి కోసం గూగుల్లో వెతికితే ప్రమాదమే..! -
హెల్త్కేర్...యాప్ హుషార్
ఒకప్పుడు అరచేయి చూస్తే చాలు ఆరోగ్యం గురించి చెప్పేసేవారట. ఇప్పుడు అరచేయిలో ఇమిడిపోయే మొబైల్ ఫోన్ చూసి ఆరోగ్య చరిత్ర చెప్పేస్తున్నారు. వ్యక్తికి సంబంధించిన శారీరక, మానసిక ఆరోగ్య విశేషాలు, వ్యాధులు, చికిత్సల చరిత్ర, వ్యాక్సినేషన్, చేయించుకున్న శస్త్రచికిత్సలు,వాడిన/వాడుతున్న మందులు.. వంటివన్నీ ఒకే చోట అందించే యాప్స్కు ఇప్పుడు అమాంతం డిమాండ్ పెరిగిపోయింది. కరోనా తర్వాత వ్యక్తిగత ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ హెల్త్కేర్ యాప్స్ వెల్లువకు కారణమైంది. చదవండి: పది కోట్ల ప్రైజ్మనీ రేసులో మన బిడ్డ ప్రతి వ్యక్తి తనకు తానే ఆరోగ్య వ్యవస్థను నిర్వహించుకునే అవకాశాన్ని ఈ యాప్స్ ఇస్తున్నాయి. ఉన్న చోట నుంచి కదలకుండా అందించే టెలి మెడిసిన్ ఆరోగ్య సంరక్షణ విషయంలో చికిత్స మాత్రమే కాకుండా వ్యాధులు రాకుండా నివారణకు కూడా వీలు కల్పిస్తాయి. సమగ్రమైన నిర్వహణ ఉపకరణంగా డాక్టర్లు / రోగుల నడుమ వారధిగా హెల్త్కేర్ యాప్ నిలుస్తుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్, వెబ్ పోర్టల్, ఐఓఎస్ల ద్వారా లభ్యమవుతుంది. ‘‘ప్రస్తుతం, ఆరోగ్యరంగంలో వేగవంతమైన వృద్ధి నమోదవుతోంది. హెల్త్కేర్ పరిశ్రమలో సరికొత్త ఆవిష్కరణలు పుంజుకుంటున్నాయి. . మారిన వాతావరణంలో రోగులు, డాక్టర్ల నడుమ అంతరాలను పూరించే ఉపకరణాల అవసరం బాగా పెరిగింది. వ్యాధులకు చికిత్సలను అందుకోవడంలో రోగుల వెతలను తగ్గించాలనే లక్ష్యంతో విడుదలవుతున్న నూతన యాప్స్ మెరుగైన ఫలితాలను పొందడంలో రోగులకు సహాయపడతాయి. ఒకే యాప్తో మొత్తం కుటుం ఆరోగ్యాన్ని కూడా నిర్వహించవచ్చు’’అని ఇటీవలే ఈ తరహా యాప్ను విడుదల చేసిన డిజిటల్ హెల్త్కేర్ స్టార్టప్ హీల్ఫా సిఇఒ రాజ్ జనపరెడ్డి అభిప్రాయపడ్డారు. ‘‘ఈ యాప్ పై రోగికి సంబంధించిన ఆరోగ్య రికార్డులన్నీ ఒక్క క్లిక్లో డాక్టర్తో పాటుగా రోగికి సైతం లభ్యమవుతాయి. అంతేకాదు డిజిటల్ చెల్లింపులకు సైతం సహకరిస్తుంది. టెలి కన్సల్టేషన్తో రోగులు ఏ సమయంలో అయినా, ఎక్కడ నుంచైనా డాక్టర్లను సంప్రదించవచ్చు’’నని చెప్పారాయన. చదవండి: Xiaomi : మరో అద్బుతమైన టెక్నాలజీ ఆవిష్కరించనున్న షావోమీ..! -
వాట్సప్ యూజర్లకు షాక్.. ఇక ఆ ఫోన్లకు కొత్త ఫీచర్స్ నిలిపివేత!
ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకోస్తూ వినియోగదారులను ఆశ్చర్య పరచడం వాట్సప్కు సహజం. ఇటు ఆండ్రాయిడ్, అటు ఐఓఎస్ వినియోగదారులకు కొత్త ఫీచర్లను అందించే వాట్సప్ యూజర్లకు షాకింగ్ న్యూస్ తెలిపింది. నవంబర్ 1, 2021 నుంచి పలు మోడళ్లలో వాట్సప్ కొత్త ఫీచర్స్ పని చేయవని పేర్కొంది. ఆండ్రాయిడ్ 4.0.3 లేదా అంతకంటే తక్కువ ఓఎస్ మీద రన్ అవుతున్న ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఓఎస్ 9 లేదా అంతకంటే తక్కువ రన్ అవుతున్న ఆపిల్ ఫోన్లలో వాట్సప్ కొత్త ఫీచర్స్ ఇక పని చేయవు. ఈ పలు మోడలళ్లలో కొత్త ఫీచర్ అప్డేట్ చేయడానికి వర్షన్ సపోర్టు చేయదని అందుకే వీటికి వాట్సప్ కొత్త ఫీచర్స్ నిలివేస్తున్నట్లు పేర్కొంది. ఇది క్రమ క్రమంగా ఈ పాత స్మార్ట్ ఫోన్లపై వాట్సప్ నిలిపివేసే అవకాశం ఉంది. యూజర్లకు మెరుగైన సదుపాయం అందించడం కోసం ఇలా చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. వాట్సప్ విడుదల చేసిన ఆండ్రాయిడ్ ఫోన్ల జాబితాలో శామ్ సంగ్, ఎల్ జీ, జడ్ టీఈ, హువావే, సోనీ, అల్కాటెల్ వంటి తదితర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మరోవైపు ఐఫోన్ల జాబితాలో ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ఉన్నాయి.(చదవండి: భారత తొలి ఎలక్ట్రిక్ కారు ఇదేనండోయ్..!) -
అదిరిపోయే టీవీ, ఇంట్లో ఉన్న అన్నీ డివైజ్లకు కనెక్ట్ చేయొచ్చు
న్యూఢిల్లీ: గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ దిగ్గజం హయర్ తాజాగా ఎస్8 ఆండ్రాయిడ్ టీవీల శ్రేణిలో కొత్తగా మరో రెండు టీవీలను ఆవిష్కరించింది. వీటిలో 55 అంగుళాల టీవీ రేటు రూ. 1,10,990గాను, 65 అంగుళాల టీవీ ధర రూ. 1,39,990గాను ఉంటుంది. 4కే హెచ్డీఆర్ పిక్చర్ నాణ్యత, ఆల్–స్క్రీన్ డిస్ప్లే, ఫ్రంట్ స్పీకర్ డిజైన్ తదితర ఫీచర్లు వీటిలో ఉంటాయి. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 9.0 వెర్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన ప్రత్యేకతలతో ఇది ఇంట్లోని అన్ని స్మార్ట్ డివైజ్లకు ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) హబ్గా కూడా ఉపయోగపడుతుందని హయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. -
జోకర్ రీఎంట్రీ... మీ ఫోన్లో ఈ 8 యాప్లు ఉంటే డిలీట్ చేయండి
Joker Virus Apps List 2021: జోకర్ మాల్వేర్ మళ్లీ వచ్చేసింది. ప్రమాదకరమైన 'జోకర్' వైరస్ తిరిగి వచ్చినట్లు బెల్జియం పోలీసులు ఇటీవల ఆండ్రాయిడ్ యాప్ వినియోగదారులను హెచ్చరించారు. అత్యంత ప్రమాదకర వైరస్లలో ఒకటైన జోకర్ వైరస్ ఆండ్రాయిడ్ పరికరాలపై దాడి చేసి గూగుల్ ప్లే స్టోర్లలోని వివిధ యాప్స్ లో దాగి ఉంటుంది. ఈ వైరస్ యూజర్ అనుమతి లేకుండానే పేమెంట్ సర్వీసులను సబ్ స్క్రైబ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. "గూగుల్ నిషేదించిన ఎనిమిది ప్లే స్టోర్ అప్లికేషన్లలో ఈ హానికరమైన వైరస్ ను గుర్తించినట్లు" బెల్జియన్ పోలీసులు తమ పోర్టల్ లో తెలిపారు. క్షణాల్లో ఖాతా ఖాళీ యాదృచ్ఛికంగా, ఈ 8 యాప్స్ ఈ ఏడాది జూన్ లో క్విక్ హీల్ సెక్యూరిటీ ల్యాబ్స్ పరిశోధకులు గుర్తించిన విధంగానే ఉన్నాయి. ఈ మాల్ వేర్ గురించి తెలిసిన తర్వాత గూగుల్ ఈ యాప్స్ ను ప్లే స్టోర్ నుండి తొలగించింది. అయితే, ఆండ్రాయిడ్ వినియోగదారులు వెంటనే తమ స్మార్ట్ఫోన్ల నుంచి ఈ యాప్స్ తొలిగించాలని పేర్కొంది. బెల్జియన్ అధికారుల ఇటీవలి హెచ్చరిక ప్రకారం.. ఇప్పటికీ ఈ యాప్స్ ఉన్న వినియోగదారులు జోకర్ మాల్వేర్ బాధితులుగా మారుతున్నారు.(చదవండి: ఈ రెండు ఆధార్ సేవలు నిలిపివేసిన యూఐడీఏఐ) ఈ మాల్వేర్ ఒక్కసారి మన ఫోన్లోకి వచ్చిదంటే ఇక అంతే సంగతులు..! మీ ఫోన్ లో ఉన్న విలువైన సమాచారాన్ని హకర్లు డార్క్ వెబ్లో అమ్మేస్తారు. అంతేగాకుండా మీ అకౌంట్లలో ఉన్న డబ్బులను క్షణాల్లో ఖాళీ చేస్తారు. జోకర్ మాల్వేర్ తొలిసారిగా 2017 గూగుల్ ప్లేస్టోర్లో తొలిసారిగా ప్రత్యక్షమైంది. క్విక్ హీల్ పరిశోధకుల ప్రకారం.. జోకర్ అనేది ఒక మొండి మాల్వేర్. యూజర్కు తెలియకుండానే రెప్పపాటులో డబ్బులు మాయం చేస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్పై యాడ్స్ రూపంలో ఈ మాల్వేర్ దాడి చేస్తుంది. మెసేజ్లు, ఓటీపీ, పాస్వర్డ్లు, పేమెంట్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోగలుగుతుంది. 8 ఆండ్రాయిడ్ యాప్స్ జాబితా: Auxiliary Message Element Scanner Fast Magic SMS Free Cam Scanner Go Messages Super Message Super SMS Travel Wallpapers -
గూగుల్ సంచలన నిర్ణయం...!
ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ను ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆండ్రాయిడ్ యాప్లను విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్చేయనున్నట్లు పేర్కొంది. ఆండ్రాయిడ్ యాప్లకు మద్దతు ఇచ్చే మొదటి ఆపరేటింగ్ సిస్టమ్గా విండోస్ 11 నిలిచింది. విండోస్ 11 లో ఆండ్రాయిడ్ యాప్లను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా కాకుండా అమెజాన్ యాప్ స్టోర్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చదవండి: Cryptocurrency: క్రిప్టోకరెన్సీలో భారత్ స్థానం ఎంతో తెలుసా...! తాజాగా గూగుల్ ఆండ్రాయిడ్ యాప్లను, గేమ్లను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్తో పాటుగా ఆపిల్ మాక్ బుక్స్లో సపోర్ట్చేయడానికి గూగుల్ ప్రణాళికలను చేస్తోన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి యూఎస్ కోర్టులో ఆపిల్ కంపెనీకి, ఏపిక్ గేమ్స్ మధ్య విచారణ కొనసాగుతుంది. దీంతో గూగుల్ ‘గేమ్స్ ఫ్యూచర్’ అనే అంతర్గత గూగుల్ కాన్ఫిడెన్షియల్ ప్రెజెంటేషన్లో ఈ నిర్ణయాన్ని పొందుపర్చినట్లూ ప్రముఖ టెక్ వెబ్సైబ్ ది వెర్జ్ గుర్తించంది. ఈ నిర్ణయాన్ని గూగుల్ ప్లే డివిజన్ 2020 అక్టోబర్ నెలలో తీసుకుంది. ఈ ప్రెజెంటేషన్లో భాగంగా గూగుల్ 2025 నాటికి గేమింగ్ రంగంలో తన రోడ్మ్యాప్ను సిద్దంచేసుకుంది. (చదవండి: ఈ క్రెడిట్ కార్డు తీసుకుంటే వడ్డీ కట్టక్కర్లేదు) -
ఐఫోన్ యూజర్లకు గుడ్న్యూస్..!
ఆపిల్ యూజర్లకు వాట్సాప్ గుడ్న్యూస్ను అందించింది. ఆపిల్ యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇకపై వాట్సాప్ ఐవోఎస్ నుంచి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్కు చాట్ బదిలీ చేసే ఫీచర్ను వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ నెల ప్రారంభంలో శాంసంగ్ అన్ప్యాక్ట్ 2021 ఈవెంట్లో తొలి సారిగా ఐఫోన్ టూ ఆండ్రాయిడ్ వాట్సాప్ చాట్ బదిలీ ఫీచర్ను ప్రకటించింది. డబ్ల్యూఏబెటాఇన్ఫో ప్రకారం ఎంపిక చేయబడిన ఆపిల్ ఐవోఎస్ ఫోన్లకు అందుబాటులో ఉందని వెల్లడించింది. ఐవోఎస్ వెర్షన్ 2.21.160.16 వాడుతున్న యూజర్లకు వాట్సాప్ చాట్ ఫీచర్ బదిలీ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో లేదు. ఐఫోన్లో వాట్సాప్ వెర్షన్ 2.21.160.16 వాడుతున్న వారికి వాట్సాప్ యాప్ సెట్టింగ్స్లో ‘ట్రాన్సఫర్ టూ ఆండ్రాయిడ్’ అనే ఫీచర్ కన్పిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్తో శాంసంగ్ కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్లకు మాత్రమే చాట్ బదిలీ ఫీచర్ అందుబాటులో ఉంది. (చదవండి: ఐమాక్స్ వీడియో రికార్డింగ్ ఈ స్మార్ట్ఫోన్ సొంతం...!) త్వరలోనే ఇతర కంపెనీ స్మార్ట్ఫోన్లకు అందుబాటులో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ చాట్లను బదిలీ చేసుకోవడానికి dr.fone వంటి థర్డ్పార్టీ యాప్స్ అందుబాటులో ఉండేవి. అంతేకాకుండా ఈ సర్వీస్ను ఉపయోగించుకోవాలంటే కొంత అమౌంట్ను వెచ్చించాల్సి ఉంటుంది. ఈ యాప్ థర్డ్పార్టీది కావడంతో యూజర్లకు భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. (చదవండి: కెమెరా ఇన్నోవేషన్ ల్యాబ్కు వేదికానున్న హైదరాబాద్) -
ఈ రియల్మీ బడ్జెట్ ఫోన్ వాడుతున్నారా..? అయితే ఇది మీకోసమే
మీరు రియల్ మీ సీ3 స్మార్ట్ ఫోన్ను వినియోగిస్తున్నారా? అయితే ఇది మీకోసమే.ఈ ఫోన్కు లేటెస్ట్గా ఆండ్రాయిడ్ 11 స్టేబుల్ వెర్షన్ విడుదలైంది.చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ సంస్థ రియల్ మీ సీ3ని 2020 ఫిబ్రవరి 14న విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన సీ2 కి హ్యూజ్ రెస్పాన్స్ రావడంతో సీ3ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ఫోన్కు సంబంధించి బీటా వెర్షన్ జులైలో విడుదల చేసినా లేటెస్ట్గా ఆ ఫోన్ స్టేబుల్ వెర్షన్ను రియల్ మీ ప్రతినిధులు విడుదల చేశారు.ఈ అప్డేట్ ద్వారా ఫోన్లో టెక్నికల్ సమస్యలతో పాటు కేటగిరి, సిస్టమ్, ఈజీ మొబైల్ ఇంటర్ ఫేస్ ఆప్టిమైజేషన్,సెక్యూరిటీ ప్రైవసీ, గేమ్స్ ఇలా ఒక్కటేమిటీ రియల్ సీ3 వెర్షన్ పూర్తిగా మారిపోతుంది. రియల్మీ సీ3 స్పెసిఫికేషన్లు రియల్ మీ సీ3 స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే, 89.8 పర్సెంట్ తో స్క్రీన్ టు బాడీ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో అందుబాటులోకి రాగా మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్.. ఆండ్రాయిడ్ 10 రియల్ మీ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనక భాగంలో 12 మెగా పిక్సెల్ కాగా, 2 మెగా పిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. దీంతో పాటు హెచ్ డీఆర్, నైట్ స్కేప్, క్రోమా బూస్ట్, స్లో మో, పొర్ ట్రెయిట్ మోడ్ ఫీచర్ తో పాటు హెచ్ డీఆర్, ఏఐ బ్యూటిఫికేషన్, పనోరమిక్ వ్యూ, టైమ్ ల్యాప్స్ ఫీచర్లు ఉన్న 5 మెగా పిక్సెల్ సెల్ఫీల కెమెరా సౌకర్యం ఉంది. -
ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్..! కొత్తగా..
ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ జింపెరియం ఆండ్రాయిడ్ యూజర్లను హెచ్చరించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలోకి ప్లైట్రాప్ అనే ట్రోజాన్(పలు సైట్ల నకిలీ రూపం) ఫేస్బుక్ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రోజన్ వల్ల ఇప్పటివరకు భారత్తో కలిపి 144 దేశాలలో పదివేల మంది ఆండ్రాయిడ్ యూజర్లను ప్రభావితం చేసినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ జింపెరియం వెల్లడించింది. దీనిని వియత్నాంకు చెందిన సైబర్నేరగాళ్లు రూపోందించనట్లుగా తెలుస్తోంది. ఈ ట్రోజన్ ఈ ఏడాది మార్చి నుంచే ఆండ్రాయిడ్ యూజర్లపై దాడి చేస్తున్నట్లు జింపెరియం పేర్కొంది. ఈ ట్రోజన్ ఏం చేస్తుందటే..! నెట్ఫ్లిక్స్, గూగుల్ యాడ్స్కు సంబంధించిన యాప్ల కూపన్ కోడ్లను ఫ్లైట్రాప్ ట్రోజన్ ఆండ్రాయిడ్ యూజర్లకు ఎరగా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కూపన్ కోడ్లకోసం ఇచ్చిన లింక్లను ఓపెన్ చేయగానే యూజర్ల ఫేస్బుక్ ఖాతాల ద్వారా వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడానికి హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని జింపెరియం తన పరిశోధనలో వెల్లడించింది. ఒకసారి యూజర్ స్మార్ట్ఫోన్లోకి ట్రోజన్ చేరితే ఫేస్బుక్ ఖాతాల ద్వారా యూజర్ల ఫేస్బుక్ ఐడీ, లోకేషన్, ఈ-మెయిల్, ఐపీ అడ్రస్లను హాకర్లు సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫోటో కర్టసీ: జింపెరియం ఎలా వస్తాయంటే...! ఫ్లైట్రాప్ ట్రోజన్ గూగుల్ ప్లే స్టోర్లోని పలు యాప్ల ద్వారా, ఇతర థర్డ్పార్టీ యాప్స్ ద్వారా యూజర్ల స్మార్ట్ఫోన్లలోకి హ్యాకర్లు చొప్పిస్తున్నట్లు జింపెరియం పేర్కొంది. గూగుల్ ఇప్పటికే హానికరమైన యాప్లను తొలగించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కాగా ఇతర థర్డ్పార్టీ యాప్స్ ద్వారా ఈ ట్రోజన్లు ఫోన్లలోకి వచ్చే అవకాశం ఉందని జింపెరియం హెచ్చరించింది. థర్డ్పార్టీ యాప్స్ను ఫోన్లనుంచి వెంటనే తీసివేయాలని ఆండ్రాయిడ్ యూజర్లకు జింపెరియం సూచించింది. -
ఈ ఫోన్లలో జీమెయిల్, యూట్యూబ్ పనిచేయవు..!
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన స్మార్ట్ఫోన్లపై గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. పాత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వర్షన్ను కల్గి ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లకు గూగుల్ అకౌంట్లలోకి సైన్ ఇన్ అవ్వకుండా మద్దతును గూగుల్ ఉపసంహరించుకోనుంది. 2.3.7 వర్షన్ లేదా అంతకంటే తక్కువ వర్షన్తో నడుస్తోన్న ఆండ్రాయిడ్ ఫోన్లలో సైన్ ఇన్లకు గూగుల్ తన సపోర్ట్ను నిలిపివేయనుంది. గూగుల్ తీసుకున్న నిర్ణయం 2021 సెప్టెంబర్ 27 నుంచి అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా 2.3.7 కంటే తక్కువ వర్షన్ వాడుతున్న యూజర్లకు గూగుల్ సంబంధిత ఈ-మెయిల్ను పంపింది. 2.3.7 వర్షన్ను వాడుతున్న యూజర్లను కనీసం ఆండ్రాయిడ్ 3.0 హనీకోంబ్ వోఎస్కు తమ స్మార్ట్ఫోన్లను ఆప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఒక వేళ అప్డేట్ చేయకపోతే జీమెయిల్, గూగుల్ సెర్చ్, గూగుల్ డ్రైవ్, యూట్యూబ్, ఇతర గూగుల్ సేవలను యాప్ల ద్వారా పొందలేరని పేర్కొంది. వీటిని ఫోన్ బ్రౌజర్లో యూజర్లు పొందే అవకాశం ఉన్నట్లు గూగుల్ పేర్కొంది. ఈ కాలంలో ఆండ్రాయిడ్ 3.0 వర్షన్ దాని కంటే తక్కువ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వర్షన్ అతి తక్కువ మంది యూజర్లు వాడుతున్నారని గూగుల్ పేర్కొంది. యూజర్ల భద్రత, డేటాను దృష్టిలో ఉంచుకొని గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 27 నుంచి ఆండ్రాయిడ్ వెర్షన్ 2.3.7 ఉన్న స్మార్ట్ఫోన్లలో ఆయా గూగుల్ యాప్స్లో లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తే యూజర్నేమ్, పాస్వర్డ్ ఏర్రర్ వస్తుందని గూగుల్ పేర్కొంది. యూజర్ల సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయమని లేదా ఫోన్లను మార్చమని గూగుల్ ప్రోత్సహిస్తుంది. గూగుల్ తీసుకున్న నిర్ణయంతో ఈ ఆండ్రాయిడ్ వర్షన్ను కల్గి ఉన్న స్మార్ట్ఫోన్లను కొత్త ఫోన్లతో రిప్లేస్ చేయాల్సి వస్తుంది. -
గూగుల్ షాకింగ్ నిర్ణయం...! వారికి పెద్ద సమస్యే..!
ఆండ్రాయిడ్ యాప్లను క్రియేట్ చేసే డెవలపర్లకు గూగుల్ చేదు వార్తను అందించింది. గూగుల్ ప్లేస్టోర్లో పలు లిస్టెడ్ యాప్లపై షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గూగుల్ ప్లే స్టోర్లో ఇన్ఆక్టివ్గా ఉన్న యాప్లను, అలాగే చాలా రోజుల పాటు అప్డేట్ చేయకుండా ఉన్న యాప్లను పూర్తిగా తొలగించాలని గూగుల్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో 2021 సెప్టెంబర్ 1 నుంచి ఆయా యాప్స్ తొలగింపు ప్రక్రియ మొదలవుతుందని గూగుల్ ప్రకటించింది. ఇన్ఆక్టివ్గా ఉన్న యాప్లను తొలగించడంతో గూగుల్ ప్లే స్టోర్ క్లీన్ అవ్వడంమేకాకుండా ప్లే స్టోర్ భద్రత మరింత పటిష్టమైతుందని గూగుల్ పేర్కొంది. లోపాలు, బగ్లను కల్గిఉన్న యాప్లను గూగుల్ ఎప్పటికప్పుడు తీసువేస్తుంది. ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్స్ యాక్టివ్గా వారి యాప్లను మెయిన్టెన్ చేస్తే గూగుల్ ప్లే వాటిని తొలగించదు. గూగుల్ స్టోర్లో యాక్టివ్గా ఉండి, సుమారు 1000కిపైగా ఇన్స్టాల్ కలిగి ఉన్న యాప్లు, లేదా గత 90 రోజుల్లో ఇన్ యాప్ పర్చెస్ కల్గి ఉన్న యాప్లను తొలగించదని గూగుల్ పేర్కొంది. కొత్త పాలసీ అప్డేట్ కింద యాప్లను తిరిగి పాత యాప్లను, డేటాను పునరుద్దరించలేరు. వాటి స్థానంలో కచ్చితంగా కొత్త వాటినే సృష్టించాల్సి ఉంటుంది. యాక్సెసిబిలిటీ సర్వీస్ ఏపీఐ టూల్ను గూగుల్ జత చేయనుంది. ఇది యూజర్ డేటా, డివైజ్ ఫంక్షనాలిటీను యాక్సెస్ చేయడానికి సహాయపడుతుంది. దీంతో యూజర్లు సురక్షితంగా యాప్లను యాక్సెస్ చేయగలరు. -
ప్రమాదంలో 200 కోట్ల మంది గూగుల్ క్రోమ్ యూజర్ల డేటా
ప్రస్తుతం మొబైల్, కంప్యూటర్ వాడుతున్న ప్రతి పరికరంలో గూగుల్ క్రోమ్ కచ్చితంగా వినియోగిస్తారు. గూగుల్ క్రోమ్ ముఖ్యంగా విండోస్, ఆండ్రాయిడ్ లో అత్యంత విస్తృతంగా ఉపయోగించే బ్రౌజర్. వాస్తవానికి, ఈ బ్రౌజర్ ని చాలా ఆండ్రాయిడ్ పరికరాల్లో వాడుతుండటం మనం గమనించవచ్చు. వివాల్డి, ఒపెరా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, బ్రేవ్ బ్రౌజర్ వంటి అనేక ఇతర బ్రౌజర్లు కూడా క్రోమియం బ్రౌజర్ సర్చ్ ఇంజిన్ పై ఆధారపడి పనిచేస్తాయి. అయితే, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 200 కోట్ల మంది గూగుల్ క్రోమ్ యూజర్ల డేటా ప్రమాదంలో ఉన్నట్లు సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వాడుతున్న గూగుల్ క్రోమ్ లో హ్యాకర్లు హ్యాక్ చేయడానికి వీలుగా ఒక కొత్త బగ్ ఉన్నట్లు ఇటీవల కనుగొనబడింది. ఈ బగ్ ద్వారా హ్యాకర్ రిమోట్ గా బగ్ కోడ్ ను మీ మొబైలో ప్రవేశ పెట్టడానికి వీలుగా అనుమతించే ఒక పెద్ద భద్రతా లోపాన్ని కనుగొన్నట్లు గూగుల్ పేర్కొంది. అందుకే వెంటనే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఇన్ స్టాల్ చేసిన వినియోగదారులు వెంటనే అప్ డేట్ చేసుకోవాలని గూగుల్ పేర్కొంది. ఒకవేల క్రోమ్ బ్రౌజర్ అప్ డేట్ చేయకపోతే హ్యాకర్లు మీ ఫోన్ హ్యాక్ చేయడమే కాకుండా, భద్రతా లోపం కారణంగా మీ డేటాను బహిర్గతం చేసే ప్రమాదం ఉంది. కొత్తగా గుర్తించిన ఈ బగ్ ఇప్పటికే ఉపయోగంలో ఉన్నట్లు గూగుల్ తన బ్లాగులో వెల్లడించింది. తమకు తెలియకుండానే హ్యాకర్లు డేటాను దొంగలిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. హ్యాకర్లు హ్యాక్ చేసిన మిలియన్ డాలర్లకు డార్క్ వెబ్ లో విక్రయిస్తారు. పాత గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వెర్షన్ లను ఉపయోగిస్తున్న క్రోమ్ యూజర్లు వెంటనే అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. కచ్చితంగా మీ గూగుల్ క్రోమ్ వెర్షన్ 91.0.4472.164 ఉండాలని సంస్థ పేర్కొంది. -
మీ ఫోన్ పాస్వర్డ్ మరిచిపోయారా..! ఇలా చేయండి..
స్మార్ట్ఫోన్ మన నిత్య జీవితంలో ఒక భాగమైంది. మన ప్రైవసీ కోసం మొబైల్ ఫోన్లకు పాస్వర్డ్ను ఏర్పాటు చేసుకుంటాం. పాస్వర్డ్ ఏర్పాటుతో మనకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఏవరి కంటపడకుండా కాపాడుకోవచ్చును. కాగా దురదృష్టవశాత్తు ఫోన్ పాస్వర్డ్ మరిచిపోయారు..అనుకోండి అప్పుడు ఏం చేస్తారు అని అడిగితే...! ఏముంది వెంటనే దగ్గరలో ఉన్న మొబైల్ రిపేర్ సెంటర్లకు తీసుకొని వెళ్తాం..ఫోన్ అన్లాక్ చేయించుకుంటాం! రిపేర్ షాపు వాడు అడిగే డబ్బును చెల్లిస్తామంటారా..! మీరు మొబైల్ రిపేర్ షాపుకు వెళ్లకుండా మీ ఇంట్లోనే ఫోన్ ఆన్లాక్ చేయడం ఎలానో మీకు తెలుసా.. ఐతే ఇది మీకోసమే..మీ ఆండ్రాయిడ్ ఫోన్ విషయంలో ఫ్యాక్టరీ రిసెట్ చేయడంతో మీ మొబైల్ను అన్లాక్ చేయవచ్చును. దాంతో పాటుగా గూగుల్ డివైజ్ మెనేజర్ను ఉపయోగించి ఫోన్ను రిసేట్ చేయవచ్చును. మీ ఆండ్రాయిడ్ ఫోన్ను ఇలా ఫ్యాక్టరీ రిసేట్ చేయండి... స్టెప్ 1: మీ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి, కనీసం ఒక నిమిషం వేచి ఉండండి స్టెప్ 2: పవర్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ను ఒకేసారి కలిసి ప్రెస్ చేయండి. స్టెప్ 3: పవర్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ ఒకేసారి ప్రెస్ చేయడంతో మీ ఫోన్ రికవరీ మోడ్లోకి వెళ్తుంది. అందులో మీకు పలు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో వైప్ డేటా/ ఫ్యాక్టరీ రిసేట్ ఆప్షన్ను ఎంపిక చేయండి. మీ మొబైల్ ఫ్యాక్టరీ రిసేట్ అవుతున్న ఆండ్రాయిడ్ సింబల్ కనిపిస్తోంది. స్టెప్ 4: మొబైల్ ఫ్యాక్టరీ రిసేట్ అయ్యేంత వరకు వేచి ఉండండి. రిసేట్ పూర్తి అయ్యాక తిరిగి మీ ఫోన్ను స్విచ్ ఆన్ చేయండి. మీరు స్విచ్ ఆన్ చేయగానే మీరు కొన్నప్పుడు మీ మొబైల్ ఫోన్ ఎలా ఉండేదో అలా తిరిగి మీకు కనిపిస్తోంది. ఫోన్ ఆన్ అవ్వగానే భాషను సెలక్ట్ చేసుకోండి అనే ఆప్షను వస్తోంది. దాని తరువాత మీ ఈమెయిల్తో లాగిన్ అవ్వమని అడుగుతోంది. ఇప్పుడు మీ ఫోన్ను పాస్వర్డ్ లేకుండానే మీ యాక్సెస్ చేయగలరు. గూగుల్ డివైజ్ మేనేజర్ ఉపయోగించి ఇలా ఆన్లాక్ చేయండి... స్టెప్ 1: Visit: google.com/android/devicemanager వెబ్సైట్ను సందర్శించండి స్టెప్ 2: మీ గూగుల్ ఖాతాతో సైన్ ఇన్ చేయండి స్టెప్ 3: అందులో మీ గూగుల్ ఖాతాతో రిజస్టర్ ఐనా గ్యాడ్జెట్లు కనిపిస్తాయి. అందులో మీరు అన్లాక్ చేయదలిచిన ఫోన్ను ఎంచుకోండి స్టెప్ 4: ఎంచుకున్న ఫోన్లో ఎరేస్ డేటాపై క్లిక్ చేయండి. తిరిగి మీ ఈ-మెయిల్, పాస్వర్డ్ను అడుగుతోంది. ఎంటర్ చేశాక మీ ఫోన్ పాస్వర్డ్ ఆన్లాక్ చేయవచ్చును. మీ డేటా పూర్తిగా ఏరేస్ అవుతుందన్ని బాధపడకండి. తిరిగి మీ ఈ-మెయిల్తో మొబైల్ ఫోన్లో లాగిన్ ఐతే మీ డేటాను తిరిగి బ్యాకప్ చేసుకోవచ్చును. -
Windows 11: ప్రత్యేకతలు, ఆకర్షించే అంశాలు ఏమిటి?
మైక్రోసాఫ్ట్ సంస్థ కొద్ది రోజుల క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విండోస్ 11 ఓఎస్ ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత విండోస్ వెర్షన్లతో పోలిస్తే ఇందులో అనేక కీలక మార్పులు చేసినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ‘ఇలా ఉంటుందట’ ‘అలా ఉంటుందట’ అనే ఊహాగానాలను షట్డౌన్ చేస్తూ మైక్రోసాఫ్ట్ వారి విండోస్ 11 హాయ్ చెప్పి పరిచయం చేసుకుంది. ఇది నెక్స్ట్ జెనరేషన్ ఆపరేషన్ సిస్టం(ఓయస్)గా వారు చెబుతున్నారు. ఇందులో ఉన్న ప్రత్యేకతలు, ఆకర్షించే అంశాలు ఏమిటి అనే దాని గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం. ఆండ్రాయిడ్ యాప్స్ను విండోస్కు తీసుకువస్తుంది మైక్రోసాఫ్ట్. అమెజాన్ యాప్ స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎడోబ్ క్రియేటివ్ క్లౌడ్, డిస్నీ ప్లస్, జూమ్, విజువల్ స్టూడియో.. మొదలైనవి యాడ్ అయ్యాయి. ఆటో హెచ్డీఆర్ (హై డైనమిక్ రేంజ్), డైరెక్ట్ స్టోరేజీ, డీఎక్స్12 అల్టిమెట్ ప్యాకేజీతో మోర్ బ్రైటర్, మోర్ కలర్ఫుల్గా గేమర్స్ను అలరించే మార్పులు చేశారు. విండోస్ 11 గేమింగ్లో డైరెక్ట్ ఎక్స్12 అల్టిమెట్(డీఎక్స్12) కీలక పాత్ర పోషించబోతుంది. రే ట్రేసింగ్ 1.1, వేరియబుల్ రేట్ షేడింగ్, శాంప్లర్ ఫీడ్బ్యాక్...మొదలైన ఫీచర్లు స్టన్నింగ్ లుకింగ్ దృశ్యాలను క్రియేట్ చేయడానికి డెవలపర్స్కు ఉపయోగపడతాయి. మల్టీటాస్కింగ్ కోసం స్నాప్ లేఅవుట్స్, స్నాప్ గ్రూప్స్, డెస్క్టాప్లు ఉంటాయి. ప్రత్యేక డెస్క్టాప్ను క్రియేట్ చేసుకోవచ్చు. ఉదా: డెస్క్టాప్ ఫర్ వర్క్, గేమింగ్, స్కూల్...మొదలైనవి. ఫోల్డర్, యాప్స్ను నచ్చిన విధంగా అమర్చుకోవచ్చు. న్యూస్, వెదర్, క్యాలెండర్, టు-డూ-లీస్ట్, తాజా ఫోటోలు.. మొదలైన వాటితో విడ్జెట్స్ కొత్త సొబగుతో అలరించనున్నాయి. అన్నిటినీ ఒకే సమయంలో ఫుల్స్క్రీన్లో చూసుకోవచ్చు. విడ్జెట్స్ను రీఅరెంజ్,రీసైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. స్టార్ట్బటన్ను రీవాంప్ చేశారు. ఫ్రెష్లుక్తో వస్తున్న విండోస్ 11లో మాస్టర్ కంట్రోల్ ప్యానల్గా చెప్పే స్టార్ట్మెనునూ ఎడమ నుంచి సెంటర్కు మార్చారు. ‘నాకు నచ్చలేదు. లెఫ్ట్ ఒరియెంటెడ్ లేఔటే బాగుంది’ అని మీరనుకుంటే మార్చుకోవచ్చు. ఇక ‘యాప్ ఐకాన్స్’ రౌండెడ్ కార్నర్లో కనిపిస్తాయి. కొత్త ఫీచర్ స్నాప్ గ్రూప్స్ (కలెక్షన్ ఆఫ్ యాప్స్)తో యూజర్లు సులభంగా యాక్సెస్ కావచ్చు. ‘టీమ్స్’ అనేది మరో అప్డెట్. దీంతో టీమ్ మీటింగ్స్లో సులభంగా పాల్గొనవచ్చు. టాస్క్బార్తోనే మ్యూట్, అన్మ్యూట్ చేయవచ్చు. సదుపాయాల సంగతి సరే, విండోస్-11కు సంబంధించి కంప్యూటర్ అనుకూలత గురించి రకరకాల సందేహాలు ఉన్నాయి. మన కంప్యూటర్ ఎంత అనుకూలంగా ఉంది? అనేది సులభంగా తెలుసుకోవడానికి మైక్రోసాఫ్ట్ ‘పీసి హెల్త్ చెక్ అప్' అనే యాప్ ఉపకరిస్తుంది. -
ఈ 10 యాప్లు మీ ఫోన్లో ఉన్నాయా? వెంటనే అలర్ట్ అవ్వండి
నిద్ర లేవడంతోనే స్మార్ట్ ఫోన్ లో ఆప్డేట్స్ చూసుకోవడం.. ఫ్రెండ్స్ సందేశాలకు రిప్లై ఇవ్వటం.. యాప్స్ నుంచి ఆన్లైన్ షాపింగ్ వరకు ఇలా అనేక పనులు చేస్తుంటాం. కానీ, మీరు వాడే యాప్స్ మీ వ్యక్తిగత సమాచారాన్ని లాగేస్తున్నాయని మీకు తెలుసా?. తాజాగా 10 ఆండ్రాయిడ్ యాప్స్ ఫేస్బుక్ యూజర్ల డేటాను దొంగలించినట్లు యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ తయారీ సంస్థ డాక్టర్ వెబ్ వెల్లడించింది. వీటిలో తొమ్మిది గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ కోసం అందుబాటులో ఉన్నాయని, వాటి గురుంచి నివేదించిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు డాక్టర్ వెబ్ తెలిపింది. ఈ యాప్స్ ని చాలా వరకు 1,00,000 మందికి పైగా ఇన్స్టాల్ చేసుకొన్నారు. మరొక దాన్ని 5 మిలియన్ మంది ఇన్ స్టాల్ చేశారు. డాక్టర్ వెబ్ నివేదిక ప్రకారం, ఫోటో ఎడిటింగ్ యాప్స్, పీఐపీ ఫోటో యాప్స్ ను 5 మిలియన్ సార్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ జాబితాలో వరుసగా App Lock Keep, App Lock Manager, Lockit Master యాప్స్ ఉన్నాయి. ఈ జాబితాలో మెమొరీ క్లీనర్, ఫిట్ నెస్ యాప్, రెండు హొరోస్కోప్ యాప్స్ కూడా ఉన్నాయి. వీటిని చాలా సార్లు ప్రజలు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు. Rubbish Cleaner, Inkwell Fitness, Horoscope Daily, HscopeDaily అనే వాటిని 1,00,000 మంది డౌన్లోడ్ చేశారు. "ఈ స్టీలర్ ట్రోజన్ల యాప్స్ ను విశ్లేషించే సమయంలో ఎడిటర్ ఫోటోపిప్ అనే ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన తర్వాత కూడా ఇప్పటికీ సాఫ్ట్ వేర్ అగ్రిగేటర్ వెబ్ సైట్లలో అందుబాటులో ఉంది" అని కంపెనీ తన బ్లాగ్ పోస్ట్ లో తెలిపింది. చాలా మాల్వేర్ యాప్స్ లాగా కాకుండా ఇన్-యాప్ ప్రకటనలను నిలిపివేయడానికి, కొన్ని ఫీచర్స్ యాక్సెస్ చేసుకోవడానికి వారి ఫేస్బుక్ ఖాతాలతో లాగిన్ కావాల్సి ఉంటుంది. వినియోగదారుల ఎంటర్ చేసిన లాగిన్ వివరాలను వారు దొంగలిస్తారు. డాక్టర్ వెబ్ తన బ్లాగ్ పోస్టులో చట్ట వ్యతిరేక కార్యక్రమాల కోసం యూజర్ల డేటాను దొంగలించి ఉండవచ్చు అని తెలిపింది. చదవండి: కొత్త బైక్ కొనేవారికి టీవీఎస్ మోటార్ గుడ్న్యూస్! -
PUBG: అందరికీ అందుబాటులో బీజీఎమ్ఐ
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా గేమింగ్ సంస్థ క్రాఫ్టన్ తాజాగా బ్యాటిల్గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది ప్రత్యేకంగా దేశీ గేమింగ్ ప్రియుల కోసం తయారు చేసిందని పేర్కొంది. ఈ ఏడాది మే 18న ప్రీ–రిజిస్ట్రేషన్స్ ప్రారంభించగా ఏకంగా 4 కోట్ల పైచిలుకు రిజిస్ట్రేషన్స్ వచ్చాయని తెలిపింది. జూన్ 17న గేమింగ్ ప్రియులకు ముందస్తుగా అందుబాటులోకి తెచ్చామని, సుమారు 2 కోట్ల మంది ప్లేయర్లు దీన్ని ఆడి, అభిప్రాయాలు తెలిపారని క్రాఫ్టన్ వివరించింది. ప్రస్తుతం ఇది గూగుల్ ప్లే స్టోర్లో ఫ్రీ–టు–ప్లే మల్టీప్లేయర్ గేమ్గా అందుబా టులో ఉంటుందని పేర్కొంది. క్రాఫ్టన్ అనుబం ధ సంస్థ పబ్జీ కార్పొరేషన్కి చెందిన పబ్జీ గేమ్ను, చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా కేంద్రం గతేడాది నిషేధించింది. చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ సంస్థ పబ్జీని భారత్లో పంపిణీ చేసేది. ఆ తర్వాత ఆ కంపెనీకి భారత్లో పంపిణీ హక్కులను ఉపసంహరించినట్లు పబ్జీ కార్పొరేషన్ అప్పట్లో తెలిపింది. తాజాగా దాని స్థానంలో క్రాఫ్టన్ కొత్త గేమ్ను ఆవిష్కరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్లో 100 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు క్రాఫ్టన్ తెలిపింది. ఇప్పటికే పలు సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునే ప్రక్రియలో ఉన్నట్లు వివరించింది. -
గూగుల్ ఫోటోస్లో ఉన్న ఫీచర్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వన్డ్రైవ్లో..!
ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. యూజర్లను తమ వైపు తిప్పుకోవడం కోసం వివిధ రకరకాల సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నాయి. కాగా తాజాగా గూగూల్ ఫోటోస్ యాప్లో యూజర్లకు ఉండే ఎడిటింగ్ ఆప్షన్ను మైక్రో సాఫ్ట్ వన్డ్రైవ్లో అందుబాటులోకి తెచ్చింది. బేసిక్ ఎడిటింగ్ టూల్స్తో యూజర్లు తమ ఫోటోలను క్రాప్, రొటేట్, ఫ్లిప్ చేయడంతో పాటూ కలర్ అడ్జస్ట్ కూడా చేయవచ్చును. ఈ ఆప్షన్ను వెబ్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉండనుంది. మైక్రో సాఫ్ట్ తన వినియోగదారులకు వన్డ్రైవ్తో 5 జీబీ వరకు క్లౌడ్ స్టోరేజీను అందిస్తోంది. రానున్న రోజుల్లో యూజర్లకు మరిన్ని సదుపాయాలను యూజర్లకు అందించడానికి మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలు చేస్తోందని పేర్కొంది. వచ్చే సంవత్సరం వన్డ్రైవ్ ఐవోస్ యూజర్లకు కూడా అందుబాటులో ఉండనుంది. చదవండి: మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులకు శుభవార్త..! -
ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు గూగుల్ శుభవార్త..!
ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్కు క్రేజ్ మామూలుగా ఉండదు. సెక్యూరిటీ విషయంలో ఇతర మొబైల్ ఫోన్లతో పోలిస్తే ఆపిల్ ఐఫోన్కు పోటి అసలు ఉండదు. ఐఫోన్ను చాలా మంది వినియోగించడానికి ప్రధాన కారణం భద్రత. ఆపిల్ తన వినియోగదారుల ప్రైవసీ,భద్రత విషయంలో అసలు రాజీ పడదు. అంతేకాకుండా ఆపిల్ ఐఫోన్ ఒక వేళ పోయినా, దొంగలించిన, తిరిగి ఫోన్ను పొందగలిగే టెక్నాలజీ ఆపిల్ సొంతం. ఐఫోన్లలోని టెక్నాలజీ రానున్న రోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా రానుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘ఫైండ్ మై డివైజ్’ పేరిట ఉన్నప్పటికీ ఈ సదుపాయాన్ని మరింత అదనంగా కొత్త ఫీచర్లను యాడ్ చేయాలని గూగుల్ భావిస్తోంది. ‘ఫైండ్ మై నెట్వర్క్’ పేరిట ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ తీసుకురానుంది. గూగుల్ ‘ఫైండ్ మై డివైజ్’తో మొబైల్ ఫోన్ను ట్రాక్ చేయవచ్చును. ఫైండ్ మై డివైజ్లో మెయిల్ ఐడీ, పాస్వర్ఢ్తో లాగిన్ అయితే మొబైల్ ఉన్న లోకేషన్ చూపిస్తోంది. ఇది కేవలం పోయిన మొబైల్కు నెట్వర్క్ కనెక్టివీటీ, ఇంటర్నెట్ ఆన్ , జీపీఎస్ కనెక్షన్ ఆన్లో ఉంటేనే మొబైల్ను ట్రాక్ చేయగలము. కాగా ఆపిల్ తన ఐవోస్ 13లో భాగంగా ఫైండ్ మై డివైజ్కు అదనపు ఫీచర్లను జోడించి ఆపిల్ కొత్త సర్వీస్ను తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఐఫోన్లు, ఐపాడ్, ఆపిల్ తెచ్చిన ఎయిర్టాగ్స్తో గుర్తించవచ్చును. కాగా ప్రస్తుతం గూగుల్ ఫైండ్ మై నెట్వర్క్ ఫీచర్ను ప్రస్తుతం బీటా వర్షన్లో టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్ ఏవిధంగా పనిచేస్తోందని గూగూల్ టెస్ట్లను నిర్వహిస్తుంది. ఈ ఫీచర్తో సుమారు 3 బిలియన్ల ఆండ్రాయిడ్ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఆపిల్లో ఫైండ్ మై డివైజ్ ఎలా పనిచేస్తుంది..? సాధారణంగా ఆపిల్ ఐఫోన్లలో ఫైండ్ మై డివైజ్ ఉన్న ఫీచర్లో ముందుగానే లాస్ట్ మై డివైజ్ ఆన్లో ఉండేలా చూసుకోవాలి. లాస్ట్ మై డివైజ్లో స్నేహితుల, లేదా ఇతర ఫోన్ నంబర్ను కచ్చితంగా ఎంటర్ చేయాలి. లాస్ట్ డివైజ్ సహకారంతో పోయినా మొబైల్ వేరేవారికి దొరికినా, లేదా దొంగిలించినా ఆ మొబైల్ స్విచ్చ్ ఆన్ చేయగానే మొబైల్ ఫోన్ లోకేషన్, మీరు ఇచ్చిన మొబైల్ నంబర్కు ఫోన్ లోకేషన్ వస్తోంది. అంతేకాకుండా ఈ ఆప్షన్తో మొబైల్ ఫోన్ ఆన్ చేయగానే మన ఫోన్ నంబర్ కనిపించేలా ఓ మెసేజ్ను చూపిస్తోంది. దీన్ని ముందుగానే లాస్ట్ మై డివైజ్లో ఎంటర్ చేస్తేనే కనిపిస్తోంది. చదవండి: ఆండ్రాయిడ్పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆపిల్ సీఈవో..! -
బీ అలర్ట్..! ఈ యాప్లు డిలీట్ చేసి ‘జోకర్’ని తరిమేయండి
జోకర్ మాల్వేర్ మళ్లీ వచ్చేసింది. ఈ మాల్వేర్ ఒక్కసారి మన ఫోన్లోకి వచ్చిదంటే అంతే సంగతులు..! మీ ఫోన్లో నిక్షిప్తమైన విలువైన సమాచారాన్ని హకర్లు డార్క్ వెబ్లో అమ్మేస్తారు. అంతేకాకుండా మీ అకౌంట్లలో ఉన్న డబ్బులను క్షణాల్లో ఖాళీ చేస్తారు. జోకర్ మాల్వేర్ తొలిసారిగా 2017 గూగుల్ ప్లేస్టోర్లో తొలిసారిగా ప్రత్యక్షమైంది. దేశంలో ఇప్పటికే ఏడు లక్షల మంది ఆండ్రాయిడ్ యూజర్స్ జోకర్ మాల్వేర్తో లింకులు ఉన్న యాప్స్ (సురక్షితం కానీ) ను డౌన్లోడ్ చేసుకున్నారని, వాళ్లలో చాలామంది ఆర్థిక లావాదేవీలు ప్రమాదం అంచున ఉన్నాయని మహరాష్ట్ర పోలీసులు ఒక ప్రకటన జారీ చేశారు. తాజాగా సైబర్ సెక్యూరిటీ ఫ్రిమ్ క్విక్ హీల్ టెక్నాలజీస్ జోకర్ వైరస్ మాల్వేర్ ఉన్న ఎనిమిది యాప్లను గుర్తించింది. వీటిని వెంటనే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల నుంచి ఆన్ఇన్స్టాల్ చేయమని సూచించింది. జోకర్ మాల్వేర్కు గురైన యాప్స్ ఇవే... 1. ఆక్జిలారీ మెస్జ్ యాప్ 2. ఫాస్ట్ మ్యాజిక్ ఎస్ఎమ్ఎస్ 3. ఫ్రీ క్యామ్ స్కానర్ 4. సూపర్ మెసేజ్ 5. ఏలిమేంట్ స్కానర్ 6. గో మెసేజ్స్ 7. ట్రావెల్ వాల్పేపర్ 8. సూపర్ ఎస్ఎమ్ఎస్ జోకర్ వైరస్ మాల్వేర్: జోకర్ అనేది ఒక మొండి మాల్వేర్. యూజర్కు తెలియకుండానే రెప్పపాటులో డబ్బులు మాయం చేయడంలో దిట్ట. ఆండ్రాయిడ్ యూజర్పై యాడ్స్ రూపంలో ఈ మాల్వేర్ దాడి చేస్తుంది. మెసేజ్లు, ఓటీపీ, పాస్వర్డ్లు, పేమెంట్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోగలుగుతుంది. ఒకవేళ ట్రాన్స్జాక్షన్ అయినట్లు యూజర్కు మెసేజ్ వచ్చినా.. అప్పటికే ఆలస్యం జరిగిపోయి ఖాతా మొత్తం ఖాళీ అయిపోతుంది. కాబట్టి, యాడ్లను క్లిక్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: ఆండ్రాయిడ్పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆపిల్ సీఈవో..! -
ఆండ్రాయిడ్పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆపిల్ సీఈవో..!
పారిస్: ఆపిల్ సీఈవో టిక్కుక్ ఆండ్రాయిడ్ ఫోన్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆపిల్ ఫోన్లతో పోల్చుకుంటే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలోనే అత్యధికంగా మాల్వేర్ ఉన్నాయని ఆపిల్ సీఈవో టిక్కుక్ పేర్కొన్నారు. జూన్ 16 న పారిస్లో జరిగిన వివాటెక్ 2021 వర్చ్యువల్ కాన్పరెన్స్లో ఈ విషయాన్ని తెలిపారు. ఈ సమావేశంలో ఆండ్రాయిడ్ ఫోన్లపై తన అక్కసును బయటపెట్టాడు. ఆపిల్ ఐవోస్ కంటే ఆండ్రాయిడ్ ఫోన్లల్లో ఎక్కువగా మాల్వేర్ దాడులు జరుగుతున్నాయని తెలిపాడు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఆపిల్ కంటే 47 రెట్లు ఎక్కువ మాల్ వేర్ కలిగి ఉందని కుక్ పేర్కొన్నారు. యూరోపియన్ దేశాల్లో తెస్తోన్న డిజిటల్ మార్కెట్ చట్టంతో ఆపిల్,గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించకుండా ఉండేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుంది. ఈ చట్టం అమలుతో సైడ్లోడింగ్ యాప్స్ (థర్డ్ పార్టీ యాప్స్)ను యూజర్లు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏలాంటి అడ్డంకులు రావు. కాగా టిమ్ కుక్ ఈ చట్టాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు. సైడ్లోడింగ్ యాప్స్తో యూజర్ల భద్రతకు, ప్రైవసీ భంగం వాటిల్లుతుందనీ హెచ్చరించాడు. కాగా ఫోర్స్ఫుల్గా ఈ థర్డ్పార్టీ యాప్స్ను ఇన్స్టాల్ చేయడంతో ఆపిల్ ఐవోస్ ప్లాట్ఫాం దెబ్బతీనే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆపిల్ స్టోర్లోకి యాప్స్ ఏంట్రీ ఇవ్వాలంటే వాటిపై కచ్చితమైన రివ్యూ చేశాకే స్టోర్లో ఉంచుతామని వివరించాడు. చదవండి: ఈ బిల్లులతో అమెజాన్ ప్రైమ్ ఫ్రీ షిప్పింగ్కు కాలం చెల్లనుందా..! -
ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ తీపికబురు
ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ తీపికబురు కబురు అందించింది. తమ వినియోగదారుల కోసం కొత్తగా మరికొన్ని ఫీచర్లను తీసుకొచ్చినట్లు ప్రకటించింది. సర్చ్ ఇంజిన్ దిగ్గజం వ్యక్తిగత మెసేజింగ్ యాప్ లో అనేక ఫీచర్లను జోడించింది. కొన్ని ఫీచర్లు వచ్చేసి ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్, ఎమోజీలకు సులభంగా అనుమతి, వాయిస్ యాక్సెస్ వంటివి ఉన్నాయి. "మీ ఖాతా పాస్ వర్డ్ ను సురక్షితంగా ఉంచడం నుంచి టెక్స్ట్ సందేశాలను షెడ్యూల్ చేసే వరకు, మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3 బిలియన్ యాక్టివ్ ఆండ్రాయిడ్ పరికరాలకు కొత్త అప్డేట్ లు ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నట్లు" గూగుల్ తెలిపింది. సందేశాలకు ఇప్పుడు ఎండ్ టూ ఎండ్ ఎన్ ఎండ్ క్రిప్షన్ లభించినట్లు గూగుల్ ప్రకటించింది. గూగుల్ గత ఏడాది నవంబర్ లో ఈ ఫీచర్ బీటా మోడ్ ను కొంత మంది యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ ఫీచర్ అందరికీ రోల్ అవుట్ చేస్తుంది. వీడియో కాలింగ్ చేసుకునే సమయంలో కూడా ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ లభిస్తుందని తెలిపింది. అలాగే, మరిన్ని దేశాల్లో భూకంప హెచ్చరిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గూగుల్ తెలిపింది. గ్రీస్, న్యూజిలాండ్ లో పరీక్షించిన ఈ ఫీచర్ ఇప్పుడు టర్కీ, ఫిలిప్పీన్స్, కజకస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లలో అందుబాటులో ఉంది. అధిక భూకంప ప్రమాదాలు సంభవించే దేశాల్లో భూకంప హెచ్చరికలను తెలియజేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు, రాబోయే సంవత్సరాల్లో ఇతర దేశాలకు విస్తరించనున్నట్లు గూగుల్ తెలిపింది. చదవండి: వాహనదారులకు కేంద్రం శుభవార్త! -
Huawei : ఆండ్రాయిడ్ స్థానంలో హర్మోని
వెబ్డెస్క్ : ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ హువావే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్కి మంగళం పాడేందుకు రెడీ అయ్యింది. ఆండ్రాయిడ్ ఓఎస్ స్థానంలో తనదైన స్వంత ఆపరేటింగ్ సిస్టమ్ హర్మోనిని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. క్రమంగా హువావేకు చెందిన స్మార్ట్ఫోన్లు, ట్యాబెట్లు, వేరబుల్ గాడ్జెట్లలో ఆండ్రాయిడ్ స్థానంలో హర్మోని ఓఎస్ తేబోతున్నట్టు ఆ సంస్థ తెలిపింది. ఆండ్రాయిడ్పై ఆధారపడలేం స్మార్ట్ఫోన్ మార్కెట్లో తనదైన ముద్ర వేసేందుకు టెక్ జెయింట్ హువావే పకడబ్బంధీగా పావులు కదుపుతోంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్కి సమాంతరంగా హువావే రూపొందించిన హర్మోనీ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)తో స్మార్ట్ఫోన్లు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హువావే ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లయిన మేట్ 40, మేట్ X 2లలో రాబోయే మోడల్స్ని హర్మోని ఓఎస్తో తీసుకువస్తామని ప్రకటించింది. అంతేకాదు క్రమంగా ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్పై ఉన్న ఫోన్లను సైతం హర్మోని ఓఎస్ పరిధిలోకి తెస్తామని చెప్పింది. హువావే పరికరాలపై అమెరికా అభ్యంతరాలు చెప్పడం ప్రారంభించినప్పుడే హువావే సొంత ఓఎస్పై దృష్టి పెట్టింది. క్రమంగా అమెరికాకు చెందిన గూగుల్ రూపొందించిన ఆండ్రాయిడ్పై ఆధారపడటం తగ్గించాలని నిర్ణయించింది. రాబోయే రోజుల్లో హువావే నుంచి వచ్చే ట్యాబ్స్, వేరబుల్ డివైజెస్, టీవీలు అన్నింటిని హర్మోని ఓఎస్తోనే తేవాలని నిర్ణయించింది. ప్రత్యామ్నయం సాధ్యమేనా స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఆండ్రాయిడ్ హవాకు అడ్డుకట్ట వేయడం ఆపిల్ లాంటి సంస్థలకే సాధ్యం కాలేదు. ఐనప్పటికీ ఆండ్రాయిడ్కి ప్రత్యామ్నయంగా ఐఓఎస్ ఒక్కటే మార్కెట్లో నిలబడింది. స్మార్ట్ఫోన్ల మార్కెట్లో ఆండ్రాయిడ్ ఓఎస్ రాజ్యమేలుతోంది. ఆండ్రాయిడ్కు ప్రత్యామ్నాయంగా సామ్సంగ్ సంస్థ టైజన్ పేరుతో స్వంత ఓఎస్ డెవలప్చేసినా.. మార్కెట్పై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో సామ్సంగ్ సైతం ఆండ్రాయిడ్ ఓఎస్తోనే ఫోన్లు తెస్తోంది. మరీ హువావే హర్మోని ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఉన్నాయి. -
ఆండ్రాయిడ్ టీవీలో ఆపిల్ సినిమాలు
వెబ్డెస్క్ : ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ వినియోగదారులకు శుభవార్త ! ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీదే ఇకపై ఆపిల్ సినిమాలు చూసే అవకాశం వచ్చింది. తాజాగా ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్పై నడిచే టీవీల్లోనూ ఆపిల్ టీవీ అప్లికేషన్ను అందించేందుకు ఆపిల్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆండ్రాయిడ్ 8 ఆపై వెర్షన్లతో నడుస్తున్న స్మార్ట్ టీవీలో ఆపిల్ టీవీ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ప్లే స్టోర్లో ఆపిల్ టీవీ యాప్ డౌన్లోడ్ ట్రెండ్ మొదలైంది. పరిధి పెంచుతోంది టెక్నాలజీలో దిగ్గజ సంస్థల్లో ఒకటి యాపిల్. కొత్తదనం, నాణ్యత, బ్రాండ్ వాల్యూ అనే పదాలకు పర్యాయ పదంగా ఆపిల్ నిలిచిపోయింది. అయితే ఆపిల్ సంస్థ అందించే అన్ని సేవలు, అప్లికేషన్లు కేవలం ఐఓఎస్ ప్లాట్ఫారమ్పై పని చేసే మాక్పాడ్, ఐపాడ్, ఐఫోన్ తదితర ఆపిల్ డివైజ్లలోనే లభించేవి. దశబ్ధకాలం పాటు తన అప్లికేషన్లను ఇతర టెక్ ప్లాట్ఫారమ్లకు అందివ్వలేదు యాపిల్. అయితే గత కొంతకాలంగా పట్టువిడుపులు ప్రదర్శిస్తోంది ఆపిల్. అందులో భాగంగానే ఐఓఎస్కి సంబంధించిన ఆప్స్టోర్కి ఆవల అమెజాన్ ఫైర్ స్టిక్, ఎల్జీ వెబ్ ఆపరేటింగ్ సిస్టమ్లకు ఆపిల్ టీవీ అప్లికేషన్ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్లోనూ స్మార్ట్ఫోన్ మార్కెట్ విభాగంలో ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ల మధ్యే ప్రధాన పోటీ. అయితే ఆ పోటీని పక్కన పెట్టి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్లోనూ ఆపిల్ టీవీ అప్లికేషన్ను అందించేందుకు ఆపిల్ అంగీకరించింది. ఈ మార్పు కేవలం ఆండ్రాయిడ్ స్మార్ట్టీవీలకే పరిమితం చేసింది. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లకు ఆపిల్ టీవీని అందివ్వడం లేదు. విస్తరించేందుకే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నడిచే టీవీలనే ఎక్కువ సంస్థలు తయారు చేస్తున్నాయి. స్మార్ట్టీవీ మార్కెట్లో వీటిదే సింహభాగం. ధర తక్కువగా ఉండటంతో ఎక్కువ మంది వీటినే కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆపిల్ టీవీకి విస్త్రృతమైన మార్కెట్ కల్పించేందుకు ఆండ్రాయిడ్ ఓఎస్ బెటర్ ఛాయిస్గా ఆపిల్ భావించింది. ఇప్పటికే చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్లు ఆపిల్ టీవీ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆపిల్ టీవీలో ఉన్న కంటెంట్కి చందాదారులుగా మారుతున్నారు. -
అలర్ట్: ముంచుకొస్తున్న ‘ఫ్లూబోట్’ ముప్పు
సాక్షి, హైదరాబాద్: ‘మీ పార్శిల్ త్వరలోనే మీకు చేరనుంది. దాని స్టేటస్ తెలియాలంటే ఈ లింకును క్లిక్ చేయండి’ అంటూ ప్రముఖ కొరియర్ సంస్థ పేరుతో మీ ఫోన్కు సందేశం వచ్చిందనుకోండి. నిజంగా పార్శిల్ రావాల్సిన వాళ్లు ఎప్పుడు వస్తోందో తెలుసుకోవడానికి.. ఆర్డర్లు ఇవ్వని వాళ్లు పార్శిల్ ఏంటనే ఉత్సుకతతో లింకును ఓపెన్ చేస్తారు. సైబర్ నేరగాళ్లు సరిగ్గా దీన్నే తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన ’ఫ్లూబోట్’ మాల్వేర్ను ఆండ్రాయిడ్ ఫోన్ల పైకి వదులుతున్నారు. ఇప్పటికే లండన్, స్పెయిన్, జర్మనీ, పోలాండ్లో అనేక మంది దీని బారినపడ్డారని, భారత్కూ ఈ ముప్పు పొంచి ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై లండన్కు చెందిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ (ఎన్సీఎస్సీ) అలర్ట్ జారీ చేసింది. ఆన్లైన్కు డిమాండ్ పెరగడంతో.. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో అనేక మంది నేరుగా షాపింగ్ చేయడానికి వెనుకాడుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఆన్లైన్ షాపింగ్ కు డిమాండ్ పెరిగింది. దేశీయ వెబ్ సైట్లు, యాప్లతో పాటు విదేశాలకు చెందిన వాటిల్లోనూ ఖరీదు చేస్తున్నారు. కరోనా ప్రభావంతో అనేక అంతర్జాతీయ విమానాలు, కంటైనర్లను తీసుకొచ్చే కార్గో లైనర్లు రద్దయ్యాయి. ఈ కారణంగా అంతర్జాతీయ డెలివరీలు ఆలస్యమవుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన సైబర్ నేరగాళ్లు కొరియర్ సంస్థల పేరుతో డెలివరీ ట్రాకింగ్ అంటూ ఫ్లూబోట్ మాల్వేర్ను పంపిస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఆ సందేశంలో వచ్చిన లింకును క్లిక్ చేసిన మరుక్షణం ఆ మాల్వేర్ ఫోన్లో నిక్షిప్తమైపోతుంది. ఈ మెసేజీలను సైబర్ నేరగాళ్లు ప్రాక్సీ సర్వర్ల ద్వారా బల్క్ విధానంలో పంపిస్తారు. ఫలితంగా వాళ్లు ఎక్కడ నుంచి పంపారు.. ఎక్కడ ఉన్నారనేది తెలుసుకోవడం సాధ్యపడదు. అన్ని పాస్వర్డ్స్ వారి అధీనంలోకి.. ఇటీవల ఇంటర్నెట్ బ్యాంకింగ్, యాప్ ఆధారిత బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్.. ఇలా ప్రతి ఒక్కటీ ఫోన్ ఆధారంగానే సాగుతున్నాయి. ఈ-మెయిల్, ట్విట్టర్ తదితర సోషల్మీడియాలను మొబైల్ లోనే వాడుతున్నారు. ప్రతి స్మార్ట్ ఫోన్కు పిన్, పాస్వర్డ్, ఫింగర్ ప్రింట్, ఫేషియల్ విధానాల్లో లాక్లు ఉంటున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లో నిక్షిప్తమై ఉండే ఫ్లూబోట్ వైరస్ ఈ పాస్వర్డ్స్ను సంగ్రహిస్తుంది. ఆ డేటా మొత్తాన్ని మాల్వేర్ ప్రయోగించిన సైబర్ నేరగాడికి అందిస్తుంది. దీన్ని దుండగులు దుర్వినియోగం చేస్తుండటంతో వ్యక్తిగత డేటాతో పాటు ఆర్థికంగానూ నష్టపోవాల్సి వస్తోంది. ఒకసారి ఫోన్లోకి ప్రవేశించిన ఫ్లూబోట్ అంత తేలిగ్గా పోదని, ఇది ఫోన్లో నిక్షిప్తమైనట్లు గుర్తించడం కూడా కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఆ ఆండ్రాయిడ్ ఫోన్ను ఫార్మాట్ చేస్తేనే వైరస్ తొలుగుతుంది. అపరిచిత లింకులు క్లిక్ చేయొద్దు.. వివిధ రకాలైన వైరస్లు, మాల్వేర్స్ను సైబర్ నేరగాళ్లు లింకులు, ఆకర్షణీయమైన ఫొటోల రూపంలో పంపిస్తారు. ఆయా వ్యక్తుల అభిరుచులు, అవసరాలకు తగ్గట్టు, ఉత్సుకత కలిగించేలా తయారు చేసిన సందేశాలు, ఫొటోల లింకుల్లో మాల్వేర్ను నిక్షిప్తం చేస్తారు. సైబర్ నేరగాళ్లు కొన్ని రకాలైన వైరస్లను ఫోన్లను హ్యాక్ చేసి లబ్ధి పొందడానికి వినియోగిస్తారు. మరికొన్నింటిని తమ ఉనికి చాటుకోవడానికి, ఏజెన్సీలకు సవాళ్లు విసరడానికి, వినియోగదారుల ఫోన్లు క్రాష్ చేయడానికి ప్రయోగిస్తారు. వీటిలో ఏ తరహా మాల్వేర్తో అయినా సాధారణ ప్రజలకు ఇబ్బందులే వస్తాయి. ఈ నేపథ్యంలో అపరిచిత నంబర్లు, సందేశాలతో వచ్చే లింకులను క్లిక్ చేయకుండా డిలీట్ చేయడం ఉత్తమం. - సైబర్ క్రైం నిపుణులు -
ఈ కొత్త వాట్సాప్ ఫీచర్ గురించి తెలుసా?
ప్రపంచ వ్యాప్తంగా అత్యదిక మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంటుంది. గతంలో వాట్సాప్ డిసప్పియరింగ్ మెసేజ్ అనే కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్ తో మీరు పంపిన మెసేజ్లు వారం రోజుల తర్వాత ఆటోమేటిక్గా గతంలో డిలీట్ అయ్యేవి. అయితే ఇప్పుడు ఆ సమయాన్ని 24 గంటలకు తగ్గించేందుకు ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్/ డెస్క్టాప్లో వాట్సాప్ టెస్టింగ్ చేస్తున్నట్లు పేర్కొంది. వాట్సాప్ ఇప్పుడు టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ప్రత్యర్థి యాప్ లతో పోటీపడుతున్న నేపథ్యంలో గతంలో వేగంగా కొత్త కొత్త ఫీచర్స్ తీసుకొస్తుంది. -
ఆండ్రాయిడ్ ఫోన్లలో కొత్త మాల్వేర్..!
