-
హీరోయిన్తో స్టార్ డైరెక్టర్ రొమాన్స్.. ఫుల్ సాంగ్ వచ్చేసింది!
హీరోయిన్ శృతిహాసన్, లియో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ నటించిన ఆల్బమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇటీవల ఇనిమెల్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా.. ఈ జంట రొమాన్స్తో రెచ్చిపోయి నటించారు. తాజాగా ఫుల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటకు కమల్హాసన్ లిరిక్స్ అందించడమే కాకుండా తానే స్వయంగా నిర్మించారు. అయితే ఈ సాంగ్లో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ నటన ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా వీరిద్దరి రొమాన్స్ చూసి ఫ్యాన్స్ షాకయ్యారు. లోకేశ్లో ఈ యాంగిల్ కూడా ఉందా కామెంట్స్ చేశారు. అయితే తాజాగా రిలీజైన సాంగ్ కేవలం తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. సాంగ్ చూస్తే లవ్, రొమాన్స్, పెళ్లి అనే కాన్సెప్స్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా మీరు కూడా ఈ రొమాంటిక్ సాంగ్ను చూసేయండి. ఇక సినిమాల విషయాకొనిస్తే లోకేశ్ కనగరాజ్ నెక్స్ట్ రజినీకాంత్తో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మరోవైపు శృతిహాసన్ అడివి శేష్ సరసన డెకాయిట్ చిత్రంలో నటించనున్నారు. -
'చూసుకో' అంటోన్న యంగ్ హీరోయిన్.. ఆకట్టుకుంటోన్న కెమిస్ట్రీ!
ప్రైవేట్ ఆల్బమ్స్, ఇండిపెండెంట్ సాంగ్స్ ఏ రేంజ్లో ట్రెండ్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. ప్రైవేట్ సాంగ్స్ను కూడా సినిమా సాంగ్స్కు ఏ మాత్రం తగ్గకుండ రూపొందిస్తున్నారు. స్టార్ హీరోలు సైతం ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్తో ఆకట్టుకుంటున్నారు. తాజాగా అలాంటి ఓ ప్రైవేట్ ఆల్బమ్లో యంగ్ హీరో, హీరోయిన్లు మెరిశారు. త్రిగుణ్, ఆయుషి పటేల్ జంటగా ‘చూసుకో’ అనే వీడియో ఆల్బమ్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 'చూసుకో అంటూ' సాగే ఈ పాటను యంగ్ సెన్సేషన్ యశస్వి కొండెపూడి, హరిణి ఇవటూరి సంయుక్తంగా ఆలపించారు. ఈ పాటకు సాహిత్యాన్ని సురేష్ బాణిశెట్టి అందించగా.. అన్వేష్ రావు కగిటాల బాణీని సమకూర్చారు. తాజాగా రిలీజైన ఈ మెలోడీ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. కేరళలోని అందమైన విజువల్స్ను మరింత అందంగా చూపించారు. ఈ సాంగ్లో త్రిగుణ్, ఆయుషి కెమిస్ట్రీ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. కాగా.. ప్రస్తుతం ఆయుషి పటేల్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మార్చి 22న కలియుగం పట్టణంలో అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరో మూడు ప్రాజెక్టులు చిత్రీకరణలో ఉన్నాయి. మరో వైపు త్రిగుణ్ సైతం ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అచ్చ తెలుగమ్మాయి అయిన ఆయుషి అందాలు ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. -
దుప్పటి కప్పుకున్నా అశ్లీలంగానే కనిపిస్తుంది : శ్రావణ భార్గవి
