-
నెల్లూరులో పాలు, నెయ్యి కల్తీ
నెల్లూరు సిటీ: నెల్లూరు కార్పొరేషన్ అధికారులు ఆహార పదార్థాల కల్తీపై మరోమారు కొరడా ఝుళిపించారు. నగరంలో కొంతకాలం క్రితం మున్సిపల్ శాఖ అధికారులు హోటల్స్, రెస్టారెంట్లు, బార్లు, చికెన్ స్టాల్స్, ఫ్రూట్ జ్యూస్ కేంద్రాలపై దాడులు చేశారు. నిల్వ మాంసం, ఆహార పదార్థాలు విక్రయిస్తున్న బయటపడడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. తాజాగా మంగళవారం జరిగిన దాడుల్లో మరో కల్తీ వ్యవహారం బట్టబయలైంది. మనం రోజూ వినియోగించే నెయ్యి, పాలు సైతం కల్తీకి గురవుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్లుగా.. నగరంలోని నవాబుపేట మహాలక్ష్మి ఆలయం వీధిలో ఓ వ్యక్తి కొన్నేళ్లుగా పాల ఉత్పత్తి కేంద్రం నిర్వహిస్తున్నాడు. అక్కడే నెయ్యి తయారీని కూడా చేస్తుంటాడు. రోజుకు సుమారు వెయ్యి లీటర్లకుపైగా పాలను నగరంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు. వివిధ కంపెనీలకు చెందిన పాలను సేకరిస్తారు. వాటిలో నీళ్లు, పౌడర్ కలిపి కల్తీ చేసి నగర ప్రజలకు విక్రయాలు చేస్తున్నారు. అదేవిధంగా నెయ్యిని కూడా ఆ కేంద్రంలోనే తయారీ చేసి విక్రయిస్తున్నారు. పాలు, నెయ్యి కల్తీ వ్యవహారంపై నగరపాలకసంస్థ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణకు సమాచారం అందడంతో మంగళవారం తయారీ కేంద్రంపై దాడులు చేశారు. నెయ్యిలో ఓ కంపెనీకి చెందిన సన్ఫ్లవర్ ఆయిల్ను కలుపుతున్నారు. అధికారులు దాడులు చేయడంతో కేంద్రం నిర్వాహకుడు పరారయ్యాడు. దాడుల్లో సుమారు 200 లీటర్ల కల్తీ పాలు, పాల పౌడర్, 600 కేజీల నెయ్యి, సన్ఫ్లవర్ ఆయిల్, తయారీ వస్తువులను స్వాధీనం చేసుకుని కేంద్రాన్ని సీజ్ చేశారు. కల్తీ పాలు, నెయ్యిని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. కఠిన చర్యలు తీసుకుంటాం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే హానికరమైన కల్తీ ఆహారాన్ని విక్రయిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా కల్తీ ఆహారంపై అవగాహన పెంచుకోవాలి. కల్తీ పదార్థాలు తయారు చేస్తున్నా, విక్రయిస్తున్నా నా దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటా.– వెంకటరమణ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ -
అంతాకల్తీ.. మానెయ్యి
విజయవాడ నగరంలో కల్తీ నెయ్యి వ్యాపారంఅక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఒకవైపు అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా కల్తీ నెయ్యి వ్యాపారంమాత్రం జోరుగా సాగుతూనే ఉంది. కల్తీనెయ్యి విజయవాడతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు యథేచ్ఛగా రవాణా అవుతోంది. సాక్షి, విజయవాడ: కల్తీ నెయ్యి విజయవాడ కేంద్రంగా తయారవుతోంది. ఏడాది కాలంగా అధికారులు నగరంలోని దేవినగర్, అయ్యప్పనగర్, రాజరాజేశ్వరీపేట, సింగ్నగర్, నున్న తదితర ప్రాంతాల్లో దాడులు చేసి 40కు పైగా కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో సుమారు కోటి రూపాయల విలువ చేసే 245 క్వింటాళ్ల కల్తీ నెయ్యిని ఫుడ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పామాయిల్, వనస్పతి, మంచి నెయ్యి కలిపి కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు. కిలో నెయ్యి తయారీకి సుమారు 350 గ్రాముల వనస్పతి, 500 గ్రాముల పామాయిల్, 150 గ్రాముల మంచి నెయ్యి వాడుతారు. వనస్పతి కలపడం వల్ల నెయ్యి పూస కడుతుంది. నెయ్యి రంగు వచ్చేందుకు రంగులు, వాసన కోసం రసాయనాలు కలుపుతారు. జంతువుల కళేబరాల నుంచి తీసిన కొవ్వును కూడా కలుపుతున్నారని అధికారులు గుర్తించారు. కల్తీ నెయ్యిని వివిధ ప్రముఖ బ్రాండ్ల పేరుతో మార్కెట్లోకి తరలిస్తున్నారు. ఒక్కొక్క కల్తీ సంస్థ వద్ద కనీసం ఐదు నుంచి ఏడు బ్రాండ్లను తలపించేలా లేబుళ్లను అధికారులు గుర్తించారు. నెయ్యి ప్యాకెట్ను సీల్ చేసి ఉంచడంతో సామాన్యులు కనుక్కోవడం కూడా కష్టమేనని అధికారులు చెబుతున్నారు. కిలో కల్తీ నెయ్యి తయారు చేయడానికి రూ.80 మాత్రమే ఖర్చవుతుందని, లేబుల్పై మాత్రం రూ.500 వరకు ధర ముద్రించి రిటైల్ వ్యాపారస్తులకు రూ.300 నుంచి రూ.350 వరకు విక్రయిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. రూ.50 డిస్కౌంట్ ఇచ్చి రూ.450 చొప్పున విక్రయిస్తారు. కిలో కల్తీ నెయ్యి అమ్మితే తయారీ దారుడికు రూ.220 వరకు, రిటైల్ వ్యాపారికి రూ.100 వరకు మిగులుతుందని, నాణ్యమైన నెయ్యి విక్రయిస్తే లాభం రూ.40కి మించదని వివరిస్తున్నారు. నగరంలోనే రూ.2 కోట్ల వ్యాపారం విజయవాడలోనే ప్రతి నెలారూ.2 కోట్లు నెయ్యి వ్యాపారం జరుగుతోందని అంచనా. ఆహార పదార్థాలు రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యం కోసం గేదె పాల నుంచి తయారైన నెయ్యి ఉపయోగిస్తారు. ఇందులో కనీసం 30 శాతం వరకు కల్తీనెయ్యి వ్యాపారం జరుగుతోందని అంచనా. కల్తీ నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యానికి హాని తప్పదని, ముఖ్యంగా జీర్ణకోశ సంబంధ వ్యాధులు వస్తాయని, కిడ్నీలు, లివర్ దెబ్బ తింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కల్తీ నెయ్యి తయారీపై నిఘా నగరంలో కల్తీ నెయ్యి తయారు చేసే వారిపై గట్టి నిఘా పెట్టాం. ఫిర్యాదులు వచ్చినా, అనుమానం వచ్చినా దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నాం. పోలీసుల సహకారంతో తయారీదారులను అరెస్టు చేయిస్తున్నాం. ఈ దాడులు ఇక ముందు కూడా కొనసాగిస్తాం. కల్తీ నెయ్యి గురించి తెలిసిన వారు మాకు సమాచారం ఇస్తే దాడులు చేస్తాం. – ఎన్.పూర్ణచంద్రరావు,అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జీర్ణాశయ సంబంధ వ్యాధులు కల్తీ నెయ్యి తినడం వల్ల లివర్, కిడ్నీలు దెబ్బతింటాయి. జీర్ణాశయ సంబంధ వ్యాధులు వస్తాయి. కొంతమంది పేగులకు కల్తీ నెయ్యి అంటుకుని క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో కలిపే పదార్థాలనుబట్టి కిడ్నీలు, రక్తనాళాలపై దుష్ప్రభావం పడుతుంది. కల్తీ నెయ్యివాడే బదులు అసలు నెయ్యి లేకుండా భోజనం చేయడం మంచిది. – డాక్టర్ పి.ఎస్.పి.వి.రత్నగిరి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు -
భారీగా కల్తీ నెయ్యి స్వాధీనం
విజయవాడ: బెజవాడలో కల్తీరాయుళ్లు రెచ్చిపోతున్నారు. అధికారులు వరుస దాడులు చేస్తున్నప్పటికీ యధేచ్ఛగా కల్తీ నెయ్యి అమ్మకాలు సాగుతునే ఉన్నాయి. విజయవాడ సింగ్ నగర్ పరిధిలోని సుబ్బరాజు నగర్లో శ్రీ లక్ష్మి దివ్యబాబు ట్రేడర్స్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి నకిలీ బ్రాండ్ నెయ్యి ప్యాకెట్లతోపాటు పదివేల లీటర్ల కల్తీ నెయ్యి, 200 లీటర్ల పామాయిల్ను సీజ్ చేశారు. కల్తీ నెయ్యితోపాటు దాన్ని తయారు చేసే యంత్రాలు, ఎనిమిది మంది పనివాళ్లను అదుపులోకి తీసుకున్నారు. -
కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై దాడులు
బంజారాహిల్స్: కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై జూబ్లీహిల్స్ పోలీసులు దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున నకిలీ నెయ్యి డబ్బాలు, తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యూసుఫ్గూడ సంజయ్నగర్కు చెందిన ఎండీ రజియుద్దీ¯ŒS గతంలో పాత బస్తీలోని ఓ కల్తీ నెయ్యి తయారీ కేంద్రంలో పని చేసిన అనుభవంతో రెండేళ్ల క్రితం స్వయంగా సంజయ్నగర్లోని ఓ ఇంట్లో తన స్నేహితులు ఎండీ రియాజ్, అబ్దుల్ గఫార్, ఇబ్రహీంలతో కలిసి కల్తీ నెయ్యిని తయారు చేస్తూ స్వీట్షాపులు, హోటళ్లకు సరఫరా చేసేవాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఇంటిపై దాడులు నిర్వహించి నెయ్యి తయారు చేస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి మూడు నెయ్యి డబ్బాలు, వనస్పతి తదితర సామగ్రిని సీజ్ చేశారు. వీరిపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘డెయిరీ’ ముసుగులో క ల్తీ నెయ్యి తయారీ
► సితార అగ్మార్క్ పేరుతో విక్రయం ► ‘వెంకటేశ్వర డెయిరీ ఫామ్’పై ► టాస్క్ఫోర్స్ దాడి ► ఇద్దరి అరెస్ట్, 930 లీటర్లు స్వాధీనం సాక్షి, సిటీబ్యూరో: డెయిరీ ఫామ్ ముసుగులో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ఓ కేంద్రం గుట్టును ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి భారీగా కల్తీ నెయ్యి, తయారీకి ఉపకరించే పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట మహంకాళి తోట ప్రాంతానికి చెందిన గాజుల నటరాజ్ కార్ఖానాలో వెంకటేశ్వర డెయిరీ ఫామ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. డెయిరీ ఉత్పత్తుల తయారీ కోసం ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్న ఇతను కల్తీ నెయ్యి తయారీకి తెరలేపాడు. పామాయిల్, వనస్పతి, క్రీమ్లు కలిపి నెయ్యిని తయారు చేసి ‘సితార అగ్మార్క్’ పేరుతో విక్రయిస్తున్నాడు. తన డ్రైవర్ జోజిబాబు ద్వారా కల్తీ నెయ్యిని దుకాణాలకు సరఫరా చేయిస్తున్నాడు. వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పుగా మారే ఈ దందాపై ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ కానిస్టేబుల్ కె.నరేష్ గౌడ్కు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్ నేతృత్వంలో ఎస్సైలు ఎ.సుధాకర్, కె.శివ తమ బృందాలతో దాడి చేసి నటరాజ్, జోజిబాబుల్ని అరెస్టు చేశారు. 930 లీటర్ల కల్తీ నెయ్యి, 700 లీటర్ల క్రీమ్, 92 లీటర్ల పామాయిల్, 10 లీటర్ల వనస్పతి తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం సైదాబాద్ పోలీసులకు అప్పగించారు.
Pagination
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Advertisement