మీరు వాడేది ఆండ్రాయిడ్ ఫోనా..! అయితే మీరు ఈ వార్తను కచ్చితంగా చదవాల్సిందే. గత కొన్నిరోజులుగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్పై కొత్త మాల్వేర్ దాడి చేయడానికి ప్రయత్నిస్తోందని సెక్యూరిటీ నిపుణులు కనుగొన్నారు. ఈ కొత్త మాల్వేర్ ఇతర మాల్వేర్కన్నా మరింత భయంకరంగా తన ప్రభావాన్ని చూపనుంది. సిస్టమ్ ఆప్డేట్ ముసుగులో గోప్యంగా ఆండ్రాయిడ్ ఫోన్లలలో కనిపించకుండా ఉంటుంది. ప్రముఖ మొబైల్ సెక్యూరిటీ కంపెనీ ‘జింపెరియం’ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ కొత్త మాల్వేర్ సిస్టమ్ ఆప్డేట్గా చూపిస్తుందని తెలిపారు. ఈ మాల్వేర్ను గుర్తించడం చాలా కష్టమని పేర్కొన్నారు. ఒకసారి ఈ మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యాక మొత్తం మొబైల్ ఫోన్ను తన కంట్రోల్లోకి తీసుకొని, కేవలం డేటానే కాకుండా ఇతర సమాచారాన్ని , ఫోటోలను , మెసేజ్లను తస్కరిస్తుంది. ఒకసారి మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ అయ్యాక హ్యాకర్లుడేటాను తమ అదుపులోనికి తెచ్చుకుంటారు. అంతేకాకుండా మొబైల్ ఫోన్ కాల్ డేటా, మెసేజ్లు , డిఫాల్ట్ గా ఉన్న బ్రౌజర్ సమాచారాన్ని , జీపీఎస్ లోకేషన్ను హ్యాకర్లు ట్రాక్చేయనున్నారు. జింపెరియం కంపెనీ సీఈవో శ్రీధర్ మాట్లాడుతూ.. ఈ మాల్వేర్ మిగతా వాటికంటే చాలా ప్రమాదకారమని తెలిపారు. ప్రస్తుతం ఈ మాల్వేర్ గూగుల్ ప్లే స్టోర్లో లేకపోవడం ఒకింతా ధైర్యానిచ్చినా, ఇతర థర్డ్ పార్టీ ఆండ్రాయిడ్ యాప్లను ఇన్స్టాల్ చేస్తే ఫోన్లలోకి వచ్చే ప్రమాదం ఉందని వివరించారు. చదవండి: గూగుల్పే, జీమెయిల్ క్రాష్ అవుతోందా? ఇలా చేయండి! -
గూగుల్పే, జీమెయిల్ క్రాష్ అవుతోందా? ఇలా చేయండి!
గత కొన్నిరోజులుగా ఆండ్రాయిడ్ వినియోగదారులకు యాప్ క్రాష్ అయిందని అకస్మాత్తుగా నోటిఫికేషన్లు వస్తోండంతో వినియోగదారులు నిర్ఘాంతపోతున్నారు. ఫలానా యాప్కు చెందిన నోటిఫికేషన్ను క్లిక్ చేసినప్పుడు యాప్ ఓపెన్ అవ్వడంలేదు. తరుచుగా క్రాష్ అవుతున్న యాప్స్లో గూగుల్పే, జీ మెయిల్, క్రోమ్ కూడా ఉన్నాయి. ఈ సమస్యకు గల కారణాన్ని గూగుల్ వెంటనే పసిగట్టింది. ఈ సమస్య వోఎస్లోని ఆండ్రాయిడ్ వెబ్ వ్యూ యాప్ ద్వారా ఏర్పడిందని గూగుల్ తెలిపింది. కొంతమంది వినియోగదారులకు జీ-మెయిల్ యాప్ పనిచేయడంలేదనే విషయం కంపెనీ దృష్టికి వచ్చిందని గూగుల్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. తొందరలోనే సమస్యను పరిష్కారిస్తా మన్నారు. అంతేకాకుండా ఈ సమస్యను ఎదుర్కొంటున్నవారు అత్యవసర సేవల కోసం ఫోన్లోని జీమెయిల్ యాప్కు బదులుగా డెస్క్ టాప్ వెబ్ ఇంటర్ఫేజ్ను వాడమని పేర్కొన్నారు. కాగా, యాప్ క్రాష్ సమస్యను ఎదుర్కొంటున్న వినియోగదారులు అత్యధికంగా ఉన్నారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన మొబైల్ ఫోన్లనే ఎక్కువశాతం వినియోగదారులు వాడుతున్నారు. ఫలానా బ్రాండ్ అనే తేడా లేకుండా అన్ని ఆండ్రాయిడ్ మొబైల్ఫోన్లలో ఈ సమస్య ఏర్పడింది. ముఖ్యంగా శాంసంగ్ ఫోన్లు ఎక్కువగా యాప్ క్రాష్ సమస్యకు గురైయ్యాయి. ఈ సమస్య మరింత జటిలం కావడంతో శాంసంగ్ తన యూజర్లను వెబ్ వ్యూ యాప్ను ఆన్ ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది. ఈ విధంగా చేస్తే యాప్ క్రాష్ అవ్వదు..! ఈ సమస్య పరిష్కారం కోసం శాంసంగ్ సపోర్ట్ పలు సూచనలు చేసింది. వెబ్వ్యూ ఆప్డేట్ను ఆన్ఇన్స్టాల్ చేసి, తిరిగి ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయమంది. తరువాత ఈ స్టెప్లను ఫాలో అవ్వండి. సెట్టింగ్స్లోకి వెళ్లి.. అక్కడ యాప్స్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. పక్కన కనిపించే త్రీ డాట్స్ను క్లిక్ చేసి షో సిస్టమ్ యాప్స్ లో ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్వ్యూ లోకి వెళ్లి..అన్ఇన్స్టాల్ ఆప్డేట్స్ను సెలక్ట్ చేసుకోవాలి. శాంసంగ్ యూజర్లు మాత్రమే కాకుండా అన్ని ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లు ఈ విధంగా చేస్తే యాప్ క్రాష్ సమస్యనుంచి తప్పించుకోవచ్చు. అయితే వెబ్వ్యూ యాప్ను అన్ఇన్స్టాల్ చేసేటప్పుడు అప్రమత్తత అవసరమని కూడా హెచ్చరించింది. (చదవండి: ఐటెల్ ఆండ్రాయిడ్ టీవీలు వచ్చేశాయ్!) -
ఐటెల్ ఆండ్రాయిడ్ టీవీలు వచ్చేశాయ్!
సాక్షి, న్యూఢిల్లీ: జీ సిరీస్ ఆండ్రాయిడ్ టీవీలను ఐటెల్ సంస్థ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిని భారత్లోనే తయారు చేసినట్టు కంపెనీ ప్రకటించింది. 400 నిట్స్తో కూడిన 4కే అల్ట్రా బ్రైట్ డిస్ప్లే, 24 వాట్ స్టీరియో సౌండ్ డాల్బీ ఆడియో, ఫ్రేమ్ పెద్దగా కనిపించని ప్రీమియం డిజైన్, గూగుల్ ప్లేస్టోర్, గూగుల్ అసిస్టెంట్ సాయంతో మాట్లాడుతూ టీవీకి కమాండ్స్ ఇచ్చే సదుపాయాలు ఈ టీవీల్లో ఉన్నాయి. 1జీబీ/8జీబీ, 2జీబీ/8జీబీ సామర్థ్యంతో కూడిన ఈ టీవీలు 60 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటాయి. జీ సిరీస్ కింద కంపెనీ నాలుగు సరికొత్త ఆండ్రాయిడ్ టీవీలను విడుదల చేసింది. ఈ టీవీల ధరలు రూ.16,999 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. భారతదేశంలో వీటి ధర, లభ్యత: ఇటెల్ ఇప్పటివరకు అన్ని మోడళ్ల ధరలను ప్రకటించలేదు. 32 అంగుళాల నుంచి 55 అంగుళాల పరిమాణంలో నాలుగు టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటెల్ జీ 3230 ఐఈ ధర రూ. 16,999 ఉండగా, ఇటెల్ జీ 4330 ఐఇ ధర రూ. 28,499. అన్ని ఆఫ్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. -
వాట్సప్ యూజర్స్ బీ అలర్ట్
వాట్సాప్ మరో కొత్త నిబంధన తీసుకోని రాబోతుంది. ఈ నిబంధన ప్రకారం కొన్ని పాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్లలో వాట్సప్ నిలిచిపోనున్నట్లు తెలుస్తుంది. కొన్ని ఆపిల్ ఐఫోన్లపై దీని ప్రభావం పడనుంది. ఆపిల్ పాత ఐఓఎస్ 9 ఆపరేటింగ్ సిస్టమ్స్లతో కూడిన ఐఫోన్లలో వాట్సాప్ ఇకమీదట పనిచేయదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఆండ్రాయిడ్ 4.0.3 కన్నా పాత ఆపరేటింగ్ సిస్టమ్లతో కూడిన స్మార్ట్ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు. వాట్సప్ తీసుకున్న తాజా నిర్ణయంతో లైనక్స్ కేఈఐఓఎస్ 2.5.1 ఆపరేటింగ్ సిస్టమ్స్ కన్న పాత ఫోన్లలో ఇది పని చేయదు. అయితే, ఈ సమస్య నుంచి బయటపడటానికి తప్పనిసరిగా యూజర్లు మీ ఆపరేటింగ్ సిస్టమ్ను అప్డేట్ చేసుకోవడం ఉత్తమం. ఆపిల్ ఐఫోన్లో సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ను అప్డేట్ చేసుకోవాలి. చదవండి: రూ.1.97లక్షల కోట్ల ఎలాన్ మస్క్ సంపద ఆవిరి ప్రపంచ తొలి 18జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్ విడుదల! -
వన్ప్లస్ నార్డ్ కు ఆండ్రాయిడ్ 11 అప్డేట్
వన్ప్లస్ నార్డ్ యూజర్లకు ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 11 అప్డేట్ తీసుకొచ్చింది. వన్ప్లస్ నార్డ్ గత ఏడాది జూలైలో ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 10తో విడుదల చేశారు. మార్చి 1నుంచి వన్ప్లస్ నార్డ్ యూజర్లకు ఆండ్రాయిడ్ 11 అప్డేట్ దశల వారీగా రావడం ప్రారంభమైంది. ఈ అప్డేట్ లో ఆల్వేస్ ఆన్-డిస్ప్లే, న్యూ సిస్టమ్ ఫాంట్, జెన్ మోడ్ లను మెరుగుపరిచారు. ఇందులో ప్రధానంగా కెమెరా ఇంటర్ఫేస్ మెరుగుదలతో పాటు హెచ్ఇవిసి సపోర్ట్ చేసే వీడియో-అఫిషియోనాడోస్ ను తీసుకొచ్చారు. యాంబియంట్ డిస్ప్లే ట్వీక్స్, మెరుగైన డార్క్ మోడ్, షెల్ఫ్ ఈ అప్డేట్ లో అందించారు. -
ఆండ్రాయిడ్ 12లో టాప్-5 ఫీచర్స్
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తీసుకొచ్చిన అతి ముఖ్యమైన టెక్నాలజీలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రధానమైనది. ప్రతి ఏడాది వినియోగదారుల ఆలోచనలకు అనుగుణంగా కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ను అప్డేట్ చేస్తూ వస్తుంది. గత ఏడాది సెప్టెంబర్ 8న ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకోని వచ్చింది. దీనిలో ప్రధానంగా ఛాట్ బబుల్స్, కన్వర్జేషన్ నోటిఫికేషన్స్, బిల్ట్-ఇన్ స్క్రీన్ రికార్డర్ వంటి కొత్త ఫీచర్స్ని ఆండ్రాయిడ్ యూజర్స్ కు పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ ఓఎస్ ఇంకా అందరికి అందుబాటులోకి రాలేదు. తాజాగా ఆండ్రాయిడ్ 12కి సంబందించిన కొన్ని ఫీచర్స్ బయటకి వచ్చాయి. వాటిలో ప్రధానమైన 5 ఫీచర్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం. సరికొత్త థీమ్స్: గతంలో ఉపయోగించిన థీమ్ రంగులకు భిన్నంగా రాబోయే ఆండ్రాయిడ్ 12లో సరికొత్త పరిచయం చేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ‘థీమింగ్ సిస్టం’ ఫీచర్ను కొత్త వెర్షన్లో తీసుకొస్తున్నట్టు సమాచారం. దీనితో యూజర్ తనకు నచ్చినట్టు ఓఎస్ థీమ్ రంగుని మార్చుకొనే అవకాశం ఉంది. కొత్త యూఐతో నోటిఫికేషన్స్: ఆండ్రాయిడ్ 12లోని నోటిఫికేషన్ సెంటర్లో కూడా మార్పులు చేస్తున్నారు. ‘మెటీరియల్ నెక్ట్స్’ డిజైన్ ఆకృతితో నోటిఫికేషన్ సెంటర్ను తీసుకోని రానున్నారు. ఇందులో యాప్ నోటిఫికేషన్లతో పాటు ఆండ్రాయిడ్ బిల్ట్-ఇన్ యాప్స్ అప్డేట్లు సరికొత్త యూజర్ ఇంటర్ఫేస్ (యూఐ)తో కనిపిస్తాయి. నోటిఫికేషన్ కోసం ఎక్కువ స్థలం కాకుండా తక్కువ స్థలం తీసుకొనేలా రూపొందించారు.మెసేజింగ్ యాప్ల కోసం ప్రత్యేకంగా ‘కన్వర్సేషన్స్’ పేరుతో విడ్జెట్స్ తీసుకొస్తున్నారు. వీటిలో మనం యాప్ ద్వారా చివరిగా ఎవరితో సంభాషించామనేది తెలుస్తుంది. అలా ప్రతి యాప్కి ప్రత్యేక విడ్జెట్ ఉంటుందని సమాచారం. సింగల్ హ్యాండ్ మోడ్: ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని ఫోన్లకు స్క్రీన్ పెద్దదిగా వస్తున్నాయి. దీంతో కొన్ని సార్లు ఫోన్ వాడటం కూడా కష్టంగా ఉంటుంది. అటువంటి వారి కోసం ఆండ్రాయిడ్ 12లో ‘వన్ హ్యాండ్ మోడ్’ ఫీచర్ పరిచయం చేస్తున్నారు. ఇది ఫోన్ స్క్రీన్ నిలువు సైజ్ను తగ్గిస్తుంది. దీని సాయంతో యూజర్ ఫోన్ను సులభంగా ఆపరేట్ చేయవచ్చు. ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యం: యాపిల్ ఐఓఎస్ తరహాలోనే గూగుల్ ఆండ్రాయిడ్ 12లో ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఇందుకోసం ఫోన్ పైభాగం చివర్లో యూజర్కి తెలిసేలా ఆరెంజ్, గ్రీన్ రంగుల్లో చిన్నపాటి గుర్తులు ఉంటాయి. ఆరెంజ్ రంగులో మైక్ సింబల్, గ్రీన్ రంగులో కెమెరా సింబల్ కనిపిస్తాయి. దీని వల్ల మీరు యాప్ ఉపయోగిస్తున్నప్పుడు మీ అనుమతి లేకుండా కెమెరా, ఫోన్ మైక్రోఫోన్ పనిచేస్తుంటే సులభంగా తెలిసిపోతుంది. అలాగే వైఫ్ షేర్ చేసుకోవడానికి కొత్తగా క్యూఆర్ కోడ్ ఆప్షన్ తీసుకోని వచ్చింది. దీనితో ఎదుటి వ్యక్తికి పాస్ వర్డ్ షేర్ చేయకుండా క్యూఆర్ కోడ్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ స్క్రీన్షాట్: 2019లో స్క్రోలింగ్ స్క్రీన్షాట్స్ ఫీచర్ను తీసుకొస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. అయితే ఆండ్రాయిడ్ 10, 11 వెర్షన్లో ఈ ఫీచర్ను తీసుకురాలేదు. తాజాగా స్క్రోలింగ్ స్క్రీన్షాట్స్ని ఆండ్రాయిడ్ 12లో పరిచయం చేయనున్నారట. దీని సాయంతో యూజర్ స్క్రీన్షాట్ తీసిన వెంటనే దానంతటదే ఫోన్ స్క్రీన్ కిందకు జరిగి మరో స్క్రీన్షాట్ తీసుకుని రెండింటిని కలిపి చూపిస్తుంది. చదవండి: 16వేలకే శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62 బంగారం రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే! -
ఆన్లైన్లో లీకైన ఆండ్రాయిడ్12 ఫీచర్లు
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్... గూగుల్ తీసుకొచ్చిన అద్భుతమైన ఈ టెక్నాలజీతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్మార్టుగా తయారైంది అని చెప్పుకోవాలి. ఆండ్రాయిడ్ మొదటి వెర్షన్ 1.0 సెప్టెంబర్ 23, 2008న విడుదలైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది మొబైల్ వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ని పరిచయం చేస్తుంది. గత ఏడాది సెప్టెంబర్ 8న తీసుకొచ్చిన ఆండ్రాయిడ్ 11లో ఛాట్ బబుల్స్, కన్వర్జేషన్ నోటిఫికేషన్స్, బిల్ట్-ఇన్ స్క్రీన్ రికార్డర్ వంటి కొత్త ఫీచర్స్ని పరిచయం చేశారు. ప్రస్తుతం ఇంకా ఆండ్రాయిడ్ 11 అప్డేట్ అందరి స్మార్ట్ఫోన్లలో అందుబాటులోకి రానప్పటికీ అప్పుడే తర్వాత రాబోయే ఆండ్రాయిడ్12పై అనేక పుకార్లు బయటకి వస్తున్నాయి. ఆండ్రాయిడ్ 12కు చెందిన కొన్ని ఫీచర్లు ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది చివరికి గూగుల్ పిక్సల్, ఆండ్రాయిడ్ వన్ తో పాటు ఇతర స్మార్ట్ఫోన్లలో దీనిని తీసుకొనిరానున్నట్లు తెలుస్తుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీ వంటి ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పతులలో వినియోగిస్తున్నారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఆండ్రాయిడ్ 12 లీకైన స్క్రీన్షాట్లను గమనిస్తే ప్రధానంగా యూఐ, సెక్యూరిటీ విషయంలో దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. గూగుల్ తర్వాత తీసుకొనిరాబోయే ఆండ్రాయిడ్ 12లోని ఫీచర్లు ఐఓఎస్ ని పోలి ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాక, పెద్ద నోటిఫికేషన్ టోగుల్ బటన్తో ఉన్న స్క్రీన్షాట్ను షేర్ చేసింది. ఆండ్రాయిడ్ 11లో ఆరు క్విక్ టోగుల్ బటన్స్ ఉండగా, ఆండ్రాయిడ్ 12లో మాత్రం నాలుగు టోగుల్ బటన్స్ మాత్రమే ఉన్నట్లు కనిపిస్తుంది. అలాగే ఐఓఎస్ లో కనిపించే సెక్యూరిటీ టోగుల్స్ కూడా ఇందులో తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. అంటే, ఆండ్రాయిడ్ 12లో పటిష్టమైన సెక్యూరిటిని అందించడానికి ఈ అప్డేట్లో ప్రయత్నిస్తున్నారు. దీనితో పాటు రీసెంట్ మెసేజెస్, కాల్స్, యాక్టివిటీ స్టేటస్ వంటి కొత్త విడ్జెట్లను తీసుకురానున్నారు. సమీప ఎలక్ట్రానిక్ పరికరాలతో వై-ఫై పాస్వర్డ్లను పంచుకోవడం, మెరుగైన థీమింగ్ అందిస్తారని అర్ధం అవుతుంది. చదవండి: ఈ యాప్ ను వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి రికార్డు స్థాయిలో రెడ్మి నోట్ సిరీస్ ఫోన్ అమ్మకాలు -
వన్ప్లస్ యూజర్లకు గుడ్ న్యూస్
వన్ప్లస్ చివరకు ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేసే ఆక్సిజన్ ఓఎస్ 11బీటా బిల్డ్ ను వన్ప్లస్ 7, 7టీ సిరీస్లకు విడుదల చేస్తోంది. ఈ కొత్త బిల్డ్ ను ఇతర మొబైల్ కంపెనీలతో పోలిస్తే చాలా ఆలస్యంగా తీసుకొచ్చింది. మిగతా వన్ప్లస్ వినియోగదారులకు ఈ అప్డేట్ త్వరలోనే అందనున్నట్లు కంపెనీ ప్రకటించింది. వన్ప్లస్ 8, వన్ప్లస్ నార్డ్ ఇది వరకే ఆక్సిజన్ ఓఎస్ 11 బీటా బిల్డ్ను అందుకున్నాయి. దీని తర్వాత 2019 విడుదలైన వన్ప్లస్ 7, 7టీ మొబైల్స్ కు అప్డేట్ రావడం మొదలైంది. ఈ అప్డేట్ దశల వారీగా రానున్నట్లు ప్రకటించింది.(చదవండి: బడ్జెట్ లో రెడ్మీ స్మార్ట్ బ్యాండ్) ఈ బిల్డ్ లో ఆల్వేస్ ఆన్-డిస్ప్లే, న్యూ సిస్టమ్ ఫాంట్, జెన్ మోడ్ లను మెరుగుపరిచారు. ఇందులో ప్రధానంగా కెమెరా ఇంటర్ఫేస్ మెరుగుదలతో పాటు హెచ్ఇవిసి సపోర్ట్ చేసే వీడియో-అఫిషియోనాడోస్ ను తీసుకొచ్చారు. ఇది బీటా బిల్డ్ కాబట్టి వన్ప్లస్ టెస్టింగ్ లో భాగంగా కొన్ని ఫీచర్స్ సరిగా పనిచేయకపోవచ్చు. కొందరు ఇప్పటికే విద్యుత్ వినియోగం పెరిగినట్లు గమనించారు. కొన్ని ఫోటోలు గ్యాలరీలో కనబడకపోవడం, బ్లూటూత్ ద్వారా పనిచేసే పరికరాలు సౌండ్ రాకపోవడం, బ్రైట్ అడ్జస్ట్మెంట్ సరిగా పనిచేయకపోవడం వంటివి కొందరు గమనించినట్లు పేర్కొన్నారు. -
2021లో రియల్మీ కీలక ఫోన్- కేవోఐ
ముంబై, సాక్షి: కొత్త ఏడాది(2021)లో చైనీస్ కంపెనీ రియల్మీ సరికొత్త స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. కేవోఐగా నామకరణం చేసిన ఈ ఫోన్ను ప్రధాన బ్రాండుగా విడుదల చేసే వీలుంది. చైనా, జపాన్లలో సుప్రసిద్ధమైన కేవోఐ చేప పేరుతో స్మార్ట్ ఫోన్ను రూపొందిస్తున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. శుభప్రదంగా భావించే కేవోఐ చేపను పోలి విభిన్న కలర్స్, అందమైన డిజైన్తో ఈ ఫోన్ను విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఇటీవల కంపెనీ మోటో.. డేర్ టు లీప్ రైటప్తోపాటు.. రెండు కోయి చేపలతో అలంకరించిన పోస్టర్ను రియల్మీ విడుదల చేసినట్లు వెల్లడించాయి. (రియల్మీ నుంచి స్మార్ట్ వాచీలు రెడీ) ఫీచర్స్ ఇలా! ఫ్లాగ్షిప్ బ్రాండుగా 2021లో రియల్మీ తీసుకురానున్న కేవోఐ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరికల్లా మార్కెట్లో ప్రవేశించవచ్చని టెక్ నిపుణుల అంచనా. ఫోన్ ఫీచర్స్ పూర్తిగా వెల్లడికానప్పటికీ వెనుకభాగంలో చతురస్రాకారంలో కనీసం మూడు సెన్సర్స్తో కూడిన 64 ఎంపీ లెన్స్ కెమెరాను ఏర్పాటు చేయనున్నట్లు టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఫ్లాస్క్ షేపుతో మూడు రంగుల కలయికతో కోత్త ప్యాటర్న్లో వెనుక కవర్ ఉండవచ్చని చెబుతున్నారు. డిస్ప్లేలోనే ఫింగర్ ప్రింట్ ఏర్పాటుకానుంది. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తోపాటు.. 12 జీబీ ర్యామ్, 256 జీబీ అంతర్గత మెమొరీకి చాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత యూజర్ ఇంటర్ఫేస్తో ఫోన్ విడుదల కావచ్చు. ఇతర వివరాలు వెల్లడికావలసి ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. -
ఈ మొబైల్స్ వాడేవారికి గుడ్ న్యూస్
మోటోరోలా సరికొత్త ఆండ్రాయిడ్ 11 అప్డేట్ను అందుకోబోయే ఫోన్ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఆండ్రాయిడ్ 11 అప్డేట్ను అందుకునే 22 మోటరోలా మొబైల్స్, ఒక లెనోవా మొబైల్ ఉంది. ఈ జాబితాలో ఉన్న ఫోన్లకు త్వరలో ఆండ్రాయిడ్ 11 అప్డేట్ రానుంది. అయితే సరిగ్గా ఎప్పుడు తీసుకువస్తారో అనే విషయం కంపెనీ ప్రకటించలేదు. ఈ జాబితాలో మోటరోలా రేజర్ 5జీ, మోటరోలా రేజర్ 2019, మోటరోలా ఎడ్జ్, మోటరోలా ఎడ్జ్ ప్లస్, మోటరోలా వన్ 5జీ, మోటరోలా వన్ యాక్షన్, మోటరోలా వన్ ఫ్యూజన్, మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్, మోటరోలా వన్ హైపర్, మోటరోలా వన్ విజన్, మోటో జీ 5జీ, మోటో జీ 5జీ ప్లస్, మోటో జీ 5జీ ఫాస్ట్, మోటో జీ పవర్, మోటో జీ ప్రో, మోటో జీ స్టైలస్, మోటో జీ9, మోటో జీ 9ప్లే, మోటో జీ 9ప్లస్, మోటో జీ 9పవర్, మోటో జీ8, మోటో జీ 8పవర్, లెనోవా కే 12నోట్ ఉన్నాయి. అయితే ఈ అప్డేట్ 2021లో రానున్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్ 11 అప్డేట్ లో భాగంగా చాట్ బబుల్స్, డివైస్ కంట్రోల్స్ ఫీచర్ రానుంది. దీంతోపాటు ప్రైవసీ సెట్టింగ్స్ను కూడా మెరుగుపరుచుకోవచ్చు. మైక్, కెమెరా, లొకేషన్ వంటి వాటికి వన్ టైం పర్మిషన్లను అందించవచ్చు. (చదవండి: 2020 వాట్సాప్ లో వచ్చిన బెస్ట్ ఫీచర్స్ ఇవే) -
వాట్సాప్ లో వచ్చిన కొత్త ఫీచర్స్ ఇవే!
ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్. వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ ఉంటుంది. గ్రూపుల్లో వరుసగా మెసేజ్లు వస్తున్నట్లుగా ఫీచర్లు వరుస కడుతున్నాయి. అందుకే ఈ వారంలో వచ్చిన వాట్సాప్లో తీసుకురాబోయే కొత్త ఫీచర్లతో పాటు, ఇతర సమాచారం గురించి తెలుసుకుందాం.(చదవండి: కొత్త సాంకేతికతను పరిచయం చేసిన ఒప్పో) ప్రస్తుతం వాట్సాప్ యూజర్లు కేవలం మొబైల్ యాప్ ద్వారా మాత్రమే వాయిస్, వీడియో కాల్స్ చేసుకొనే సదుపాయం ఉంది. ఇప్పుడు ఈ ఫీచర్ ని వాట్సాప్ వెబ్ వెర్షన్ లకు కూడా తీసుకురానున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఇప్పటికే ఈ సదుపాయం బీటా యూజర్లకు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. త్వరలో మిగతా వినియోగదారులకు కూడా తీసుకురానున్నట్లు పేర్కొంది. వాట్సాప్ గత నెలలో భారతదేశంలో వాట్సాప్ పే సేవలను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ వారంలో జరిగిన ఫేస్బుక్ యొక్క ఫ్యూయల్ ఫర్ ఇండియా 2020 సమావేశంలో వాట్సాప్ యూజర్లు ఇప్పుడు ఎస్బిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ లేదా యాక్సిస్ బ్యాంక్ ఖాతాల ద్వారా కూడా వాట్సాప్ పే సేవలను ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చని ప్రకటించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్లో 50 మిలియన్లకు పైగా వినియోగదారులు భాగస్వామ్యం అయ్యారని మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు. వీరిలో దాదాపు 15 మిలియన్ల మంది వినియోగదారులు భారతదేశం నుండే ఉన్నారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుండి ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆధారిత ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నట్లు సంస్థ ప్రకరించింది. నిషేదిత ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ ఫోన్ల జాబితాలో ఆండ్రాయిడ్ 4.3 లేదా అంతకంటే తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్, ఐఓఎస్ 9 లేదా అంతకంటే తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ గల మొబైల్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నట్లు సంస్థ ప్రకటించింది. -
ఆ ఫోన్లలో వాట్సప్ పని చేయదు
కొన్ని పాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది సంస్థ. 2021లో కొన్ని మొబైల్స్ లలో వాట్సాప్ పని చేయదని తెలిపింది. ఆండ్రాయిడ్ తో పాటు ఐఓఎస్ మొబైల్స్ కూడా వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. 2021లో ఐఓఎస్ 9, ఆండ్రాయిడ్ 4.0.3 కన్నా పాత ఆపరేటింగ్ సిస్టమ్లతో పనిచేసే మొబైల్స్ లో 2021 నుండి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. వాట్సప్ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్స్ ని ఉపయోగించుకునేందుకు వినియోగదారులు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించాలని వాట్సాప్ పేర్కొంది. మీరు కనుక వాట్సాప్ సేవలు వాడుకోవాలంటే ఓఎస్ 9, ఆండ్రాయిడ్ 4.0.3 ఆపై లేటెస్ట్ వర్షన్స్ స్మార్ట్ఫోన్లు మాత్రమే వాడాలి. అంతకన్నా పాత వర్షన్స్ వాడితే మీ మొబైల్ లో వాట్సప్ యాప్ పనిచేయదు.(చదవండి: నాలుగు బ్యాంకులతో వాట్సాప్ ఒప్పందం) -
12వేలలో ఇన్ఫినిక్స్ బడ్జెట్ స్మార్ట్ టీవీ
బడ్జెట్, ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్ల తీసుకొచ్చిన ఇన్ఫినిక్స్ తాజాగా భారతదేశంలో తన మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని ఆవిష్కరించింది. 32 అంగుళాల, 43-అంగుళాల వేరియంట్లతో ఎక్స్ 1 స్మార్ట్ టివి సిరీస్తో ఆండ్రాయిడ్ టివి మార్కెట్లోకి ప్రవేశించింది. కెన్యా మరియు ఇతర దేశాలలో ఇదివరకే ఈ స్మార్ట్ టీవీలను ప్రారంభించారు. ఈ రెండు టీవీలు టీయూవీ రెయిన్ల్యాండ్ సర్టిఫికేషన్ పొందాయి. కాబట్టి వీటిని చూడటంలో ఎటువంటి ఇబ్బందీ ఎదురుకాదు.(చదవండి: బెస్ట్ ట్రెండింగ్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ ఇవే!) ఇన్ఫినిక్స్ ఎక్స్ 1 టీవీ ఫీచర్స్, ధర: ఇన్ఫినిక్స్ ఎక్స్ 1 స్మార్ట్ టివిని ఫ్లిప్కార్ట్లో ప్రత్యేకంగా లాంచ్ చేశారు. స్మార్ట్ టీవీలను 32-అంగుళాలు, 43-అంగుళాలతో వేరియంట్లలో వీటిని విడుదల చేశారు. 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ .11,999 కాగా, 43 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ .19,999. 32 అంగుళాల మోడల్లో హెచ్డీ డిస్ ప్లేను, 43 అంగుళాల మోడల్లో ఫుల్ హెచ్డీ డిస్ ప్లేను అందించారు. ఇది అంచులు లేని డిస్ప్లే ని తీసుకొచ్చారు. ఇందులో బెస్ట్ సౌండ్ కోసం అంతర్నిర్మిత బాక్స్ స్పీకర్లు తీసుకొచ్చారు. 43 అంగుళాల స్మార్ట్ టీవీ 24వాట్ స్పీకర్ను ఉపయోగిస్తుండగా, 32 అంగుళాల టీవీ 20వాట్ స్పీకర్ను ఉపయోగిస్తుంది. ఎక్స్1 సిరీస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలు 1జీబీ ర్యామ్ , 8జీబీ రోమ్ వంటి శక్తివంతమైన మీడియాటెక్ క్వాడ్-కోర్ ప్రాసెసర్పై నడుస్తాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ మొదలైన వీడియో యాప్స్ లకు మెరుగైన కనెక్టివిటీ కోసం ఇది అంతర్నిర్మిత క్రోమ్ కాస్ట్ తీసుకొచ్చారు. ఎపిక్ 2.0 పిక్చర్ ఇంజిన్, 60 హెర్ట్జ్ డిస్ ప్లే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రెండు హెచ్డీఎంఐ పోర్టులు, ఒక యూఎస్బీ పోర్టు, బ్లూటూత్ 5.0, వైఫై, ఐఆర్ రిమోట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు 32 అంగుళాల వేరియంట్లో ఉన్నాయి. మూడు హెచ్డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టు, బ్లూటూత్ 5.0, వైఫై, బ్లూటూత్ రిమోట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు 43 అంగుళాల వేరియంట్లో అందించారు. -
బడ్జెట్ లో నోకియా సీ1 ప్లస్ మొబైల్
నోకియా సీ1 ప్లస్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్ను యూరోపియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేయనుంది. దింట్లో 4జీ కనెక్టివిటీ కూడా అందించారు. యూరోప్ లో దీని ధర 69 యూరోలు(సుమారు 6,200). ఇది ఎరుపు, నీలం రంగులలో లభించనుంది.(చదవండి: డిసెంబర్ 29న రానున్న ఎంఐ 11) నోకియా సీ1 ప్లస్ ఫీచర్స్ ఆండ్రాయిడ్ 10(గో ఎడిషన్)పై నడుస్తున్న నోకియా సీ1 ప్లస్ స్మార్ట్ఫోన్ 5.45-అంగుళాల హెచ్డి స్క్రీన్ను కలిగి ఉంది. ఇది 18:9 డిస్ప్లే రేషియోతో వస్తుంది. నోకియా C1 ప్లస్ స్మార్ట్ఫోన్ 1.4గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియా టెక్ ప్రాసెసర్ తో నడుస్తుంది. ఇందులో 1జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. మైక్రో ఎస్ డీ కార్డ్ ద్వారా 128జీబీ స్టోరేజీ వరకు పెంచుకోవచ్చు. నోకియా సి 1 ప్లస్ లో సెల్ఫీ, వీడియోల కోసం ముందు, వెనుక భాగంలో 5మెగాపిక్సల్ ఒకే కెమెరాను అందించారు. 2500 ఎంఏహెచ్ బ్యాటరీతో సపోర్ట్ తో వస్తున్న నోకియా సి1 ప్లస్ లో 4జీ, వైఫై, బ్లూటూత్ 4.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్ను కలిగి ఉంది. 5వాట్ చార్జింగ్కి ఇది సపోర్ట్ చేయనుంది. ఈ స్మార్ట్ఫోన్ యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్ (జి-సెన్సార్)ను అందిస్తుంది. ఇందులో ఎఫ్ఎం రేడియోను కూడా అందించారు. -
గూగుల్ మెసేజ్ లో సాంకేతిక లోపం
చాలా మంది ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఎస్ఎంఎస్ యాప్ గురుంచి పిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్యను మొదటగా ఆండ్రాయిడ్ సెంట్రల్ గుర్తించినట్లుగా తెలుస్తుంది. గూగుల్ యొక్క క్యారియర్ సర్వీసెస్ యాప్ ని ఆండ్రాయిడ్ ఫోన్ లో అప్డేట్ చేసినప్పుడు సమస్య వస్తుందని, ఎస్ఎంఎస్ పంపేటప్పుడు వారు దాదాపు 30 నిముషాల లాగ్స్ ఎదుర్కొంటున్నారని వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ సమస్య గురుంచి రెడ్డిట్, ఇతర ఫోరమ్లలో చాలా ఫిర్యాదులు చేసినప్పటికీ ఈ సమస్యకు సంబంధించి గూగుల్ లేదా స్మార్ట్ఫోన్ తయారీదారుల నుండి ఎటువంటి స్పందన లేదు. (చదవండి: షియోమీ మరో సంచలనం) మీరు ఈ సమస్య నుండి బయటపడటానికి మీ స్మార్ట్ఫోన్ నుండి గూగుల్ క్యారియర్ సర్వీసెస్ యాప్ ని అన్ ఇన్స్టాల్ చేయడం ద్వారా తాత్కాలికంగా పరిష్కారం లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికోసం మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళాక అక్కడ మెను భాగంలో మై యాప్స్, గేమ్స్ ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ యాప్స్ లో ఉన్న 'క్యారియర్ సర్వీసెస్'ని 'అన్ఇన్స్టాల్' చేయండి. మీరు ఒకటి మాత్రం గమనించాలి గూగుల్ క్యారియర్ సేవలను అన్ఇన్స్టాల్ చేసే ముందు గూగుల్ క్యారియర్ సర్వీసెస్ గూగుల్ మెసేజెస్ యాప్ లో సరికొత్త కమ్యూనికేషన్ సర్వీసెస్, ఫీచర్లను ఎనేబుల్ చేస్తుందని అనే విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి మీరు యాప్ ని మళ్లీ ఇన్స్టాల్ చేయకపోతే మీరు ఏ క్రొత్త ఫీచర్లను భవిష్యత్ లో ఉపయోగించలేరు. ఎస్ఎంఎస్ యాప్ లో వచ్చిన సమస్యకు గూగుల్ పరిష్కరిస్తుందో చూడాలి. -
వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్
వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్స్ ని ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరో కొత్త ఫీచర్ని వినియోగదారులకు పరిచయం చేసింది. గత వారం క్రితం ఈ ఫీచర్ ని తీసుకొస్తున్నట్లు తన కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో ద్వారా తెలిపింది. ఇప్పుడు వచ్చిన కొత్త ఫీచర్ ద్వారా ఛాటింగ్ చేసేప్పుడు ప్రతి ఛాట్ పేజ్కి కొత్త వాల్పేపర్ను సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం కొత్తగా వాల్పేపర్ గ్యాలరీ అప్డేట్ చేశారు. ఈ రోజు నుండి వాట్సాప్ వినియోగదారులను వ్యక్తిగత చాట్ల కోసం వాల్పేపర్లను సెట్ చేసుకోవడనికి అనుమతి ఇచ్చింది.(చదవండి: షియోమి నుంచి మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్) ప్రత్యేక వాల్పేపర్లను ఇలా సెట్ చేయండి: ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి మీరు ఏదైనా ఖాతాను ఎంచుకోండి. ఇప్పుడు పైన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి "వాల్పేపర్" ఎంచుకోండి. మీకు అక్కడ బ్రైట్, డార్క్, సాలిడ్ కలర్స్, మై ఫొటోస్ అనే ఆప్షన్ కనిపిస్తాయి. పైన తెలిపిన వాటిలో మీకు నచ్చిన దాన్ని ఎంచుకున్న తర్వాత సెట్ వాల్పేపర్ క్లిక్ చేసి ఓకే నొక్కండి. ఇప్పుడు మీకు నచ్చిన వాల్పేపర్ అన్ని కాంటాక్ట్స్ లేదా మీకు ఇష్టమైన వాటికీ సెట్ చేసుకోవచ్చు. వ్యక్తిగత చాట్ల కోసం వాల్పేపర్లతో పాటు, వాట్సాప్ వినియోగదారులకు కాంతి(లైట్) మరియు డార్క్ థీమ్ల కోసం వేర్వేరు వాల్పేపర్లను సెట్ చేయడానికి అనుమతి ఇచ్చింది. డార్క్ థీమ్ల కోసం వాల్పేపర్ డిమ్మింగ్ ఆప్షన్ కూడా తీసుకోని వచ్చింది. దీని ద్వారా థీమ్ బ్రైట్ నెస్ పెంచుకోవడంతో పాటు తగ్గించుకోవచ్చు కూడా. దీనికోసం వాట్సాప్ సెట్టింగ్ ఓపెన్ చేసి చాట్స్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇది డార్క్ థీమ్ కి మాత్రమే పని చేస్తుంది. మీరు డార్క్ థీమ్ ఎంచుకున్నాక క్రింద ఉన్న "వాల్పేపర్" ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు వాల్పేపర్ డిమ్మింగ్ అనే కొత్త ఫీచర్ కనిపిస్తుంది. దీని ద్వారా మీరు మీ డార్క్ థీమ్ యొక్క బ్రైట్ నెస్ తగ్గించుకోవడం లేదా పెంచుకోవడం చేసుకోవచ్చు. ఐఓఎస్ యూజర్లు యాప్ స్టోర్, ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ కొత్త అప్డేట్ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ట్రై చేయవచ్చు. -
ఈ యాప్స్ ని వెంటనే డిలీట్ చేయండి
బంబుల్, ఓక్కుపిడ్, గ్రైండర్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, సిస్కో టీమ్స్, వైబర్ వంటి ప్రముఖ డేటింగ్, ట్రావెల్, వీడియో కాలింగ్ యాప్స్ లలో ఇటీవల ఒక పెద్ద బగ్ గుర్తించినట్లు చెక్పాయింట్ పరిశోధకులు తెలిపారు. ఈ సమస్య అనేది గూగుల్ కోర్ లైబ్రరీ(జీపీసీ)కి చెందిన రెండు యాప్స్ మాత్రమే కాకుండా ఇతర యాప్స్ లలో గుర్తించినట్లు తెలిపారు. డెవలపర్ల నిర్లక్ష్యం కారణంగా ఈ బగ్ బయటపడింది. దీనిని 2020 ఏప్రిల్లో గూగుల్ గుర్తించి పరిష్కరించింది. ఈ బగ్ కి CVE-2020-8913 అని పేరు పెట్టబడింది. (చదవండి: గూగుల్ పేలో డిజిటల్ గిఫ్ట్ కార్డ్లు) ఈ బగ్ ద్వారా సైబర్ క్రీమినల్స్ కి మీ మొబైల్ యొక్క డెవలపింగ్ కోడ్ అనేది పొందటానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు హ్యాకర్స్ మీ మొబైల్ లో ఉన్న సెక్యూరిటీ కోడ్ ని మార్చడంతో పాటు వారు మరో హానికరమైన కోడ్ను మొబైల్ లో ఇంజెక్ట్ చేయవచ్చు. ఇటువంటి హానికర యాప్స్ ద్వారా వినియోగదారులకు తెలియకుండా వ్యక్తిగత సమాచారంతోపాటు సున్నితమైన బ్యాంక్ వివరాలు, సోషల్ మీడియా వివరాలు తెలుసుకుంటారు. ఈ సమస్య 2020 ఏప్రిల్లో గుర్తించబడింది. ఇది గూగుల్ ప్లే కోర్ లైబ్రరీకి సంబంధించినది కనుక గూగుల్ పరిష్కరించింది. అయితే చాలా మంది యాప్ డెవలపర్లు ఇప్పటికీ పాతబడిపోయిన గూగుల్ ప్లే కోర్ లైబ్రరీ (జీపీసీ)నే వాడుతున్నారు. ఇందులోనే ఈ బగ్ను కనుగొన్నారు. ఈ జీపీసీ ద్వారానే డెవలపర్లు తమ అప్డేట్స్ను యూజర్లకు చేరవేస్తారు. 2020 సెప్టెంబర్ నెలలో గూగుల్ ప్లే స్టోర్లోని కొన్ని ప్రముఖ యాప్స్ను చెక్ పాయింట్ పరీక్షించింది. ఇప్పటికి 13 శాతం డెవలపర్లు పాత గూగుల్ ప్లే కోర్ లైబ్రరీని వాడుతున్నట్లు గుర్తించింది. 8 శాతం మంది బగ్ ముప్పు ఎక్కువగా ఉన్న వెర్షన్నే వాడుతున్నారని ఇందులో తేలింది. ఇంకా ఈ సమస్యను గూగుల్ పూర్తిగా పరిష్కారించలేదు. గ్రైండర్, వైబర్, ఓక్కుపిడ్, బంబుల్, సిస్కో జట్లు, ఎడ్జ్, యాంగో ప్రో, ఎక్స్రేకార్డర్ మరియు పవర్ డైరెక్టర్ లాంటి ప్రముఖ యాప్స్ లో లోపం ఉన్నట్లు చెక్పాయింట్ నిపుణులు తెలిపారు. అందుకని మీ మొబైల్ ఇలాంటి యాప్స్ ఉంటె వెంటనే డిలీట్ చేయండి. -
రూ. 13,000లలో నోకియా లేటెస్ట్ ఫోన్
ముంబై, సాక్షి: ఈ నెల రెండు లేదా మూడో వారంలో నోకియా లేటెస్ట్ స్మార్ ఫోన్ 3.4 దేశీ మార్కెట్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ను ఎంపిక చేసిన కొన్ని యూరోపియన్ దేశాలలో సెప్టెంబర్లోనే నోకియా విజయవంతంగా ప్రవేశపెట్టింది. యూకేలో 3.4 నోకియా ఫోన్ ధర 130 పౌండ్లుకాగా.. దేశీయంగా సుమారు రూ. 12,000- 12,800 స్థాయిలో ఉండవచ్చని విశ్లేషకుల అంచనా. నోకియా స్మార్ట్ ఫోన్లలో 2.4 మోడల్, 5.3 మోడళ్ల ధరలు రూ. 10,400- రూ. 12,999 మధ్యలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు మోడళ్ల మధ్యలో తాజా ఫోన్ 3.4 ధర ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. చదవండి: (దేశీ రోడ్లపై కేటీఎం ప్రీమియం సైకిళ్లు!) ఇవీ ఫీచర్స్ నోకియా దేశీ వెబ్సైట్ వివరాల ప్రకారం నోకియా 3.4 మోడల్ మూడు కలర్స్లో లభ్యంకానుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 406 ఎస్వోసీ ప్రాసెసర్తో విడుదల కానుంది. 3 జీబీ ర్యామ్, 64 జీబీ వరకూ అంతర్గత మెమరీను అందించనుంది. మైక్రో ఎస్డీకార్డ్ ద్వారా 512 జీబీ వరకూ మెమరీను పెంచుకునే సౌలభ్యం ఉంది. ఆండ్రాయిడ్ 10తో వెలువడనున్న ఈ స్మార్ట్ఫోన్కు రెండేళ్ల వరకూ అప్డేట్స్ లభించనున్నాయి. బ్యాటరీ సామర్థ్యం 4,000 ఎంఏహెచ్కాగా.. యూఎస్బీ టైప్-సీ పోర్ట్తో చార్జింగ్ చేయవచ్చు. చదవండి: (హెల్మెట్ వాయిస్ కమాండ్స్తో ఇక బైకులు!) బిగ్ డిస్ప్లే నోకియా 3.4 ఫోన్ హెచ్డీ డిస్ప్లే కలిగిన 6.39 అంగుళాల తెరతో వెలువడనుంది. డ్యూయల్ నానో సిమ్ కార్డ్స్ సపోర్ట్ చేస్తుంది. వెనుక భాగంలో మూడు కెమరాలు ఉంటాయి. 13 ఎంపీ ప్రైమరీ, 2 ఎంపీ డెప్త్ సెన్సర్, 5 ఎంపీ అల్ట్రావైడ్తో వీటిని ఏర్పాటు చేసింది. సెల్ఫీలు తీసుకునేందుకు అనుగణంగా ముందుభాగంలో 8 ఎంపీ హొల్పంచ్ కటౌట్ కెమెరాను ఎడమవైపు కార్నర్లో ఫిక్స్ చేసింది. ఏఐ ఇమేజింగ్, పోర్ట్రయిట్ మోడ్, నైట్ మోడ్ తదితర పలు ఫీచర్లను అంతర్గతంగా ఏర్పాటు చేసిన కెమెరా యాప్ ద్వారా యూజర్లు వినయోగించుకోవచ్చు. నోకియా 3.4 స్మార్ట్ఫోన్ 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్సీలతోపాటు ఎఫ్ఎం రేడియో ఫీచర్లను సైతం కలిగి ఉంది. -
ఆండ్రాయిడ్ 11తో రానున్న గెలాక్సీ ఎ32 5జీ
శామ్సంగ్ గెలాక్సీ ఎ32 5జీ మొబైల్ అవుట్ అఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11తో రానున్నట్లు సమాచారం. దీనికి సంబందించిన కొన్ని లీక్స్ బయటకి వచ్చాయి. ఈ ఫొటోలో నాచ్ డిస్ప్లే, చిన్న కెమెరా బంప్ తో రానున్నట్లు కనిపిస్తుంది. మోడల్ నంబర్ ఎస్ఎమ్-ఎ326బితో వస్తున్న ఫోన్ గెలాక్సీ A32 5జీ అని సమాచారం. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్సంగ్ దీని గురుంచి ఎటువంటి సమాచారం తెలపలేదు. ఇది ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ తో వన్ UI 3.0పై పని చేయనుంది. ఇటీవల గెలాక్సీ ఎ32 5జీ యొక్క ఫీచర్స్ గురుంచి కొన్ని రూమర్లు బయటికి వస్తున్నాయి. ఇందులో 6.5-అంగుళాల డిస్ప్లే మరియు క్వాడ్ రియర్ కెమెరా సెటప్ను చూపిస్తుంది. ఫోన్ ఫ్లాట్ అయిన ప్లాస్టిక్ బ్యాక్ ప్యానల్తో పాటు ముందు భాగంలో సెల్ఫీ కెమెరా కోసం నాచ్ తో వస్తుంది అని నివేదిక పేర్కొంది. ప్రధాన కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ తో రానున్నట్లు సమాచారం. ఫోన్ వెనుక భాగంలో కెమెరా మాడ్యూల్ లేని బ్యాక్ ప్యానెల్ తో ఫ్లష్ గా ఉంటుంది. గెలాక్సీ ఎ 32 5జీ మొబైల్ యుఎస్బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్తో రావచ్చు.(చదవండి: రియల్మీలో స్నాప్డ్రాగన్ 888) -
ఆండ్రాయిడ్ యూజర్స్కి శుభవార్త
గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్స్కి శుభవార్త తెలిపింది. గూగుల్ తన రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్(ఆర్సిఎస్) ఫీచర్ ఇప్పుడు ఆండ్రాయిడ్లోని మెసేజెస్ యాప్లో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉందని తెలిపింది. రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ను గూగుల్ మెసేజెస్ యాప్లో పాత తరం ఎస్సెమ్మెస్ స్థానంలో తీసుకొస్తున్నట్లు తెలిపింది. గూగుల్ తన మెసేజెస్ యాప్లో ఆర్సిఎస్ స్టాండర్డ్ తీసుకురావడం కోసం కొంతకాలంగా అభివృద్ధి చేస్తుంది. ఆర్సిఎస్ ద్వారా వినియోగదారులు మెరుగైన కమ్యూనికేషన్ అనుభూతిని పొందుతారని తెలిపింది. దీని ద్వారా గ్రూప్ ఛాట్తో పాటు, ఎమోజీలు, ఎక్కువ క్వాలిటీ కలిగిన ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ తరహాలోనే ఇందులో కూడా ఆన్లైన్ స్టేటస్, టైపింగ్, రీడ్ ఇండికేటర్స్ ఉంటాయి. (చదవండి: వచ్చే ఏడాది తొలి బడ్జెట్ 5జీ ఫోన్) దీనిలో వాట్సాప్లో లాగే ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ తీసుకొస్తామని గూగుల్ ప్రకటించింది. దాని వల్ల ఇతరులెవరు మెసేజ్లను చదవలేరు. కేవలం మీరు, మీతో మాట్లాడే వ్యక్తి మాత్రమే వాటిని చదవగలరు. ప్రస్తుతం పరీక్షలో దశలో ఉన్న ఈ ఫీచర్ను 2021 ప్రథమార్ధంలో యూజర్స్కి అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ తెలిపింది. కొన్నేళ్లుగా కొత్త ఫీచర్స్ లేకపోవడంతో ఎక్కువ మంది యూజర్స్ మెసేజింగ్ కోసం వాట్సాప్తో పాటు ఇతర యాప్స్ను ఉపయోగిస్తున్నారు. వాటికి దీటుగా ఈ ఆర్సీఎస్ సేవలను గూగుల్ తీసుకొచ్చింది. (చదవండి: ఉచితంగా నెట్ఫ్లిక్స్ అకౌంట్) -
ఆండ్రాయిడ్ 11: తొలి స్మార్ట్ఫోన్ వివో వీ20
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో మంగళవారం కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. వీ సిరీస్ లో భాగంగా వివో వి 20 స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో మనదేశంలో లాంచ్ అయిన మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. వివో వీ20 ఫీచర్లు 6.44అంగుళాల అమోలేడ్ ఎఫ్హెచ్డి + హాలో ఫుల్ వ్యూ డిస్ప్లే 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720 జీ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ 1 టీబీ వరకు విస్తరించుకునే అవకాశం 64+ 8 +2 ట్రిపుల్ రియర్ కెమెరా 44 మెగా పిక్సెల్ ఆటోఫోకస్ సెల్పీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ వివో వీ20 ధర, లభ్యత రెండు వేరియంట్లలో లభ్యం. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,990 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,990గా ఉంది ప్రీ-బుకింగ్స్ ఈరోజు నుంచి ప్రారంభం. అలాగే అక్టోబర్ 20 నుంచి సేల్ ప్రారంభం. లాంచింగ్ ఆఫర్ వీ-షీల్డ్ మొబైల్ ప్రొటెక్షన్ ద్వారా కొత్త ఫోన్ కొనేటప్పుడు దీనిపై రూ.2,500 అదనపు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ను పొందవచ్చు. 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాండ్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, జెస్ట్ మనీ ద్వారా ఆఫ్ లైన్లో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ లభించనుంది. దీంతో పాటు వీఐ(వొడాఫోన్ ఐడియా) 819 రీచార్జ్ పై ఒక సంవత్సరం అదనపు వారంటీ కూడా లభ్యం. Out with the blurry, and in with clarity. Capture your life with the ultra-sleek #vivoV20 powered by 44MP Eye Autofocus Selfie to explore a new #DelightEveryMoment. Prebook now: https://t.co/PHsB9eFNXT pic.twitter.com/26zNlw9Mwh — Vivo India (@Vivo_India) October 13, 2020 -
గూగుల్తో పేటీఎం ఢీ..!
న్యూఢిల్లీ: కొద్ది రోజుల క్రితం నిబంధనల ఉల్లంఘన పేరుతో తమ యాప్ను ప్లేస్టోర్ నుంచి తొలగించిన టెక్ దిగ్గజం గూగుల్తో తలపడేందుకు దేశీ ఈ–కామర్స్ చెల్లింపుల సంస్థ పేటీఎం సిద్ధమయ్యింది. ఇందులో భాగంగా తాజాగా దేశీ డెవలపర్ల కోసం ఆండ్రాయిడ్ మినీ యాప్ స్టోర్ను ఆవిష్కరించింది. తమ యాప్లో అంతర్గతంగా మినీ–యాప్స్ను లిస్టింగ్ చేయడానికి ఎటువంటి చార్జీలు ఉండబోవని తెలిపింది. అలాగే, యూజర్లు.. పేటీఎం వ్యాలెట్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, యూపీఐ, నెట్–బ్యాంకింగ్, కార్డులు మొదలైన వాటి ద్వారా చెల్లింపులు జరిపేలా డెవలపర్లు ప్రత్యామ్నాయ అవకాశాలు ఇవ్వొచ్చని పేర్కొంది. క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులపై మాత్రం 2 శాతం చార్జీ ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఈ యాప్ స్టోర్ బీటా వెర్షన్ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. డెకాథ్లాన్, ఓలా, పార్క్ప్లస్, ర్యాపిడో, నెట్మెడ్స్, 1ఎంజీ, డోమినోస్ పిజ్జా, ఫ్రెష్మెనూ, నోబ్రోకర్ వంటి 300 పైచిలుకు యాప్ ఆధారిత సర్వీసుల సంస్థలు ఇప్పటికే ఇందులో చేరినట్లు పేటీఎం తెలిపింది. ‘ప్రతీ భారతీయ యాప్ డెవలపర్కూ సాధికారత కల్పించేలా పేటీఎం మినీ యాప్ స్టోర్ ఆవిష్కరించడం సంతోషకరమైన విషయం‘ అని పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. పేటీఎం యూజర్లు ప్రత్యేకంగా ఆయా యాప్లను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, తమకు నచ్చిన పేమెంట్ ఆప్షన్ల ద్వారా చెల్లింపులు చేసే వీలుంటుందని పేర్కొన్నారు. పరిమిత స్థాయిలో డేటా, ఫోన్ మెమరీ గల యూజర్లకు ఇలాంటి మినీ యాప్స్ ఉపయోగకరంగా ఉంటాయని వివరించారు. గూగుల్తో వివాదం.. టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సేవల విభాగంలో గూగుల్తో పేటీఎం పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అయితే, క్యాష్బ్యాక్ ఆఫర్తో నిబంధనలకు విరుద్ధంగా క్రీడల బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ సెప్టెంబర్ 18న పేటీఎం యాప్ను గూగుల్ తమ ప్లే స్టోర్ నుంచి కొన్ని గంటలపాటు తొలగించింది. సదరు ఫీచర్ను తొలగించిన తర్వాతే మళ్లీ ప్లేస్టోర్లో చేర్చింది. గూగుల్ తన మార్కెట్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, పోటీ సంస్థలను అణగదొక్కేందుకే ఇలాంటి పక్షపాత విధానాలు అమలు చేస్తోందని పేటీఎం ఆరోపించింది. ప్లేస్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ యాప్స్పై గూగుల్కు గుత్తాధిపత్యం ఉండటం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తడంతో గూగుల్ తమ విధానాలపై వివరణనిచ్చింది. ప్లే స్టోర్ ద్వారా డిజిటల్ కంటెంట్ విక్రయించే యాప్స్ కచ్చితంగా గూగుల్ ప్లే బిల్లింగ్ సిస్టమ్నే ఉపయోగించాలని, ఇన్–యాప్ కొనుగోళ్లకు సంబంధించి నిర్దిష్ట శాతం ఫీజుగా చెల్లించాల్సిందేనని పేర్కొంది. దీనిపై డెవలపర్లు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో భారత్లోని డెవలపర్లు.. ప్లే బిల్లింగ్ సిస్టమ్తో తమ యాప్లను అనుసంధానించేందుకు గడువును 2020 మార్చి 31 దాకా పొడిగించింది. ఫ్లిప్కార్ట్తో జట్టు.. పండుగ సీజన్ నేపథ్యంలో పేటీఎంతో చేతులు కలిపినట్లు ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తెలిపింది. ది బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసే యూజర్లు.. పేటీఎం వ్యాలెట్, పేటీఎం యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని పేర్కొంది. అంతేగాకుండా ఫ్లిప్కార్ట్ కస్టమర్లు తమ పేటీఎం వ్యాలెట్లలో తక్షణ క్యాష్బ్యాక్ పొందవచ్చని వివరించింది. అక్టోబర్ 16 నుంచి 21 దాకా ఫ్లిప్కార్ట్ ‘ది బిగ్ బిలియన్ డేస్’ సేల్ నిర్వహిస్తుండగా, ఆ సంస్థలో భాగమైన ఫ్యాషన్ విభాగం మింత్రా కూడా అక్టోబర్ 16 నుంచి 22 దాకా ’బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్’ నిర్వహిస్తోంది. అటు, మ్యాక్స్ ఫ్యాషన్తో కూడా జట్టు కట్టినట్లు మింత్రా మరో ప్రకటనలో వెల్లడించింది. -
ఆండ్రాయిడ్ ఫోన్లకు మాల్వేర్ ముప్పు!
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల నుంచి బ్యాంకింగ్ తదితర వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకు ‘బ్లాక్రాక్’ పేరుతో ఓ మాల్వేర్ చలామణిలో ఉందని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఒకటి గురువారం హెచ్చరించింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్లోని దాదాపు 337 అప్లికేషన్ల నుంచి ఈ మాల్వేర్ సమాచారాన్ని సేకరించగలదని, ఈమెయిల్, ఈకామర్స్, సోషల్మీడియా, బ్యాంకింగ్ ఆప్స్ కూడా ఇందులో ఉన్నాయని ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ’క్లుప్తంగా సెర్ట్.ఇన్ హెచ్చరించింది. ఈ ట్రోజన్ వైరస్ ఇప్పటికే ప్రపంచమంతా చక్కర్లు కొడుతోందని సెర్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. బ్లాక్రాక్ను క్సెరెక్స్ బ్యాంకింగ్ మాల్వేర్ సోర్స్కోడ్ ఆధారంగా తయారు చేశారని ఈ క్సెరెక్స్ అనేది లోకిబోట్ ఆండ్రాయిడ్ ట్రోజాన్ అని సెర్ట్ తెలిపింది. ఈ వైరస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లోకి చొరబడినప్పుడు యాప్ డ్రాయర్ నుంచి తన ఐకాన్ను దాచివేస్తుందని, ఆ తరువాత గూగుల్అప్డేట్ రూపం దాల్చి అనుమతులు కోరుతుందని వివరించారు. ఒక్కసారి అనుమతులిస్తే.. వినియోగదారుడి ప్రమేయం లేకుండానే సమాచారం లాగేస్తుందని సెర్ట్ తెలిపింది. గుర్తు తెలియని అప్లికేషన్లను డౌన్లోడ్/ఇన్స్టాల్ చేసుకోకుండా ఉండటం, అప్లికేషన్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, వినియోగదారుల సమీక్షలను కూడా గమనించి ఒక నిర్ణయం తీసుకోవడం.. అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకునే ముందు అదనపు సమాచారం ఏముందో తెలుసుకోవడం, తెలియని వైఫై నెట్వర్క్లకు దూరంగా ఉండటం ద్వారా ఈ మాల్వేర్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. -
ఆ ఫోటో వాడితే ఫోన్ క్రాష్..
ఓ వాల్పేపర్ వల్ల ఆండ్రాయిడ్ ఫోన్లు క్రాష్ అవుతుందంటూ గత కొద్ది రోజులుగా సోషల్మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫొటోను వాల్పేపర్గా పెట్టుకుంటే.. తమ మొబైల్స్ స్క్రీన్లాక్ దానంతటదే ఆన్ అవడం, వెంటనే ఆఫ్ అవడం జరుగుతోందని ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఫిర్యాదు చేశారు. మోంటానాలోని హిమానీనద జాతీయ ఉద్యానవనంలోని సెయింట్ మేరీ సరస్సు ఫోటో ఇది. ఈ క్రమంలో ఈ ఫోటో తీసిన వ్యక్తి ప్రస్తుతం తెర మీదకు వచ్చారు. గౌరవ్ అగర్వాల్ అనే శాస్త్రవేత్త, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ 2009, ఆగస్టులో దీనిని తీశారు. ఫోటో షేరింగ్ సైట్ ‘ఫ్లికర్’లో అప్లోడ్ చేశారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ ఫోటోను వాల్పేపర్గా వాడిన ఆండ్రాయిడ్ ఫోన్లు వాటంతట అవే ఆన్, ఆఫ్ కావడం.. క్రాష్ అవ్వడం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అగర్వాల్ ఈ ఫోటో, దాని వెనక ఉన్న కథను తెలియజేశారు. ఈ సందర్భంగా అగర్వాల్ మాట్లాడుతూ.. ‘ఎవరి ఫోన్ పాడు చేయాలనే ఉద్దేశంతో ఈ ఫోటో తీయలేదు. ఈ ఫోటో వల్ల ఇలాంటి ఇబ్బంది ఎదురవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగేవరకు నాకు దీని గురించి తెలియదు. నికాన్ కెమెరాతో ఈ ఫోటో తీశాను. తరువాత 'లైట్రూమ్' అనే సాఫ్ట్వేర్ను ఉపయోగించి దాన్ని ఎడిట్ చేశాను. అయితే ఫోటోను ఎక్స్ప్లోర్ చేయడానికి నేను ఎంచుకున్న కలర్ మోడ్.. ఇప్పటి ఆండ్రాయిడ్ ఫోన్లకు అనుకూలంగా లేదు’ అని తెలిపాడు. అంతేకాక ‘ఇక ఇప్పటి నుంచి నేను మరొక ఫార్మాట్ ఉపయోగించబోతున్నాను. ఈ ఫోటోలో ఏమీ తప్పు లేదు, కాని ఇది ఎల్ఆర్ నుండి ప్రోఫోటోఆర్జీబీ ఫార్మాట్లో ఎక్స్ప్లోర్ చేశాను. అందుకే ఈ ఫోటో ఆండ్రాయిడ్ ఫోన్కు అనుకూలంగా లేదు’ అని అగర్వాల్ అన్నారు. ఈ వాల్ పేపర్ సమస్య పెద్దది కావడంతో ఈ నెల 11న దీనికి సంబంధించి ఓ అప్డేట్ను విడుదల చేయనున్నట్లు సామ్సంగ్ ప్రకటించింది. దీనిపై ఓ నిపుణుడు మాట్లాడుతూ.. సదరు ఫొటో ఆర్జీబీ(RGB) కలర్ ఫార్మాట్లో ఉందని, ఆండ్రాయిడ్ ప్రఫర్డ్ ఎస్ఆర్జీబీలో లేకపోవడం వల్లే ఇలా జరుగుతుండొచ్చని చెప్పారు -
మార్కెట్లోకి ‘కొడాక్ సీఏ సిరీస్’ టీవీలు
న్యూఢిల్లీ: గూగుల్ సర్టిఫికేట్ పొందిన అండ్రాయిడ్ టెలివిజన్లలో అత్యంత చౌక ధరలకే కొడాక్ తన కొత్త తరం టీవీలను అందుబాటులోకి తెచ్చింది. భారత్లో ఈ బ్రాండ్ విక్రయానికి లైసెన్సు కలిగి ఉన్న సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్పీపీఎల్).. ‘కొడాక్ సీఏ సిరీస్’ పేరిట వీటిని సోమవారం మార్కెట్లోకి విడుదలచేసింది. డాల్బీ విజన్, 4కే హెచ్డీఆర్10, ఆండ్రాయిడ్ 9.0 ఇంటర్ఫేస్, డీటీఎస్ ట్రూసరౌండ్ కలిగిన డాల్బీ డిజిటల్ ప్లస్, యుఎస్బీ 3.0, బ్లూటూత్ వీ5.0 (తాజా వెర్షన్), అమెజాన్ ప్రైమ్ వంటి ఆప్షన్లు కలిగిన యూజర్ ఫ్రెండ్లీ రిమోట్ వంటి అధునాతన ఫీచర్లు కొత్త సిరీస్లో ఉన్నాయి. 43, 50, 55, 65 అంగుళాల సైజుల్లో టీవీలు లభిస్తుండగా.. ప్రారంభ ధర రూ. 23,999, హై ఎండ్ రూ. 49,999కే లభిస్తున్నట్లు ఎస్పీపీఎల్ డైరెక్టర్, సీఈఓ అవనీత్ సింగ్ మార్వ్ ప్రకటించారు. మార్చి 19 నుంచి ఈ సీరిస్ టీవీలు ఫ్లిప్కార్టులో అందుబాటులో ఉండనున్నాయి. -
మళ్లీ సోనీ ‘వాక్మాన్’!
న్యూఢిల్లీ: అప్పట్లో పాటల ప్రియులను అలరించి, డిజిటల్ ధాటికి కనుమరుగైన వాక్మాన్లను (పోర్టబుల్ పర్సనల్ క్యాసెట్ ప్లేయర్లు) సోనీ మళ్లీ కొత్త రూపులో ఆవిష్కరించింది. ఈసారి టచ్స్క్రీన్ సదుపాయంతో ఆండ్రాయిడ్ వాక్మాన్ ఎన్డబ్ల్యూ–ఎ105 మోడల్ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 23,990. ఇందులో 16 జీబీ బిల్టిన్ మెమరీ ఉంటుందని, 128 జీబీ దాకా ఎక్స్పాండబుల్ మెమరీ ఉంటుందని సంస్థ తెలిపింది. 3.6 అంగుళాల టచ్స్క్రీన్, ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్, 26 గంటల పాటు పనిచేసే బ్యాటరీ, వై–ఫై ద్వారా పాటలు డౌన్లోడ్ చేసుకునే సదుపాయం, వేగవంతంగా చార్జ్ అయ్యేందుకు టైప్–సీ పోర్టు, అత్యుత్తమమైన ఆడియో నాణ్యత ఇందులో ప్రత్యేకతలని వివరించింది. జనవరి 24 నుంచి ఈ వాక్మాన్లు అందుబాటులోకి వస్తాయి. -
ఈ యాప్స్ను తక్షణమే తొలగించండి!
ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక. గూగుల్ ప్లే స్టోర్ లోని కొన్ని యాప్స్ చాలా హానికరమైనవిగా ఉన్నాయని తక్షణమే వీటిని అన్ఇన్స్టాల్ చేయాలని ఒక పరిశోధన సంస్థ వినియోగదారులను తాజాగా హెచ్చరిస్తోంది. వివిధ ఉపయోగరమైన యాప్స్తో పాటు కొన్ని హానికరమైన యాప్స్ కూడా ప్లేస్టోర్లో దాక్కుని ఉన్నాయని బ్రిటిష్ సైబర్ సెక్యూరిటీ సంస్థ సోఫోస్ వెల్లడించింది. దాదాపు 15 పైగా ఇలాంటి యాప్స్ను తన పరిశోధనలో గుర్తించినట్టు తెలిపింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ వినియోగదారులు వాటిని ఇప్పటికే ఇన్స్టాల్ చేసుకుని వుండి వుంటే..వెంటనే అన్ఇన్స్టాల్ చేయాలని హెచ్చరించింది. ఈ మోసపూరితమైన యాప్స్ ద్వారా వినియోగదారుల గోప్యతకు ముప్పుతో పాటు, వాటి డెవలపర్ అక్రయ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని పేర్కొంది. పరిశోధనా సంస్థ సోఫోస్ ప్రకారం వీటిని ప్రస్తుతం గూగుల్ తొలగించినప్పటికీ, ఈ 15 యాప్స్ 1.3 మిలియన్లకు పైగా మొబైల్స్లో డౌన్లోడ్ అయినట్టు గుర్తించింది. 2019 జనవరి- జూలై మధ్య ఇవి ఇన్స్టాల్ అయ్యాయని తెలిపింది. ఇమేజ్ మ్యాజిక్ జెనరేట్ ఈవ్స్ సేవ్ ఎక్స్పెన్స్ క్యూఆర్ ఆర్టిఫాక్స్ ఫైండ్ యువర్ మొబైల్ స్కావెంజర్ స్పీడ్ ఆటో కటౌట్ ప్రో రీడ్ క్యూఆర్ కోడ్ ఫ్లాష్ కాల్స్ & మెసేజ్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఆటో కటౌట్ ఆటో కటౌట్ 2019 ఈ హానికరమైన అనువర్తనాలను వదిలించుకోవడానికి సెట్టింగ్స్లోకి వెళ్లి, యాప్స్, నోటిఫికేషన్లోకి వెళ్లి, రీసెంట్ యాప్స్ చెక్చేసి అనుమానాస్పదంగా కనిపిస్తే, వెంటనే వాటిని అన్ ఇన్స్టాల్ చేయాలని హెచ్చరించింది. ముఖ్యంగా అవసరం లేకపోతే ఎలాంటి యాప్స్ను ఇన్స్టాల్ చేయవద్దని యూజర్లకు సూచిస్తోంది. -
మొదటి వారంలోనే 100 మిలియన్ల డౌన్లోడ్లు!
నేటి డిజిటల్ యుగంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ వీడియో గేమ్స్ ఆడుతూ హల్చల్ చేస్తున్నారు. బ్లూవేల్, పబ్ జీ వంటి డేంజరస్ గేమ్స్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినా.. వాటికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో తాజాగా కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్ పేరిట మరో సరికొత్త గేమ్ ప్లే స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు మార్కెట్లోకి వచ్చిన స్వల్ప కాలంలోనే 100 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ సాధించిన తొలి గేమ్గా రికార్డుకెక్కింది. టిమీ స్టూడియోస్ డెవలప్ చేసిన ఈ గేమ్ హవా ఇలాగే కొనసాగితే.. ప్రత్యర్థి కంపెనీలు పతనం కావడం ఖాయమని విశ్లేషణా సంస్థ సెన్సార్ టవర్ పేర్కొంది. ఈ మేరకు ఐఓఎస్లో 56.9 మిలియన్, ఆండ్రాయిడ్లో 45.3 మిలియన్ డౌన్లోడ్లు సాధించిన కాల్ ఆఫ్ డ్యూటీ ఆయా ప్లాట్ఫాంలలో వరుసగా 9.1 మిలియన్, 8.3 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిపెట్టిందని తెలిపింది. ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో ఉన్న చైనాలో లాంచ్ కాకముందే రికార్డు స్థాయిలో డౌన్లోడ్స్ సాధించిన ఈ గేమ్.. అక్కడ కూడా లాంచ్ అయితే గేమింగ్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టిస్తుందని అంచనా వేసింది. ఫస్ట్ పర్సన్ షూటర్ గేమ్గా రూపొందిన ఈ మొబైల్ గేమ్ అక్టోబరు 1న విడుదలైందన్న విషయం తెలిసిందే. -
నేను చేసిన పెద్ద తప్పు అదే: బిల్గేట్స్
వాషింగ్టన్: ఆండ్రాయిడ్ను అభివృద్ధి చేసే అవకాశం గూగుల్కు దక్కేలా చేయడం, ఆండ్రాయిడ్కు ధీటైన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ను తయారు చేసుకోలేకపోవడం తాను చేసిన అతి పెద్ద తప్పు అని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్గేట్స్ పేర్కొన్నారు. ఫలితంగా తమ కంపెనీకి 40,000 కోట్ల డాలర్ల నష్టం వచ్చిందని వివరించారు. ఆండ్రాయిడ్ను 5 కోట్ల డాలర్లకే ఎగరేసుకుపోయిన గూగుల్ నిజమైన విజేతగా నిలిచిందని పేర్కొన్నారు. వెంచర్ క్యాపిటల్ సంస్థ, విలేజ్ గ్లోబల్కు ఇచ్చిన ఒక ఇంటరŠూయ్వలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. అన్నీ ఆండ్రాయిడ్ ఫోన్లే... యాపిల్ ఫోన్లు కాకుండా మిగిలిన ఇతర ఫోన్లకు ప్రామాణిక ప్లాట్ఫాంగా ఆండ్రాయిడ్ అవతరించిందని, మైక్రోసాఫ్ట్ ఆ స్థానంలో ఉండాల్సిందని ఆయన వివరించారు. గూగుల్ కంపెనీ ఆండ్రాయిడ్ను 2005లోనే కొనుగోలు చేసింది. ఐఫోన్ 2007లో మార్కెట్లోకి రాగా, ఆండ్రాయిడ్ ఫోన్2008లో మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం తయారవుతున్న స్మార్ట్ఫోన్లలో 85 శాతానికి పైగా ఆండ్రాయిడ్ ఓఎస్తో ఉన్నవే. ఇక విండోస్ ఓఎస్తో తయారైన ఫోన్లు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. -
అమెరికాకు వావే షాక్!
బీజింగ్ : అమెరికా బెదిరింపులకు, ఆంక్షలకు ధీటుగా సమాధానం చెప్పిన చైనా మొబైల్ తయారీ దిగ్గజ సంస్థ వావే కీలక విషయాన్ని ప్రకటించింది. తన సొంత ఆపరేటింగ్ సిస్టమ్ను తొందరలోనే లాంచ్ చేయనున్నామని గురువారం ప్రకటించింది. మమ్మల్ని తక్కువగా అంచని వేయొద్దని ప్రకటించిన వావే ఆండ్రాయిడ్కు ప్రత్యామ్నాయంగా ‘హాంగ్మెంగ్’ పేరుతో కొత్త ఓఎస్ను లాంచ్ చేయనుంది. తద్వారా అమెరికా టెక్ దిగ్గజాలు గూగుల్, ఆపిల్కు పెద్ద షాక్ ఇస్తోంది. వావే ‘హాంగ్మెంగ్’ ఓఎస్ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరలోనే తన ఫోన్లలో ఆండ్రాయిడ్ స్థానంలో గ్లోబల్గా దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నామని వావే తెలిపింది. ఈ మేరకు వావే టెక్నాలజీస్ కో లిమిటెడ్ పబ్లిక్ ఎఫైర్స్ అండ్ కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ విలియమ్సన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, హాంగ్మెంగ్ ఆపరేటింగ్ సిస్టంను ఇప్పటికే చైనాలో మిలియన్కు పైగా స్మార్ట్ఫోన్లలో అమలు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ట్రేడ్మార్క్ను సాధించనున్నామంటూ ధృవీకరించారు. గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వావేను బ్లాక్లిస్ట్లో పెట్టి, సంస్థ వ్యాపార లావాదేవీలను నిషేధించారు. శత్రు దేశాల నుంచి అమెరికా కంప్యూటర్ నెట్వర్క్కు ప్రమాదం పొంచి ఉందని, తద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లొచ్చని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా చైనాకు చెందిన ప్రపంచపు అతిపెద్ద టెలికం కమ్యూనికేషన్స్ ఎక్విప్మెంట్ కంపెనీ వావే లక్ష్యంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే వావేకు అమెరికాలో కార్యకాలాపాల కొనసాగింపు కోసమంటూ అమెరికా వాణిజ్య శాఖ 90 రోజుల తాత్కాలిక లైసెన్స్ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే గూగుల్ వావేతో సంబంధాలు తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. ఇటీవల ఫేస్బుక్ కూడా ఇదే బాటలో పయనించింది. ప్రస్తుతం అమెరికా కంపెనీలైన గూగుల్, ఆపిల్ కు చెందిన ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మార్కెట్ను ఏలుతున్న సంగతి తెలిసిందే. హువావే 2012 నుంచే సొంత ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేస్తోందని ఇటీవల పలు నివేదికలు వెల్లడించాయి. తాజా ప్రకటనతో అమెరికా ప్రభుత్వంతో పాటు గూగుల్, ఆపిల్ కంపెనీలకు ఝలక్ ఇచ్చినట్టేనని టెక్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
షావోమియే ‘గాడ్ఫాదర్’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అతి చౌకైన స్మార్ట్ఫోన్లను విక్రయిస్తూ ప్రసిద్ధి చెందిన ‘షావోమి’ అనే చైనా కంపెనీ గురించి తెలియనివారు నేటి యువతరంలో ఉండకపోవచ్చు. నిజంగా ఈ కంపెనీని స్మార్ట్ఫోన్ల రంగంలో ‘ది గాడ్ ఫాదర్’గా అభివర్ణించవచ్చు. అందుకు ఓ అసలైన కారణం కూడా ఉంది. ప్రముఖ చైనా వ్యాపారవేత్త లీ జున్ స్వతంత్ర భావాలు కలిగిన చిత్రమైన వ్యక్తి. షావోమి కంపెనీ స్థాపించడానికి ముందు ఆయన కోట్లకొద్ది డాలర్లను కుమ్మరించి ‘కింగ్సాఫ్ట్’ లాంటి పలు కంపెనీలను స్థాపించారు. జోయో అనే ఈ కామర్స్ సంస్థను స్థాపించి దాన్ని అనతి కాలంలోనే దాన్ని అమెజాన్ చైనాకు అమ్మేశారు. ఆ తర్వాత ‘వైవై కార్పొరేషన్’ పేరిట గేమింగ్ ఫ్లాట్ఫామ్ను ఏర్పాటు చేశారు. ఆయన తన వ్యాపారాలన్నింటికీ స్వస్తి చెప్పి హఠాత్తుగా చైనా చిత్ర రంగంలోకి అడుగుపెట్టారు. ఒకనాడు హాలీవుడ్లో సంచలనం సృష్టించిన ‘ది గాడ్ ఫాదర్’ చిత్రాన్ని చైనా భాషలో రీమేక్ చేసి తాను స్వయంగా అందులో గాడ్ ఫాదర్ పాత్రను పోషించారు. ఆ తర్వాత 2010లో జీ జున్ సినిమా ప్రపంచం నుంచి మళ్లీ వ్యాపార ప్రపంచంలోకి అడుగు పెట్టారు. షావోమి సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉపయోగించి ‘ఆపరేటింగ్ సిస్టమ్’ను అభివృద్ధి చేశారు. గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు సాఫ్ట్వేర్ రంగంలో, ఆపిల్, శ్యామ్సంగ్, నోకియా, మైక్రోమాక్స్ కంపెనీలు హార్డ్వేర్ రంగంలో రాణిస్తుండగా.. షావోమి రెండు రంగాల్లో రాణించడం విశేషం. ఒకప్పుడు మెకిన్సేలో పనిచేసిన భారతీయుడు మను జైన్ షావోమిలో చేరి భారత్లో ఈ ఫోన్ల విక్రయానికి అధిపతిగా నియమితులయ్యారు. ఫ్లిప్కార్ట్ సహాయంతో ఆన్లైన్లో షావోమి ఫోన్ల అమ్మకాల్లో పెద్ద విప్లవాన్నే సృష్టించారు. -
థాంప్సన్ నుంచి ఆండ్రాయిడ్ టీవీలు
న్యూఢిల్లీ నుంచి సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధి: ఫ్రెంచ్ కన్సూ్యమర్ దిగ్గజం థాంప్సన్... దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఆండ్రాయిడ్ టీవీలను విడుదల చేసింది. మేక్ ఇన్ ఇండియాకు అనుగుణంగా ఈ టీవీలను భారత్లోనే ఉత్పత్తి చేశామని కంపెనీ ఇండియా పేటెంట్ హక్కుదారు ఎస్పీపీఎల్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా చెప్పారు. దీంతో అన్ని రకాల ఆండ్రాయిడ్ టీవీలను స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న తొలి బ్రాండ్గా నిలిచామన్నారు. 43, 49, 55, 65 అంగుళాల వేరియంట్లలో ఈ టీవీలున్నాయని, వీటి ధర రూ. 29,999 నుంచి రూ. 59,999 వరకు ఉంటుందని చెప్పారు. ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్పై వీటిని విక్రయిస్తామన్నారు. ప్రత్యేకతలు: ఇన్బిల్ట్ క్రోమ్క్యాస్ట్, డాల్బీ సౌండ్, 2.5 ర్యామ్, 16 జీబీ మెమరీ, 5000కు పైగా వివిధ ప్రీఇన్స్టాల్డ్ యాప్స్, నెట్ఫ్లిక్స్, గూగుల్ప్లే కోసం హాట్కీస్, 4కే 10హెచ్డీఆర్ డిస్ప్లే తదితరాలు. -
సోనీ ఆండ్రాయిడ్ టీవీ...ధర వింటే
సోనీ సంస్థ అద్భుతమైన మరో ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. ఎక్స్9500జీ సిరీస్లో మరో బిగ్ టీవీని తీసుకొచ్చింది. 75 అంగుళాల స్క్రీన్తో సోనీ 4కే అల్ట్రా హెచ్డీ ఎల్ఈడీ టీవీని ‘‘కేడీ75 ఎక్స్9500జీ’’ పేరుతో భారత మార్కెట్లో అవిష్కరించింది. దీని ధరను రూ. 4,49,990 గా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా సోనీ సెంటర్, ఇతర ఎలక్ట్రానిక్స్ స్టోర్ల ద్వారా ఈ సూపర్ టీవీలు అందుబాటులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. మామూలు ఎల్ఈడీ టీవీల కంటే ఆరు రెట్లు ఎక్కువ క్వాలిటీ పిక్చర్ అందిస్తుందని కంపెనీ చెప్పింది. ఆండ్రాయిడ్ 8.0 సపోర్టుతో లభిస్తున్న 75 అంగుళాల స్ర్కీన్, బెజెల్ లెస్ డిస్ప్లే ప్రధాన ఆకర్షణ. ఇంకా 3840x2160 పీక్సెల్స్ రిజల్యూషన్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, ఎక్స్1 అల్టిమేట్ పిక్చర్ ప్రాసెసర్, ఫుల్ అర్రే లోకల్ డిమ్మింగ్ బ్యాక్లైట్, అల్ట్రా వైడ్ వ్యూయింగ్ యాంగిల్, నెట్ఫ్లిక్స్ కాలిబ్రేటెడ్ మోడ్, 16 జీబీ స్టోరేజ్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. -
బడ్జెట్ ధరలో షావోమి ఎంఐ స్మార్ట్టీవీ
సాక్షి, న్యూఢిల్లీ : చైనా దిగ్గజ కంపెనీ షావోమి నోట్ సిరీస్ స్మార్ట్ఫోన్లతో పాటు మరో స్మార్ట్టీవీని కూడా లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత 32 అంగుళాల స్మార్ట్ టీవీని గురువారం ఆవిష్కరించింది. ఎంఐ ఎల్ఈడీ 4ఏ ప్రో పేరుతో దీన్ని తీసుకొచ్చింది. దీని ధరను రూ.12,999గా నిర్ణయించింది. మార్చి 7వ తేదీనినుంచి మై హోం, ఎంఐ.కాం, ఫ్లిప్కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుందని షావోమి వెల్లడించింది. ఎంఐ ఎల్ఈడీ 4ఏ ప్రో ఫీచర్లు 32 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 1366 x 768 పిక్సెల్స్ రిజల్యూషన్ 1జీబీ ర్యామ్, 8ఈ ఎంఎంసీ స్టోరేజ్ లేటెస్ట్ అమ్లోజిక్ 64బిట్ ప్రాసెసర్ విత్ 7వ జనరేషన్ ఇమేజింగ్ ఇంజీన్ గూగుల్ అసిస్టెంట్, బ్లూ టూత్, ఎంఐ రిమోట్ Here’s the all-new #MiLEDTV4APRO32 for you. At just ₹12,999. Goes on sale on https://t.co/cwYEXeds6Y, @flipkart and Mi Home on 7th March at 12 noon. pic.twitter.com/uEDWq0A7Uf — Redmi India (@RedmiIndia) February 28, 2019 -
ఆండ్రాయిడ్ యూజర్లకు జియో కొత్త యాప్
సాక్షి, న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ యూజర్లకోసం రిలయన్స్ జియో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. గ్రూపు కాలింగ్ లేదా గ్రూపు టాక్ అవకాశాన్ని కల్పించనుంది. ఇందుకు కోసం గూగుల్ యాప్ స్టోర్లో ఒక కొత్త అప్లికేషన్ను అందిస్తోంది. దీని ప్రకారం జియో సిమ్ వాడుతున్న ఆండ్రాయిడ్ వినియోగదారులు ఒకేసారి పది మందితో కాన్ఫరెన్స్ కాల్ (ఆడియో మాత్రమే) ద్వారా మాట్లాడుకోవచ్చు. ఇందులో లెక్చర్ మోడ్, మ్యూట్ పార్టిసిపెంట్ లాంటి ఇతర ఫీచర్లను కూడా జోడించింది. ప్రస్తుతం పరీక్షల్లో ఉన్న ఈ యాప్ను అతి త్వరలోనే జియో కస్టమర్లకు అందించనుంది. -
మరో వివాదంలో ఫేస్బుక్
‘నాకు ఫేస్బుక్ అకౌంట్ లేదు. కాబట్టి నా వివరాలేవీ వాళ్లకు తెలియవు’ అన్న ధీమాలో మీరుంటే పొరపాటు పడ్డట్టే! మీకు ఫేస్బుక్ ఖాతా లేకపోయినా, మీ ఆండ్రాయిడ్ ఫోన్లో వాడే ఇతర యాప్ల ద్వారా మీ గుట్టంతా ఆటోమేటిక్గా ఫేస్బుక్కు వెళ్లిపోతోందట. బ్రిటన్కు చెందిన ప్రైవసీ ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ సంచలన విషయాన్ని బయటపెట్టింది. సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు అనేక యాప్స్ను వాడుతుంటారు. వాళ్లు ఏ యాప్ను ఓపెన్ చేసినా వారి సమాచారం అంతా ఆటోమేటిక్గా ఫేస్బుక్కు చేరిపోతోందని ఈ అధ్యయనంలో తేలింది. ఫేస్బుక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్(ఎస్డీకే) ద్వారా ఈ యాప్ డెవలపర్లు యూజర్ల సమాచారాన్ని ఫేస్బుక్తో పంచుకుంటున్నారు. గతేడాది ఆగస్టు–డిసెంబర్ నెలల మధ్య కోటి నుంచి 50 కోట్లమంది యూజర్లు వాడుతున్న 34 యాప్లను పరిశీలించిన అనంతరం ప్రైవసీ ఇంటర్నేషనల్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ జాబితాలో డ్యుయోలింగో, ట్రిప్ అడ్వైజర్, ఇన్డీడ్, స్కైస్కానర్ వంటి యాప్లు ఉన్నాయి. ఈ యాప్లు ప్రధానంగా ఎలాంటి సమాచారాన్ని ఫేస్బుక్కు అందజేస్తున్నాయో కూడా ఈ సంస్థ విశ్లేషించింది. 61 శాతం యాప్స్ను యూజర్లు ఓపెన్చేయగానే వారి సమాచారం ఫేస్బుక్కు చేరిపోతుందని తెలిపింది. ఈ యాప్స్ పంపిన సమాచారాన్ని గూగుల్ అడ్వర్టైజింగ్ ఐడీ ద్వారా ఇతరులు పంచుకుంటున్నారని వెల్లడించింది. ఈ సమాచారం ఆధారంగా ప్రకటనకర్తలు యూజర్ల ప్రొఫైల్స్ను రూపొందించి వారికి అనుకూలమైన, ఆసక్తి కలిగించే ప్రకటనలు ఇస్తున్నారని పేర్కొంది. జర్మనీలోని లీపింగ్లో జరిగిన కాస్ కంప్యూటర్ కాంగ్రెస్లో ప్రైవసీ ఇంటర్నేషనల్ ఈ నివేదికను సమర్పించింది. ఇదంతా మామూలే: ఫేస్బుక్ ప్రైవసీ ఇంటర్నేషనల్ నివేదికపై ఫేస్బుక్ స్పందించింది. యూజర్ల సమాచారాన్ని కంపెనీలు పంచుకోవడమన్నది చాలా మామూలు విషయమని తెలిపింది. దీనివల్ల వినియోగదారులతో పాటు కంపెనీలకు కూడా లాభం చేకూరుతుందని వెల్లడించింది. ఈ సమాచారం ఆధారంగా డెవలపర్లు తమ యాప్ను మరింత బాగా తయారుచేయగలరంది. -
ఆ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు
న్యూఢిల్లీ: కొన్ని నిర్థారిత ప్లాట్ఫామ్స్కు రేపటి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్టు వాట్సప్ ప్రకటించింది. ‘నోకియా ఎస్ 40’లో డిసెంబర్ 31 తర్వాత వాట్సప్ పనిచేయదు. ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్ 2.3.7తో పాటు దాని కంటే పాత ఓఎస్లో కూడా వాట్సప్ రాదు. భవిష్యత్తులో తాము ప్రవేశపెట్టబోయే ఫీచర్లను పాత ఐఓఎస్ సపోర్ట్ చేయబోదని ఇంతకు వాట్సప్ తన బ్లాగ్లో పేర్కొంది. తమ సేవలు కొనసాగాలంటే ఓఎస్ 4.0 ప్లస్, ఐఓఎస్ 7 ప్లస్ లేదా విండోస్ ఫోన్ 8.1 ప్లస్కు అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.3.3 కంటే పాత ఓఎస్లో వాట్సప్ పనిచేయదు. విండోస్ ఫోన్ 7, ఐఫోన్ 3జీఎస్/ఐఓఎస్ 6, నోకియా సింబియన్ ఎస్ 60 వెర్షన్లలో కూడా వాట్సప్ రాదు. ఐఓఎస్ 7, పాత వెర్షన్లల్లోనూ 2020, ఫిబ్రవరి 1 నుంచి వాట్సప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఐఫోన్ 4, ఐఫోన్ 4ఎస్, ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ, ఐఫోన్ 5ఎస్.. ఐఓఎస్ 7 ఆధారంగా నడుస్తున్నాయి. ఆండ్రాయిడ్ రన్నింగ్ ఓఎస్ 4.0 ప్లస్, ఐఫోన్ రన్నింగ్ ఐఓఎస్ 8 ప్లస్, విండోస్ ఫోన్ 8.1 ప్లస్, జియో ఫోన్, జియో ఫోన్ 2లకు వాట్సప్ సేవలు కొనసాగుతాయి. అయితే ఈ ఫోన్లలో చాట్ హిస్టరీని ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం లేదని వాట్సప్ వెల్లడించింది. చాట్ హిస్టరీని ఈ-మెయిల్కు పంపుకోవచ్చని సూచించింది. -
వాట్సాప్లో మరో అదిరిపోయే ఫీచర్
ముంబై : యూట్యూబ్లోనే, ఫేస్బుక్లోనే మంచి వీడియోనో, సినిమానో చూస్తుంటాం.. సడెన్గా వాట్సాప్లో మెసెజ్ వస్తుంది. అప్పుడేం చేస్తాం.. వీడియోను పాస్ చేసి.. వాట్సాప్ ఓపెన్ చేసి రిప్లై ఇస్తాం. మళ్లీ యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియో చూడ్డం కంటిన్యూ చేస్తాం. ఇది ఇప్పటిదాకా పరిస్థితి. అదే ఐఫోన్ యూజర్లకైతే ఈ పరిస్థితి ఉందదు. వారు ఎంచక్కా వీడియోలను ఎంజాయ్ చేస్తూనే.. వాట్సాప్లో చాట్ చేస్తూంటారు. కానీ ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ సౌలభ్యం లేదు. కానీ ఇక మీదట అలా జరగదంటూన్నారు వాట్సాప్ అధికారులు. ఎందుకంటే ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కూడా ఈ అద్భుత ఫీచర్ని అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్. ‘పిక్చర్ ఇన్ పిక్చర్’ పేరిట నయా ఫీచర్ ఒకటి వాట్సాప్లోకి వచ్చేసింది. ఈ ఫీచర్ ద్వారా వీడియోలని మరో యాప్కి రీడైరెక్ట్ కాకుండానే వాట్సాప్లోనే ప్రత్యేక విండోలో చూసే అద్భుత అవకాశాన్ని యూజర్లందరికి కల్పించింది. దాంతో ఇతరులతో చాటింగ్ చేస్తూనే థర్డ్ పార్టీ యాప్స్ అయిన యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వీడియోలని వాట్సాప్లోనే ప్లే చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అయితే ప్లేస్టోర్లో వాట్సాప్ వర్షన్ 2.18.380కి అప్డేట్ చేసుకున్నవాళ్లు మాత్రమే ఈ ఫీచర్ను వాడుకోవచ్చు. గ్రూప్ చాట్, సింగిల్ చాట్లను కూడా ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తుందని వాట్సాప్ అధికారులు తెలిపారు. -
డేటా స్టోరేజీపై.. వాట్సాప్ గుడ్ న్యూస్
కాలిఫోర్నియా : ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్, సెర్చింజన్ దిగ్గజం గూగుల్లు డేటా స్టోరేజీ విషయంలో కొత్త అప్డేట్ తీసుకొచ్చాయి. వాట్సాప్ డేటా స్టోరేజీ విషయంలో తమ యూజర్లకు ఇబ్బందులు కలగకుండా వాట్సాప్, గూగుల్తో ఒప్పందం చేసుకుంది. కొత్త అప్డేట్తో గూగుల్ డ్రైవ్లో వాట్సాప్ డేటాను బ్యాకప్ చేస్తే గూగుల్ డ్రైవ్లోని స్టోరేజీని వాడుకోదు. వాట్సాప్ బ్యాకప్ డేటా మొత్తం గూగుల్ డ్రైవ్లో ప్రత్యేకంగా సేవ్ అవుతాయి. ఒక్కో అకౌంట్కు గూగుల్ డ్రైవ్లో 15 జీబీ డేటా ఉచితంగా వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం గూగుల్ డ్రైవ్ను వాట్సాప్ బ్యాకప్కి వాడితే ఈ 15 జీబీలో నుంచే స్టోరేజీని వాడేసుకునేది. ఈ ఏడాది నవంబర్ 12 నుంచి రానున్న కొత్త అప్డేట్తో వాట్సాప్ బ్యాకప్కి గుగుల్ డ్రైవ్లోని స్టోరేజీని వాడకుండా, ప్రత్యేకంగా వాట్సప్ డేటా స్టోర్ అవుతుంది. దీనికి సంబంధించి గూగుల్ డ్రైవ్తో వాట్సాప్ ఒప్పందం చేసుకుంది. వాట్సాప్ డేటాని గుగుల్ డ్రైవ్లో బ్యాకప్కి వాడితే ఎంత మేర డేటాను ఉచితంగా స్టోరేజీకి వాడుకొవొచ్చు అనే విషయంలో స్పష్టత రావాల్సిఉంది. అయితే కొత్త మార్పులతో ఏడాది, లేదా అంత కన్నా ఎక్కువ కాలం బ్యాకప్ అప్షన్ వాడనట్టయితే గూగుల్ డ్రైవ్లో ఇంతకు ముందు సేవ్ చేసిన వాట్సాప్ డేటా ఆటోమెటిక్గా డెలీట్ చేయనున్నట్టు వాట్సాప్ తెలిపింది. డేటా డెలీట్ కాకుండా ఉండాలంటే అక్టోబర్ 30 లోపు మ్యానువల్గా వాట్సప్ బ్యాకప్ చేసుకోవాలని వాట్సాప్ సూచించింది. గూగుల్ డ్రైవ్లో వాట్సాప్ బ్యాకప్ ఎలా చేయాలంటే.. ► ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయాలి ► మెనూలో క్లిక్ చేయాలి. ► సెట్టింగ్స్లో చాట్స్పై క్లిక్ చేయండి ►చాట్ బ్యాకప్ క్లిక్ చేయండి ► చాట్ హిస్టరీని సేవ్ చేయాలనుకున్న గూగుల్ అకౌంట్ని సెలక్ట్ చేసుకోండి(వీడియోలు కూడా బ్యాకప్ కావాలను కుంటే ఇన్క్లూడ్ వీడియోస్ క్లిక్ చేయండి) ► బ్యాకప్ నొక్కితే మీ వాట్సాప్లోని డేటా మొత్తం గూగుల్ డ్రైవ్ లో స్టోర్ అవుతుంది. వాట్సప్ డేటా బ్యాకప్ రెగ్యులర్గా చేసుకోవాలనుకుంటే అక్కడే అప్షన్స్(డెయిలీ, వీక్లీ, మంథ్లీ) కూడా ఉంటాయి. -
ఎంట్రీ లెవెల్ ఫోన్స్ కోసం ఆండ్రాయిడ్ 9 గో ఎడిషన్
శాన్ ఫ్రాన్సిస్కో: ఎంట్రీ లెవెల్ స్మార్ట్ఫోన్స్ కోసం గూగుల్ ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్లో ‘గో’ ఎడిషన్ను ఆవిష్కరించింది. మరింత స్టోరేజీతోపాటు మెరుగైన సెక్యూరిటీ ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. అదనంగా 500 ఎంబీ స్టోరేజీతో పాటు డేటా వినియోగాన్ని ఎప్పటికప్పుడు చూపించే డ్యాష్బోర్డ్ వంటి ఫీచర్స్ ఇందులో పొందవచ్చని ఆండ్రాయిడ్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ విభాగం డైరెక్టర్ సాగర్ కామ్దార్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఫోన్ వినియోగాన్ని సులభతరం చేసే ఆండ్రాయిడ్ 9 పై వెర్షన్ను గూగుల్ ఈ ఆగస్టులోనే ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. -
వెంటాడే గూగుల్ నిఘా
శాన్ఫ్రాన్సిస్కో: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మీపై నిఘా పెడుతోందా? మీరు వద్దన్నా సరే మీ రాకపోకలు, మేసేజ్లు అన్నింటిని రికార్డు చేస్తోందా? అంటే నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. తమ ప్రయాణ వివరాలు రికార్డు చేయవద్దని సెట్టింగ్స్ పెట్టినప్పటికీ గూగుల్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల సమాచార సేకరణను ఆపడంలేదు. అసోసియేటెడ్ ప్రెస్ జరిపిన పరిశోధనలో ఈ సంచలనాత్మక విషయం వెల్లడైంది. ఈ వివరాలను ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ పరిశోధకులకు పంపగా అనుమతి లేకుండా పౌరుల సమాచారాన్ని గూగుల్ సేకరిస్తోందని వారు ధ్రువీకరించారు. ‘గూగుల్ మ్యాప్స్’ వాడేటప్పుడు యూజర్ ఉన్న లొకేషన్ తెల్సుకునేందుకు అనుమతి ఇవ్వాలి. అలా చేస్తే ప్రజలు ఫోన్తో ఏ చోట్లకెళ్లారు? అక్కడ ఎంతసేపున్నారు? తదితర అంశాలను ఆటోమేటిక్గా రికార్డు చేస్తుంది. అయితే ఇది ఇష్టం లేని యూజర్ల కోసం ‘లొకేషన్ హిస్టరీ ఆప్షన్’ను ఆఫ్ చేసే సౌకర్యాన్ని గూగుల్ తెచ్చింది. దీన్నివాడితే యూజర్లు ఎక్కడున్నారో రికార్డు కాదని గూగుల్ చెప్పింది. తాజాగా పరిశోధకులు ఇది అబద్ధమని తేల్చారు. లొకేషన్ హిస్టరీ ఆప్షన్ ను నిలిపివేసినా కొన్ని గూగుల్యాప్స్ కస్టమర్లు ఎక్కడ, ఎంతసేపు ఉన్నారో రికార్డు చేస్తున్నాయని తేల్చారు. గూగుల్ మ్యాప్ యాప్ను ఒక క్షణం ఓపెన్ చేసినా స్క్రీన్ షాట్ ఆటోమేటిక్గా గూగుల్ తీసేసుకుంటోందని పరిశోధకులు తెలిపారు. ఆటోమేటిక్గా వాతావరణం గురించి చెప్పే యాప్స్ కూడా యూజర్లు ఎక్కడ ఉన్నారన్న సమాచారాన్ని గూగుల్కు పంపిస్తూనే ఉంటాయి. లొకేషన్కు సంబంధం లేని మరికొన్ని యాప్స్ అయితే కేవలం 30 సెం.మీ కచ్చితత్వంతో ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారుల సమస్త సమాచారాన్ని గూగుల్కు అందజేస్తున్నాయి. 200 కోట్ల మందికి పైగా ఉన్న ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారుల సమాచారాన్ని గూగుల్ రికార్డు చేసిందన్నారు. వినియోగదారుల అనుమతి లేకుండా గూగుల్ వారి సమాచారాన్ని దొంగతనంగా సేకరించిందని ప్రిన్స్టన్ వర్సిటీకి చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త జొనాథన్ మేయర్ తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు వేర్వేరు మార్గాల్లో తాము యూజర్ల సమాచారాన్ని సేకరిస్తామని గూగుల్ ప్రతినిధి చెప్పారు. యూజర్లు myactivity.google.com ద్వారా తమ సెర్చింగ్లు, ఇతర వివరాలను చూసుకోవచ్చు. -
ఆండ్రాయిడ్ ‘పై’ వచ్చేసింది
న్యూఢిల్లీ: టెక్నాలజీ ప్రియులకు గూగుల్ తీపి కబురు తెచ్చింది. తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)లో కొత్త వెర్షన్ ‘పై’ను మంగళవారం ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్ ఓఎస్ సిరీస్లో ఇది తొమ్మిదవది. ప్రస్తుతం ‘ఓరియో’ ఓఎస్ను ఎక్కువగా స్మార్ట్ఫోన్లలో వినియోగిస్తున్నారు. సమాచార గోప్యత(ప్రైవసీ)కు సంబంధించి మరిన్ని మెరుగైన ఫీచర్లతో పాటు పలు అధునాతన అంశాలను కొత్త ఓఎస్లో జతచేసినట్లు గూగుల్ పేర్కొంది. ముఖ్యంగా ‘పై’ ఓఎస్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సామర్థ్యం అత్యంత ముఖ్యమైనదిగా చెబుతోంది. ఇటీవలి కాలంలో మొబైల్స్ ఇతరత్రా స్మార్ట్ పరికరాల్లో సమాచార గోప్యత లోపాలపై భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గూగుల్ నూతన ఓఎస్లో ప్రైవసీకి పెద్దపీట వేయడం గమనార్హం. కాగా, గూగుల్ పిగ్జెల్ మొబైల్ యూజర్లకు త్వరలోనే ‘పై’ ఓఎస్ ఆన్లైన్ అప్డేట్ అందుబాటులోకి రానుంది. సోనీ మొబైల్, షావొమీ, హెచ్ఎండీ గ్లోబల్, ఒపో, విపో, వన్ ప్లస్ తదితర మొబైల్ తయారీ కంపెనీలతో పాటు ఆండ్రాయిడ్ వన్ యూజర్లకు ఈ ఏడాది చివరికల్లా ‘పై’ అప్డేట్ లభ్యమవుతుందని గూగుల్ తన బ్లాగ్లో వెల్లడించింది. ఆండ్రాయిడ్ 9 ‘పై’తో కొత్త మొబైల్స్ను విడుదల చేసే విధంగా తయారీ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. మీకేం కావాలో చెప్పేస్తుంది... ఆండ్రాయిడ్ ‘పై’.. మొబైల్ వాడకాన్ని మరింత స్మార్ట్గా మార్చేస్తుందని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ (ప్రొడక్ట్ మేనేజ్మెంట్, ఆండ్రాయిడ్, గూగుల్ ప్లే) సమీర్ సామత్ పేర్కొన్నారు. మొబైల్ యూజర్ వివిధ అప్లికేషన్లను వాడే విధానాన్ని ఆండ్రాయిడ్ ‘పై’లోని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు గుర్తించి.. తదనుగుణంగా సూచనలు, సలహాలను అందిస్తుందని చెప్పారు. అంటే... అప్పుడున్న పరిస్థితుల్లో మీకేం కావాలో మీ మొబైల్ మీకు ఊహించి చెప్పేస్తుందన్న మాట!! అదే విధంగా ఇందులోని అడాప్టివ్ బ్యాటరీ ఫీచర్ కూడా మీరు ఎక్కువగా వాడే యాప్స్ను గుర్తుంచుకొని.. వాటికి మాత్రమే బ్యాటరీ పవర్లో ప్రాధాన్యం ఇస్తుంది. ఇంకా అడాప్టివ్ బ్రైట్నెస్ పీచర్.. వివిధ సెట్టింగ్స్కు మీరు ఎంత స్క్రీన్ వెలుగు(బ్రైట్నెస్)ను కోరుకుంటారో గుర్తించి... ఆటోమేటిక్గా ఆ మేరకు సర్దుబాటు చేస్తుంది. అంతేకాదు కొత్త డ్యాష్బోర్డును కూడా గూగుల్ చేర్చింది. మీరు మీ డివైజ్పై దేనికి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారో ఇది ఇట్టే చెప్పేస్తుంది. -
ఆండ్రాయిడ్ వాట్సాప్లో ‘పిక్చర్ టు పిక్చర్’
వాషింగ్టన్: ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ మరో ఫీచర్ను తీసుకురానుంది. ‘పిక్చర్ టు పిక్చర్’ మోడ్ను అండ్రాయిడ్ ఫోన్లకూ అందుబాటులోకి తేనుంది. ఈ ఫీచర్ సాయంతో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూస్తూనే వీడియో కాల్ మాట్లాడొచ్చు. వీడియో కాల్ మాట్లాడుతూనే సందేశాలు పంపవచ్చు. వీడియోలు చూసేటప్పుడు, మెసేజ్లు పంపేటప్పుడు వీడియో కాల్ స్క్రీన్ చిన్నదిగా మారి ఫోన్లో కుడివైపుకొస్తుంది. వీడియో కాల్ మాట్లాడుతూ యాప్లను చెక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్కు ప్రస్తుతం తుది పరీక్షలు నిర్వహిస్తున్నామనీ, త్వరలో మార్కెట్లోకి తెస్తామని వాట్సాప్ తెలిపింది. -
ఆ నెంబర్ మా పొరపాటే : గూగుల్
స్మార్ట్ఫోన్ యూజర్ల ప్రమేయం లేకుండా.. వారి కాంటాక్ట్ లిస్ట్లోకి కొత్తగా జతచేరిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) టోల్ఫ్రీ హెల్ప్లైన్ నెంబర్... ఎక్కడ నుంచి వచ్చిందని యూజర్లు తలబద్దలు కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇది తమ తప్పిదం కాదని యూఐడీఏఐ తేల్చేసింది. అయితే ఈ పని ఎవరు చేశారంటూ అని అనుకుంటుండగా.. సెర్చింజన్ దిగ్గజం గూగుల్ అనూహ్య ప్రకటన చేసింది. ఆండ్రాయిడ్ యూజర్ల ఫోన్లోకి వచ్చిన యూఐడీఏఐ టోల్ఫ్రీ నెంబర్ తమ తప్పిదమేనని గూగుల్ ప్రకటించింది. తమ సిబ్బంది అజాగ్రత్త కారణంగానే ఈ తప్పిదం చోటుచేసుకున్నట్లు ప్రకటించింది. దీనిపై గూగుల్, ఆండ్రాయిడ్ యూజర్లకు క్షమాపణలు చెప్పింది. కోడింగ్ తప్పిదం కారణంగా పాత టోల్ ఫ్రీ నంబర్ 1800-300-1947తో పాటు ఎమర్జెన్సీ నంబర్ 112 యూజర్ల సెటప్ విజార్డ్లోకి చేరిపోయాయని గూగుల్ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే ఇది తాము ఏ ఆండ్రాయిడ్ డివైజ్లలోకి అనధికారికంగా చొరబడాలని చేసింది కాదని స్పష్టంచేసింది. యూజర్లు తమ డివైజ్ల నుంచి ఈ నెంబర్ను మాన్యువల్గా డిలీట్ చేయొచ్చని పేర్కొంది. కాగ, ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కాంటాక్ట్ లిస్టులో ఎవరి ప్రమేయం లేకుండా యూఐడీఏఐ టోల్ఫ్రీ నెంబర్ జతచేరిన విషయం తెలిసిందే. ఆ నెంబర్ వేలాది ఫోన్లలో శుక్రవారం కనిపించింది. దీంతో కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు. నెంబర్ను ఫోన్లో సేవ్ చేయకుండానే కాంటాక్ట్ లిస్టులోకి ఎలా వచ్చిందా అని ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు టెన్షన్ పడ్డారు. ఓ వ్యక్తి తన కాంటాక్ట్ లిస్టును స్క్రీన్షాట్ తీసి ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. అప్పటికీ ఈ గందరగోళంపై యూఐడీఏఐ ఇది అసలు తమ వాలిడ్ నెంబర్ కాదంటూ తేల్చేసింది. తమ టోల్ఫ్రీ నెంబర్ 1947 అని, రెండేళ్లకు పైగా దీన్నే వాడుతున్నామని ప్రకటించింది. -
ఫోన్లో డీఫాల్ట్గా ఆధార్ టోల్ ఫ్రీ నంబర్
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆధార్ టోల్ ఫ్రీ నంబర్ 1800–300–1947 డీఫాల్ట్గా చేరింది. తమ ప్రమేయం లేకుండా ఫోన్ల కాంటాక్ట్ లిస్ట్లో టోల్ ఫ్రీ నంబర్ను చేర్చడం ఏంటని ప్రజలు సోషల్మీడియాలో మండిపడ్డారు. కాగా ఆండ్రాయిడ్ ఫోన్లలో సేవ్ చేసిన పాత ఆధార్ నంబర్ 1947 కూడా 1800–300–1947గా మారింది. ఈ తతంగాన్ని ఫ్రెంచ్ ఎథికల్ హ్యాకర్ ఇలియట్ గుర్తించారు. వెంటనే ‘హాయ్ యూఐడీఏఐ. ఆధార్ ఉన్న, లేనివారు, ఎంఆధార్ను ఇన్స్టాల్ చేసుకున్న, చేసుకోని వారు ఇలా అందరి ఫోన్లలోకి టోల్ఫ్రీ నంబర్ వచ్చింది. దీనిపై ప్రజలకు సమాచారమే లేదు. ఎందుకో చెబుతారా?’ అని ట్వీట్ చేశారు. కాగా, ఆధార్ టోల్ ఫ్రీ నంబర్ను ఫోన్లలో చేర్చాల్సిందిగా తాము ఏ మొబైల్ తయారీ సంస్థను, సర్వీస్ప్రొవైడర్ను కోరలేదని యూఐడీఏఐ తెలిపింది. తాము ఆధార్ టోల్ ఫ్రీ నంబర్ 1947ను మార్చలేదనీ, ప్రస్తుతం దీన్నే వాడుతున్నామని స్పష్టం చేసింది. మరోవైపు తమ సిబ్బంది అజాగ్రత్త కారణంగానే ఈ తప్పిదం చోటుచేసుకున్నట్లు ప్రకటించిన గూగుల్ యూజర్లను క్షమాపణలు తెలిపింది. కోడింగ్ తప్పిదం కారణంగా పాత టోల్ ఫ్రీ నంబర్ 1800–300–1947తో పాటు ఎమర్జెన్సీ నంబర్ 112 యూజర్ల సెటప్ విజార్డ్లోకి చేరిపోయాయని వెల్లడించింది. -
వాట్సాప్ సరికొత్త ఫీచర్ : ఆండ్రాయిడ్స్లోకి...
న్యూఢిల్లీ : ఫేస్బుక్కు చెందిన వాట్సాప్ తన యూజర్లకు ఎప్పడికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ అలరిస్తూ ఉంది. తాజాగా మరో ఆసక్తికర ఫీచర్ను ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఐఓఎస్ ఎక్స్క్లూజివ్ ఫీచర్గా ఉన్న ‘పిక్చర్-టూ-పిక్చర్ మోడ్’ ఫీచర్ను వాట్సాప్ ఎట్టకేలకు ఆండ్రాయిడ్ యూజర్లకు ప్రవేశపెడుతోంది. వాట్సాప్లోనే వీడియోను చూసుకునేలా ఈ ఫీచర్ను ప్రవేశపెడుతున్నట్టు డబ్ల్యూఏబీటా ఇన్ఫో రిపోర్టు చేసింది. కంపెనీ మీ చాట్ అనుభవాన్ని ఎలాంటి అవాంతరం కలిగించకుండా.. వీడియో ప్లే చేసుకునేందుకు ఒక పాప్-అప్/ ఫ్లోటింగ్ విండోను జోడిస్తుంది. గూగుల్ ప్లే బీటా ప్రొగ్రామ్లో కంపెనీ ఇప్పటికే తన అప్డేట్ను సమర్పించింది. ఈ అప్డేట్లో ఆండ్రాయిడ్ పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ ఫీచర్కు సపోర్టు చేస్తుంది. యాప్కు ఈ ఫీచర్ను యాడ్ చేస్తే, ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సాప్లో వచ్చిన వీడియో కోసం ప్లే ఐకాన్ను క్లిక్ చేసుకుని చూడొచ్చు. అదేవిధంగా చాట్ను కూడా నేవిగేట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోలకు పనిచేయనుంది. ఇదే ఫీచర్ ఇప్పటికే ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. మరోవైపు ఇప్పటికే యూట్యూబ్ వీడియోలను యాప్లోనే చూసుకునేలా వాట్సాప్ యూజర్లకు అనుమతి ఇస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ ఫీచర్ను తీసుకొచ్చింది. ఇటీవలే గ్రూప్ వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్ను ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. గత రెండేళ్లుగా వాట్సాప్ యూజర్లు వాయిస్, వీడియో కాల్స్తో ఎంజాయ్ చేస్తున్నారు. రోజుకు 200 కోట్ల నిమిషాల కాల్స్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాయిస్, వీడియో కాల్స్కు మరింత డిమాండ్ను పెంచేందుకు గ్రూప్ కాలింగ్ ఫీచర్ను ప్రవేశపెట్టినట్టు వాట్సాప్ తెలిపింది. -
వాట్సాప్లో మరో అద్భుత ఫీచర్
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో మరో అద్భుత ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ గ్రూప్ కాలింగ్ ఫీచర్ వాయిస్, వీడియో రెండింటికీ సపోర్ట్ చేస్తూ ఎట్టకేలకు లైవ్గా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇకపై యూజర్లు గ్రూప్ వీడియో, వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ గురించి వాట్సాప్ గతేడాది అక్టోబర్లోనే సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో ఫేస్బుక్ తను యాన్యువల్ ఎఫ్8 డెవలపర్ కాన్ఫరెన్స్లో వాట్సాప్ గ్రూప్ కాలింగ్ ఫీచర్ను ప్రకటించింది. ఈ కొత్త వాట్సాప్ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చినట్టు ఆ కంపెనీ ప్రకటించింది. వాట్సాప్ ప్రవేశపెట్టిన ఈ గ్రూప్ వీడియో, వాయిస్ కాలింగ్ ఫీచర్ సహాయంతో ఒకేసారి నలుగురు గ్రూప్ వీడియో, వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. అయితే ముందుగా ఇద్దరు యూజర్లు వన్ టు వన్ వీడియో చాటింగ్ మొదలు పెట్టాలి. అనంతరం ఇద్దరు యూజర్లను అందులోకి యాడ్ చేయాలి. దీంతో గ్రూప్ వీడియో, వాయిస్ కాలింగ్ సాధ్యపడుతుంది. రోజుకు 2 బిలియన్ పైగా నిమిషాలను కాల్స్కు వాట్సాప్ యూజర్లు వెచ్చిస్తున్నట్టు ఆ కంపెనీ తెలిపింది. వాట్సాప్ వీడియో కాల్స్ ఫీచర్ను 2016 నుంచి అందుబాటులోకి తెచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తులకు మాత్రమే ఇది సపోర్టు చేస్తూ వచ్చింది. తక్కువ నెట్వర్క్ ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ కొత్త ఫీచర్ పనిచేయనుందని వాట్సాప్ తెలిపింది. అదనంగా మెసేజస్ మాదిరి ఈ కాల్స్ కూడా ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్ట్ అయి ఉంటాయని పేర్కొంది. వాట్సాప్ గ్రూప్ వీడియో, వాయిస్ కాలింగ్ ఫీచర్ కోసం.. ఈ యాప్కు చెందిన అప్డేటెడ్ వెర్షన్ను ఇన్స్టాల్ చేసుకుంటే ఈ ఫీచర్ను యూజర్లు పొందవచ్చు. గ్రూప్ కాల్ చేయాలంటే, తొలుత ఒక యూజర్తో వీడియో, వాయిస్ కాల్ ప్రారంభించాలి. ఆ తర్వాత పైన కుడివైపు ఉన్న యాడ్ పార్టిసిపెంట్ బటన్ను ట్యాప్ చేయాలి. ఇతర యూజర్లను కూడా గ్రూప్ వీడియో/వాయిస్ కాల్కి ఆహ్వానించవచ్చు. -
నోకియా 3.1 విడుదల
న్యూఢిల్లీ: ఫిన్లాండ్కు చెందిన నోకియా బ్రాండ్ ఫోన్స్ విక్రయ సంస్థ హెచ్ఎమ్డీ గ్లోబల్ గురువారం భారత మార్కెట్లో నోకియా 3.1 ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ను విడుదలచేసింది. 13 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ కెమోరా, 5.2 అంగుళాల హెచ్డీ డిస్ప్లే (2.5డీ కర్వుడ్) కలిగిన ఈ ఫోన్ ధర రూ.10,499గా నిర్ణయించినట్లు తెలిపింది. మీడియా టెక్ 6750 చిప్సెట్తో నడిచే ఈ స్మార్ట్ఫోన్ జులై 21 (శనివారం) నుంచి నోకియా డాట్ కామ్/ఫోన్స్, పేటీఎమ్ మాల్, రిటైలర్ల ద్వారా అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. ఆండ్రాయిడ్ వన్ ఓఎస్ ఆధారంగా ఈ ఫోన్ పనిచేస్తుందని తెలిపింది. -
గూగుల్కి 5 బిలియన్ డాలర్లు జరిమానా
బ్రసెల్స్: టెక్నాలజీ దిగ్గజం గూగుల్కి యూరోపియన్ యూనియన్(ఈయూ) కాంపిటీషన్ కమిషన్ భారీ షాకిచ్చింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ సిస్టమ్ ఆధిపత్య దుర్వినియోగ ధోరణులకు గాను 4.3 బిలియన్ యూరోల (5 బిలియన్ డాలర్లు) జరిమానా విధించింది. సొంత సెర్చ్ ఇంజిన్, బ్రౌజర్ వినియోగాన్ని పెంచేందుకు స్మార్ట్ఫోన్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఆధిపత్యం ఉన్న ఆండ్రాయిడ్ను గూగుల్ ఉపయోగించుకుందని ఈయూ కాంపిటీషన్ కమిషనర్ మార్గరెట్ వెస్టాజర్ పేర్కొన్నారు. గతంలో మరో కేసులో గూగుల్పై ఈయూ కమిషన్ విధించిన పెనాల్టీకి తాజా జరిమానా రెట్టింపు కావడం గమనార్హం. ఉత్పత్తులను పోల్చి చూపే సర్వీసులను అందించడంలో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 2017లో గూగుల్పై ఈయూ కమిషన్ 2.4 బిలియన్ యూరోల జరిమానా విధించింది. ఈయూ దేశాల నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను పెంచడం ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన తరుణంలో గూగుల్పై ఈయూ కమిషన్ రికార్డు స్థాయిలో జరిమానా విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దిగుమతి సుంకాల వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో చర్చించేందుకు యూరోపియన్ కమిషన్ చీఫ్ జాన్ క్లాడ్ జంకర్ మరో వారంలో అమెరికా వెళ్లనున్న తరుణంలో ఈ ఉత్తర్వులు రావడం గమనార్హం. ఈయూ నిబంధనల ప్రకారం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ వార్షికాదాయంలో 10 శాతం దాకా జరిమానా విధించవచ్చు. గతేడాది ఆల్ఫాబెట్ ఆదాయం 110.9 బిలియన్ డాలర్లు. ఆరోపణలు ఇవీ..: ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధిపత్య దుర్వినియోగానికి సంబంధించి గూగుల్పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ప్రాచుర్యంలో ఉన్న కొన్ని గూగుల్ యాప్స్లకు లైసెన్సు తీసుకోవాలంటే ఆయా స్మార్ట్ఫోన్స్లో క్రోమ్ బ్రౌజర్తో పాటు తమ సెర్చి ఇంజిన్ను ఇన్స్టాల్ చేయాల్సిందేనంటూ శాంసంగ్ వంటి హ్యాండ్సెట్ తయారీ సంస్థలకు గూగుల్ షరతులు విధిస్తోందని అభియోగాలు ఉన్నాయి. దీనివల్ల సదరు డివైజ్లను కొనుగోలు చేసిన వారు ప్రీ–ఇన్స్టాల్డ్ గూగుల్ క్రోమ్ బ్రౌజరు, సెర్చి ఇంజిన్లే ఉపయోగిస్తూ మిగతా వాటి వైపు చూడటం లేదని.. ఆ రకంగా పోటీ సంస్థలను తొక్కేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. అలాగే, ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ కోడ్ ఆధారిత పోటీ ఆపరేటింగ్ సిస్టమ్స్తో హ్యాండ్సెట్స్ను ఉత్పత్తి చేయకుండా కంపెనీలను కూడా గూగుల్ అడ్డుకుంటోందంటూ ఏప్రిల్లో ఫిర్యాదు నమోదైంది. తమ డివైజ్లలో గూగుల్ సెర్చిని ఇన్స్టాల్ చేసే తయారీ సంస్థలు, మొబైల్ ఆపరేటర్లకు గూగుల్ ‘ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు’ కూడా అందిస్తోంది. ఈ స్థాయి ప్రోత్సాహకాలు ఇవ్వలేని పోటీ సంస్థలకు ఇది ప్రతికూలంగా ఉంటోంది. యూరోపియన్ యూనియన్లో మొత్తం 28 దేశాలు ఉన్నాయి. సిలికాన్ వేలీ దిగ్గజాలపై వెస్టాజెర్ పోరు.. యూరోపియన్ యూనియన్ కాంపిటీషన్ కమిషనర్గా గత నాలుగేళ్లుగా వెస్టాజెర్ పలు సిలికాన్ వేలీ టెక్నాలజీ దిగ్గజాలపై పోరు కొనసాగిస్తున్నారు. దీనికి యూరప్లో మంచి పేరే వచ్చినప్పటికీ .. అమెరికాకు మాత్రం ఆమె కంటగింపుగా మారారు. గూగుల్ షాపింగ్ ఫైల్స్, ఆండ్రాయిడ్ దుర్వినియోగంపై జరిమానాలు పక్కన పెడితే.. యాడ్సెన్స్ అడ్వర్టైజింగ్ వ్యాపారంపై కూడా ప్రస్తుతం ఈయూ కమిషన్ విచారణ జరుపుతోంది. మరోవైపు, వివాదాస్పద డీల్తో ఎగవేసిన పన్నులకు సంబంధించి ఐర్లాండ్కు 13 బిలియన్ యూరోలు చెల్లించాలంటూ 2016లో యాపిల్ను ఈయూ కమిషన్ ఆదేశించింది. అటు అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్లకు కూడా ఇలాంటి జరిమానాలు తప్పలేదు. -
ఆండ్రాయిడ్ పీ అప్డేట్తో నోకియా ఫోన్లు?
సాక్షి, న్యూఢిల్లీ: హెచ్ఎండీ గ్లోబల్ భాగస్వామ్యంతో మార్కెట్లో రీ ఎంట్రీ ఇచ్చిన నోకియా స్మార్ట్ఫోన్లు మరో అడుగు ముందుకు వేశాయి. 2018 ఆగస్టునుంచి లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్డేటెట్ వెర్షన్తో రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. రాబోయే అన్ని నోకియా ఫోన్లు ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ ‘పి’ తో రాబోతున్నాయని హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించినట్టుగా వార్తలు వెలువడ్డాయి. ఈ అప్డేట్కు సంబంధించిన ఈ మెయిల్ సంభాషణ లీక్ అయింది. అలాగే నోకియా ప్రతినిధికూడా అనధికారికంగా ఈ అప్డేట్ను దృవీకరించినట్టు సమాచారం. అయితే ఇప్పటివరకు కొత్త ఆపరేటింగ్ సిస్టం గురించి ఎటువంటి సమాచారం లేకపోయినా ఆగస్టుమాసంలో ఆడ్రాయిడ్ పితో రాబోతుందన్న పుకార్లు భారీగా షికారు చేస్తున్నాయి. 2017లో నోకియా స్మార్ట్ ఫోన్లను తిరిగి మార్కెట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో నోకియా 2, నోకియా 3, నోకియా 5 స్మార్ట్ఫోన్లను మార్కెట్ లో లాంచ్ చేసింది. -
గూగుల్ మెసేజస్ వెబ్పైకి వచ్చేసింది..
వాట్సాప్, ఫేస్బుక్లకు పోటీగా.. గూగుల్ మెసేజస్ ప్లాట్ఫామ్ను మరింత అప్డేట్ చేసింది. తాజాగా గూగుల్ మెసేజస్ను స్మార్ట్ఫోన్లో మాత్రమే కాక, వెబ్ ద్వారా కూడా చేసుకునేలా అవకాశం కల్పించింది. ఆండ్రాయిడ్ మెసేజస్ ఫర్ వెబ్ను ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ఆవిష్కరించినట్టు గూగుల్ వెల్లడించింది. గత వారం నుంచే దీన్ని గూగుల్ మార్కెట్లోకి ఆవిష్కరించడం ప్రారంభించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇది అందుబాటులోకి వచ్చేసిందని గూగుల్ ప్రకటించింది. దీంతో మీరు కంప్యూటర్ల మీద పనిచేస్తున్నప్పుడు యాప్తో పనిలేకుండా వెబ్బ్రౌజర్ నుంచే మీ ఫోన్ కాంటాక్ట్లకు మెసేజ్లు పంపించుకోవచ్చని తెలిపింది. అయితే దీని కోసం స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఆండ్రాయిడ్ మెసేజస్ యాప్ లేటెస్ట్ వెర్షన్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. లేటెస్ట్ అప్డేట్తో ఆండ్రాయిడ్ మెసేజ్ యాప్ యూజర్లు, అన్ని మెసేజ్లు, సంభాషణలను తమ వ్యక్తిగత కంప్యూటర్లలో యాక్సస్ చేసుకోవచ్చు. ఈ ఆండ్రాయిడ్ మెసేజస్ ఫర్ వెబ్ అచ్చం వాట్సాప్ వెబ్ మాదిరిగానే ఉంది. కాగ, వాట్సాప్ వెబ్ 2015లో యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ మెసేజస్ ఫర్ వెబ్ ఎలా ఉపయోగించాలి... తొలుత ఆండ్రాయిడ్ మేసేజస్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి మీ స్మార్ట్ఫోన్లో ఇన్స్టాల్ చేయాలి అలాగే కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో క్రోమ్, ఫైర్బాక్స్, ఒపెరా, యాపిల్ సఫారీ బ్రౌజర్లలో ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసి ఉండాలి ఫోన్లో ఆండ్రాయిడ్ మెసేజ్ యాప్ను ఓపెన్ చేసుకోవాలి యాప్ హోం పేజీలో కుడివైపు పైన కనిపించే మూడు డాట్స్ను క్లిక్ చేయాలి మోర్ ఆప్షన్స్ మెనూను టాప్ చేసి, మెసేజస్ ఫర్ వెబ్ను ఎంపిక చేసుకోవాలి మెసేజస్ ఫర్ వెబ్ను ఎంపిక చేసుకున్నాక వచ్చిన పేజీలో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకోవాలి పేజీ లోడ్ అయ్యాక, మీరు మెసేజ్లు చూసుకోవచ్చు, సెండ్ చేసుకోవచ్చు. -
ఆ ఫోన్లకు వాట్సాప్ బంద్
ఇన్స్టాంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్గా వాట్సాప్ ఎంతో ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఈ మధ్యన ఈ యాప్ కొన్ని ఫోన్లకు పనిచేయకుండా పోతోంది. బ్లాక్ బెర్రీ ఓఎస్, బ్లాక్ బెర్రీ 10, విండోస్ ఫోన్ 8.0, అంతకంటే పాత వాటికి వాట్సాప్ పనిచేయడం గతేడాది చివరి నుంచి ఆగిపోయింది. నోకియా ఎస్40 డివైజ్లకు కూడా ఈ ఏడాది చివరి వరకు ఆగిపోనుంది. తాజాగా మరికొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లకు కూడా వాట్సాప్ పనిచేయదట. ఆండ్రాయిడ్ జింజర్బ్రెడ్ ఆధారిత స్మార్ట్ఫోన్లకు కూడా 2020 ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్ ఆగిపోనుందని తెలుస్తోంది. ఈ జింజర్బ్రెడ్ లేదా వెర్షన్ 2.ఎక్స్.ఎక్స్ యూజర్లకు తొలుత 2010లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వెర్షన్ వాడే వారు 3.9 మిలియన్ మంది యూజర్లున్నారు. అంటే మొత్తం ఆండ్రాయిడ్ యూజర్లలో 0.3 శాతం మంది. అదనంగా ఐఓఎస్7 డివైజ్లకు కూడా ఇదే తేదీ నుంచి వాట్సాప్ సపోర్టు చేయదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆండ్రాయిడ్ జింజర్బ్రెడ్ ఉన్న స్మార్ట్ఫోన్ యూజర్లు 2020 ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్ సపోర్టును కోల్పోనున్నారని రిపోర్టులు తెలిపాయి. ఈ వెర్షన్ ఉన్న వారు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్లో ప్రస్తుత వెర్షన్లోకి అప్గ్రేడ్ అవ్వాలని సూచించాయి. వాట్సాప్ ఇటీవలే తన యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లను ఆఫర్ చేయడం ప్రారంభించింది. తన సబ్స్క్రైబర్లను పెంచుకుంటూ.. వారికి వినూత్నమైన ఆఫర్లను అందించాలని వాట్సాప్ ఈ ఫీచర్లను తీసుకొస్తోంది. గ్రూప్ వీడియో, వాయిస్ కాలింగ్ ఫీచర్ను ఇటీవలే వాట్సాప్ తన ఎంపిక చేసిన యూజర్లకు లాంచ్ చేసింది. వాట్సాప్ గ్రూప్ వీడియో కాలింగ్ అచ్చం ఫేస్బుక్ గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ను పోలి ఉండటం గమనార్హం. -
వాట్సాప్ యూజర్లకు మరో కొత్త ఫీచర్
ఎప్పడికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో అలరిస్తున్న వాట్సాప్ తాజాగా మరో అద్భుత ఫీచర్ తీసుకొచ్చింది. వాట్సాప్ యూజర్లను పదే పదే విసుగిస్తున్న ఫార్వర్డెడ్ మెసేజ్ల బారి నుంచి తప్పించడానికి ‘ఫార్వర్డెడ్ లేబుల్ ఫీచర్’ను లాంచ్ చేసింది. ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్తో ఫార్వర్డ్ మెసేజ్లకు ఓ లేబుల్ ఉంటుంది. దీంతో రెగ్యులర్ మెసేజ్లకు, ఫార్వర్డ్ మెసేజ్లకు తేడా తెలుసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ను యాక్సస్ చేసుకోవడానికి ఎలాంటి ప్రక్రియ అవసరం లేదు. కేవలం బీటా యూజర్లు తమ వాట్సాప్ను అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి అప్డేట్ అయిన తర్వాత మెసేజ్ టాప్లో ఫార్వర్డ్ లేబుల్ ఉంటుంది. కొంతమంది వ్యక్తులు గ్రూప్ల్లో గుడ్మార్నింగ్ మెసేజ్ను ఫార్వర్డ్ చేస్తూ.. మన ఫోన్ మెమరీని స్పామ్ చేస్తూ ఉంటారు. దీన్ని కొంతమేర తగ్గించడానికి ఇది ఎంతో ఉపయోగపడనుంది. 2.18.179 వాట్సాప్ బీటా వెర్షన్కు ఇది అందుబాటులో ఉంది. ప్రస్తుతం వాట్సాప్, 25 సార్లు కంటే ఎక్కువ సార్లు ఫార్వర్డ్ అయితే కానీ మెసేజ్ను బ్లాక్ చేయలేదు. దీంతో స్పామ్ పోస్టులు విపరీతంగా ఫార్వర్డ్ అవుతూ ఉన్నాయి. మరోవైపు పేమెంట్ సర్వీసులను కూడా భారత్లో ఆవిష్కరించాలని వాట్సాప్ ప్లాన్ చేస్తోంది. కానీ కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాంతో ఈ ఫీచర్ లాంచ్ చేయడానికి కాస్త సమయం తీసుకునేలా ఉంది. అయితే ఎప్పుడు ఈ సర్వీసులను లాంచ్ చేస్తుందో ఇంకా స్పష్టతలేదు. తాజాగా వాట్సాప్ తీసుకొచ్చిన అప్డేట్లో ఎక్కువ సేపు పాటు వాయిస్ మెసేజ్లను రికార్డు చేయడం, ఫింగర్ను నొక్కి పట్టాల్సి అవసరం లేకుండా మెసేజ్లను రికార్డు చేయడం వంటి ఫీచర్లు ఉన్నాయి. -
రెడ్మికి సవాల్ : నోకియా స్మార్ట్ఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ: హెచ్ఎండీ గ్లోబల్ దిగువ, మధ్య తరగతి సెగ్మెంట్లో మూడు కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను ప్రకటించింది. ముఖ్యంగా దేశీయంగా ప్రస్తుతం స్మార్ట్ఫోన్ మార్కెట్ను శాసిస్తున్న షావోమి షియోమీరెడ్మీ ఫోన్లకు పోటీగా బడ్జెట్ ధరల్లో వీటిని అందుబాటులోకి తేనుంది. గత ఏడాది లాంచ్ చేసిన నోకియా 2, 3. 5 సిరీస్లో 2018 మోడళ్లను తీసుకొస్తోంది. నోకియా 2.1, నోకియా 3.1, నోకియా 5.1 పేర్లతో ఈ డివైస్లను విడుదల చేసింది. బ్లూ/కాపర్, బ్లూ/సిల్వర్, గ్రే/సిల్వర్ రంగు వేరియెంట్లలో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి. నోకియా 2.1 సుమారు రూ.7,801గా ఉండనుందని అంచనా. జూలై నెలలో ఇవి వినియోగదారులకు లభ్యం కానున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్ను నోకియా 2లో జోడించింది. మరోవైపు ఈ మూడు స్మార్ట్ఫోన్ల ధరలపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనా లేదు. నోకియా 2.1 ఫీచర్లు 5.5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.4 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 8 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4100 ఎంఏహెచ్ బ్యాటరీ నోకియా 3.1 ధర సుమారు రూ. 10,900గాఉండనుందని అంచనా. 2జీబీ/16జీబీ స్టోరేజ్, 3జీబీ/32జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభ్యం కానుంది. నోకియా 3.1 ఫీచర్లు 5.2 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 720x1440 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 2జీబీ/16జీబీ స్టోరేజ్ 3జీబీ/32జీబీ స్టోరేజ్ 128 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 13ఎంపీ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 2990 ఎంఏహెచ్ బ్యాటరీ నోకియా 5.1 కూడా రెండు వేరియంట్లలో( 2జీబీ/16జీబీ స్టోరేజ్, 3జీబీ/32జీబీ స్టోరేజ్) లభ్యం కానుంది. ధర సుమారు రూ.14,800 నోకియా 5.1 ఫీచర్లు 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 1080x2160 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 2జీబీ/3జీబీ 16జీబీ/32 జీబీ స్టోరేజ్ 128 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 16ఎంపీ రియర్కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
వాట్సాప్ నుంచి మరో రెండు అద్భుత ఫీచర్లు
వాట్సాప్ గ్రూప్ల ద్వారా వచ్చే ఇమేజస్ అన్నీ ఇన్నీ కావు. అవన్నీ ఫోన్లోని గ్యాలరీకే వెళ్లిపోతాయి. కొంతమంది ఆ ఇమేజస్ను ప్రైవసీ దృష్టిలో పెట్టుకుని ఫోన్ గ్యాలరీలో కనిపించకూడదని అనుకుంటారు. వాటిని వెంటనే డిలీట్ చేయడం చేస్తుంటారు. కానీ కొందరికి డిలీట్ చేసే తీరిక ఉండదు. ఈ అవసరాన్ని గుర్తించి, వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. అదే మీడియా విజిబిలిటీ. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ మీడియా కంటెంట్ గ్యాలరీలో కనిపించాలో, హైడ్ చేసుకోవాలో నిర్ణయించుకోవచ్చు. దీని కోసం వాట్సాప్లోని సెట్టింగ్స్కు వెళ్లి, డేటా, స్టోరేజ్ యూసేజ్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. అక్కడ షో మీడియా ఇన్ గ్యాలరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది డిఫాల్ట్గా టిక్ చేసి ఉంటుంది. ఒకవేళ వాట్సాప్ ఇమేజస్ గ్యాలరీలో కనిపించకూడదంటే, దాన్ని అన్టిక్ చేసుకోవాలి. దాంతో గ్యాలరీలో వాట్సాప్ ఇమేజస్ కనిపించవు. అయితే ఆ ఇమేజస్ను ఫైల్ మేనేజర్కు వెళ్లి అక్కడ చూసుకోవచ్చు. వాట్సాప్ ఆండ్రాయిడ్లోని కొత్త బీటా వెర్షన్(2.18.159) యూజర్లకు ఈ మీడియా విజిబిలిటీ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ ఫీచర్ను ఇన్స్టాగ్రామ్ లాంటి పలు మెసేజింగ్ యాప్స్ అందిస్తున్నాయి. దీంతో పాటు మరో ఫీచర్ను కూడా వాట్సాప్ తీసుకొచ్చింది. అది న్యూ కాంటాక్ట్ షార్ట్కట్. ఈ ఫీచర్ కూడా కొత్త బీటా వెర్షన్ వాళ్లకు అందుబాటులో ఉంది. చాట్ స్క్రీన్లో కింద కుడివైపున న్యూ మెసేజ్ బటన్ను ప్రెస్ చేస్తే, న్యూ కాంటాక్ట్ షార్ట్కట్ ఫీచర్ కనిపిస్తుంది. అక్కడి నుంచి కాంటాక్ట్లను జత చేర్చుకోవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫీచర్లను పొందడానికి వాట్సాప్ బీటా వెర్షన్ను డౌన్లోడ్ చేసుకోవాలని యూజర్లకు సూచించింది. -
వాట్సాప్లో మరో బిగ్ ఫీచర్
మెసేజింగ్ యాప్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన వాట్సాప్, తరుచు కొత్త కొత్త అప్డేట్లతో యూజర్లను అలరిస్తూ ఉంటోంది. ఇటీవలే డిలీట్ చేసిన ఫోటోలను, వీడియోలను రీస్టోర్ చేసుకునే ఫీచర్ను తన యాప్కు జత చేసిన వాట్సాప్, మరో అద్భుతమైన ఫీచర్ను తన యాప్పై లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అదేమిటంటే.. యాప్ను ఓపెన్ చేయకుండానే యూజర్లు చాట్ చేసుకునే ఫీచర్. దీనికోసం ఫేస్బుక్కు చెందిన ఈ మెసేజింగ్ మాధ్యమం www.wa.me అనే డొమైన్ను రిజిస్ట్రర్ చేసుకుందని తెలిసింది. వాట్సాప్ గురించి ఎప్పడికప్పుడు కొత్త విశేషాలు అందించే డబ్ల్యూఏబీటా ఇన్ఫో ఈ విషయాన్ని తెలిపింది. ఈ కొత్త డొమైన్ షార్ట్ లింక్ api.whatsapp.comగా పేర్కొంది. ఇది వెంటనే వాట్సాప్లో చాట్ ఓపెన్ చేసుకునేందుకు వాడనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.18.138కు అందుబాటులో ఉందంట. ఆండ్రాయిడ్ 2.18.138 వెర్షన్ విజయవంతంగా wa.me అనే షార్ట్లింక్ను గుర్తించిందని, బ్రౌజర్ను వాడకుండానే చాట్ను ఆటోమేటిక్గా ప్రారంభించుకోవచ్చని డబ్ల్యూఏబీటా ఇన్ఫో తెలిపింది. లింక్ను వాడుతూ యూజర్లు టెక్ట్స్ పంపాలనుకునే వ్యక్తికి సంబంధించి https://wa.me/(phone number) టైప్ చేయాలి. దీంతో వెంటనే యూజర్లు ఆ చాట్కు వెళ్లిపోతారు. ఒకవేళ మీరు ఎంటర్చేసిన నెంబర్ తప్పు అయితే, వాట్సాప్ యూజర్లను నోటిఫై చేస్తుంది. -
ఫేస్బుక్ ద్వారా మొబైల్ రీఛార్జ్!
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఇటీవల తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. యూజర్ల డేటాను అక్రమంగా కేంబ్రిడ్జ్ అనలిటికాకు షేర్చేసిందనే వార్తలతో, ఫేస్బుక్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ క్షమాపణ కూడా చెప్పారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఫేస్బుక్ తన ప్లాట్ఫామ్పై సరికొత్త ఫీచర్ను సైతం లాంచ్ చేసింది. ఆ ఫీచర్ ద్వారా ఫేస్బుక్ యాప్ను వాడుతూ యూజర్లు తమ ప్రీపెయిడ్ మొబైల్ నెంబర్కు రీఛార్జ్ చేసుకోవచ్చట. ఆండ్రాయిడ్ వెర్షన్ 167.0.0.42.94పై ఇప్పటికే ఈ ఫీచర్ స్పాట్ అయింది. టాప్లో కుడివైపు ‘మొబైల్ రీఛార్జ్’ అనే ఆప్షన్ను ఆండ్రాయిడ్ యూజర్లకు కనిపిస్తుందని, ఒకవేళ అక్కడ కనిపించకపోతే, ‘సీ మోర్’లో ఈ ఫీచర్ ఉంటుందని తెలిపింది. ఇలా ఈ ఆప్షన్లను ట్యాప్ చేసిన అనంతరం ఓ వెల్కమ్ స్క్రీన్ వస్తుంది. దానిలో ప్లాన్ను ఎంపిక చేసుకోండి, మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా సెక్యుర్గా, ఫ్రీగా, చాలా వేగంగా చెల్లించుకోండి అనే సందేశం వస్తోంది. ‘రీఛార్జ్ నౌ’ అనే దాన్ని ట్యాప్ చేస్తే, అది మీ నెంబర్, ఎంపిక చేసుకునే ఆపరేటర్, ప్లాన్లను బ్రౌజ్ చేసుకునే ఆప్షన్ అన్నీ ఉండే పేజీలోకి తీసుకెళ్తోంది. ఒక్కసారి నెంబర్ ఎంటర్ చేస్తే, ఫేస్బుకే ఆటోమేటిక్గా ఆపరేటర్ను ఎంపిక చేస్తుంది. ఒకవేళ సర్కిల్ మార్చాలనుకుంటే, ప్రస్తుత ఆపరేటర్ను ఎంపిక చేసుకోవాలి. ప్లాన్ ఎంపిక చేసుకుంటే, అది ఆర్డర్ వివరాలున్న పేజీలకి తీసుకెళ్తోంది. అక్కడ ఆర్డర్ వివరాలన్నీ నమోదుచేస్తే, యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవడానికి ఓటీపీని లేదా 3డీ సెక్యుర్ పాస్వర్డ్ను అడుగుతోంది. ఇలా యూజర్లు మీ ప్రీపెయిడ్ మొబైల్ నెంబర్లకు ఫేస్బుక్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. పలు ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లనో ఈ ఫీచర్ స్పాట్ అయింది. కానీ ఆపిల్ ఐఫోన్లలో ఇంకా ఈ ఫీచర్ అందుబాటులోకి రాలేదు. అయితే ఈ ఫీచర్ కూడా ప్రస్తుతం ప్రీపెయిడ్ నెంబర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. పోస్టు పెయిడ్ బిల్లులను చెల్లించుకునే వీలులేదు. కేవలం డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. నెట్బ్యాంకింగ్, యూపీఐ, లేదా ఇతర పేమెంట్ మార్గాలతో పేమెంట్లు చేసుకోవడానికి వీలులేదు. ఫేస్బుక్ సొంతమైన వాట్సాప్ కూడా రెండు నెలల క్రితమే తన ప్లాట్ఫామ్పై పేమెంట్ ఆప్షన్ను తీసుకొచ్చింది. -
10 నిమిషాల పాటు ట్విటర్ డౌన్
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ ఒక్కసారిగా స్తంభించిపోయింది. ప్రపంచంలో చాలా దేశాల్లో ట్విటర్ డౌన్ అయినట్టు తెలిసింది. సుమారు 7 గంటల ప్రాంతం నుంచి ట్విటర్ ఆగిపోవడం ప్రారంభించింది. దీంతో యూజర్ల నుంచి పెద్ద ఎత్తున్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఐదు నుంచి పది నిమిషాల పాటు ఈ స్తంభన కొనసాగింది. డౌన్డిటెక్టర్ అనే ఇంటర్నెట్ ట్రాకర్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈశాన్య అమెరికా, యూకేలో కొన్ని ప్రాంతాలు, ఫ్రాన్స్, జపాన్, భారత్ దేశ యూజర్లు ఈ టెక్నికల్ సమస్యను ఎదుర్కొన్నారని డౌన్డిటెక్టర్ రిపోర్టు చేసింది. ట్విటర్కు ప్రధాన వనరు అయిన ఆండ్రాయిడ్ యాప్ నుంచే 28 శాతం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఐప్యాడ్ యాప్ యూజర్లు కూడా ఇదే రకమైన సమస్యను ఎదుర్కొన్నట్టు డౌన్డిటెక్టర్ తెలిపింది. మొత్తం ఫిర్యాదుల్లో 18 శాతం ఐప్యాడ్ యాప్ వారివి కూడా ఉన్నట్టు పేర్కొంది. వెబ్ సైట్ యూజర్లు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. అయితే ఏ కారణం చేత ట్విటర్ స్తంభించిపోయిందో ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ ఇంకా ప్రకటించలేదు. కానీ ట్విటర్ డౌన్ అయినప్పడు ‘టెక్నికల్గా కొంత సమస్య ఉంది. నోటీసు చేసినందుకు ధన్యవాదాలు. దాన్ని ఫిక్స్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే సాధారణం అయిపోతుంది’ అనే మెసేజ్ ఈ ప్లాట్ఫామ్పై దర్శనమిచ్చింది. ట్విటర్ ఇలా డౌన్ అవడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు ఇలా ట్విటర్ ఆగిపోయింది. -
వాట్సాప్లో మరో కొత్త ఫీచర్
పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ రోజుకో కొత్త ఫీచర్తో యూజర్లను అలరిస్తూనే ఉంది. తాజాగా మరో కొత్త ఫీచర్ను ఆండ్రాయిడ్ బీటా యాప్ యూజర్ల కోసం టెస్ట్ చేస్తోంది. అదీ పొరపాటున డిలీట్ అయి పోయి మీడియా ఫైల్స్ను తిరిగి డౌన్లోడ్ చేసుకునే పీచర్. అంటే మీ స్మార్ట్ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి ఏమైనా ఇమేజస్ను, జీఐఎఫ్ఎస్ను కానీ, వీడియో, ఆడియో ఫైల్స్ను కానీ, ఆడియో రికార్డింగ్లను, డాక్యుమెంట్లను డిలీట్చేస్తే, వాటిని తిరిగి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును ఈ ఫీచర్ సహకరిస్తుంది. ఇప్పటి వరకైతే డిలీట్ చేసిన వీటిని తిరిగి డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం మాత్రం లేదు. ఈ ఫీచర్తో ప్రస్తుతం సర్వర్ల నుంచి వాటిని రీ-డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని వాట్సాప్ కల్పిస్తుందని డబ్ల్యూబీటాఇన్ఫో రిపోర్టు తెలిపింది. డివైజ్లలో తక్కువ స్టోరేజ్ కలిగి ఉన్న యూజర్లకు ఇది ఎంతో ఉపయోగపడనుందట. అయితే ఈ ఫీచర్పై యూజర్ల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. డిలీట్ చేసినప్పటికీ ఫైల్స్ను వాట్సాప్ స్టోర్ చేస్తుండటం సెక్యురిటీ సమస్యలను తెచ్చిపెడుతుందని యూజర్లు పేర్కొంటున్నారు. అయితే తమ ప్లాట్ఫామ్పై ప్రతి డేటా ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్టెడ్గా వాట్సాప్ పేర్కొంటోంది. -
టాప్ డౌన్లోడింగ్ యాప్స్ ఇవే..
నేటి డిజిటల్ యుగంలో చేతిలో స్మార్ట్ఫోన్ లేకుంటే నిమిషం కూడా గడవదు.. ఆత్మీయులతో మాట్లాడటానికి, క్యాబ్ బుకింగ్, ఆన్లైన్ షాపింగ్, బ్యాంకింగ్ ఇలా ఇంట్లో కూర్చునే పనులు పూర్తి చేయాలంటే అందుకు సంబంధించిన యాప్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ‘యాప్ అన్నే’ నివేదిక-2018 ప్రకారం ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ల వాడకంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న మార్కెట్లలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం భారత్లో అత్యధిక మంది డౌన్లోడ్ చేస్తున్న టాప్- 10 యాప్లపై ఓసారి లుక్కేద్దాం. 1. ఫేస్బుక్ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అత్యధిక మంది యూజర్లు డౌన్లోడ్ చేసిన యాప్గా సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ అగ్రస్థానంలో నిలిచింది. 2. యూసీ బ్రౌజర్ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ను వెనక్కి నెట్టి యూసీ బ్రౌజర్ రెండో స్థానంలో నిలిచింది. ఫాస్ట్ బ్రౌజింగ్, డాటా సేవింగ్ వంటి ఫీచర్ల వల్ల గతేడాదితో పోలిస్తే ఈసారి యూజర్ల సంఖ్య పెంచుకోగలిగింది యూసీ బ్రౌజర్. 3. వాట్సాప్ ప్రస్తుతం ఉన్న మెసేజింగ్ యాప్లన్నింటిలో అగ్రస్థానంలో కొనసాగుతోంది వాట్సాప్. కానీ అత్యధిక మంది డౌన్లోడ్ చేస్తున్న యాప్లలో మూడో స్థానంలో నిలిచింది. 4. ఎఫ్బీ మెసెంజర్ గతేడాది నాల్గో స్థానంలో నిలిచిన ఎఫ్బీ మెసెంజర్ ఇప్పుడు కూడా అదే స్థానంలో కొనసాగుతోంది. 5. షేర్ ఇట్ వివిధ డివైస్ల మధ్య ఫైళ్లు, ఫొటోలు షేర్ చేసుకోవడాన్ని సులభతరంగా మార్చిన షేర్ ఇట్ యాప్ ఐదో స్థానం సంపాదించింది. 6. జియో టీవీ గతేడాది చివరి స్థానంలో నిలిచిన జియో టీవీ ఈసారి ఆరో స్థానానికి ఎగబాకింది. సీరియల్స్, క్రికెట్ మ్యాచులు చూసేందుకు వీలుగా రూపొందిచబడిన ఈ యాప్ తన యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. 7. ఎయిర్ టెయిల్ టీవీ తక్కువ ధరకే డేటాను అందించడం ద్వారా ఎయిర్టెల్ టీవీ యూజర్ల సంఖ్యను పెంచుకొని ఏడో స్థానంలో నిలిచింది. 8. హాట్ స్టార్ స్టార్ నెట్వర్కింగ్కు సంబంధించిన హాట్ స్టార్ మొదటి సారిగా మోస్ట్ డౌన్లోడెడ్ యాప్ల జాబితాలో చోటు సంపాదించుకుని ఎనిమిదో స్థానాన్ని ఆక్రమించుకుంది. 9. ట్రూకాలర్ రాంగ్ కాల్స్ నుంచి విముక్తి పొందడానికి రూపొందించిన ట్రూకాలర్ యాప్కు యూజర్లు ఎక్కువగానే ఉన్నారు. అయితే గతేడాది ఎనిమిదో స్థానంలో నిలిచిన ఈ యాప్ ప్రస్తుతం తొమ్మిదో స్థానానికి పడిపోయింది. 10. హైప్స్టార్ వీడియో కమ్యూనిటీ యాప్ హైప్స్టార్ డౌన్లోడ్ చేసుకుంటే ఒకే క్లిక్తో వైరల్ వీడియోలు చూసేయొచ్చు. గతేడాది టాప్ 10లో చోటు దక్కించుకోలేక పోయిన ఈ యప్ ఈసారి పదో స్థానంలో నిలిచింది.ఈ టాప్- 10 యాప్లు మీ మొబైల్లో కూడా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి మరి. -
వాట్సాప్లో మరో అద్భుతమైన ఫీచర్లు
మెసేజింగ్ యాప్లో మంచి పాపులారిటీని సంపాదించుకున్న వాట్సాప్ రోజుకో కొత్త రకం ఫీచర్లను ప్రవేశపెడుతూ యూజర్లను అలరిస్తూ ఉంది. తాజాగా ఆండ్రాయిడ్ వాట్సాప్కు కొత్త బీటా వెర్షన్ను తీసుకొచ్చింది. ఈ బీటా వెర్షన్లో రికార్డు చేసిన వాయిస్ మెసేజ్లను లాక్ చేసుకునే వెసులుబాటు ఉంది. మెసేజ్ రికార్డు చేస్తున్న సేపు రికార్డు బటన్ను పట్టుకునే ఉండకుండా.. వాయిస్ మెసేజ్లను తేలికగా రికార్డు చేయొచ్చు. అంతేకాకుండా రికార్డు చేసిన వాయిస్ మెసేజ్లను డెలివరీ చేసేముందే యూజర్లు ప్లే చేసే వినే ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ ఫీచర్ కోసం 2.18.102ను వాట్సాప్ అప్డేట్ చేసింది. వాయిస్ రికార్డింగ్లను లాక్ చేసుకునే ఫీచర్ను ఐఓఎస్ ఐఫోన్లకు గతేడాది నవంబర్లోనే తీసుకొచ్చింది. ప్రస్తుతం దీన్ని ఆండ్రాయిడ్ బీటా వెర్షన్కు కూడా అందుబాటులోకి తెచ్చింది. మీ వాయిస్ మెసేజ్లను లాక్ చేయాలనుకుంటే, మిక్ ఐకాన్ను 0.5 సెకన్లు పట్టుకుని, లాక్ బటన్ వైపు మీ చేతి వేళ్లను స్లైడ్ చేయాలి. ఒక్కసారి లాక్ అయిన వాయిస్ రికార్డింగ్ను తేలికగా సెండ్ బటన్తో పంపవచ్చు. అంటే మనం ఎవరికైనా వాయిస్ మెసేజ్ లు పంపాలనుకున్నప్పుడు రికార్డు బటన్ మీద అలాగే ప్రెస్ చేసి పట్టుకోవాల్సిన పనిలేకుండా ఒకసారి రికార్డింగ్ లాక్ చేసి పెడితే.. మాట్లాడడం పూర్తయిన తర్వాత దాన్ని అన్లాక్ చేసుకునే విధంగా ఈ లాక్డ్ రికార్డింగ్ సదుపాయం ఉపయోగపడుతోంది. లాక్ రికార్డింగ్ ఫీచర్, వాయిస్ మెసేజ్లను పంపే ముందు వినే సౌకర్యం కోసం వాట్సాప్ బీటా యూజర్లు ఆండ్రాయిడ్ వెర్షన్ 2.18.102ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని WABetaInfo రిపోర్టు చేసింది. గూగుల్ ప్లేలో బీటా టెస్టర్ల వద్ద ఇది అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది. -
వాట్సాప్లో మరో కొత్త ఫీచర్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మరో కొత్త ఫీచర్ను నేడు లాంచ్ చేసింది. ఈ ఫీచర్తో యూజర్లు తమ వాట్సాప్ నెంబర్లను తేలికగా మార్చుకోవచ్చు. అంతేకాక ఎలాంటి గందరగోళం లేకుండా కొత్త నెంబర్కు డేటాను కూడా బదిలీ చేసుకోవచ్చు. కొత్త ‘ఛేంజ్ నెంబర్’ ఫీచర్ అప్డేట్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్లోని 2.18.97 ఆండ్రాయిడ్ బీటా అప్డేట్కు అందుబాటులో ఉంది. అనంతరం ఈ ఫీచర్ ఐఓఎస్, విండోస్ డివైజ్లకి కూడా అందుబాటులోకి రానుంది. కొత్త ‘ఛేంజ్ నెంబర్’ ఫీచర్తో ఓల్డ్ ఛేంజ్ నెంబర్ ఫీచర్కు మరిన్ని మెరుగులను అందించిందని డబ్ల్యూఏబీటాఇన్ఫో ట్వీట్ చేసింది. ఈ ఫీచర్తో అన్ని లేదా కొన్ని కాంటాక్ట్లను నోటిఫై చేయాలనుకుంటే, యూజర్లు ఆ స్పెషిఫిక్ కాంటాక్ట్లను ఎంపిక చేసుకోవచ్చని పేర్కొంది. ఛాట్ హిస్టరీని కొత్త ఛాట్లోకి మార్చుకోవచ్చని, డూప్లికేట్ ఛాట్లను డిలీట్ చేసుకోవచ్చని రిపోర్టు చేసింది. దీనికోసం యూజర్లు వాట్సాప్ సెట్టింగ్స్లోని అకౌంట్లో ఈ ‘ఛేంజ్ నెంబర్’అనే అనే ఆప్షన్ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ఆప్షన్లో పాత, కొత్త ఫోన్ నెంబర్లను ఇన్సర్ట్ చేశాక, మీ కొత్త నెంబర్కు ఏ కాంటాక్ట్లను నోటిఫై చేయాలో వాట్సాప్ కోరుతోంది. కొత్త నెంబర్లోకి మారిన తర్వాత, పాత ఛాట్లో ఉన్న షేర్డ్ మెసేజ్లు, కొత్త దానిలోకి మరలుతాయని డబ్ల్యూబీటాఇన్ఫో పేర్కొంది. -
ఆండ్రాయిడ్ ఓరియోలో లావా కొత్త స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ: మొబైళ్లు తయారు చేసే లావా కంపెనీ ఆండ్రాయిడ్ ఓరియో(గో ఎడిషన్)లో కొత్త స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తెచ్చింది. జడ్50 పేరుతో ఈ స్మార్ట్ఫోన్ను టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ భాగస్వామ్యంతో తక్కువ ధరకే అందిస్తున్నామని లావా తెలిపింది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ.4,000 అని భారతీ ఎయిర్టెల్ మేరా పెహ్లా స్మార్ట్ఫోన్(నా తొలి స్మార్ట్ఫోన్) కార్యక్రమంలో భాగంగా ఆ కంపెనీ రూ.2,000 క్యాష్బ్యాక్ ఆఫర్ని ఇస్తోందని, దీంతో ఈ ఫోన్ రూ.2,400కే లభిస్తుందని వివరించింది. ఈ జడ్50 స్మార్ట్ఫోన్లో 4.5 అంగుళాల డిస్ప్లే, 1.1 గిగాహెట్జ్ క్వాడ్–కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్పేస్, 5 మెగా పిక్సెల్ రియర్, ఫ్రంట్ కెమెరా విత్ ఫ్లాష్ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్ లక్షకు పైగా రిటైల్ స్టోర్స్లతో పాటు ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్ల్లో కూడా లభిస్తుందని పేర్కొంది. గూగుల్ సంస్థ గత ఏడాది డిసెంబర్లో ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్లో ఒక స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఓఎస్పై పనిచేసే స్మార్ట్ఫోన్లో యాప్లు తక్కువ డేటాను వినియోగించుకుంటూనే వేగంగా పనిచేస్తాయి. -
రూ.2400కే లావా స్మార్ట్ఫోన్
ఎన్నో అంచనాల అనంతరం లావా కంపెనీ దేశీయ తొలి ఆండ్రాయిడ్ ఓరియో(గో ఎడిషన్) స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న ‘మేరా పెహ్లా స్మార్ట్ఫోన్’ ప్రొగ్రామ్లో భాగంగా జడ్50 పేరుతో ఈ స్మార్ట్ఫోన్ను రూ.2400కే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ఫోన్ను 10వేలకు పైగా రిటైల్ స్టోర్లలో, అదేవిధంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ వంటి ఆన్లైన్ ఛానళ్లలో అందుబాటులో ఉంచినట్టు లావా పేర్కొంది. బ్లాక్, గోల్డ్ రంగుల ఆప్షన్లలో ఇది లభ్యమవుతోంది. ఈ లావా జడ్50 అసలు మార్కెట్ ఆపరేటింగ్ ధర 4,400 రూపాయలు. ఎయిర్టెల్ ఈ ఫోన్పై రూ.2000 క్యాష్బ్యాక్ ప్రకటించడంతో, దీని ధర 2,400 రూపాయలకు దిగొచ్చింది. అయితే కస్టమర్లు రూ.2000 క్యాష్బ్యాక్ పొందాలంటే, తొలి 18 నెలలు రూ.3500తో, 19 నుంచి 36 నెలల మరో రూ.3500తో తమ ఎయిర్టెల్ అకౌంట్లలో రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ఫోన్ను రెండేళ్ల వారెంటీతో మార్కెట్లోకి వచ్చింది. లావా అదనంగా వన్టైమ్ స్క్రీన్ రిప్లేస్మెంట్ను కూడా ఆఫర్ చేస్తోంది. అయితే ఇది ఫోన్ కొనుగోలు చేసిన ఏడాది వరకే వాలిడ్లో ఉంటుంది. లావా జడ్50 స్పెషిఫికేషన్లు.. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో(గో ఎడిషన్) 4.5 అంగుళాల డిస్ప్లే 2.5డీ కర్వ్డ్ గొర్రిల్లా గ్లాస్ క్వాడ్-కోర్ 1.1గిగాహెడ్జ్ మీడియాటెక్ ఎంటీ6737ఎం ఎస్ఓసీ 1జీబీ ర్యామ్, 8జీబీ ఆన్బోర్డ్ స్టోరేజ్ 5 మెగాపిక్సెల్ రియర్, ఫ్రంట్ కెమెరా సెన్సార్స్ 2000 ఎంఏహెచ్ బ్యాటరీ -
వాట్సాప్ డిలీట్ మెసేజ్ సమయం పొడిగింపు
-
మెసేజ్ డిలీట్ చేయడానికి మరికొంత సమయం
వాట్సాప్లో పొరపాటున ఏదైనా మెసేజ్ ఎవరికైనా పంపితే, ఏడు నిమిషాల వ్యవధిలో దాన్ని డిలీట్ చేసేవచ్చు. ఇలా మెసేజ్ను డిలీట్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ కొన్ని నెలల క్రితం అందుబాటులోకి తీసుకొచ్చింది. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ పీచర్తో సెంటర్ తనతో పాటు రిసీవర్ వద్ద కూడా మెసేజ్ను డిలీట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఏడు నిమిషాల వ్యవధి సమయాన్ని వాట్సాప్ మరింత పెంచింది. చాట్లో మెసేజ్ను డిలీట్ చేయడానికి 4,096 సెకన్ల(68 నిమిషాల 16 సెకన్ల) సమయాన్ని యూజర్లకు కేటాయించింది. అంటే వాట్సాప్ యూజర్లకు మెసేజ్ డిలీట్ చేయడానికి గంట సమయం ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అభివృద్ధి చేసిన కొత్త బీటా 2.18.69 వెర్షన్లో ఈ వ్యవధిని పెంచింది. వాట్సాప్ గురించి ఎప్పడికప్పుడు అప్డేట్స్ అందించే డబ్ల్యూఏబీటాఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు తీసుకొచ్చిన ఈ ఫీచర్, ఐఓఎస్, విండోస్ ప్లాట్ఫామ్స్కు కూడా త్వరలోనే అందుబాటులోకి తేనుంది. డిలీట్ మెసేజ్ ఫీచర్ సమయాన్ని పెంచడం మాత్రమే కాక, ఈ కొత్త అప్డేట్లో స్వల్ప మార్పులు కూడా చేసింది. ఈ బీటాలోనే లాక్డ్ రికార్డింగ్, స్టికర్ ప్యాక్ డిస్ప్లే సైజ్ వంటి ఫీచర్లను కూడా వాట్సాప్ తీసుకొచ్చింది. -
గూగుల్తో ఎయిర్టెల్ జట్టు
న్యూఢిల్లీ: చౌక ఆండ్రాయిడ్ ఓరియో (గో ఎడిషన్) స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టే దిశగా టెక్ దిగ్గజం గూగుల్తో టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ చేతులు కలిపింది. ’మేరా పెహ్లా స్మార్ట్ఫోన్ (నా తొలి స్మార్ట్ఫోన్)’ కార్యక్రమం కింద మార్చి నుంచి ఆండ్రాయిడ్ ఓరియో (గో) ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే చౌక 4జీ స్మార్ట్ఫోన్లు ఎయిర్టెల్ విక్రయించనుంది. వీటిలో మై ఎయిర్టెల్ యాప్తో పాటు ఎయిర్టెల్ టీవీ, వింక్ మ్యూజిక్ మొదలైన యాప్స్ ఉంటాయి. ఈ ఫోన్లలో ర్యామ్ 1 జీబీ లేదా అంతకన్నా తక్కువ ఉంటుంది. కోట్ల కొద్దీ ఫీచర్ ఫోన్ యూజర్లను స్మార్ట్ఫోన్ల వైపు మళ్లించేందుకు, వారికి ఇంటర్నెట్ను చేరువ చేసేందుకు చౌక ఆండ్రాయిడ్ గో ఫోన్స్ ఉపయోగపడతాయని భారతీ ఎయిర్టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వాణీ వెంకటేష్ తెలిపారు. తక్కువ డేటా వినియోగంతో.. మరింత వేగంగా పనిచేసేలా తీర్చిదిద్దిన పలు యాప్స్ ఈ ఫోన్లో ఉంటాయి. ఓరియో గో ఓఎస్తో నడిచే చౌక స్మార్ట్ఫోన్స్ని గూగుల్ గతేడాది డిసెంబర్లో ఆవిష్కరించగా... లావా, మైక్రోమ్యాక్స్ వంటి హ్యాండ్సెట్ తయారీ సంస్థలు వీటిని తయా రు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. జెడ్50 పేరిట ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ స్మార్ట్ఫోన్ని లావా మంగళవారం ప్రకటించింది. మార్చి మధ్య నాటికల్లా లక్షకు పైగా రిటైల్ స్టోర్స్లో ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ధర మాత్రం వెల్లడించలేదు. జెడ్50లో 4.5 అంగుళాల డిస్ప్లే, 1.1 గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 5 ఎంపీ కెమెరా, మొదలైన ఫీచర్స్ ఉంటాయి. -
తొలి ఆండ్రాయిడ్ గో స్మార్ట్ఫోన్..
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ హ్యాండ్సెట్ తయారీదారు లావా తొలి ఆండ్రాయిడ్ ఓరియో గో 4జీ స్మార్ట్ఫోన్ను మంగళవారం విడుదల చేసింది. లావా జెడ్ 50 పేరుతో దీన్ని లాంచ్ చేసింది. బడ్జెట్ ధరలో ఎంట్రీ లెవల్లో 1జీబీ ర్యామ్ డివైస్లకుద్దేశించిన కొత్త ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం (గో ఎడిషన్) మొట్టమొదటి స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ధరను 5వేల రూపాయలుగా నిర్ణయించింది. లావా జెడ్ 50 ఫీచర్లు 4.5 అంగుళాల డిస్ప్లే, 2.5డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆండ్రాయిడ్ ఓరియో గో 1.1 గిగాహెట్జ్ క్వాడ్ కోర్ 1 జీబీ ర్యామ్ 8 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ 5ఎంపీ రియర్ కెమెరా 5ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ ఫ్లాష్ -
నోకియా నుంచి కొత్తగా ఐదు ఫోన్లు
బార్సిలోనా : నోకియా బ్రాండు స్మార్ట్ఫోన్ తయారు చేసి, మార్కెట్లోకి విడుదల చేస్తున్న హెచ్ఎండీ గ్లోబల్ తన పోర్ట్ఫోలియోను మరింత విస్తరిస్తోంది. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018(ఎండబ్ల్యూసీ) వేదికగా కొత్తగా ఐదు డివైజ్లను హెచ్ఎండీ గ్లోబల్ ఆవిష్కరించింది. అవి నోకియా 8 సిరొక్కో, నోకియా 7 ప్లస్, నోకియా 6(కొత్త వేరియంట్), నోకియా 1, పునరుద్ధరించిన నోకియా 8110. నోకియాకు చెందిన ఐకానిక్ మోడల్ 8110. ఈ మోడల్ను ప్రస్తుతం 4జీ కనెక్టివిటీతో పాటు గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ సెర్చ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి యాప్స్తో కంపెనీ ఆవిష్కరించింది. పన్నులు, ఇతర సబ్సిడీలను మినహాయించి నోకియా ఐకానిక్ మోడల్ అయిన 8110 ధరను హెచ్ఎండీ గ్లోబల్ 79 యూరోలుగా నిర్ణయించింది. మే నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రాబోతుంది. ''గతేడాది ఈ రోజుల్లో, అభిమానుల నుంచి మంచి స్పందన రావాలని ఆశిస్తూ మా ప్రయాణాన్ని ప్రారంభించాం. మా స్పేస్లో అత్యంత వినూత్నమైన బ్రాండులను డెలివరీ చేస్తున్నాం. గతేడాది 70 మిలియన్లకు పైగా నోకియా ఫోన్లను రవాణా చేశాం'' అని హెచ్ఎండీ గ్లోబల్ సీఈవో ఫ్లోరియాన్ సైచి చెప్పారు. కొత్తగా ఐదు డివైజ్ల ఆవిష్కరణతో తమ రేంజ్ను విస్తరించుకున్నామని తెలుపడం చాలా గర్వంగా ఉందని, నోకియా 8 సిరొక్కోతో స్మార్ట్ఫోన్ డిజైన్లో కొత్త బెంచ్మార్కు తీసుకొచ్చామని హెచ్ఎండీ గ్లోబల్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జూహో సర్వికాస్ అన్నారు. నోకియా 8 సిరొక్కో, నోకియా 7 ప్లస్, కొత్త నోకియా 6లు ఆండ్రాయిడ్ వన్ ఫ్యామిలీలో చేరాయని, గూగుల్ డిజైన్ చేసిన హై క్వాలిటీ సాఫ్ట్వేర్ అనుభవాన్ని వీటిలో తాము అందించినట్టు పేర్కొన్నారు. నోకియా 8 సిరొక్కో స్మార్ట్ఫోన్ ధర 749 యూరోలుగా కంపెనీ నిర్ణయించింది. అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.60వేలుగా తెలుస్తోంది. కానీ భారత్లో ఈ స్మార్ట్ఫోన్ ధర ఎంత ఉండొచ్చో కంపెనీ వెల్లడించలేదు. ఏప్రిల్ ప్రారంభం నుంచి నోకియా 8 సిరొక్కో స్మార్ట్ఫోన్ సేల్ మొదలవుతోంది. 5.5 అంగుళాల క్యూహెచ్డీ పీఓలెడ్ డిస్ప్లే, 3డీ కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 835 ఎస్ఓసీ, 6జీబీ ర్యామ్, 128జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్, 12 ఎంపీ, 13 ఎంపీతో డ్యూయల్ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా దీనిలో ఫీచర్లు. కాగ, కొత్త నోకియా 6 ముందు దాని కంటే 60 శాతం వేగవంతంగా పనిచేస్తుంది. ఈ ఫోన్ను 279 యూరోలకు కంపెనీ మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ స్మార్ట్ఫోన్ అయిన నోకియా 1, మృదువుగా డిజైన్ అయింది. గూగుల్ ప్లే స్టోర్ ఫుల్ యాక్సస్తో దీన్ని ఆవిష్కరించింది. దీని ధర కూడా అన్ని పన్నులు, సబ్సిడీలు కలుపుకోకపోతే, 85 డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది. -
ఇక హిందీలోనూ ‘గూగుల్ అసిస్టెంట్’
శాన్ఫ్రాన్సిస్కో: 2018 చివరికల్లా హిందీ సహా 30కిపైగా భాషల్లో గూగుల్ అసిస్టెంట్ను అందుబాటులోకి తీసుకొస్తామని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం గూగుల్ అసిస్టెంట్ కేవలం ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, కొరియన్, స్పానిష్, పోర్చుగీస్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఫోన్ల కోసం హిందీ సహా డానిష్, డచ్, ఇండోనేషియన్, నార్వేజియన్, స్వీడిష్, థాయ్ భాషల్లో గూగుల్ అసిస్టెంట్ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఒకే వ్యక్తి వేర్వేరు భాషల్లో ఇచ్చే ఆదేశాలను పాటించేలా ఈ సాఫ్ట్వేర్లో మార్పులు చేస్తారు. ఏ స్మార్ట్ఫోన్లో అయినా హోమ్పేజ్ బటన్ను కొద్దిసేపు నొక్కిపట్టుకోవడం లేదా ‘ఓకే గూగుల్’ అని చెప్పడం ద్వారా ‘గూగుల్ అసిస్టెంట్’ను యాక్టివేట్ చేయవచ్చు. -
వాట్సాప్లో మరో సరికొత్త ఫీచర్
-
స్మార్ట్ఫోన్ యూజర్లకు కొత్త న్యూస్
సాక్షి, టెక్నాలజీ : పలుకే బంగారామాయేనా... అన్నట్లు వాట్సప్, మెసేంజర్లలో ఎందులోనైనా సరే చాటింగ్ చేస్తున్నప్పుడు మన ఫీలింగ్స్ను రాసి పంపే కంటే బొమ్మల(ఎమోజీ)తో తెలుపుతాం. కోపంగా ఉన్నామనీ, సిగ్గుపడుతున్నామనీ, ఏడుస్తూ ఉన్నామనీ ఇలా ప్రతీ ఫీలింగ్ను నేస్తాలకు తెలియజేస్తాం. రాతల్లో చెప్పలేని మాటలను బొమ్మలతో చెప్పుకుంటాం. ఇలా ఎమోజీలకు అలవాటు పడిన చాటింగ్ ప్రియులకు కొత్తగా మరికొన్ని ఎమోజీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది చివరికల్లా కొత్తగా తయారుచేసిన 157 ఎమోజీలన్నీ స్మార్ట్ఫోన్లోకి అందుబాటులోకి రానున్నాయని యూనికోడ్ కన్సార్టియం తెలిపింది. మహిళా సూపర్ హీరో, లైట్ స్కిన్ రెడ్ హెయిర్ ఉన్న అమ్మాయి, డార్క్ స్కిన్ కర్లీ హెయిర్ ఉన్న అబ్బాయి, దోమ, పైరెట్ ఫ్లాగ్(డేంజర్ జోన్లో ఉండే బొమ్మ) ఇలా అనేక రకాల కొత్త ఎమోజీలు ఉన్నట్లు సమాచారం. -
వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ వారికి వచ్చేసింది..
మెసేజింగ్ యాప్లో బాగా పాపులర్ అయిన వాట్సాప్, యూపీఐ ఆధారిత పేమెంట్స్ ఫీచర్తో మరింత మంది భారత కస్టమర్లను ఆకట్టుకోవాలనుకుంటోంది. ఈ మేరకు భారత్లో పేమెంట్స్ ఫీచర్ను కూడా వాట్సాప్ టెస్ట్ చేస్తోంది. ఈ కొత్త ఫీచర్ ఎంపిక చేసిన ఐఓఎస్, ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా యూజర్లకు అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ ఫీచర్తో యూపీఐ ఆధారితంగా.. నగదును వేరే వాళ్లకి పంపించడం, వేరే వాళ్ల ద్వారా నగదును యూజర్లు పొందడం వంటివి చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్లోని 2.18.21 వాట్సాప్ వెర్షన్కు, ఆండ్రాయిడ్ 2.18.41 వెర్షన్ వారికి అందుబాటులో ఉన్నట్టు తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇటీవల భారత్లో డిజిటల్ పేమెంట్లు ఎక్కువగా పెరగడంతో, పేమెంట్స్ ప్లాట్ఫామ్ను ఆఫర్చేసి మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవాలని వాట్సాప్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. గిజ్మో టైమ్స్లో ఈ వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ తొలుత స్పాట్ అయింది. చాట్ విండోలోనే ఈ ఫీచర్ను యూజర్లు యాక్సస్ చేసుకోవచ్చు. గేలరీ, వీడియో, డాక్యుమెంట్లు వంటి ఇతర ఆప్షన్లతో పాటు ఈ ఆప్షన్ కూడా ఇక అందుబాటులో ఉంటుంది. పేమెంట్స్ను క్లిక్ చేస్తే.. ఓ డిస్క్లైమర్ విండో ఓపెన్ అవుతుంది. దీనిలో బ్యాంకుల జాబితా కూడా ఉంటుంది. యూపీఐతో కనెక్ట్ అయిన బ్యాంకు అకౌంట్ను యూజర్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్స్ ప్లాట్ఫామ్ను మీరు కనుక వాడి ఉండకపోతే, ప్రమాణీకరణ పిన్ను క్రియేట్ చేసుకోవాలి. అదనంగా యూపీఐ యాప్ ద్వారా లేదా సంబంధిత బ్యాంకు వెబ్సైట్ ద్వారా యూపీఐ అకౌంట్ను క్రియేట్ చేసుకోవాలి. లావాదేవీని విజయవంతంగా పూర్తిచేసుకోవాలంటే నగదు పంపేవారికి, స్వీకరించే వారికి ఇద్దరికీ కచ్చితంగా వాట్సాప్ ఆఫర్ చేసే పేమెంట్స్ ఫీచర్ ఉండాలి. -
వాట్సాప్లోకి మరో కొత్త ఫీచర్
న్యూఢిల్లీ : వాయిస్ కాలింగ్, ఆ తర్వాత వీడియో కాలింగ్ వంటి ఫీచర్లతో ఆకట్టుకున్న వాట్సాప్ మరో కొత్త ఫీచర్ను టెస్ట్ చేస్తోంది. అదే గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్. ఇన్ని రోజులు ఇద్దరు వ్యక్తులకు మాత్రమే పరిమితమైన ఈ ఫీచర్ను, గ్రూప్లోని సభ్యులు కలిసి మాట్లాడుకునే విధంగా ఈ కొత్త ఫీచర్ను లాంచ్ చేయబోతుంది. గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ పేరుతో దీన్ని పరిచయం చేస్తోంది. డబ్ల్యూఏబీటా ఇన్ఫో ఈ ఫీచర్ను తొలుత స్పాట్ చేసింది. ఆండ్రాయిడ్లోని 2.17.443 వెర్షన్లో ఈ గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ ఉన్నట్టు సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్పై యాప్ కొత్త వెర్షన్ 2.18.39పై కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా దీన్ని ప్రవేశపెట్టనప్పటికీ, బీటా యూజర్లకు మాత్రం ఇది అందుబాటులో ఉన్నట్టు డబ్ల్యూబీటా ఇన్ఫో రిపోర్టు చేసింది. దీనికి సంబంధించి స్క్రీన్ షాట్ను కూడా ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసింది. వీడియో కాల్లో ఎక్కువ మందిని చేర్చడానికి పైన కుడివైపు ఓ ఆప్షన్ కూడా ఉన్నట్టు ఆ స్క్రీన్షాట్ తెలిపింది. మీరు, మరో వ్యక్తితో పాటు ముగ్గురు సభ్యులు ఈ గ్రూప్ వీడియో కాల్లో మాట్లాడుకునేలా ప్రస్తుతం ఈ ఫీచర్ పనిచేస్తుందని తెలిసింది. అయితే నాన్-బీటా యూజర్లకు ఈ ఫీచర్ ఎప్పుడు తీసుకొస్తుందో ఇంకా తెలియరాలేదు. కానీ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. WhatsApp beta for Android 2.18.39: new option to add participants in a group call 🔥 [***AVAILABLE IN FUTURE***] pic.twitter.com/XtAzxiSAhQ — WABetaInfo (@WABetaInfo) February 5, 2018 -
మరో మాల్వేర్ : వాట్సాప్ మెసేజ్లను దొంగిలిస్తోంది
సెక్యురిటీ రీసెర్చర్లు మరో మాల్వేర్ భూతాన్ని కనుగొన్నారు. ఈ మాల్వేర్ యూజర్ల ఆండ్రాయిడ్ ఫోన్లపై పూర్తి ఆధిపత్యం సంపాదించి, సమాచారాన్ని దొంగలిస్తుందని రష్యాకు చెందిన కాస్పెర్స్కై ల్యాబ్ రీసెర్చర్లు వెల్లడించారు. దీంతో ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ మెసేజ్లు కూడా ఈ మాల్వేర్ చోరి చేస్తుందని కాస్పెర్స్కై ల్యాబ్ హెచ్చరించింది. ఈ మాల్వేర్ను స్కైగోఫ్రీగా రీసెర్చర్లు పేర్కొన్నారు. 2014లో తొలుత దీన్ని రూపొందించారని, అప్పటి నుంచి ఇది అభివృద్ధి చెందుతూనే ఉందని తెలిసింది. అంతకముందు ఎన్నడూ మనం చూడని విధంగా ఓ ప్రత్యేక ప్రాంతంలోకి టార్గెట్ ఫోన్ ప్రవేశించగానే, వ్యక్తుల సంభాషణను, చుట్టుపక్కల ఆడియోలను ఆటోమేటిక్ రికార్డు చేస్తుందని రీసెర్చర్లు తెలిపారు. పిక్చర్లను, వీడియోలను తీసే సామర్థ్యాన్ని కూడా ఈ స్కైగోఫ్రీ కలిగి ఉందని, డివైజ్ మెమరీలో స్టోర్ అయి ఉన్న కాల్ రికార్డులను సీజ్ చేయడం, ఎస్ఎంఎస్లు, జియోలొకేషన్, కాలెండర్ ఈవెంట్లు, బిజినెస్లకు సంబంధించిన సమాచారం తన ఆధీనంలోకి తీసుకెళ్లడం వంటి చేస్తుందని పేర్కొన్నారు. ఈ మాల్వేర్ బారిన పడిన బాధితులు ఎక్కువగా ఇటలీలో ఉన్నారు. అదేవిధంగా ఈ మాల్వేర్ టూల్ను సృష్టించిన వారు కూడా ఇటాలియన్లే అని తెలిసింది. అటాకర్ల ఆధీనంలో ఉన్న వై-ఫై నెట్వర్క్లకు కూడా ఈ ప్రభావిత డివైజ్లు కనెక్ట్ అవుతుంటాయని రీసెర్చర్ల అధ్యయనంలో వెల్లడైంది. -
మీ స్మార్ట్ ఫోన్ స్పీడ్ తగ్గిందా.. అయితే ఇలా!
నిడమర్రు : స్మార్ట్ ఫోన్ కొత్తలో మంచి స్పీడ్గా ఉంటుంది. అప్లికేషన్లు వేగంగా కదులుతాయి, కానీ కొన్ని నెలల వాడకం తర్వాత మీ ఫోన్ స్పందించే తత్వం తగ్గిపోయి, దాని స్పీడ్ నెమ్మదిస్తుంది. అత్యవసరం అయినప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ సమస్య ఎక్కువగా ఎదరవుతుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ఫోన్ వేగంగా పెంచాలంటే అందుకు అవసరమైన సూచనలు నిపుణులు వివరిస్తున్నారు. యాప్స్, వాల్పేపర్స్ స్మార్ట్ ఫోన్లో స్టోరేజీ ఉందని నచ్చిన ప్రతీ యాప్ ఇన్స్టాల్ చెయ్యడం వల్ల ఫోన్ వేగం తగ్గుతుంది. అవసరమైన యాప్ మినహా మిగిలినవి అన్ఇన్స్టాల్ చేయండి. లైవ్ వాల్పేపర్లు, హోమ్ స్క్రీన్పై కదిలే వాల్ పేపర్లు అధికంగా ఉంచుకోవద్దు. బ్యాక్గ్రౌండ్లో యాప్స్.. ఫోన్లోని కొన్ని యాప్స్ ఫోన్తో పాటే ప్రారంభం అవుతుంటాయి. కొన్ని ఆన్లైన్ సర్వీసులను వినియెగించుకుంటుంటాయి. ఈ రెండూ స్మార్ట్ ఫోన్ స్లో అయ్యేందుకు కారణం అవుతాయి. బ్యాక్ గ్రౌండ్లో రన్ అవుతున్న యాప్స్ గురించి తెలుసుకోవడానికి సెట్టింగ్స్లో యాప్స్ గురించి తెలుసుకోవడానికి సెట్టింగ్స్లో యాప్స్కు వెళ్లాలి. అక్కడ రన్నింగ్ అనే దాన్ని ఎంచుకుంటే బ్యాక్ గ్రౌండ్లో రన్ అవుతున్న యాప్స్ లిస్ట్ కనిపిస్తుంది. యాండ్రాయిడ్ సాప్ట్వేర్ సహా పలు యాప్స్ రన్ అవుతుంటాయి. అందులో మీకు అవసరం లేనివి ఉంటే వాటిని వెంటనే ఆన్ ఇన్స్టాల్ లేదా డిజేబుల్ చేసుకోవాలి. ♦ అలాగే బ్యాక్ గ్రౌండ్లో యాప్స్ సింకింగ్ అవుతున్నాయా? లేదా అన్నది గమనించాలి. వీటి సింక్రనైజేషన్ను టర్న్ ఆఫ్ చేయాలి. దీనివల్ల డేటాతోపాటు సిస్టమ్ రీసోర్సెస్ కూడా ఆదా అవుతాయి. ఇందుకోసం సెట్టింగ్స్లో డేటా యూసేజ్కు వెళ్లాలి. కొన్నింటిలో వైర్లెస్ అండ్ నెట్ వర్క్స్లో యూసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో స్క్రోల్ డౌన్ చేస్తే ఏ యాప్స్ డేటాను ఎక్కువగా వాడుతున్నామనే వివరాలు తెలుస్తాయి. విడిగా ఒక్కో యాప్ సెట్టింగ్స్లోకి వెళ్లి సింక్రనైజేషన్ను టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. యాప్ కిల్లర్తో.. అడ్వాన్స్డ్ టాస్క్ కిల్లర్ అనే ఒక యాప్ ఉంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే అధికంగా ర్యామ్ను వినియోగించుకునే, ఫోన్ను స్లో చేస్తున్న ఏ యాప్ను అయినా సులభంగా కిల్ చేయవచ్చు. క్యాచే డేటా క్లియర్ చేయాలి యాప్స్ను వాడుతున్నప్పుడు క్యాచే డేటా పోగవుతుంది. వాటిని క్లియర్ చేస్తుండాలి. క్యాచే అంటే మీరు ఓ వెబ్సైట్ లేదా యాప్ను యాక్సెస్ చేసినప్పుడు వాటికి సంబంధించిన సమాచారాన్ని మీ ఫోన్ క్యాచే ఫైల్స్ రూపంలో నిల్వ చేస్తుంది. తర్వాత మరోసారి అదే వెబ్సైట్ లేదా యాప్ను తెరిచే ప్రయత్నం చేసినప్పుడు అంతకుముందు నిల్వ ఉన్న సమాచారం ఆధారంగా వెంటనే ఓపెన్ చేస్తుంది. క్యాచే డేటా నిల్వ చేయడానికి ప్రధాన కారణం సంబంధిత వెబ్సైట్లు, యాప్స్ను తిరిగి ఓపెన్ చేసినప్పుడు వేగంగా లోడ్ చేసేందుకే, ఇందుకోసం యాక్సెస్ చేసిన ప్రతీ సైట్, యాప్ సమాచారం క్యాచేలుగా లోడ్ అయి ఉంటుంది. ఇది అంతా ఫోన్ మెమొరీపై భారాన్ని మోపుతుంది. దీంతో ఎప్పటికప్పుడు క్యాచే డేటా క్లియర్ చేసుకోవాలి అంతర్గత స్టోరేజ్.. స్మార్ట్ ఫోన్లో ఇన్ బిల్ట్గా ఉండే స్టోరేజీ పూర్తిగా నిండిపోయినా ఫోన్ స్పీడ్ తగ్గిపోతుంది. స్టోరేజ్ సున్నాకు చేరితే కొన్ని ఫంక్షన్ల నిర్వహణ కష్టమైపోతుంది. ఫైల్స్ను ఒక లొకేషన్ నుంచి మరో లొకేషన్కు ట్రాన్స్ఫర్ చేసే విషయంలోనూ వేగం మందగిస్తుంది. ఎప్పుడూ కనీసం 10 నుంచి 20 శాతం ఇన్బిల్ట్ స్టోరేజీ ఖాళీగా ఉంచుకోవాలి. ఒక వేళ అదనపు స్టోరేజ్ కావాలనుకుంటే మైక్రో ఎసీడీ లాంటివి వాడుకోవాలి. సాఫ్ట్వేర్ అప్ టు డేట్.. సిస్టమ్లో సాఫ్ట్వేర్ ఎప్పటికప్పుడు ఆప్ టు డేట్ (తాజా వెర్షన్తో) ఉండాలి. సాఫ్ట్వేర్ ఆప్ టు డేట్ వల్ల కొన్ని అదనపు ఫీచర్లతో వస్తుంటాయి. పనితీరుపై ప్రభావం చూపించే బగ్స్ను తొలగించి ఆప్డేట్ వెర్షన్ తీసుకురావడం జరుగుతుంది. ఇందుకోసం సెట్టింగ్స్లో ఆప్డేట్ ఆప్షన్ ఉంటుంది. ఫ్యాక్టరీ డేటా రీసెట్ పైన తెలిపిన సూచనలు పాటించినా వేగం పెరగకపోతే చివరి అస్త్రంగా ఫ్యాక్టరీ డేటా రీసెట్ క్లిక్ చేయాలి. దీనికి ముందు మీ ఫోన్లోని ముఖ్యమైన ఫైల్స్, డేటా అంతటినీ ఎక్స్టర్నల్ మెమొరీలోకి కాపీ చేసుకోవాలి. దీంతో మీరు ఫోన్ కొన్నప్పుడు ఎలా ఉందో తిరిగి అదే స్థాయికి వెళుతుంది. దీంతో మీకు అవసరమైన అప్లికేషన్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి. -
టెలిగ్రాం యాప్లో సరికొత్త ఫీచర్..!
న్యూయార్క్: ఇన్స్టంట్ మెసేజింగ్ మొబైల్ యాప్ ‘టెలిగ్రాం’లో యూజర్లకు ఎంతో ఉపయోగకరమైన ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి ఒక ఆండ్రాయిడ్ ఫోన్లో మూడు టెలిగ్రాం అకౌంట్లను వాడుకోవచ్చు. ఒకటి కన్నా ఎక్కువ టెలిగ్రాం అకౌంట్లు ఉన్నవారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇది ఆండ్రాయిడ్ ఫోన్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఐఓఎస్ ప్లాట్ఫాంపై లభిస్తున్న టెలిగ్రాం ఆప్లో కూడా రెండు కొత్త థీమ్లను జత చేశారు. ఇక రెండు ప్లాట్ఫాంలపై కూడా టెలిగ్రాం యూజర్లు తమకు వచ్చే మెసేజ్లకు క్విక్ రిప్లై ఇవ్వవచ్చు. టెక్ట్స్, ఎమోజీ, స్టిక్కర్, జిఫ్ ఇమేజ్లను పంపుకోవచ్చు. తాజా వెర్షన్ 4.7ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు తమ తమ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఈ మొబైల్స్లో ఇక వాట్సాప్ పనిచేయదు!
శాన్ఫ్రాన్సిస్కో : వివిధ మొబైల్ ఫ్లాట్ఫాంలపై డిసెంబర్ 31, 2017 తర్వాత మెసేజింగ్ యాప్ వాట్సాప్ నిలిచిపోనున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ బ్లాగ్ ద్వారా ధృవీకరించింది. బ్లాక్బెర్రీ ఓఎస్, బ్లాక్బెర్రీ 10, విండోస్ ఫోన్ 8.0, దాని కంటే పాత ఫ్లాట్ఫాంలకు వాట్సాప్ తన సేవలను నిలిపివేస్తున్నట్లు సోమవారం తెలిపింది. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి అప్డేట్స్ అభివృద్ధి చేయడం లేదని, కొన్ని ఫీచర్లు ఏ సమయంలోనైనా పనిచేయకపోవడం ఆగిపోవచ్చునని వెల్లడించింది. భవిష్యత్తులో తమ యాప్ ఫీచర్లను ఇంకా అభివృద్ధి చేద్దామనుకుంటున్నామని, కానీ ఈ ఫ్లాట్ఫాంలకు అంత సామర్థ్యం లేదని చెప్పింది. ఈ ఓఎస్లు వాడుతున్న వారు వెంటనే కొత్త ఓఎస్ వెర్షన్(ఆండ్రాయిడ్ ఓఎస్ 4.0+, ఐఫోన్ ఓఎస్ 7+, విండోస్ ఫోన్ 8.1+)లోకి అప్గ్రేడ్ కావాలని సూచించారు. అప్పుడే మీరు వాట్సప్ను వినియోగించుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. ఇది మాకు ఒక కఠినమైన నిర్ణయం, కానీ వాట్సాప్ ద్వారా వినియోగదారులు మరింత మంది స్నేహితులు, కుటుంబం, ప్రియమైన వారిని తో సన్నిహితంగా ఉండేలా, ఉన్నతమైన ఫీచర్లను మెరుగైన సౌలభ్యాన్ని అందిస్తున్నాం. ఈ క్రమంలో అప్గ్రేడ్ చేసుకోవాలసింది రికమెండ్ చేశాం’’ అని వాట్సాప్ తన బ్లాగులో పేర్కొంది. ఈ సంవత్సరం చివరి నాటికి వాట్సాప్ బంద్ అయ్యే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ బ్లాక్ బెక్రీ, ఓఎస్, 10 విండోస్ ఫోన్ 8.0 , అంతకంటే పాతవి దీనితోపాటు నోకియా ఎస్ 40 ఫోన్లలో వాట్సాప్ డిసెంబర్ 31,2018 తరువాత పనిచేయదని పేర్కొంది. ఫిబ్రవరి 1, 2020 తర్వాత ఆండ్రాయిడ్ 2.3.7 , అంతకంటే పాత వెర్షన్లలో కూడా వాట్సాప్ సేవలను నిలిపి వేయనుంది. కాగా 2016 లో వివిధ మొబైల్ ఫ్లాట్ఫాంలలో వాట్స్అప్ సేవలు నిలిపివేత గురించి మొదటిసారి ప్రకటించింది. ఆ తరువాత మరికొన్ని ఓఎస్లలో ఈ గడువును జూన్ 30, 2017 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. తాజాగా గడువు డిసెంబరు 31, 2017తో ముగియనుందని తెలిపింది. -
భారత్కు గూగుల్ బొనాంజా!
న్యూఢిల్లీ: భారత్ తదితర మార్కెట్లలో ఇంటర్నెట్ వినియోగాన్ని మరింత పెంచే దిశగా టెక్ దిగ్గజం గూగుల్ పలు ఆవిష్కరణలు చేసింది. చౌక స్మార్ట్ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ ‘ఓరియో గో’ ఆపరేటింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది. అలాగే ద్విచక్ర వాహనదారులకూ మరింతగా ఉపయోగపడేలా మ్యాప్స్కి సంబంధించి బైక్ మోడ్ ఫీచర్ని అందుబాటులోకి తెచ్చింది. అటు రిలయన్స్ జియో స్మార్ట్ ఫీచర్ ఫోన్లలో గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ (వర్చువల్ అసిస్టెంట్) కస్టమైజ్డ్ వెర్షన్ను ప్రవేశపెట్టింది. దైనందిన కార్యకలాపాల్లో ఇంటర్నెట్ ఉపయోగంపై మరింతగా అవగాహన కల్పించే దిశగా ప్రత్యేకంగా భారత మార్కెట్కి అనువైన ఉత్పత్తులు, ఫీచర్స్ని అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్లో భాగమైన నెక్ట్స్ బిలియన్ యూజర్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ సీజర్ సేన్గుప్తా తెలిపారు. గూగుల్ మ్యాప్స్లో బైక్ మోడ్, తేజ్ చెల్లింపుల విధానం మొదలైనవన్నీ పెద్ద సంఖ్యలో భారతీయుల జీవనవిధానాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవేనని తెలియజేశారు. ‘ఈ ఉత్పత్తులు, ఫీచర్స్ అన్నీ కూడా ముందుగానే భారత్లోనే ప్రవేశపెడుతున్నాం. కాకపోతే, ఇవి ఇక్కడికి మాత్రమే పరిమితం కావు. ఇక్కడి వారికి ఉపయోగపడేంత మెరుగైన ఉత్పత్తులంటే... అవి మిగతా దేశాల్లోని వారికీ అనువైనవనే భావించవచ్చు‘ అని గూగుల్ ఫర్ ఇండియా–2017 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. ఫైల్స్ గో లాంటి యాప్స్ స్మార్ట్ఫోన్ వినియోగాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చగలవని, డేటా వినియోగం తగ్గించగలవని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఓరియో గో హ్యాండ్సెట్స్.. ఆండ్రాయిడ్ ఓరియో (గో) ఓఎస్ ఆధారిత స్మార్ట్ఫోన్లను హ్యాండ్సెట్ తయారీ సంస్థలు వచ్చే ఏడాది తొలినాళ్లలో ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లు సేన్గుప్తా చెప్పారు. రామ్ సామర్ధ్యం 1జీబీ లేదా అంతకన్నా తక్కువున్న హ్యాండ్సెట్స్కి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ఎంట్రీ స్థాయి ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ఫోన్ల కోసం గూగుల్ గతంలో మైక్రోమ్యాక్స్, స్పైస్ వంటి దేశీ హ్యాండ్సెట్ తయారీ సంస్థలతో చేతులు కలిపినప్పటికీ.. ఆ ప్రాజెక్టు పెద్దగా ఫలితాలు సాధించలేదు. మరోవైపు తొలిసారి స్మార్ట్ఫోన్ని ఉపయోగించే వారిని దృష్టిలో ఉంచుకుని మరింత తేలికపాటి యాప్స్ని కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు సేన్గుప్తా తెలిపారు. గూగుల్ గో సెర్చి ఇంజిన్, యూట్యూబ్ గో మొదలైనవి ఆ కోవకి చెందినవేనని చెప్పారు. ఇక ఇంగ్లిష్తో పాటు హిందీ భాషలోనూ గూగుల్ అసిస్టెంట్ను రిలయన్స్ జియో ఫోన్స్ కోసం రూపొందించినట్లు చెప్పారు. ‘‘ఫీచర్ ఫోన్లో గూగుల్ వర్చువల్ అసిస్టెంట్ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా 20 నగరాల్లో వాయు కాలుష్య సంబంధ సమాచారాన్ని సైతం త్వరలో మా యాప్స్ ద్వారా అందిస్తాం. ద్విచక్ర వాహనాలకూ ఉపయోగపడే మ్యాప్స్ ఫీచర్ మంగళవారం నుంచి భారత్లో అందుబాటులోకి వచ్చింది. రాబోయే నెలల్లో మిగతా దేశాల్లోనూ ప్రవేశపెడతాం. రైల్టెల్ భాగస్వామ్యంతో ప్రస్తుతం రైల్వేస్టేషన్లలో అందిస్తున్న వైఫై సదుపాయాన్ని వచ్చే ఏడాది 400 స్టేషన్లకి విస్తరిస్తాం’’ అని వివరించారు. వివిధ నగరాల్లో వైఫై హాట్స్పాట్స్ ఏర్పాటు చేసే ప్రాజెక్టుపై పనిచేస్తున్నామని, త్వరలో దీన్ని ఇండొనేషియా తదితర మార్కెట్లకు కూడా విస్తరిస్తామని సేన్గుప్తా చెప్పారు. నెలకు 11 జీబీ డేటా వినియోగం.. వచ్చే నాలుగేళ్లలో భారత్లో డేటా వినియోగం దాదాపు మూడు రెట్లు ఎగిసి నెలకు సగటున 11 జీబీ స్థాయికి పెరగవచ్చని గూగుల్ ఇండియా విభాగం హెడ్ రాజన్ ఆనందన్ చెప్పారు. మరిన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సాథీ... మహిళల్లో డిజిటల్ అక్షరాస్యత పెంచే క్రమంలో టాటా ట్రస్ట్స్ భాగస్వామ్యంతో ప్రవేశపెట్టిన ఇంటర్నెట్ సాథీ ప్రాజెక్టును మరింతగా విస్తరించనున్నట్లు గూగుల్ మార్కెటింగ్ విభాగం హెడ్ (ఆగ్నేయాసియా, ఇండియా) సప్నా చడ్ఢా తెలిపారు. 2015 జూలైలో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద ఇప్పటిదాకా 30,000 మంది పైచిలుకు మహిళలకు శిక్షణనిచ్చినట్లు వివరించారు. ఇప్పటిదాకా 1.1 లక్షల గ్రామాల్లో అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మరికొన్నేళ్లలో 3 లక్షల గ్రామాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
గూగుల్ సరికొత్త ఆఫర్
-
గూగుల్ సరికొత్త ఆఫర్
వాషింగ్టన్ : సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఓ కొత్త ఆఫర్ ప్రకటించింది. బగ్స్ సులువుగా కనిపెట్టే వారికి గూగుల్ ఆఫర్ మరింత ఉపయోగపడనుంది. అదేంటంటే.. గూగుల్ ప్లే స్టోర్ ఆండ్రాయిడ్ యాప్స్లో బగ్స్ని కనుక్కుని సంస్థకు సమాచారం ఇచ్చిన వారికి 1000 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 66 వేలు) అందిస్తామని గూగుల్ ప్రకటించింది. హ్యాకర్ వన్ అనే కంపెనీతో డీల్ ద్వారా కొత్త డెవలపర్లను వెలికితీసేందుకు గూగుల్ శ్రీకారం చుట్టింది. ఆండ్రాయిడ్ యాప్స్ రూపొందించే వారితో పాటు యాప్ ప్రోగ్రామ్స్ చెక్ చేసి బగ్స్ గుర్తించే వారు తమ నైపుణ్యాన్ని బయటపెట్టేందుకు ఇది సదావకాశమని గూగుల్ ప్లే యాప్స్ అండ్ గేమ్స్ డైరెక్టర్ వినీత్ బచ్ అన్నారు. తమ యూజర్లకు వైరస్ల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకూడదని బగ్స్ గుర్తించండి.. రివార్డ్ పొందండి అంటూ కొత్తదనానికి బాటలు వేస్తోంది గూగుల్. 2015లో బగ్స్ రిమూవ్ ప్రోగ్రామ్ మొదటుపెట్టాక ఇప్పటివరకూ వీటి కోసం గూగుల్ 115 మిలియన్ డాలర్లు వెచ్చించినట్లు సంస్థ తెలిపింది. -
దొంగల ముఠా యాప్తో ఠా
ప్రొద్దుటూరు క్రైం : రాష్ట్ర వ్యాప్తంగా చోరీలను అరికట్టడానికి పోలీసులు కొత్తగా ప్రవేశ పెట్టిన ఏపీ ఎల్హెచ్ఎంఎస్ ఆండ్రాయిడ్ యాప్కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్రంలోని నాలుగైదు జిల్లాల్లో యాప్కు విస్తృత ప్రచారం కల్పిస్తుండగా, మరి కొన్ని జిల్లాల్లో పోలీసులు అలసత్వం వహిస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని ముఖ్య పట్టణాలలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. యాప్ను ఇలా డౌన్ లోడ్ చేసుకోవాలి ఆండ్రాయిడ్ ఫోన్లోని గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్లి ఏపీ ఎల్హెచ్ఎంఎస్ అప్లికేషన్ను డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మొబైల్ స్క్రీన్పై రిజిస్టర్, రిక్వెస్టు పోలీసు వాచ్ అనే రెండు ఆప్షన్లు వస్తాయి. రిజిస్టర్ ఆప్షన్ను క్లిక్ చేసి అందులో సెల్ఫోన్తోపాటు ఇంటి అడ్రస్ టైప్ చేయాలి. తర్వాత రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే కొన్ని సెకండ్లలోనే సెల్కు ఓటీపీ నంబర్ వస్తుంది. ఆ నంబర్ను ఎంటర్ చేస్తే సక్సెస్ఫుల్ ఓటీపీ అనే మెసేజ్తో పాటు అందులో ఐడీ నంబర్ వస్తుంది. ఆ నంబర్ను గుర్తుండేలా ఎక్కడైనా రాసి పెట్టుకోవాలి. ఒకటి లేదా నాలుగైదు రోజులు ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే వెంటనే రిక్వెస్ట్ పోలీసు వాచ్ ఆప్షన్లోకి వెళ్లి ఐడీ నంబర్, ఎప్పుడు వెళ్తారో, ఏ తారీఖున తిరిగి వస్తారో అందులో పొందు పరచి సబ్మిట్ అని క్లిక్ చేయాలి. వెంటనే ఈ మెసేజ్ ఏపీ ఎల్హెచ్ఎంఎస్ కంట్రోల్ రూమ్కు వెళ్తుంది. వచ్చిన మెసేజ్ ఆధారంగా సంబంధిత ఫోన్ నంబర్కు పోలీసులు మళ్లీ ఒక సారి ఫోన్ చేసి రిక్వెస్టును సరి చూస్తారు. నిర్ధారించుకున్న తర్వాత కొన్ని నిమిషాల్లోనే సీసీ కెమెరా తీసుకొచ్చి ఇంట్లోని రహస్య ప్రాంతంలో అమరుస్తారు. ఈ కెమెరా రాత్రి, పగలు పని చేస్తుంటుంది. కెమెరా ముందు నుంచి మనిషి లేదా పిల్లి, ఎలుక లాంటివి వెళ్లినా కంట్రోల్ రూంలో అలారం మోగుతుంది. అక్కడి పోలీసులు కంట్రోల్ రూం ద్వారా సీసీ కెమెరా దృశ్యాలను చూస్తారు. ఒక వేళ ఇంట్లోకి ప్రవేశించింది మనిషి అయితే వెంటనే బీట్ పోలీసులు, సీఐ, ఎస్ఐ, డీఎస్పీకి సమాచారం అందిస్తారు. ఐదు నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టి దొంగను అదుపులోకి తీసుకుంటారు. ఇందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో... లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంపై జిల్లా పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఇప్పటి వరకు 14,800 మంది యాప్ను డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో ప్రొద్దుటూరులోనే 5,950 మంది రిజిస్టర్ చేసుకున్నారు. సీసీ కెమెరాలు కావాలని ప్రొద్దుటూరుకు చెందిన 90 మంది రిక్వెస్టు పెట్టుకున్నారు. ప్రొద్దుటూరు నియోజక వర్గానికి సంబంధించి వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. శిక్షణ పొందిన కానిస్టేబుళ్లు జమాలుల్లా ఖాన్, రవి, ఎస్ం బాషా, హోంగార్డు మునీంద్ర మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సీఐలు వెంకటశివారెడ్డి, సదాశివయ్య, ఓబులేసు, ఎస్ఐలు కూడా పర్యవేక్షిస్తున్నారు.