Okapari Okapari Sravana Bhargavi: టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి పేరు కొంతకాలంగా నెట్టింట హల్చల్ చేస్తుంది. తాజాగా ఆమె రిలీజ్ చేసిన ఓ పాటపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేసిందంటూ అన్నమయ్య వంశస్తులు మండిపడుతున్నారు. వెంకటేశ్వర స్వామికి అభిషేకం కైంకర్యం చేస్తూ భక్తి భావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి వివిధ భంగిమల్లో కనిపిస్తూ, కాళ్లు ఊపుతూ పాటను చిత్రీకరించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా తనపై వస్తోన్న విమర్శలపై సింగర్ శ్రావణ భార్గవి స్పందించింది. తాను పాడిన పాటలో ఎలాంటి తప్పులేదని, మీరు చూసే చూపులోనే తప్పుందని ఘాటుగా బదులిచ్చింది. 'ఆ వీడియోలో అశ్లీలత ఎక్కడ కనిపించింది? నేను ఆ పాటను ఎంత భక్తితో పాడానో నాకు తెలుసు. ఈ పాటలో మీకు తెలుగుదనం తప్పా ఇంకేదైనా కనిపిస్తే అది మీ చూపులో లోపం. నా ప్రాబ్లం కాదు.మీరు చూసే చూపులో లోపం ఉంటే దుప్పటి కప్పుకుని కూర్చున్నా అశ్లీలంగా కనిపిస్తుంది. నేనేం లిరిక్స్ మార్చి పాడలేదు. నా అంతరాత్మకి తెలుసు నేను తప్పుచేయలేదని. నిజంగా ఈ పాట తప్పు అంటే.. దేవుడే ఆ పాటని తీయించేస్తాడు. మగ గాయకులు ఆల్బమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఎలాంటి వివాదాలు ఉండవు. కానీ అదే ఆడవాళ్లు రిలీజ్ చేసినప్పుడే ఇలాంటి వివాదాలు సృష్టిస్తారు' అంటూ శ్రావణ భార్గవి కౌంటర్ ఇచ్చింది. -
లవ్ యూ బేబీ’ కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది
తమిళసినిమా: లవ్ యూ బేబీ వీడియో ఆల్బమ్ కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని దర్శకుడు ప్రసాద్ రామన్ ధీమా వ్యక్తం చేశారు. నటుడు సంతోష్ ప్రతాప్, నటి ఐరా జంటగా నటించిన ఈ ఆల్బమ్ను అనుగ్రహ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎస్.కామాక్షి కనిమొళి రూపొందించారు. ముత్తమిళం, ప్రసాద్ రామన్ కలిసి రాసిన ఈ పాట కు రాకేష్ అంబికాపతి సంగీతాన్ని అందించారు. (చదవండి: ఓటీటీలోకి సిద్ధార్థ్.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే..) నటుడు సంగీత దర్శకుడు ప్రేమ్జీ అమరన్ పాడిన ఈ పాటకు సంతోష్ పాండే ఛాయాగ్రహణంను, రిచర్డ్ క్రిస్టఫర్ నృత్య దర్శకాన్ని సమకూర్చారు. ఈ తరం యువత నాడిని గ్రహించి వారిని అలరించే విధంగా ఈ వీడియో ఆల్బమ్ను రూపొందించినట్లు దర్శకుడు ప్రసాద్ రామన్ తెలిపారు. దీనిని 20వ తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. -
తోటా వీడియో ఆల్బమ్ విడుదల
Thota Music Video Album Launch: తోటా వీడియో ఆల్బమ్ను శనివారం సాయంత్రం చెన్నైలో విడుదల చేశారు. నాయిస్ అండ్ గ్రెయిన్ నుంచి వస్తున్న తాజా వీడియో ఆల్బమ్ ఇది. నటుడు రియోరాజ్, రమ్యా పాండియన్ జంటగా నటించిన దీనికి బ్రిట్టో జేబీ దర్శకత్వం వహించారు. దేవ్ ప్రకా ష్ సంగీతాన్ని అందించిన ఈ పాటను ప్రేమ్ జీ, నిత్యాశ్రీ పాడారు. శనివారం సాయంత్రం స్థానిక అడయార్లోని ఓ స్టార్ హోటల్లో జరిగిన ఈ వీడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్వాహకులు కార్తీక్, మహావీర్ మాట్లాడారు. ఇంతకు ముందు తాము రూపొందించిన కన్నమ్మ పాటకు మంచి ఆదరణ లభించిందన్నారు. దీంతో తోటా పాట కాన్సెప్ట్ గురించి నటుడు రియోరాజ్ చెప్పడంతో నచ్చి వెంటనే దీన్ని రూపొందించినట్లు తెలిపారు. యువ నటీనటులను ప్రోత్సహిస్తూ అందరినీ అలరించే వీడియో ఆల్బమ్ను రూపొందించడమే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement